టాయ్లెట్ వాడే కమోడ్లలో, ఇండియన్ కమోడ్ డిజైన్ వల్ల శరీరం కమోడ్ కు తగలదు.
అయితే
ఈమధ్య కాలంలో చాలామంది మోకాళ్ల నొప్పితో వంగలేకపోతున్నారంటూ చాలా చోట్ల
పైన కూర్చునే విధంగా టాయ్లెట్ కమ్మోడ్ కట్టించుకుంటున్నారు.
ఇళ్ళల్లోను, బయట కూడా కొత్తవిధానం కమోడ్ లే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కమ్మొడ్ పైన కూర్చుంటే మన శరీరం కమ్మొడ్ కు తగులుతుంది.
ఇంతకుముందు వాడిన వారు అక్కడే కూర్చుని వెళ్తారు. ఇలాంటప్పుడు, ఒకరినుంచి ఒకరికి జబ్బులు వచ్చే అవకాశముంది.
అందువల్ల, మనం వాడేముందు కమ్మొడ్ పైన టాయ్లెట్ పేపర్ వేసి, దానిపైన కూర్చోవటం కొంతవరకు బెటర్.
ఇంకో సమస్య ఏమిటంటే, మలవిసర్జన సమయంలో మలం నీటిలో పడినప్పుడు కొన్ని చుక్కలు చింది శరీరంపై పడే పరిస్థితి ఉంటుంది.
స్త్రీలకయితే ఆ నీటి చుక్కలు శరీరపు ప్రైవేట్ పార్ట్స్ లో పడే అవకాశముంటుంది. ఇది తలచుకుంటేనే చాలా భయం వస్తుంది.
బయట టాయ్లెట్స్ ఎందరో వాడుతారు. ఎన్ని భయంకరమైన జబ్బులు వచ్చే అవకాశముందో తెలియదు.
నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలంటే, ఆధునిక టాయ్లెట్స్ లో నీరు క్రింద పడకుండా పొడిగా ఉండాలంటారు.
షాపింగ్ మాల్స్, హోటల్స్, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్స్..ఇలా ఎన్నో చోట్ల టాయ్లెట్స్ వాడతారు.
లాంగ్
జర్నీస్ లో బయట టాయ్లెట్స్ వాడక తప్పదు. ఎక్కువసేపు టాయ్లెట్ వెళ్ళకుండా
ఆపుకుంటే అనారోగ్యాలు వచ్చే అవకాశముంది. టాయ్లెట్స్ సమస్యల వల్ల ప్రయాణం
అంటేనే భయమొస్తుంది.
ఇలాంటప్పుడు మనమే టాయ్లెట్ పేపర్, డెట్టాల్ తీసుకెళ్లి కమ్మొడ్ పైన జల్లి వాడుకోవాలేమో?
అసలు
కమ్మోడ్ పైన కూర్చోకుండా, చెత్త ఎత్తే చిన్న చాట తీసుకెళ్ళి మలవిసర్జన
తరువాత కమోడ్లో వేసి.. పైప్ నీటితో క్లీన్ చేస్తే ఎలాగుంటుంది? అని కూడా
అనిపిస్తుంది.
కమ్మొడ్ తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ..
మలం
ఒకేసారి నీటిలో పడకుండా నిదానంగా జారి నీటిలో పడేటట్లు, ఆ నీరు మనిషి మీద
చిందకుండా, నీటికి...మనిషి కూర్చున్న దానికి కొంత దూరం ఉండేటట్లు కమోడ్
లోపలి భాగాన్ని తయారు చేయాలి. ..
అంటే, మనిషి కూర్చున్న క్రింద కాకుండా కొంత దూరంగా కమ్మోడ్ నీటిగుంత ఉండాలి.
.....................
ఇదంతా ఇంత వివరంగా రాయవలసి రావటం ఏమిటో ఖర్మ. కొంతకాలం తరువాత ఈ పోస్ట్ డిలిట్ చేసేస్తాను.
.......................
కుదిరినంతలో భారతీయ మోడల్ కమోడ్ వాడటం మంచిది.
రెండేడుపులేడ్చి సానుభూతితో పనులు సులువుగా చక్క బెట్టుకొంటారు. మగవాళ్ళ మీద పడి ఏడవటమే వాళ్ల జీవిత లక్ష్యం.
మీ వ్యాఖ్యకు కృఅతజ్ఞతలండి.
నా దృష్టిలో స్త్రీలైనా పురుషులైనా సమానమే.
స్త్రీలకు, పురుషులకు ..హక్కులూ ఉన్నాయి. బాధ్యతలూ ఉన్నాయి.
స్త్రీలంటే పురుషులకు శత్రుత్వం ఉండకూడదు.పురుషులంటే స్త్రీలకు శత్రుత్వం ఉండకూడదు. కుటుంబమంటే స్త్రీలూ ఉంటారు. పురుషులూ ఉంటారు.
మగవారి సంపాదనను భార్య ఒక్కతే తింటుందా ? కుటుంబంలో అందరూ తింటారు కదా !
తమ సంపాదనను కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి బాధపడే మగవాళ్ళు వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తే సరిపోతుంది.
స్త్రీవాదులు కొందరు మేము వంటింట్లో పడి ఉండాలా ? అంటుంటారు. కుటుంబ సంరక్షణ, కుటుంబం కోసం వంట చేయటం కూడా తప్పే అనుకునే స్త్రీలు వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తే సరిపోతుంది.
కుటుంబం కోసం సంపాదించటం పురుషుని బాధ్యత, ఇంటిని చక్కదిద్దుకోవటం స్త్రీ బాధ్యతగా పెద్దవాళ్ళు నిర్ణయించారు.
స్త్రీలు తలచుకుంటే కుటుంబ పోషణ భారాన్ని కూడా చక్కగా నిర్వర్తించగలరు.
మరి పురుషులు స్త్రీలలా నెలసరి, గర్భాన్ని ధరించటం..వంటి భారాలను భరించగలరా ? ( ఆ అవకాశం వస్తే..)
...........
స్త్రీలు అణచివేతకు గురవుతున్నారని.. రక్షణ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు కల్పించారు. ఇప్పుడు కొందరు మగవాళ్ళు కూడా అణచివేతకు గురవుతున్నారని అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మగవాళ్ళ రక్షణ కోసం కూడా కొన్ని ప్రత్యేక చట్టాలు కల్పిస్తారేమోలెండి.
మీరు చెప్పే పెద్దల నిర్ణయించినవాటిని, భారత సంస్కృతిని స్రీవాదం ఒప్పుకోదు. సుమారు 80% ప్రభుత్వానికి పన్నులరూపంలో వచ్చే ఆదాయం మగవారి సంపాదననుంచే. స్రీ వాదులు, ప్రభుత్వం సహాయం చేయాలని కోరేది పరోక్ష్యం గా మగవాళ్ల సంపాదననే. వ్యక్తిగత స్వేచ్చ పై నమ్మకం, ఆత్మాభిమానం ఉంటే స్రీలు వారి సంపాదనను వార సంపాదించుకొని జీవించాలి. మరి అలా చేయరెందుకు? నీ వంశానికి వారసుడినిచ్చా అని పల్లవి ఎత్తుకుంటారేందుకు? మోగోళ్ళకి భారత సంస్కృతి వలన ఎమీ సుఖంలేదు.లాభం అంతకన్నా లేదు. మగవారి కష్టార్జితాన్ని ప్రభుత్వం, కుటుంబం సంస్థాగతం గా దోచుకొని తినటం హక్కుగా భావిస్తున్నారు.
మరి, వాళ్లకు జన్మించిన సంతానం ఎవరి డబ్బుతో పెరిగి పెద్దవుతారు ? స్త్రీలు,పురుషులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు కాబట్టి ప్రభుత్వమే దేశంలోని పిల్లల్ని పెంచి పోషించాలా ?
భార్య భర్త సర్దుకుపోతేనే సంసారం సజావుగా నడుస్తుంది. పంతాలు, పట్టింపులకు పోతే గొడవలు పెద్దవవుతాయి తప్ప పరిష్కారం లభించదు.
భార్యాభర్త అనేకాదు, ఎవరికయినా సరే, జీవితంలో కొంత సర్దుబాటు ధోరణి లేకపోతే కష్టం. మగవాళ్ళు లేక స్త్రీలు..తమ ఆఫీసులో పై ఆఫీసర్ పెత్తనాన్ని భరిస్తారా ? లేక ఎదురుతిరిగి ఉద్యోగం ఊడగొట్టుకుంటారా ?
ఆఫీసులో పైవాళ్ళతోనూ, సాటి కొలీగ్స్ తోనూ కూడా మనకు నచ్చని అనేక అంశాలుంటాయి. మనకి ఇబ్బంది కలిగించే అంశాలూ ఉంటాయి. అయితే, ఉద్యోగం కోసం వాటిని భరిస్తారు కదా! మరి అదే సర్దుబాటు ధోరణిని కుటుంబంలోనూ చూపిస్తే బాగుంటుంది కదా !
ఎన్ని ఆఫీసులు మారినా..కొద్దిగా అయినా సర్దుబాటు ధోరణి లేకపోతే ఉద్యోగంలో నిలదొక్కుకోవటం కూడా కష్టమవుతుంది.
బయట ఉద్యోగం అయినా వ్యాపారం అయినా లేక మరే ఉపాధి అయినా సరే సర్దుకుపోక తప్పదు. ఉదా..ఎన్ని ఇంటి గొడవలతో సతమతమవుతున్నా కూడా, వ్యాపారం చేసే వ్యక్తి షాపుకు వచ్చిన కస్టమర్లతో ఓపికగా మాట్లాడకపోతే ఇంకోసారి కస్టమర్లు అతని షాపుకు రారు.
నిజమే, ఎంత సర్దుకుపోదామన్నా కొన్నిసార్లు సర్దుకుపోలేము. అయితే జీవితమంటే సర్దుకుపోక తప్పదు.
అంతెందుకు తల్లితండ్రులు, జన్మించిన పిల్లలతో కూడా అభిప్రాయాలు కొన్ని సరిపడకపోవచ్చు. అయితే, వాళ్ళతో సర్దుకుపోతాము కదా !
ఎక్కడో పుట్టి పెరిగిన భార్యాభర్త మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం అత్యంత సహజం.
దురదృష్టం ఏమిటంటే, ఈ రోజుల్లో కొందరు బంధువులు, స్నేహితులు..అనబడే దగ్గరి వారి వల్ల కూడా భార్యాభర్త మధ్య గొడవలు వస్తున్నాయి.
ఈ పరిస్థితి మారి అందరూ బాగుండాలని ఆశిద్దాము.
స్త్రీవాదం తెలిసిన వాళ్ళు పురుషవాదం గురించి తెలియదనటం విడ్దూరంగా ఉంది.
స్త్రీలు, పురుషులు సమానం.. అంటుంటే ఇక ఎవరైనా ఓడటం అనే సమస్యే ఉండదు కదా !
వనజవనమాలి గారి గురించి పదేపదే మీరు ఈ బ్లాగులో వ్రాయటం ఎందుకో అర్ధం కావటం లేదు. మీ అభిప్రాయాలను ఆమె బ్లాగ్ లోనే వ్రాస్తే బాగుంటుంది.
చరిత్రలో స్రీలు సంపాదించిన డబ్బులతో మోగోళ్లు కోటలు కట్టలేదు...అని మీరు వెలిబుచ్చిన అభిప్రాయం గురించి నాకు ఏమనిపిస్తుందంటే,
అంతా డబ్బుతోనే బేరీజు వేయకూడదు. ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో జన్మించాలంటేనే అందుకు ఆ వ్యక్తి యొక్క తల్లి నవమాసాలూ మోసి ప్రసవిస్తేనే ఈ లోకంలోకి వస్తారు.( పూర్వకాలంలో అయోనిజులు గురించి మినహాయిస్తే..)
ఆ తరువాత శిశువు సంరక్షణ, పెరిగి పెద్దవ్వటం వెనుక స్త్రీ పాత్ర చాలా ఉంటుంది. ఇదంతా జరిగితేనే కదా డబ్బు సంపాదించేది, కోటలు కట్టేది.
సంసారంలో స్త్రీల పాత్రా ముఖ్యమైనదే.... పురుషుల పాత్రా ముఖ్యమైనదే. ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంది.
అవునండి, మీరన్నట్లు నాణేనికి రెండు పక్కలుంటాయి. వివాహంతో ఒక స్త్రీ మరొక ఇంటికి వెళుతున్నపుడు తల్లి తండ్రులు తమకి తగినది ఇచ్చి పంపటం తప్పుకాదు. దీనికోసమని అమ్మాయిని హింసించడం, ఆడపిల్ల పుట్టిందని తరిమేయడం లాటివి అమానుషం. తవ్వుకుంటే తప్పులు ఇరు పక్కలా కనపడతాయి. సద్దుకుంటే నే జీవితం.
స్త్రీ ధనానికి చట్టబద్ధత ఉన్నప్పుడు, కట్నం ఇవ్వటం పుచ్చుకోవటం నేరం అనేది పరస్పర విరుద్ధంగా ఉంది కదా ! కట్నానికి స్త్రీ ధనానికి తేడా ఏమిటండి ?
స్త్రీధనం అంటే బంగారు ఆభరణాలు, బహుమతులు వంటివే వస్తాయా ? ఈ స్త్రీ ధనానికి కొంత మొత్తం అని పరిమితి ఉంటుందనుకుంట.
లక్షల విలువ చేసే ఆస్తిని అమ్మాయికి ఇస్తే అది కట్నం అవుతుందా లేక స్త్రీ ధనం కోవలోకి వస్తుందా?
నగదు లేదా వేరే రూపేణా, అలాగే పరిమితి అంటూ ఏమీ లేదండీ. తల్లితండ్రులు తమ తాహతు కొద్దీ తమ కూతురుకు స్వచ్చందంగా (వియ్యంకుల & అల్లుడి ప్రమేయం & హక్కు ఇసుమంతయినా లేకుండా) ఇస్తే చాలు.
మొత్తం స్త్రీధనం ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. దశలవారీగా (ఉ. పిల్లలు పుట్టినప్పుడు, ప్రతి దసరా పండుగకు వగైరా) కూడా ఇవ్వొచ్చు.