koodali

Friday, July 9, 2010

పురాణములు ఎంతో గొప్పవి ....మూడవ భాగం...... ....

 

పురాణములలోని కధలనుంచి మనము ఎన్నెన్నో విషయములు నేర్చుకోవచ్చు.

శ్రీ వల్లీ శ్రీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారములు..



ఉదాహరణకు రామాయణం విషయములో చూస్తే శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించటం, రావణాసురుణ్ణి సం హరించటం ఇదంతా ముందే ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని మనం పెద్దల ద్వారా తెలుసుకున్నాము. జయ,విజయుల శాపం కధ కూడా మనకు తెలిసిందే.


అయితే పురాణములద్వారా మనము జీవితములో ఎలా ప్రవర్తించాలి , ఎలా ప్రవర్తించకూడదు అన్నది కూడా తెలుసుకోవచ్చు అని నా ఉద్దేశ్యము. రామాయణములో చూడండి. ....సీతారాములు ఎన్నో కష్టాలు అనుభవించినా కూడా ధర్మాన్ని వీడలేదు. ధర్మం కోసం వారు ఆ కష్టాలను తట్టుకున్నారు. అందుకే వారి సంతానము చక్కగా ఉండి రాజ్యమును పాలించారు.


అదే రావణాసురుడు మంచి దైవ భక్తుడే ,........ కొంతకాలం సుఖములను అనుభవించినా కూడా ......... తరువాత తన అధర్మ ప్రవర్తన ,, అత్యాశ ఇలాంటి కారణాల వల్ల తాను నాశనం అవటమేకాక తనతోపాటు తన బంధువులు, సంతానము ఇలా అందరి నాశనానికి కారకుడయ్యాడు. ధర్మమును అనుసరించిన విభీషణుడు రాజ్యాన్ని పాలించాడు. .



దీనివల్ల నాకు ఏమనిపిస్తుందంటేనండి......మనము జీవితములో ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. మన ప్రవర్తనను బట్టే మన తరువాతి తరాల వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఎన్ని చెడ్డ పనులు చేసినా పరవాలేదు. కొన్ని మంచిపనులు చేస్తే ఆ పాపం కొట్టుకుపోతుందిలే అని. మరి రావణాసురుడు అంత భక్తుడయినా కూడా .... ఆయన చేసిన పాపం కొట్టుకుపోలేదు. పాప,పుణ్యాలలో దేని లెక్క దానిదే ........


భగవంతుడు కరుణామయుడే ...... కానీ ఎంత చెప్పినా వినకుండా అధర్మంగా ప్రవర్తించేవాళ్ళను ఎంతవరకు సహించాలి?.


రావణాసురుడు మారటానికి ఆ దైవం ఎన్నో అవకాశములు కల్పించి , ఎంతోకాలం గడువిచ్చినా కూడా , ........ ఆయన తన ప్రవర్తన మార్చుకోలేదు కాబట్టే ఆ దైవం ఆయనను శిక్షించారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది తమ అంతులేని కోరికలకోసం అత్యాశతో ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నారు. నైతిక విలువలను కూడా పాటించుట లేదు .


ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈ నాటి మానవులు చాలామంది తమకు ఏమి కావాలో సరిగ్గా తెలుసుకోలేక ఏదో తాపత్రయముతో తమ సుఖం కోసమని ప్రపంచాన్ని, అందులోని ఇతర జంతుజాలాన్ని నాశనం చేస్తున్నారు. ఈ ప్రపంచం పైన సర్వ హక్కులు తమవే అని ఈ నాటి మానవులు అనుకుంటున్నారు. ప్రపంచాన్నీ అల్లకల్లోఅలం చేస్తున్నారు. ఇంతచేసినా ఎవరికీ మనశ్శాంతి లేనేలేదు.


కొంత కాలం తరువాత మనముండము. కాని ఆ విషతుల్యమయిన ఫలితాలను అనుభవించాల్సింది మన సంతానమయిన మన పిల్లలే..........
.. ఏమో ఇప్పుడు అధర్మంగా ప్రవర్తించిన వారే పాప ఫలం అనుభవించటానికి తరువాతి తరంలో పుట్టొచ్చు కూడా .......ఇదంతా ఎందుకు లెండి .......

అంతా భగవంతుని దయ .

 

No comments:

Post a Comment