koodali

Wednesday, December 7, 2016

కనీసం అందరికీ నిత్యావసరాలకు లోటు లేకుండా చేస్తే..


ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉంది. ఇలాంటప్పుడు అందరికీ  ఉపాధి  అనేది చాలా సమయం పడుతుంది. 

  పరిశ్రమలు పెట్టండి..అంటూ అందరినీ బ్రతిమాలుకోవాలి..వారికి భూములు లభించాలి..పరిశ్రమలు నెలకొల్పాలి..ఇదంతా సమయం పడుతుంది. 

ఇంతా చేస్తే ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయో చెప్పలేం.ఉద్యోగం వచ్చినా ఎంతకాలం ఉద్యోగం ఉంటుందో అసలే చెప్పలేం.

 ప్రతిసంవత్సరం దేశంలోని కాలేజీల నుండి కేవలం ఇంజనీరింగ్ చదివిన వారే లక్షలమంది వస్తున్నారు. 

మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు లభించాలంటే అబ్బో చాలా పెద్దపని.

ఇలాంటప్పుడు కనీసం అందరికీ నిత్యావసరాలకు లోటు లేకుండా చేస్తే బాగుంటుంది.

 దేశంలో ఎక్కువ  శాతం  ఉన్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చౌక ధరకు ఆహారాన్ని అందివ్వటం, తక్కువ ధరకు సరుకులను అందించటం, తక్కువ ధరకు వైద్యాన్ని అందించటం వంటివి చేస్తే  ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.  


వ్యవసాయాధారిత పరిశ్రమలు మరిన్ని నెలకొల్పితే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి.

సేవా రంగం ద్వారా కూడా  అవకాశాలు పెంచుకోవచ్చు..

ఉపాధి కోసం  పెద్ద ఎత్తున వస్తు తయారీరంగంపై మాత్రమే ఆధారపడితే సహజవనరులు వేగంగా తరిగిపోతాయి. 

ఉపాధి కోసం .. ఉన్న వనరులన్నీ మనమే ఖాళీ చేస్తే రాబోయే తరాలకు మిగిలేదేమిటి ?

*********************

 Monday, September 8, 2014
అమ్మ, అన్న క్యాంటీన్లు..

ఈ క్యాంటీన్ల  గురించి  వినే  ఉంటారు.  తమిళనాడులో  అమలవుతున్న  అమ్మ  క్యాంటీన్లలో  అతితక్కువ  ధరకే  భోజనాన్ని  అందిస్తున్నారట. 

ఇంకా  నిత్యావసర  వస్తువులనూ  అందిస్తున్నారట. మిగతా  విషయాలు  ఎలా  ఉన్నా  ఇది  మంచి  పద్ధతే  అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం  కూడా  అన్న  క్యాంటీన్లను  ప్రారంభించాలనుకోవటం  ఎంతో మంచి  విషయం.

రేషన్  కార్డుల  ద్వారా  నిత్యావసర  వస్తువులను  అందించటమూ  మంచిదే. అయితే, వంట  చేయాలంటే గ్యాస్  వంటివి ఎన్నో కావాలి.  

వంటచేసుకోవాలంటే  కుదరని వారికి  ఇలాంటి  క్యాంటీన్లు  ఎంతో  ప్రయోజనకరం.  

మనిషికి  ఆహారం  ముఖ్యం.  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  సమాజంలో  ఎంత  టెక్నాలజీ  ఉన్నా ఏం  లాభం ?  

అందరికీ  ఆహారాన్ని  అందించగలిగిన  రోజున  దేశంలో  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.
...................
ఇక్కడ  ఒక విషయాన్ని  చెప్పుకోవాలి. 

 
సమాజంలో  డబ్బున్న  వాళ్ళలో  కొందరు  మరీ  పిసినారివాళ్ళుంటారు.    ఇలాంటి  వాళ్ళు,  తక్కువ ధరకు  ఆహారం  లభిస్తుందంటే - ఇక  ఇంట్లో  వండుకోవటం  మానేసి  అన్నా  క్యాంటీన్లలోనే  భోంచేస్తారేమో ? 

  డబ్బున్న  వాళ్ళు  కూడా  ఇలా  చేస్తే , పేదవారికి  ఆహారం  సరిపోదు.  ఇలాంటి  క్యాంటీన్లను  ప్రారంభించిన   అసలు  ఉద్దేశ్యం  సరిగ్గా  నెరవేరదు. 


 ఎప్పుడో తప్పనిసరి  పరిస్థితిలో  తప్ప  డబ్బున్నవాళ్ళు  ఇలాంటి  క్యాంటీన్లను  ఉపయోగించకుండా  ఉంటేనే మంచిది. 

 పీనాసితనాన్ని,అత్యాశను   తగ్గించుకుంటే  పేదవారి  కడుపు నింపిన వారవుతారు.


No comments:

Post a Comment