koodali

Monday, July 12, 2010

పురాణములలో ఉన్నది అధర్మం కాదు అంతా ధర్మమే.....పురాణములు ఎంతో గొప్పవి నాలుగవ భాగం ........ ...

ఇవాళ ఇంకో విషయం చెప్పుకుందామండి.

ఓం నమః శివాయః దుర్గాదేవికి నమస్కారములు..

కొంతమంది ఇలా అంటుంటారు. ఒకాయన తన మాట కోసం ఆలిని అమ్మేసాడు, ఒకాయన ఆలిని అగ్ని పరీక్షకు గురిచేశాడు అని , ఒకాయన జూదం లో ఆలిని పణంగా పెట్టాడు అని.....దీని గురించి కొంచెం చెప్పుకుందామండి.


హరిశ్చంద్రుడు
ఉన్నారు. ఒకానొక సందర్భములో ఆయన సత్యవాక్పరిపాలన కోసం విశ్వామిత్రులవారికి తన రాజ్యాన్నిఇచ్చివేయాల్సి వచ్చింది. దక్షిణ కోసం కొన్ని బారువుల బంగారాన్నీ ఇవ్వటం మిగిలింది. దానికోసం ఆయన తనభార్యను, కుమారుని అమ్మిన మాట వాస్తవమే.

ఇది కొంచెం విచారించదగ్గ విషయమే, కానీ అప్పటి ప్రత్యేకమయిన సందర్భములో ధర్మరక్షణ కొరకు మాత్రమే వారు అప్పటికి తమకు తోచిన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు... ధర్మరక్షణ కొరకు మాత్రమే వారు అన్ని కష్టాలను అనుభవించారు..



అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. వివాహ సందర్భములో భార్యాభర్తలు తాము జీవితములో కష్టసుఖాలనుకలసి పంచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు కదా.....ఉదాహరణకు సంపదలు బాగా ఉన్నప్పుడు కుటుంబసభ్యులు అందరూసుఖభోగాలను అనుభవిస్తారుగదా! అలాగే ఆపదలలో వచ్చే కష్టాలను అందరూఎదుర్కోవాలి కదా.....



.అలాగే హరిశ్చంద్రుడు కష్టములో ఉన్నప్పుడు భార్యగా చంద్రమతీ దేవి హరిశ్చంద్రునితో తానే సలహా చెప్పటం జరిగింది ....తననిపరిచారికగా ఎవరికయినా ఇచ్చి వచ్చే సొమ్ముతో రుణం తీర్చమని... నిజంగా ఆవిడ ఎంత ఉత్తమ ఇల్లాలు.
తానుపుట్టింటికి పోయి భర్త యొక్క పరిస్థితి చక్కబడ్డాక రావచ్చులే అని ఆమె అనుకోలేదు .. . సందర్భములో వారు ఎంతోబాధపడ్డారు. అయినా కూడా దంపతులు ధర్మాన్ని వీడలేదు.



కాశీలోని ఒక పండితునికి బార్యాబిడ్డలను అమ్మిన సందర్భములో హరిశ్చంద్రుడు పడ్డ బాధ వర్ణనాతీతం తన వలనసుకుమారులయిన తన భార్యాబిడ్డలు ఇంత కష్ట పడుతున్నారుగదా అని ఎంతగానో విలపించారు. తరువాతఆయనేమీ వారిమానాన వారిని వదిలేసి తాను రాజభోగాలను అనుభవించలేదు. ఇచ్చిన మాటకోసం తానుకూడాచండాలుని రూపంలో ఉన్న యమధర్మరాజుకు కాటికాపరిగా అమ్ముడుపోయారు.. .

 

 ఆతరువాత కొంతకాలానికి వారికుమారుడు పాముకాటుతో చనిపోవటంతో అందరూ శ్మశానములో కలుసుకున్నప్పుడు విరక్తితో శరీర త్యాగం చేసుకోబోతుంటే వారి సత్యవాక్పరిపాలనకు మెచ్చి దేవతలు ప్రత్యక్షమయ్యి వారి కుమారుని బ్రతికించి అందరినిఅనుగ్రహించారు.



రోజుల్లో మరి సత్యం అంటే అంత గౌరవంతో పాటు మాట తప్పితే అందరికి కష్టాలు వస్తాయని కూడా నాటి వారుభావించేవారు. .. .... ఇంతటి సత్యవాక్పరిపాలన , త్యాగం రోజుల్లో మనవల్ల కానిపని .... కానీ ఇందులో కొద్దిగాపాటించినా చాలు లోకం ఎంతో బాగుపడుతుంది.


రోజుల్లో భార్యాభర్తల మధ్య చిన్న గొడవలకే హత్యలు, ఆత్మహత్యలు తరువాత పిల్లలు అనాధలవటం ఇలాంటివితగ్గుతాయి. అనాధలు ఎక్కువ కావటానికి తల్లిదండ్రుల మధ్య గొడవలు కూడా ఒక కారణమని నా అభిప్రాయం....



.ఇందులో మనము అయ్యో హరిశ్చంద్రుడు భార్యను ఎంత ఇబ్బంది పెట్టాడు అనుకోకుండా .... భార్యాభర్తలుసంపదలలోనే కాదు,....ఆపదలు వచ్చినప్పుడు కూడా అంతే ఐకమత్యముగా ఉండాలని.. పెద్దలు మనకు చెప్పారనిఅనుకోవచ్చు కదా...............

అయితే ఇది కలికాలం కాబట్టి అమ్ముడుపోవటం లాంటి సాహసాలు ఏమీ ఆడవాళ్ళు చెయ్యక్కర్లేదు కానీ భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటే చాలు.

 

No comments:

Post a Comment