koodali

Tuesday, May 17, 2011

ప్రపంచంలో మానవ మేధకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.

 

ప్రహ్లాదుని వంటి బాలకుని సడలని భక్తికి మెచ్చి....... ఆవిర్భవించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఈ రోజు..

ఈ మధ్యన మేము 4 రోజులు తమిళనాడు వెళ్ళి , దేవాలయాలు అవీ చూసి ,ఈ నెల 14 న ప్రొద్దున తిరిగి వచ్చామండి...... తిరువణ్ణామలై, శ్రీరంగం, శ్రీ విల్లిపుత్తూరు, సమయపురం, మేల్ మరువత్తూర్, మధురై మీనాక్షి సుందరేశ్వరుల గుడి , తిరుచ్చిలో ఉచ్చి పిళ్ళయార్ టెంపుల్ ఇంకా కొన్ని గుడులు చెన్నైలోవి కూడా చూసి వచ్చామండి....... భగవంతుని దయవల్ల అన్నీ బాగా జరిగాయి.


ఆ దేవాలయాలు రాతితో కట్టినా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి,.............. ఆ శిల్ప సౌందర్యం చాలా గొప్పగా బాగుంది. ...... శ్రీ విల్లిపుత్తూరులో కూడా వటపత్ర శాయి గుడిలో ...... చెక్కతో చేసిన ఆ ఆర్చిటెక్చర్ చాలా గొప్పగా బాగుంది.


మేము కూడా చాలా మందిలాగే......... కొద్దిగా భక్తి ఉండి, ................ ఇంకా కోరికలు తీరటం కోసం కూడా ..... ఇలా యాత్రలకు వెళ్ళామండి. ( ఇలా చెప్పటానికి సిగ్గుగా ఉంది. కోరికలు లేని పసిపిల్లల్లాంటి నిష్కల్మషమైన భక్తి కలిగే అదృష్టం ......ఇంకా మాకు కలగలేదు .).


సరే, అది అలా ఉంచండి. కొందరు దైవము, మహిమలు ఇలాంటివన్నీ లేవంటారు కదా ! ఈ ప్రపంచంలో మానవ మేధకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.


ఈ భూమి మీది రహస్యాలు తెలుసుకోవటానికే మనకు ఎప్పటికీ సాధ్యం కాదు.... ఇక అనంత విశ్వంలోని రహస్యాలు , కోటానుకోట్ల నక్షత్రాల గురించి తెలుసుకోవటం అసలెప్పటికీ సాధ్యం కాదు........... అసలు వీటి గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచించి............ మనం మన జీవితంలోని ఆనందాన్ని కోల్పోతున్నామేమో అనిపిస్తుంది.


కొందరు ,హేతువాదులు విభూతి సృష్టించటం లాంటివి మాజిక్ ద్వారా చూపించి చూశారా !..... ఇదంతా మేము కూడా చెయ్యగలం కాబట్టి .............. దేవుడు, మహిమలు లాంటివి ఏమీ లేవు అంటుంటారు..


మహిమలు అంటే కేవలం విభూతి సృష్టించటం ఇలాంటివి మాత్రమే కాదండి. ........... యోగులు కొందరు అణిమాది సిధ్ధులను పొందినవారు ఉన్నారట.............. శరీరాన్ని చిన్నదిగా , పెద్దదిగా చెయ్యగలగటం, పరకాయ ప్రవేశం, ఆకాశ గమనం, ఒక దగ్గర మాయమయ్యి......... ఇంకొక దగ్గర ప్రత్యక్ష మవ్వటం , దూరశ్రవణం, దూరదృష్టి కలిగిఉండటం ఇలా ... ఎన్నో శక్తులు ఆధ్యాత్మిక సాధన ద్వారా సాధించిన వారు ఉన్నట్లు ప్రాచీన గ్రంధాల ద్వారా తెలుస్తుంది.


1.. మహా భారతంలో సంజయుల వారు భారతయుధ్ధం జరుగుతున్న విధానాన్ని ................ ఎంతో దూరం నుంచీ చూసీ, అక్కడ జరిగే సంభాషణలు వినీ .................... దృతరాష్ట్రుల వారికి కళ్ళకు కట్టినట్లు వివరించారు అని అంటే ............. ఇదంతా అభూత కల్పన. ............. దూరం నుంచీ యుధ్ధం జరగటం చూడటం ఎలా సాధ్యం ? అని ఎగతాళి చేసిన వారు ఎందరో ఉన్నారు ........


మరి ఇప్పుడు టి.విలు, ఫోన్లు వచ్చాక దూరశ్రవణం, దూరదృష్టి అసాధ్యం కాదని తేలిపోయింది కదా !

2.. ప్రపంచంలో సైన్స్ కు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో ఇలాంటి మహిమలు స్వయంగా చూసినవారు.......... చెప్పిన మహిమల యొక్క విశేషాలు ఎన్నో ఉన్నాయి. ................ ఆహారం తీసుకోకుండా ఎన్నో ఏళ్ళు జీవించిన ఒక మహా సాధ్వి గురించి,............. రాముడు అనే ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించిన.......... శ్రీ శ్రీ లాహిరీ మహాశయులనే ఒక మహా యోగి గురించి............. ఇలా ఎన్నో వివరాలు ఆ గ్రంధములో చెప్పబడ్డాయి.


3..ఇప్పుడు కూడా ఒక స్థాయిలో ......... యోగా, ప్రాణాయామం చేసే వారు కొందరు నీటిమీద తేలుతూ వెల్లికిలా పరుండి విన్యాసాలు చేయటం మనం చూస్తూ ఉంటాము.

మన వాళ్ళకు విదేశాల వాళ్ళ గురించి చెబితే బాగా నమ్ముతారు. అలాంటి ఉదాహరణ చూడండి...........

4....వైద్య ప్రపంచానికి అంతు చిక్కని అద్భుతం....విచిత్ర శక్తుల వింత మనిషి........." edgar caycey ""ఈయన గురించి .......... నెట్ లో............ వివరంగా వ్రాయబడింది. దయచేసి చదవండి.


ఈయన ఏసు క్రీస్తు భక్తుడు. వైద్యం గురించి ఏ మాత్రం తెలియని ఈయన ట్రాన్స్ లోకి వెళ్ళి , తనకు భగవదత్తమయిన శక్తి ద్వారా ............... గొప్ప డాక్టర్ గా మారి ఎన్నో క్లిష్టమయిన కేసులలో రోగాలను తగ్గించేవారట.

1910 లో డాక్టర్ వెస్లీ అనే ఆయన......... అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ రీసెర్చి వారికి ఎడ్గర్ ను ఓ మెడికల్ వండర్ గా పరిచయం చేశారట .


5.....ఇంకా మన దేశంలో ఉత్తర్ ప్రదేశ్ లో " ఆంరోహా " అన్న పట్టణానికి వెలుపలగా ఉండే " షర్ పుద్దీన్ షా దర్గా " లో తేళ్ళు ఎవరినీ కుట్టవట..

ఈ దర్గాలోని మౌల్వీ గారి మహిమకు మరో నిదర్శనం ఏమిటంటే ................ఈ తేళ్ళను ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళేందుకు ఇక్కడి అధికారులు అనుమతిస్తారట.


అయితే..............అధికారులు ఎంత సమయం వరకూ ఉంచుకోవచ్చని ఆ సమాధి దగ్గర అనుమతి తీసుకుని మీకు అనుమతిస్తారో ............. అంతవరకే ........ అవి ఎలాంటి హానీ చేయని సాధు జంతువుల్లా ఉంటాయట.

నిర్ణీత సమయానికి ముందుగానే వాటిని మరలా దర్గా అధికారులకు అప్పగించాలట. ............ కేవలం సమాధిలోని ఆ మహిమాన్విత మహాపురుషుని దివ్య ఆత్మ యొక్క అద్భుత శక్తి కారణం గానే........... ఈ ఆలయ ప్రాంగణంలో తేళ్ళు ఎవరినీ కుట్టవట............ ఈ విషయం నేను ఒక పుస్తకంలో చదివానండి.


6...ఇంకా కర్నూలు జిల్లాలోని యాగంటి పుణ్య క్షేత్రంలో పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. .............. ఆ నందీశ్వరుని చుట్టూ కొంతకాలం క్రితం వరకూ కూడా ................. భక్తులు ప్రదక్షిణలు చేయటానికి స్థలం ఉండేదట.

అయితే ఆ నందీశ్వరుడు పెరుగుతుండటం వల్ల .......... ఇప్పుడు అక్కడ ప్రదక్షిణ చేయటానికి అవకాశం లేనంతగా ........... నందీశ్వరుడు పెరగటం జరిగింది. మేము కూడా ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నాము.


భక్తి పేరుతో కొందరు ప్రజలను మోసం చేయటాన్ని, భక్తి పేరుతో మూఢత్వం పెరగటాన్ని ఖండించవలసిందే.............కానీ ఇలా ప్రపంచములో ఎన్నో వింతలు ఉండగా దేవుడు లేడు, మహిమలు లేవు అనటం అన్యాయం కదండి..

 

2 comments:

  1. meelo unde openess undi choosaaru,adoka goppa varam meeku...kalmashamleni manishiki openess anedi untundi.

    ReplyDelete
  2. పొగిడి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు..... ..నాలో స్వార్ధం, కోపం, ఇలా ......... కొన్ని అవలక్షణాలు కూడా బాగానే ఉన్నాయి లెండి. కొన్ని విషయాల్లో ఓపెన్ గా మాట్లాడటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నానండి. " ఏప్రిల్ 1 విడుదల " సినిమాలో రాజేంద్రప్రసాద్ గారి లాగ......

    ReplyDelete