koodali

Wednesday, January 2, 2013

చరిత్రలో ఎందరో మహానుభావులైన స్త్రీపురుషులున్నారు.

* ఓం.

*ఈమధ్య  ఒక బ్లాగ్ లోని  టపాకు  నేను  వ్రాసిన   వ్యాఖ్యలో.............

* ..జీవితంలో  ఎవరినీ  ఎప్పుడూ  విసుక్కోని,  కసురుకోని,  తిట్టని,  ఒక్క  స్త్రీని  నాకూ  చూడాలనుంది... అని  వ్రాసాను.

* తరువాత  ఆలోచిస్తే,   ధర్మరక్షణ  కోసం   జీవితాలలో  ఎన్నో  కష్టాలను  సహించిన  ఎందరో  మహానుభావులైన  స్త్రీలు,  పురుషులు  చరిత్రలో   ఉన్నారు.  అందుకని    పైవిధంగా  నేను  వ్రాయటం  తప్పని  నాకు  అనిపించింది. 



 * తెల్లవారితే  పట్టాభిషేకానికి  బదులు  వనవాసానికి  వెళ్ళవలసివచ్చినప్పుడు  సీతారాములు  ఎంతో  నిబ్బరంగా  వ్యవహరించారు. 


*
నేను  వనవాసానికి  వెళ్ళను.....  అని  రాముడు  అంటే  ఎవరూ  చేయగలిగిందేమీలేదు.  అయితే,   శ్రీ రాముడు  అడవులకు  వెళ్ళకపోతే  ,  కైకేయికిచ్చిన  మాటను  నిలబెట్టుకోలేక   మాటతప్పిన  వాడనే  చెడ్డపేరు  దశరధునికి  వచ్చి  ఉండేది.


* నేను  రాజ్యాన్ని దానంగా  ఇవ్వను....అని  హరిశ్చంద్రుడు  అంటే  ఎవరూ  చేయగలిగిందేమీలేదు.   అయితే, రాజ్యాన్ని
దానంగా ఇవ్వకపోతే,   విశ్వామిత్రునకు  ఇచ్చిన   మాటను  నిలబెట్టుకోలేక   మాటతప్పిన  వాడనే  చెడ్డపేరు  హరిశ్చంద్రునకు  వచ్చి  ఉండేది.

 * వాళ్ళు   ధర్మపరిరక్షణకు  ఎంతో  ప్రాధాన్యతను  ఇచ్చేవారు.


* సమాజంలో  బాధ్యతాయుతస్థానాల్లో  ఉన్నవారు  అసత్యవాదులు,  అధర్మపరులు  అయితే ,   ప్రజలు  కూడా  అసత్యం,  అధర్మం  చేయటానికి  వెనకాడరు.    అప్పుడు  సమాజమంతా  అబద్ధాలకోర్లు,  మోసగాళ్ళతో  నిండిపోయి   అస్తవ్యస్తమవుతుంది.      అధర్మం  పెరిగిపోతుంది.     సమాజంలో   ఎన్నో  నేరాలు  జరుగుతాయి.



*  అందుకే  సత్య  హరిశ్చంద్రుడు,  శ్రీరాముడు, వంటి  వారు  లోకహితం  కోరి,  ధర్మ  పరిరక్షణ  కొరకు  రాజభోగాలను   కూడా   అవలీలగా  త్యజించి , ఎన్నో  కష్టాలను  సహించారు.  వారి  భార్యలు  కూడా  ఎన్నో  కష్టాలను  భరించారు.


* రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులు...  వారి  భార్యలు  ...  రాజ్యాధికారం  కోసం  తమలో  తాము  
కలహించుకోకుండా  ప్రజలకు  శాంతినిచ్చి  తాము  కష్టాలను  భరించారు.

* భారతంలో  భీష్ములవారు  రాజ్యాధికారాన్ని,  వివాహాన్ని  అవలీలగా  త్యజించి  జీవితాంతం  తాను  చేసిన  ప్రతిజ్ఞకే  కట్టుబడ్డారు.



* లోకక్షేమం  కోసం  వెన్నెముక  కావాలని   దేవతలు   అడిగితే  అవలీలగా  అర్పించారు  దధీచి  మహర్షి.


*  ఇలా    ధర్మరక్షణ  కోసం  జీవితాలలో  ఎన్నో  కష్టాలను  సహించిన  స్త్రీలు,  పురుషులు   పురాణేతిహాసాలలో  ఎందరో   ఉన్నారు. 



* పురాణేతిహాసాల  ద్వారా  వీరి  చరిత్రలను  తెలుసుకుని ,  స్వార్ధాన్ని  తగ్గించుకుని  జీవితాలను  తీర్చిదిద్దుకున్న  వారెందరో   తరువాత   కాలంలో  కూడా   ఉన్నారు.



* ఇంత  మంది  మహనీయులైన  స్త్రీలు,  పురుషులు  చరిత్రలో  ఉన్నప్పుడు ,  జీవితంలో  ఎవరినీ  ఎప్పుడూ  విసుక్కోని,  కసురుకోని,  తిట్టని,  ఒక్క  స్త్రీని  నాకూ  చూడాలనుంది...... అని  నేను  వ్రాయటం  ఎంతో  తప్పే  . * అలా  వ్రాసినందుకు  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


.................................
* ఈ  మధ్య   నేను  కురువపురం  వెళ్ళి  శ్రీపాదశ్రీవల్లభుల  వారి  దర్శనం  చేసుకు  వచ్చాను.

* ఇంతకుముందు  కూడా  ఒకసారి  కురువపురం  సందర్శన  భాగ్యం  కలిగింది.   మళ్ళీ  నాకు   కురువపురం  సందర్శన  భాగ్యం   కల్పించినందుకు  దైవానికి  అనేక  నమస్కారములు.


* శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  అనేక  నమస్కారములు.

*  శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  అనేక నమస్కారములు.

........................

 * ఆంగ్ల  నూతన సంవత్సర  సందర్భంగా .... ప్రపంచమంతటా  శాంతిభద్రతలు  విలసిల్లాలని  ఆకాంక్షిస్తున్నాను.



2 comments:

  1. వారంతా కారణ జన్ములండీ!
    తీర్ధయాత్ర చేసివచ్చారనమాట అదృష్టవంతులు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి. మీరన్నట్లు వారంతా కారణజన్ములు.
    ...............

    అంతా దైవం దయ.

    ReplyDelete