గ్రంధాలలో ఎన్నో అర్ధం కాని విషయాలుంటాయి. ప్రక్షిప్తాలు కూడా ఉంటాయి.
ఇవన్నీ అదేపనిగా ఆలోచిస్తూ, వాదిస్తూ సమయాన్ని గడపటం కన్నా, ఇవన్నీ విని గందరగోళం పడటం కన్నా..కొంతవరకు తెలుసుకుని..అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుని మన శక్తికొలది చక్కగా దైవాన్ని ఆరాధించుకోవటం మంచిదనిపిస్తుంది.
................
ఒకప్పుడు వేదములను రాక్షసులు అపరించినప్పుడు, దైవము రాక్షస సంహారం చేసి వేదాలను రక్షించారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
వేదాలనే అపహరించగలిగినప్పుడు, ఎవరైనా గ్రంధాలలో మార్పులుచేర్పులు(ప్రక్షిప్తాలు) చేయటంలో ఆశ్చర్యం ఏముంటుంది.
..................
మరికొన్ని విషయములు..
ఈ రోజుల్లో చాలా పూజలలో విపరీతంగా సామాగ్రిని వాడుతున్నారు.
పూజలు ముగిసేసరికి బోలెడు నిర్మాల్యం మిగులుతాయి. కొందరు వాటిని చెత్తలో వేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లతో సహా నీటిలో పడేస్తారు కొందరు.
కొందరు తమ దీక్షలు పూర్తయ్యాక దీక్షా వస్త్రాలను నదీతీరాల వద్ద గట్లవద్ద వదిలేసి వెళ్లిన దృశ్యాలు వార్తల్లో వచ్చాయి.
కుంభమేళా తరువాత మిగిలిన టన్నుల వ్యర్ధాలను మిషన్లతో ఎత్తిపోయవలసి వచ్చిందట.
ప్రజలు కొన్ని విషయాలను పాటించాలి.
దైవచిత్రాలను ఎక్కడపడితే అక్కడ ముద్రించి తరువాత వాటిని చెత్తలో వేయటం సరైనది కాదు.
పూజల తరువాత మిగిలిన వాటిని, తినగా మిగిలిన ప్రసాదం పాకెట్లను రోడ్ల పక్కన పడేయటం కాకుండా జాగ్రత్తగా ఒక దగ్గర వేయాలి.
పసుపుకుంకుమ తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు, నూనె, నెయ్యి కవర్లు..ఇలాంటివి నీటిలోను, రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ వేయడం కాకుండా, ప్లాస్టిక్ వేసే చెత్తబుట్టలలో మాత్రమే వేయాలి.
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. చెరువులను, నదులను అశుభ్రంగా చేయకూడదు.
...........................
కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా చక్కగా తరించవచ్చని ప్రాచీనులు తెలియజేసారు. దైవానుగ్రహాన్ని పొందటానికి సులభమైన మార్గాలెన్నో ఉన్నాయి.
చక్కగా తన్మయత్వంతో దైవ ప్రార్ధన చేసుకోవటం, దైవస్మరణ, భజనలు, భక్తి పాటలు పాడటం కూడా చేయవచ్చు. ఇలాంటివాటికి డబ్బు ఖర్చు కూడా అంతగా ఉండదు.
No comments:
Post a Comment