koodali

Wednesday, January 17, 2018

దైవాన్ని ఎవరూ సృష్టించనవసరం లేదు, దైవం నిత్యం. ..




ఆధునికవిజ్ఞానం.."Matter and energy cannot be created or destroyed "....  అని  వివరించటం  జరిగింది.

 సృష్టిలోని  పదార్ధాల   రూపం  మారే   అవకాశం  ఉంది  గానీ   మూల శక్తి    నాశనం  కాదు.  
ఉదా..ఆవిరి  నీరుగా  రూపాంతరం  చెందుతుంది.  నీరు  మంచు గా  రూపాంతరం  చెందుతుంది ,  మంచు  నీరుగా,  నీరు  ఆవిరిగా  మారే  అవకాశం  ఉంది    గానీ    మూలశక్తి  ఎప్పుడూ  ఉంటుంది.

 దైవాన్ని  ఎవరూ    సృష్టించనవసరం  లేదు.   దైవం   నిత్యమూ  ఉండే  శక్తి.    దైవానికి  ఆది అంతమూ  లేదు.     మొదలైన  విషయాల   గురించి   విష్ణుచిత్తుల వారు  మరియు  ఎందరో  మహానుభావులు  తమ    అభిప్రాయాలను    తెలియజేసారు. 


  ఈ మధ్య   టీవీలో  ప్రసారమైన  ఒక    కార్యక్రమంలో   శ్రీ  సామవేదం  షణ్ముఖశర్మ  గారు   కొన్ని  విషయముల  గురించి  తెలియజేస్తూ....మర్రి  విత్తనంలో  ఉండే  శక్తి  గురించి  తెలియజేశారు.


   నిజమే,  మర్రి  విత్తనాన్ని  చూసిన  వారికి  పెద్ద  కాండము,  శాఖోపశాఖలు  కనిపించవు.  అంత  చిన్న  విత్తనంలో    మహావృక్షం    దాగుంది.

  చిన్న  విత్తనం  నుంచి  మహావృక్షం  రావటం   అనేది  సృష్టిలో  ఒక    అద్భుతం.  సృష్టిలో  ఇలాంటి  అద్భుతాలెన్నో  ఉన్నాయి.

..............
ఆధ్యాత్మికవాదులు,  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పేదాని  ప్రకారం    ...... పదార్ధాన్ని   శక్తిని   సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని ,   తెలుస్తోంది  కదా  !     ఇవన్నీ  రూపాలను  మార్చుకున్నా    కూడా   ఎప్పుడూ  విశ్వంలో   ఉంటాయని  తెలుస్తోంది.


అంటే ,  ఆద్యంతములు   లేని  ఒక  మహాశక్తి   ఎప్పుడూ   నిత్యంగా    ఉంటుందని  మనకు  తెలుస్తోంది.  ఈ  శక్తి  ఊహాతీతమైన  అద్భుతమైన  ఆలోచనా  శక్తి  కూడా  ఉన్న  శక్తి. (  ఆలోచన  కూడా  ఒక  శక్తే  కాబట్టి..  ) 


అన్ని  శక్తులూ  కలబోసిన   ఈ మహా శక్తినే  ఆస్తికులు  దైవం  అని  భావిస్తారు.  దైవానికి  అనేక  వందనములు.
................
(Wednesday, January 22, 2014

దైవాన్ని ఎవరూ సృష్టించనవసరం లేదు, దైవం నిత్యం.)

.........

 దైవ సృష్టి ...

 సృష్టిలో , ఆకాశంలో ఎగిరే పక్షుల శరీరం , ఎగరటానికి తగ్గట్లుగా సృష్టించబడింది. నీటిలో ఈదే చేపలశరీరం అందుకు తగ్గట్లుగా ఉంది. 

ఇవన్నీ ఇలా ఉండాలంటే ఎంతో ఆలోచనకల శక్తికే సాధ్యం. ఆ మహాశక్తే దైవము.

ఇంత పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే, ఊహాతీతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఈ మహాశక్తినే ఆస్తికులు దైవం అని పిలుచుకుంటున్నారు.

ఆధ్యాత్మికవాదులు..  దైవానికి   ఆది ,  అంతమూ ..లేవు .  అని తెలియజేసారు. 

".Matter and energy cannot be created or destroyed "....... అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ..యొక్క రూపం మారుతుంది .

 అంతేకానీ, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.

ఉదా...నీరు ఆవిరిగా మారుతుంది ... ఆవిరి మరల నీరుగా మారుతుంది, నీరు మంచులానూ మారవచ్చు, ఆ మంచు మరల నీరుగానూ , ఆ నీరు ఆవిరిగానూ మారవచ్చు.

విశ్వాన్ని దైవం సృష్టించారు అంటే,  మరి దైవం  ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్న వేస్తారు భౌతికవాదులు. 

 మరి , పదార్ధం లేక శక్తి  మొదట ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్నకు భౌతికవాదులు ఏం సమాధానం  చెబుతారు ?

 పదార్ధానికే పుట్టుక , నశించటం అనేవి లేనప్పుడు , పదార్ధాన్ని సృష్టించిన దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .... అని పెద్దలు చెప్పిన మాట నిజమని తెలుస్తోంది కదా !
  
దైవం వద్ద   జీవులకు కలిగే  అన్ని సందేహాలకు  సమాధానాలు ఉంటాయి . 

అయితే,   విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలంటే   జీవులు  తగిన అర్హతలు సంపాదించుకోవాలి. 

 దైవకృపను పొందగలిగిన జీవులకు ఆ రహస్యాలు తెలిసే అవకాశం ఉందనిపిస్తుంది. ఉదా.. మోక్షాన్ని పొందిన జీవులకు  విషయాలు తెలుస్తాయి .  అనిపిస్తుంది . 

 విమానం ఎలా ఎగురుతుంది ? అని చిన్న పిల్లవాడు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళు ఎంత వివరించినా పిల్లవాడికి అర్ధం కాకపోవచ్చు. 

అదే పిల్లవాడు పెద్దవాడయి చదువుకుంటే ఆ విషయాలు సులభంగా బోధపడతాయి. 

విశ్వరహస్యాలు తెలుసుకోవాలన్నా తగిన  అర్హతలను సంపాదించుకోవాలి.
 
*******
సృష్టి ఎలా ఏర్పడింది? అనే  ప్రశ్నకు,   దైవం  వల్ల   సృష్టించబడింది.. అని  ఆస్తికులు ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.

సృష్టి ఎలా ఏర్పడింది?  అనే  ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.

కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఏర్పడ్డారని  ప్రశ్నిస్తారు.

సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు..  మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా
ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. 
దైవము  ఎప్పుడూ ఉంటారు.
 

 

No comments:

Post a Comment