koodali

Wednesday, July 28, 2010

పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ ఎంతో గొప్పవి........

 

ఓం.

శ్రీ కృష్ణార్జునులకు నమస్కారములు.

సుధాసముద్రములో, మణిద్వీపములో , చింతామణి గృహములో నివసించే ఆ ఆదిపరాశక్తి కి {పరమాత్మ {శ్రీ మన్మహాదేవిశ్రీమన్మహాదేవులు} నమస్కారములు.


ఆమెయే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు సృష్టి, స్థితి, లయములనే పదవీబాధ్యతలను అప్పగించారట.


ఒకప్పుడు ఈ విశ్వంలో ఎన్నో బ్రహ్మాండాలను, అందులో ఎంతోమంది బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులను చూసి మన త్రిమూర్తులు ఎంతో ఆశ్చర్యాన్ని పొందారట. జీవులకు మోహబంధనాలను కలిగించినా, మోక్షాన్ని అనుగ్రహించినా ఆ తల్లి లీలయేనని పెద్దలు చెబుతున్నారు . లోకంలో ఎప్పుడయినా దేవతలకు కూడా లొంగని బలవంతులైన రాక్షసులను ఆమెయే సంహరిస్తుంది. . అలా ఎంతోమంది దానవులను సంహరించి ఆ తల్లి లోకాలను రక్షించింది. . ఎన్నో విషయములు శ్రీ దేవీ భాగవతములో చెప్పబడ్డాయి.


ఓకప్పుడు భూమిపై పాపాత్ములు పెరిగిపోయి భూభారం పెరిగిపోయినప్పుడు ఆ పరమాత్మ ఒక ప్రణాళిక ప్రకారం కధను నడిపించి మహాభారత యుధ్ధం ద్వారా భూభారాన్ని తగ్గించటం జరిగిందట. .

ఆ కధలలో ఎన్నో వింతలు, విశేషాలు,...... ,ఎన్నో మనస్తత్వాలు.... .....లోకంలో ఉండే విశేషాలన్నీ అందులో ఉంటాయని పెద్దలు చెబుతున్నారు.


వ్యాస భగవానుడు...విష్ణు మూర్తి అవతారమని పెద్దలు చెబుతున్నారు. వీరు తమ తల్లి ఆదేశం మేరకు మాత్రమే వంశరక్షణ, రాజ్యరక్షణ కోసమని అంబిక, అంబాలికలకు సంతానాన్ని అనుగ్రహించారు. అయితే ఆ తర్వాత తమ అధర్మ ప్రవర్తనతో ధృతరాష్ట్రులవారి సంతానం అలా అయ్యారు. పాండురాజుల వారి జీవితంలో కొన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి కదా..... ఇక విదురులవారు గొప్ప వేదాంతి.


ఇక పాండు రాజు ఆదేశించగా కుంతీదేవి, మాద్రిదేవి దేవతల ద్వారా సంతానాన్ని పొందారని పెద్దలు చెబుతున్నారు. మనలో చాలామంది ఈ సంఘటనలను అపార్ధం చేసుకోవటం తప్పు. ఈ రోజుల్లో కూడా కొంతమంది భార్యా,భర్తలు సంతానం లేనివారు స్పెర్మ్ బ్యాంకుల సహాయంతో కృత్రిమపధ్ధతులలో సంతానాన్ని పొందుతున్నారు కదా....నేను వారిని, పోల్చటం లేదు. విషయం అర్ధం అవటానికి చెప్పానండి.


సూర్య భగవానుని వల్ల కుంతీదేవి కి కర్ణ జననం జరిగిన సందర్భంలో ఆమె కన్యాత్వానికి భంగం రాకుండా సంతానాన్ని పొందారని పెద్దలు చెబుతున్నారు. దేవతలుగాని, మహర్షులు గాని తమ అధ్బుతమైన మహత్తు ద్వారా సంకల్ప మాత్రంచేతనే వరాలను, సంతానాన్ని అనుగ్రహించగలరు. దైవభక్తి, తపశ్శక్తి, యోగా ఇలాంటి వాటి ద్వారా గొప్పశక్తి కలుగుతుందట. ,


ఈ రోజుల్లో కూడా కొంతమంది యోగా సాధకులు నీటిపైన పడుకోవటం మనం చూస్తున్నాము. కరాటే చేసేవారు కూడా ఒక్క చేత్తో బండరాళ్ళను పగులకొట్టడం చూస్తూనే ఉన్నాము. ఇలా లోకంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం ? అని మనకి అనిపించే విషయాలు ఎన్నో సృష్టిలో ఉన్నాయి..



కొద్దిగా యోగా చేసే వారికే ఇన్ని శక్తులు ఉన్నప్పుడు మరి దేవతలు, మహర్షులకు ఎంత శక్తి ఉంటుంది....... ఇంకా కొన్ని మొక్కలు పువ్వులు పూయటం, కాయలు కాయటం, , విత్తనం, తద్వారా కొత్త మొక్కలు ఇలాంటి ఫలదీకరణం అనే ఒక సైకిల్ లేకుండా ఒక కొమ్మగాని, ఆకు గాని తుంచి నేలలో పాతినా అందులోనుంచి కొత్త మొక్క వస్తుంది. ఇది చూడటానికి సామాన్యంగా అనిపించినా ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. సృష్టిలో ఇలా ఎన్నో రకాల సంతానోత్పత్తి పధ్ధతులున్నాయి.



ఇంకా కొన్ని సంఘటనలలో చేతితో మంత్ర పూర్వకముగా నాభిని స్పృశించి సంతానాన్ని అనుగ్రహించటం లాంటివి చదివినప్పుడు ఆ రోజుల్లో లాప్రోస్కోపీ లేక లేజర్ సర్జరీ ఇలాంటివి ఉండేవా అని అనిపించినా వారు తమ తపశ్శక్తితో సంతానాన్ని అనుగ్రహించగల గొప్ప మహిమ గలవారు.


ఒకోసారి ఈ కధలు వింటుంటే ఆ రోజుల్లోనే ఎంతో అబివృధ్ధి చెందిన విజ్ఞానం ఉండేదని అనిపిస్తుంది. అందుకే మనము విషయం సరిగ్గ తెలియనప్పుడు తొందరపడి పెద్దలను అపార్ధం చేసుకోకూడదు. . .


ఇక కొంతమంది ధర్మరాజు జూదంలో ద్రౌపదిని పణంగా పెట్టి ఆడి ఓడటం అన్యాయమని అంటారు. నిజమే ఇది చాలా బాధాకరమైన విషయమే. అయితే ఆయన రాజ్యాన్ని, తన తమ్ములను కూడా ఓడిపోయారు.



మనకు ఒకోసారి కొన్ని ధర్మ సందేహాలు వస్తూఉంటాయి. ఉదా....అధర్మంగా ప్రవర్తించేవారు ఎప్పుడైనా జూదం ఆడటం ఇలాంటి పనులు చేస్తే ........... మనం ఠకీమని ఏమంటామంటే వారు దానికి తగ్గ ఫలితాన్నీ అనుభవిస్తారు అని. కానీ ఎప్పుడూ ధర్మబధ్ధంగా ప్రవర్తించేవారు ఇలా వ్యవహరిస్తే దాని ఫలితం ఎలా ఉండబోతుందనే సందేహం మనకు కలుగుతుంది.


ఒకోసారి న్యాయం చెప్పే న్యాయమూర్తులకు కూడా ఇలాంటి ధర్మసంకటం కలగవచ్చు. అంటే వారు గొప్పవారు కాబట్టి ఆ చెడు ఫలితాన్ని అనుభవిస్తారా? లేక క్షమించబడతారా?....అని.


ఈ కధ ద్వారా మనకు ఏమని తెలుస్తుందంటే ఎవరయినా ఎంతగొప్పవారయినా సరే ...... ,ఎలాంటి పనిచేస్తే అలాంటి ఫలితాన్నే వారు అనుభవించాల్సి ఉంటుందని. పాండవులు వనవాసాన్నీ అనుభవించారు. అయితే వారు ఆ కాలాన్ని అతిధి, అభ్యాగతుల సేవలు, ఇంకా ధర్మకార్యాలతో గడిపారు.


జీవుల పాప,పుణ్యాలను సరిచూసే సమవర్తి అయిన ఆ యమధర్మ రాజు అంశతో జన్మించిన ధర్మమూర్తి అయిన ధర్మరాజులవారికి ఈ పాప, పుణ్యాలు తెలియకుండా ఉండవు కదా.......


అయితే ఇలాంటి పాత్రలద్వారా మన జీవితంలో ఎదురయ్యే ధర్మసందేహాలకు సమాధానాలు తెలియచెప్పటం, జూదం ఆడటం లాంటి పనులవల్ల జీవితంలో ఎదురయ్యే కష్ట,నష్టాలను ........,మరియు ........ ఒక రాజు ఇలా చేస్తే అతని రాజ్యంలోని ప్రజలు కూడా దుర్యోధనుని లాంటి వారి పాలనలో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది .... ఇలా అన్ని విషయాలను పెద్దలు మనకు తెలియచేస్తున్నారు.


ఇవన్నీ చెప్పి మనల్ని భయపెట్టడం పెద్దల ఆలోచన కాదు. రాబోయే తరాలవారి యందు ప్రేమతో ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి, లేకపోతే దుర్యోధనుల లాంటి ద్వారా కష్టాలను అనుభవించాల్సి వస్తుందని ఆప్యాయంగా మనలను హెచ్చరిస్తున్నారు అంతే.


ఇక ద్రౌపదీ దేవి తాను కావాలని ఏమీ పాండవులు అందరినీ వివాహం చేసుకోలేదు కదా. అది అలా జరిగింది అంతే. కానీ పాపం ఆమె ఎందుకనో అలా పుత్రా శోకాన్ని అనుభవించవలసి వచ్చింది.


పాండవులు, ద్రౌపది వీరందరూ ఎన్ని కష్టాలను అనుభవించినా ధర్మ మార్గాన్ని వీడలేదు. అందుకే భగవానుడైన శ్రీ కృష్ణులవారు వారికి అండగా నిలబడ్డారు. . . ..

తప్పులను ఆ దైవం దయచేసి క్షమించాలని నా ప్రార్ధన..... ...
.అంతా భగవంతుని దయ..


2 comments:

  1. //అయితే ఇలాంటి పాత్రలద్వారా మన జీవితంలో ఎదురయ్యే ధర్మసందేహాలకు సమాధానాలు తెలియచెప్పటం//

    మన పురాణ ఇతిహాసాల సెంట్రల్ పాయింట్ మీరు చక్కగా చెప్పారు.

    ReplyDelete
  2. చాలా థాంక్స్ సార్. అంతా ఆ భగవంతుని దయ , అంతేనండి. ఇది రాయటానికి కొంచెం భయపడ్డానండి. సున్నితమైన అంశం కదా... తప్పులేమైనా ఉంటే ఆ భగవంతుడే క్షమించాలి మరి.....

    ReplyDelete