koodali

Wednesday, June 10, 2015

.యధారాజా..తధాప్రజా..యధాప్రజా..తధా రాజా...


ఇప్పటి సమాజంలో నైతిక విలువలు తగ్గిపోయాయి.

యధారాజా..తధాప్రజా..యధాప్రజా..తధా రాజా.. అన్నట్లు పరిస్థితి ఉంది. ఇవన్నీ మారాలంటే సమాజంలో సమూలంగా మార్పులు రావాలి. నైతిక విలువలు పెరగాలి.

ప్రలోభాలు అనేవి అనేక విధాలుగా ఉండే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వజూపటం, ఖరీదైన వస్తువులను ఇవ్వజూపటం, పదవులను ఇవ్వజూపటం, ఆస్తిపాస్తులను ఇవ్వజూపటం ..వంటివి ఎన్నో ఉంటాయి.

ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు ప్రజలకు ప్రలోభాలు ఆశ చూపి ఓట్లు అడిగే సంఘటనలు ఉంటాయని అంటారు.

కొందరు ప్రజలు కూడా  తమకు అలా ఇచ్చిన వాళ్ళకే  ఓట్లు వేస్తామని అడిగే సందర్భాలూ ఉంటాయంటారు.

మరి కొందరు ప్రజలు తమ పనులు ఏ మాత్రం ఆలస్యం కాకుండా త్వరగా జరగటం కోసం ఆఫీసులలో పనిచేసేవారిని  ప్రలోభపెడుతుంటారు.

 కొన్ని ఆఫీసులలో అయితే త్వరగా పని జరగాలంటే  తమకు లంచం ఇవ్వాలని  కొందరు ఉద్యోగులు డిమాండ్ చేయటమూ ఉంటుంది.

ఇలా జరిగే  ఎన్నో సంఘటనల గురించి వార్తల ద్వారా వింటున్నాము.

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. .అందరిలో  నైతికవిలువలు పెరగాలి 
.....................

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో  జరుగుతున్న సంఘటనలు ఎంతో బాధను కలిగిస్తున్నాయి.

కొందరు, మీది తప్పంటే మీది తప్పంటూ నిందలు వేసుకుంటున్నారు.

మీరు ఇతరపార్టీల వాళ్ళకు డబ్బు ఇచ్చి ప్రలోభపరచాలని చూసారు. మీరు చేసింది తప్పు.. అని కొందరు అంటుంటే....

మీరు పదవులతో ఇతర పార్టీల వాళ్లను ప్రలోభపెట్టారు. మీరు చేసింది తప్పు.. అని మరికొందరు అంటున్నారు.

ఇలా ఒకరినొకరు నిందించుకుంటూ ఉన్నారు.

ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో వాళ్ళకే తెలియటంలేదనిపిస్తోంది.

ఇతరులను  ప్రలోభపెట్టే అంశం  విషయంలో చాలా రాజకీయ పార్టీల అభిప్రాయాలలో  దగ్గర సంబంధం ఉంటుంది. 
................

వ్యక్తులు తమ ఆధిపత్య ధోరణులు వల్ల గొడవలు పడేటప్పుడు ఆ ఆవేశం  అంతా బాగున్నట్లే అనిపిస్తుంది. ఆవేశం తగ్గిన తరువాత ఆలోచించుకుంటే తాము ఎంత నష్టపోయామో తెలుస్తుంది.  

ఆధిపత్య ధోరణితో సాధించే సంతోషం తాత్కాలికమైనది.

పదవిలో ఉండి, ప్రజలకు సహాయం  చేసే అవకాశం అందరికీ లభించదు. 

ఆధిపత్య ధోరణి వల్ల లభించే తాత్కాలిక సంతోషం కన్నా....  ప్రజలకు సహాయం చేసి వాళ్ళ  జీవితాలను మెరుగుపరిచితే లభించే సంతోషం ఎంతో గొప్పది.

తప్పులు చేసినవాళ్లు ఇప్పుడు తప్పించుకున్నా భగవంతుని న్యాయస్థానం నుంచి తప్పించుకోలేరు.... అని గుర్తుంచుకోవాలి.

  ఏది ఒప్పు ఏది తప్పు అనే విషయాలలో ఎన్నో ధర్మ సూక్ష్మములు ఇమిడి ఉంటాయి. ఇవన్నీ దైవానికి తెలుస్తాయి.


No comments:

Post a Comment