ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు అందరూ కృషిచేయవలసి ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు.
ఆంధ్రప్రదేశ్లో ఎంతో సముద్ర తీరం ఉన్నా, పోర్టులు అంతగా అభివృద్ధి చేయబడలేదు. అరకు, తలకోన వంటి ఆహ్లాదకర ప్రాంతాలు ఉన్నా ఎవరూ అభివృద్ధి చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులు , ప్రజలు కూడా రాజధాని అనే ఉద్దేశంతో హైదరాబాద్లోనే ఎక్కువగా తమ పెట్టుబడులను పెట్టారు.
దురదృష్టం ఏమిటంటే విభజన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్కు అన్యాయమే జరుగుతోంది.
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చటం లేదు.
ఆర్ధికంగా మిగులు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి పధకాలు ప్రకటించటంలో గొప్పేం లేదు.
ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తే అది గొప్పవిషయం.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి రాజకీయపార్టీలు, అధికారులు, ప్రజలు అందరూ ఐకమత్యంగా కృషిచేయాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారే కానీ... వారిలో కొంత మందికి ఐకమత్యం, సొంత రాష్ట్రం అంటే అభిమానం అంతగా ఉన్నట్లు అనిపించదు.
వ్యక్తిగతంగా ఆర్ధికాభివృద్ధి, సౌకర్యాలు ఉంటే చాలదు ..ఆత్మాభిమానం కూడా ఉండటం అవసరం.
ఆంధ్రప్రదేశ్కు చెందిన పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పెట్టుబడులను పెట్టాలి.
ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ..... ఆత్మాభిమానం, ఐకమత్యంతో రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎవరి పరిధిలో వారు చిత్తశుద్ధితో కృషిచేయవలసి ఉంది.
ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. అందుకు అందరూ పౌరుషంగా కృషిచేయాలి.
పాలకులు, అధికారులు, ప్రజలు అందరూ చిత్తశుద్ధితో కృషిచేస్తే త్వరలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు.
ఆంధ్రప్రదేశ్లో ఎంతో సముద్ర తీరం ఉన్నా, పోర్టులు అంతగా అభివృద్ధి చేయబడలేదు. అరకు, తలకోన వంటి ఆహ్లాదకర ప్రాంతాలు ఉన్నా ఎవరూ అభివృద్ధి చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులు , ప్రజలు కూడా రాజధాని అనే ఉద్దేశంతో హైదరాబాద్లోనే ఎక్కువగా తమ పెట్టుబడులను పెట్టారు.
దురదృష్టం ఏమిటంటే విభజన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్కు అన్యాయమే జరుగుతోంది.
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చటం లేదు.
ఆర్ధికంగా మిగులు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి పధకాలు ప్రకటించటంలో గొప్పేం లేదు.
ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తే అది గొప్పవిషయం.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి రాజకీయపార్టీలు, అధికారులు, ప్రజలు అందరూ ఐకమత్యంగా కృషిచేయాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారే కానీ... వారిలో కొంత మందికి ఐకమత్యం, సొంత రాష్ట్రం అంటే అభిమానం అంతగా ఉన్నట్లు అనిపించదు.
వ్యక్తిగతంగా ఆర్ధికాభివృద్ధి, సౌకర్యాలు ఉంటే చాలదు ..ఆత్మాభిమానం కూడా ఉండటం అవసరం.
ఆంధ్రప్రదేశ్కు చెందిన పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పెట్టుబడులను పెట్టాలి.
ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ..... ఆత్మాభిమానం, ఐకమత్యంతో రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎవరి పరిధిలో వారు చిత్తశుద్ధితో కృషిచేయవలసి ఉంది.
ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. అందుకు అందరూ పౌరుషంగా కృషిచేయాలి.
పాలకులు, అధికారులు, ప్రజలు అందరూ చిత్తశుద్ధితో కృషిచేస్తే త్వరలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
No comments:
Post a Comment