koodali

Monday, June 9, 2014

సంతాన ఫల మంత్రం..


సంతానం లేకపోవడానికి నాగదోషం లేదా సర్పదోషం కారణమని అంటారు.

ఈ నాగదోషం తొలగాలంటే గర్భం ధరించిన నెలలోపులో లేదా గర్భధారణకి పూర్వమే అయినా ఈ క్రింది శ్లోకాన్ని రోజూ స్నానం చేశాక ముమ్మారు పఠించాలి. ఇలా చదివితే తప్పక 108 రోజుల్లో నాగదోషం తొలగుతుందన్నది అనుభవంలో ఉన్న సత్యం.

చక్కని సంతానం కలిగారన్నది వాస్తవం.

ఏ నిత్య నివేదనలూ నియమాలూ లేవు. 108 వ రోజు చదవటం పూర్తయ్యాక నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఆ మంత్రం లాంటి శ్లోకం ఇదిగో,


జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ .

వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా ..

జరత్కారుప్రియాస్తీకమాతా విషహారేతి చ .

మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా ..

ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ .

తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ.

పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు వంటివి  ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



2 comments:

  1. దీని గురించి ఒక టపా రాయాలేమో! :)

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. టపా వ్రాస్తానండి.

    ReplyDelete