koodali

Wednesday, November 23, 2016

భారతీయుల పొదుపు చేసే లక్షణం ఏమైనట్లు?


పాత కాలంలో భారతీయులకు పొదుపు చేసే లక్షణం ఉండేది.ఆధునిక కాలంలో ఖర్చు చేసే లక్షణం బాగా పెరిగింది. డబ్బున్నవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు కూడా విపరీతంగా ఖర్చుపెడుతున్నారు.

ఒకే వ్యక్తి ఎక్కువ సెల్ ఫోన్లు వాడటం, మార్కెట్లోకి వచ్చిన కొత్తరకం గాడ్జెట్లపై మోజు పెంచుకుని ఆన్ లైన్ షాపింగ్ ద్వారా కొనేయటం వంటివి ఎక్కువయ్యాయి.షాపులకు వెళ్ళినా ఎంత ధర అయినా కొనేస్తున్నారు.

ఇలా విపరీతంగా కొనటం వల్ల వస్తువుల తయారీ పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. సహజవనరులు కూడా త్వరగా తరిగిపోతాయి.
..................
మనిషి సుఖంగా జీవించాలంటే బోలెడు డబ్బు అవసరం లేదు.

విపరీతంగా కొనటం అలవాటయిన ప్రజలకు ఇప్పుడు కష్టంగా ఉంది.

అయితే వీళ్ళలో నిత్యావసరాలు కొరకు సరుకులు  కొనటం ఎలాగో తెలియక కష్టాలు పడుతున్న ప్రజలు కూడా ఉన్నారు.
 ..................
  ఈ రోజుల్లో వ్యాపారస్తులు ధరలు బాగా పెంచేస్తున్నారు. అయినా జనం వస్తువులు కొంటూనే ఉన్నారు.

అధిక ధరలను ప్రభుత్వం నివారించాలి. అప్పుడు అధిక జీతాలు ఇవ్వనవసరం లేదు. ప్రజలు అధిక ఖర్చులను తగ్గించుకోవాలి.
................
సమాజంలో అవినీతి బాగా పెరిగింది. విలాసవంతమైన జీవితం కోసం ఎలా అయినా డబ్బు సంపాదించటానికి చాలామంది ప్రజలు వెనుకాడటం లేదు. 

 తప్పు చేయటానికి సామాన్యులు, ధనికులు, చదువుకున్నవారు, చదువుకోని వారు అనే తేడా ఉండటం లేదు. ఎవరి స్థాయిలో వారు అవినీతిపనులు చేస్తున్నారు.
.................

ఇప్పుడు కోట్లాదిసొమ్ము ఉన్న వారిలో చాలామంది ఒకప్పుడు పేదవారే. వారిలో కొందరు అవినీతిపనులు చేసి పైకి వచ్చి ఉండవచ్చు.
ప్రారంభ దశలోనే వీరి చర్యలకు అడ్డుకట్ట వేసినట్లయితే పెద్దమొత్తం డబ్బు వారి దగ్గర ప్రోగుపడేదికాదు.
...................
విదేశాలలో ఉన్న నల్లడబ్బును తిరిగి తెస్తామని, నల్లడబ్బు నియంత్రిస్తామనటం మంచిపనే.


బినామీలను కట్టడి చేస్తామని చెబుతున్నారు. ఇవన్నీ చక్కగా ఆచరణలో సఫలమవ్వాలని అందరమూ మనసారా కోరుకుందాము.

 అలాగే ప్రస్తుతానికి  ప్రజల ఇబ్బందులు తగ్గేలా వేగంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

.................
ఇప్పుడు పెద్దనోట్ల రద్దువలన కొంతకాలం వ్యాపారాలు తగ్గితే వచ్చే నష్టమేమీలేదు. 

ప్రస్తుతానికి పెద్దనోట్లు ఎక్కువ అందుబాటులో లేవుకాబట్టి.. ప్రజలు అనవసరమైన కొనుగోళ్ళు చేయకుండా నిత్యావసరాలకు డబ్బు ఉంచుకోవాలి. 

చాలామందికి కార్డులు ఉన్నాయి కదా! వాళ్ళు కార్డులు వాడితే సరిపోతుంది. అప్పుడు బ్యాంకుల ముందు ఎక్కువ క్యూలు ఉండవు.

అయితే భారత దేశంలో చాలామంది చదువుకున్న వారికి కూడా కార్డులు వాడకం, బ్యాంకుల లావాదేవీల వంటివి సరిగ్గా తెలియదు.

దేశంలో పూట గడవక నిత్యావసరాలు తీరని ప్రజలు ఎందరో ఉన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ప్రభుత్వ ఆఫీసులు చాలా ఉన్నాయి.విద్యుత్ సరఫరా సరిగ్గా లేని ఊళ్ళూ ఉన్నాయి.

 ఇలాంటి దేశంలో నగదురహిత లావాదేవిలు వంటివి జరగాలంటే చాలా మార్పులుచేర్పులు జరగాలి.
.............
ఇప్పటికిప్పుడు దేశమంతా నగదు రహిత లావాదేవీలకు  ఏర్పాట్లు చేయాలన్నా చాలా సమయం పడుతుంది.

ఉన్నపళంగా ప్రజలందరూ నగదురహిత లావాదేవీ విధానాలకు మారిపోవాలి ..అప్పటివరకూ కొత్తనోట్లు విడుదల చేయం.. అని కూర్చుంటే మాత్రం ప్రజలకు, ప్రభుత్వానికి కష్టాలు తప్పవు.

అందువల్ల ప్రస్తుతానికి కొత్తనోట్లను త్వరగా విడుదల చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలి. క్రమంగా నగదురహిత చర్యలు చేపట్టవచ్చు.


No comments:

Post a Comment