koodali

Wednesday, November 30, 2016

దేశంలో పరిస్థితి గురించి కొన్ని విషయాలు ..1..

 
సైబర్  నేరాల  వల్ల బాగా చదువుకున్న వాళ్ళుకూడా మోసానికి గురవుతున్న ఈ రోజుల్లో.. 
టెక్నాలజీ అంతగా తెలియని వాళ్ళు ఎక్కువగా మోసపోయి డబ్బుపోగొట్టుకునే అవకాశాలున్నాయి. 
............

మనదేశంలో ఎక్కువమంది ప్రజల ఆర్ధికపరిస్థితి అంతంత మాత్రమే. వాళ్ళలో కొందరు  పెద్ద మాల్స్ కు  వెళ్ళటానికి  జంకుతారు. 

ఉదా ..మా బంధువుల ఇంట్లో పనిచేసె అమ్మాయి కుక్కర్ కొనుక్కోవాలనుకుందట. 

కుక్కర్ అమ్మే షాపుకు వెళ్ళటానికి తనకు జంకు అని చెప్పి, ఇంటామెతో   తనకు మంచి కుక్కర్ కొని తెమ్మని ..డబ్బు తానే ఇస్తానని  అడిగిందట. 

ఇది ఎందుకు రాసానంటే.. ఇలాంటి పరిస్థితి ఉన్న దేశంలో   ప్రజలు ఉన్నపళాన అందరూ నగదురహిత లావాదేవీలు చేయాలంటే ప్రజలకు కష్టమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు గ్రామీణులు సరుకులు కొనుక్కోవటానికి వీలుగా గ్రామాలలో మాల్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు. 

అక్కడే కుక్కర్లు  వంటి వస్తువులు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది.

***********
ఇంకో సంఘటన చెబుతాను. మాకు ఇంట్లో అంతర్జాలం సౌకర్యం ఉంది. నేను ఒకసారి దేవాలయానికి ఆన్ లైన్ ద్వారా కొంత సొమ్ము పంపాలనుకున్నాను. 

నాకు చేతకాకుంటే ఇంట్లో వాళ్ళు సహాయం చేసారు. ఇంకోసారి ఆన్ లైన్లో ప్రయత్నిస్తే కుదరలేదు.

దగ్గరలోని పోస్టాఫీస్ కు వెళ్ళి మనియార్డర్ చేసాము. 

ఇంకొకసారి, మనియార్డర్ చేద్దామని వెళ్తే అక్కడి సిబ్బంది మిషన్ పనిచేయటం లేదన్నారు. 

బాగవటానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేమని అన్నారు. 
************

పోస్టాఫీసుకు వచ్చే వాళ్ళలో చదువు అంతగా రాని వాళ్ళు , చదువు వచ్చినా అప్లికేషన్స్ రాయటం చేతకాని వాళ్ళు కూడా ఉంటారు. 

నేను పోస్టాఫీస్ వద్ద ఉన్నప్పుడు ఒకామె వచ్చి ఏదో అప్లికేషన్  చూపించి,  రాసిపెట్టమని నన్ను అడిగింది. అవన్నీ నాకు తెలియదు.

 తెలిసీతెలియక నేను ఏదో రాస్తే తప్పులు వస్తే కష్టమని భావించి అప్లికేషన్ రాయటం నాకు తెలియదని చెప్పాను. ఆమె  వెళ్ళిపోయింది.

 ఇలాంటి దేశంలో అంతా నగదురహిత పద్ధతులు అంటే ..

.చదువు రానివాళ్ళు ప్రతిదానికి ఇతరుల సహాయం అడగవలసి వస్తుంది.అప్పుడు వాళ్ళను  మోసం చేసే వాళ్ళూ ఉంటారు. 

ప్రజలు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వైద్యవృత్తిలో ఉన్నవాళ్ళలో కూడా బ్యాంకింగ్ గురించి సరిగ్గా తెలియనివారున్నారు. 

వారిలో కొందరు వివరాల కోసం బ్యాంక్ వాళ్ళను, సిఏ వాళ్ళను అడుగుతారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఎవరి పని బిజీ వాళ్ళది. 

ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలనూ అందరూ తెలుసుకోవాలంటే ఎలా కుదురుతుంది ?
..............
ఇందువల్ల అందరూ డిజిటల్ లావాదేవీలకు మారటం కంటే ..పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వటం ..చిన్నమొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు నగదు వాడటం జరిగితే బాగుంటుంది.
 

No comments:

Post a Comment