ప్రపంచం ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తుల మధ్య శాంతి కొరకు చర్చలు జరగటం అనేది… ఊహించలేని ఆశ్చర్యకరమైన విషయం.
ఈ మాత్రం పరిస్థితి మెరుగుపడటం అంటే అంతా దైవం దయ.
భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది దైవానికే తెలుస్తుంది.
న్యూస్ పేపర్ చదవటం అంటే నాకు చిన్నప్పట్నించి చాలా ఇష్టం. అందువల్ల ప్రపంచ చరిత్ర గురించి నాకు కొంత తెలుసు.
నేను హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాను. ప్రపంచ రాజకీయాలు, అమెరికా దేశ చరిత్ర, భారతదేశ చరిత్ర, ..ఇలా కొన్ని సబ్జెక్ట్లు ఉన్నాయి.
అవి చదివాను కాబట్టి , నాకు ప్రపంచ చరిత్ర గురించి బాగా తెలుసు అనుకోనవసరం లేదు.
ఏదో బట్టీ పట్టి చదివి రాసాను. దైవం దయ వల్ల పాసయ్యాను.
ఏదో బట్టీ పట్టి చదివి రాసాను. దైవం దయ వల్ల పాసయ్యాను.
చరిత్ర విషయంలో సంవత్సరాలు గుర్తు పెట్టుకోవాలంటే నాకు చాలా కష్టమయింది. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ అని కొన్నిసార్లు ఏడుపు కూడా వచ్చేది.
మొత్తానికి దైవం దయ వల్ల పీజీ పూర్తి చేసి డిగ్రీ పొందగలిగాను.
అయితే , నాకు న్యూస్ పేపర్ చదవటం అంటే ఉన్న ఇష్టంతో న్యూస్ పేపర్లను ఆసక్తిగా చదవటం వల్ల ఒక్కసారే చదివినా కూడా గుర్తుంటాయి.
పీజీ డిగ్రీ కొరకు చదవటం అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల,
అలా చదివిన విషయాలు అంతగా గుర్తు ఉండవు .
*************mari కొన్ని విషయములు....
వేదాలలో
విగ్రహారాధన లేదని కొందరు అంటున్నారు. అయితే, చాలామందికి దైవాన్ని ఒక
రూపంలో చూసుకోవాలని భావించి విగ్రహారాధన వచ్చి ఉంటుంది. విగ్రహారాధన, ఎన్నో
ఆచారవ్యవహారాలు, నియమాలను ఏర్పరిచారు. వీటిలో ఎన్నో మంచివిషయాలున్నాయి.
అయితే, క్రమంగా కొన్నిమూఢనమ్మకాలు కూడా ప్రవేశించాయి. ఇప్పుడు అన్నీ కలిసి
బోలెడు అయ్యాయి.
ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, దైవభక్తి, ధర్మబద్ధంగా జీవించటం..వంటి విషయాల గురించి ఆలోచించటం కన్నా, ఇతరవిషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు.
ఉదా..పూజలో కొబ్బరికాయ కుళ్లవచ్చా..లేదా? కుళ్ళితే వారి బ్రతుకులు ఏమవుతాయి? కొబ్బరికాయ ఎలా పగిలితే ఏ ఫలితం ఉంటుంది? ఇంట్లో టీవీ ఎక్కడ పెట్టాలి..ఎక్కడ పెట్టకూడదు? ఇంటికి వచ్చిన మహిళలకు ఎన్ని బ్లౌసులు ఇవ్వాలి? ఏ రంగువి ఇవ్వాలి? ఏ రంగువి ఇవ్వకూడదు?..ఇలా సవాలక్ష ఉన్నాయి.
భక్తి, జ్ఞానం గురించి ఎలా ఉన్నా, పైన వ్రాసిన సందేహాల గురించి ఆలోచనలతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. పూజకన్నా, పూజా విధానాన్ని సరిగ్గా ఆచరిస్తున్నామా లేదా? అనే సందేహాలతోనే సమయం గడిచిపోతుంది.
దైవము మెచ్చేలా ఎలా ప్రవర్తించాలి? ధర్మబద్ధంగా ఎలా జీవించాలి? దైవకృపను ఎలా పొందాలి? ఇలాంటి వాటిగురించి ఎక్కువగా ప్రజలకు చెప్పాలి..ప్రజలు కూడా వీటి గురించి ఎక్కువ ఆలోచించాలి.
జీవితంలో నియమాలు, ఆచారవ్యవహారాలు తప్పక ఉండాలి. అయితే, అతి పెరిగితే మంచిది కాదు. ఆహారం అయినా అతిగా తింటే ఆరోగ్యానికి మంచిదికాదు. ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఆచారవ్యవహారాలను పద్ధతిగా పాటించాలి. అయితే, కొందరు ఆచారవ్యవహారాలను మూఢనమ్మకాలతో పాటిస్తారు. అలాంటివారికి చెప్పేదేమిటంటే, ఏ విషయంలోనైనా విపరీతధోరణి సరైనది కాదు.
ప్రతిదానినీ పెంచుకుంటూ ..ప్రతిదానికీ సవాలక్ష నియమాలు చెబుతూ వాటిని పాటించకపోతే కష్టాలొస్తాయని భయపెడుతుంటే.. భయపడి అన్నింటినీ పాటించలేక ఎందరో హిందువులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటప్పుడు తేలికగా దైవాన్ని ప్రార్ధించుకునే విధానాల గురించి ఎవరైనా చెబితే అటువైపు మనస్సు వెళ్ళటం సహజం. జనాలు ఈ గోలలో ఉంటే ఇతరులు తమపనితాము కానిచ్చుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా కూడా ప్రజల బాధ పట్టించుకోని కొందరు తమకు తోచినట్లు తాము చెపుతూనే ఉన్నారు.
మూఢనమ్మకాలను వదిలిపెట్టకుండా, పట్టువిడుపులు లేకుండా ఉన్నప్పుడు, మతం మారిపోతున్నారంటూ ఎంత గగ్గోలు పెట్టినా ఫలితం ఉండదు. మనమూ మన విధానాలను కొంత సరళం చేసుకోవాలి.
ప్రతిరోజూ ఏదో ఒక విశేషం అంటూ అన్నన్ని పాటించటం కన్నా, రోజూ నిత్యపూజ చేసుకుంటూ ధర్మబద్ధంగా జీవిస్తూ దైవాన్నిస్మరించుకుంటూ చక్కగా ఉండవచ్చు.
చక్కగా దైవభక్తి, ధర్మబద్ధమైన జీవితం, నిత్యపూజ, కొన్ని పండుగలు, దేవాలయాలకు వెళ్లటం..ఇలా తేలికైన మార్గాన్ని వదిలి, ఏవేవో నమ్మకాలతో తాము సతమతమవుతూ, అందరినీ అయోమయం చేయటం ఏమిటో? అన్నింటికీ దైవమే దిక్కు.
ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, దైవభక్తి, ధర్మబద్ధంగా జీవించటం..వంటి విషయాల గురించి ఆలోచించటం కన్నా, ఇతరవిషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు.
ఉదా..పూజలో కొబ్బరికాయ కుళ్లవచ్చా..లేదా? కుళ్ళితే వారి బ్రతుకులు ఏమవుతాయి? కొబ్బరికాయ ఎలా పగిలితే ఏ ఫలితం ఉంటుంది? ఇంట్లో టీవీ ఎక్కడ పెట్టాలి..ఎక్కడ పెట్టకూడదు? ఇంటికి వచ్చిన మహిళలకు ఎన్ని బ్లౌసులు ఇవ్వాలి? ఏ రంగువి ఇవ్వాలి? ఏ రంగువి ఇవ్వకూడదు?..ఇలా సవాలక్ష ఉన్నాయి.
భక్తి, జ్ఞానం గురించి ఎలా ఉన్నా, పైన వ్రాసిన సందేహాల గురించి ఆలోచనలతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. పూజకన్నా, పూజా విధానాన్ని సరిగ్గా ఆచరిస్తున్నామా లేదా? అనే సందేహాలతోనే సమయం గడిచిపోతుంది.
దైవము మెచ్చేలా ఎలా ప్రవర్తించాలి? ధర్మబద్ధంగా ఎలా జీవించాలి? దైవకృపను ఎలా పొందాలి? ఇలాంటి వాటిగురించి ఎక్కువగా ప్రజలకు చెప్పాలి..ప్రజలు కూడా వీటి గురించి ఎక్కువ ఆలోచించాలి.
జీవితంలో నియమాలు, ఆచారవ్యవహారాలు తప్పక ఉండాలి. అయితే, అతి పెరిగితే మంచిది కాదు. ఆహారం అయినా అతిగా తింటే ఆరోగ్యానికి మంచిదికాదు. ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఆచారవ్యవహారాలను పద్ధతిగా పాటించాలి. అయితే, కొందరు ఆచారవ్యవహారాలను మూఢనమ్మకాలతో పాటిస్తారు. అలాంటివారికి చెప్పేదేమిటంటే, ఏ విషయంలోనైనా విపరీతధోరణి సరైనది కాదు.
ప్రతిదానినీ పెంచుకుంటూ ..ప్రతిదానికీ సవాలక్ష నియమాలు చెబుతూ వాటిని పాటించకపోతే కష్టాలొస్తాయని భయపెడుతుంటే.. భయపడి అన్నింటినీ పాటించలేక ఎందరో హిందువులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటప్పుడు తేలికగా దైవాన్ని ప్రార్ధించుకునే విధానాల గురించి ఎవరైనా చెబితే అటువైపు మనస్సు వెళ్ళటం సహజం. జనాలు ఈ గోలలో ఉంటే ఇతరులు తమపనితాము కానిచ్చుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా కూడా ప్రజల బాధ పట్టించుకోని కొందరు తమకు తోచినట్లు తాము చెపుతూనే ఉన్నారు.
మూఢనమ్మకాలను వదిలిపెట్టకుండా, పట్టువిడుపులు లేకుండా ఉన్నప్పుడు, మతం మారిపోతున్నారంటూ ఎంత గగ్గోలు పెట్టినా ఫలితం ఉండదు. మనమూ మన విధానాలను కొంత సరళం చేసుకోవాలి.
ప్రతిరోజూ ఏదో ఒక విశేషం అంటూ అన్నన్ని పాటించటం కన్నా, రోజూ నిత్యపూజ చేసుకుంటూ ధర్మబద్ధంగా జీవిస్తూ దైవాన్నిస్మరించుకుంటూ చక్కగా ఉండవచ్చు.
చక్కగా దైవభక్తి, ధర్మబద్ధమైన జీవితం, నిత్యపూజ, కొన్ని పండుగలు, దేవాలయాలకు వెళ్లటం..ఇలా తేలికైన మార్గాన్ని వదిలి, ఏవేవో నమ్మకాలతో తాము సతమతమవుతూ, అందరినీ అయోమయం చేయటం ఏమిటో? అన్నింటికీ దైవమే దిక్కు.
ReplyDeleteరోడ్డుపై డివైడర్లు ఉన్నఫ్ఫుడు ట్రాఫిక్ జాం అవటం తక్కువ. కొన్ని ఫంక్షన్స్ జరిగినప్పుడు , డివైడర్ లేని రోడ్దుమధ్య తాడుతో టెంపరరీగా విభజించి ట్రాఫిక్ సరిగ్గా వెళ్లేటట్లు ఏర్పాటు చేస్తారు.
అయితే కొన్నికారణాల వల్ల ఇలాంటి ఏర్పాట్లు చేయలేనప్పుడు అధిక జనం ఫంక్షన్ కు వస్తే, రోడ్దుపై వచ్చేవాళ్లు , పోయేవాళ్లతో ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది.
ఇక జనం కూడా తామే త్వరగా వెళ్ళాలనుకుంటూ సందు దొరికితే బండిని ముందుకు పోనిస్తూ సన్నని రోడ్లపై మూడు నాలుగు వరుసలుగా ముందుకు వచ్చేస్తారు.
ఇక ట్రాఫిక్ జాం అయి ఎన్ని గంటలైనా బండ్లు సరిగ్గా ముందుకు పోవు.
సన్నని రోడ్దు మాత్రమే ఉన్నప్పుడు, జనం తమ ఇష్టానుసారంగా బండ్లను మూడు నాలుగు వరుసలుగా ముందుకు పోవటం కాకుండా ...
వెళ్లే దారిలో వెహికల్స్ అన్నీ ఒకదాని తరువాత ఒకటి గా ఒకే వరుసలో ముందుకు వెళ్లేటట్లు... వచ్చేవి కూడా ఒకే వరుసలో వచ్చేటట్లు చూసుకుంటే... ట్రాఫిక్ జాం అవకుండా ఎన్ని వెహికల్స్ అయినా సునాయాసంగా ముందుకు వెళ్ళగలవు. ట్రాఫిక్ జాం అవదు.
అయితే ప్రజలలో ఈ క్రమశిక్షణ ఎప్పుడొస్తుందో ? అందరూ ఒకేసారి ముందు కెళ్లాలనే దూకుడుతో భయంకరమైన ట్రాఫిక్ జాం కు ఎందుకు కారణమవుతారో ?