koodali

Thursday, January 25, 2018

కొన్ని విషయములు...


మనం  ఒక  పని  చెయ్యాలంటే  ఎంతో  ఆలోచించి  చేయవలసి  వస్తుంది.     ఇంత  పద్ధతిగా  ప్రపంచం  ఏర్పడిందంటే  దాని  వెనుక  ఎంతో  ఆలోచన   తప్పక  ఉంటుంది. 

  ఆలోచన  లేనప్పుడు  ఇంత  చక్కటిసృష్టి  ఎలా  సాధ్యం? 


కొందరు  భావిస్తున్నట్లు  ఆలోచన అనేది  లేకుండా  యాదృఛ్చికంగా   సృష్టి   జరగటం  అనే దానికి  అర్ధం  ఏమిటి?  

నిర్జీవమైన, ఆలోచనలేని స్థితిలో యాధృచ్చికంగా సృష్టి ఎలా జరుగుతుంది?  అది  సాధ్యం  కాని  విషయం.

  సృష్టిలో  ఆది  నుంచి  ఆలోచన  ఉంది.  అందుకే  దైవం  ఈ  సృష్టిని  తన  సంకల్పమాత్రం  చేతనే  సృష్టించారు....  అని  పెద్దలు  చెప్పి   ఉంటారు.  

*************
బ్రహ్మాండం యావత్తూ సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. ......... రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం దేవుడి కల. ........ మానవుడు తన స్వప్నచేతనలో, సకలజీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు , తన మనస్సులోంచే సర్వ వస్తు సముదాయాన్నీ సృష్టిస్తాడు.

" ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడు..... తరవాత దానికి జీవం ఇచ్చాడు. పరమాణు శక్తీ ఆ తరవాత పదార్ధమూ పుట్టాయి. ..... భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఘనగోళాకృతిగా రూపొందించాడు.... దాని అణువులన్నీ దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి. ... ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తనం చెందుతాయి..... అణుశక్తి, తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది.... భూభావం , స్థూలత్వంలో నుంచి అదృశ్యమవుతుంది. "
"దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించి, ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచి, ప్రయోజనం తీరగానే దాన్ని అదృశ్యం చేయటం జరుగుతుంది..."...... ఇలాగే......... మనిషి, కళ్ళు మూసుకుని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు......... మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు........... .."...... ఈ విషయాలు ఒక యోగి ఆత్మ కధ గ్రంధములో చెప్పబడ్డాయి.



No comments:

Post a Comment