koodali

Monday, January 25, 2016

ఎందరో భాగస్వామ్యం ఉంది....

 
 
ఎన్నో రిపబ్లిక్ దినోత్సవాల తరువాత కూడా ఎన్నో సమస్యలు అలాగే ఉన్నాయి.

 ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దేశం అభివృద్ధి చెందకపోవటానికి ప్రజలు, అధికారులు, పాలకులు ..ఎందరో భాగస్వామ్యం ఉంది.
...............

 స్వాతంత్రోద్యమం  కాలం నాటి ప్రజలు చాలామంది  తమ సంపదను కూడా దేశం కోసం అర్పించారు. జీవితంలో ఎంతో కాలం జైళ్ళలో గడిపారు. 

భగత్ సింగ్ వంటి కొందరు యువకులు దేశం కోసం జీవితాల్నే అర్పించారు.
..................

 అయితే ఈ రోజుల్లో...  దేశం ఎటుపోతే మనకేమిటి మనకు డబ్బు వస్తే చాలు..అనుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఇలాంటివాళ్ళ వల్లే దేశం వెనుకబడి ఉంది.

ఇప్పటికీ వందలాదిమందికి ఒక్కటే పాయిఖానా ఉండే బస్తీలు ఎన్నో ఉన్నాయి.

 ఫ్లోరైడ్ నీటితో అవయవాలు కొంకరపోయిన ప్రజలు ఎందరో ఉన్నారు.

 పందులు తిరిగే రోడ్లు.. ఎలుకలు, కుక్కలు  సంచరించే  ఆస్పత్రులు..  బొద్దింకలు, నల్లులు పాకుతూ గబ్బుకొట్టే టాయ్లెట్లున్న రైళ్ళు ఉన్నాయి...

 ( ఈ సమస్యలను పరిష్కరించకుండా బుల్లెట్ రైళ్ళ కోసం డబ్బు ఖర్చు చేయటం ఎందుకు  ?) 

   లాభాల కోసం అదేపనిగా ధరలు పెంచే వ్యాపారులు , వినోదం పేరుతో అసభ్యకర విషయాలతో ప్రజలను పాడుచేస్తున్న వాళ్ళు,  దేశంలోని  సంపదను కొల్లగొడుతున్న వాళ్ళు , ప్రతిపనికి లంచాలు మింగే వాళ్ళు..ఇలా  ఎవరికి వీలైనంతలో వాళ్ళు డబ్బుకోసం  కక్కుర్తి పడిపోతూ  జీవిస్తుంటే దేశం ఇలా కాక ఇంకెలా ఉంటుంది. 

  
సొంత అభివృద్ధి తప్పు కాదు. అయితే మన సొంత అభివృద్ధి కోసం ఇతరుల పొట్ట కొట్టకూడదు. 

సమాజ సంపదలో మన వంతు వాటాను మాత్రమే మనం వాడుకోవాలి. అంతా నాకే అని వాడేసుకోకూడదు.

 ప్రపంచంలోని సంపద కొందరిది మాత్రమే కాదు. అందరికీ భాగం ఉంది.

 మన తెలివితేటలు, బలమూ ..మనతో పాటు, ఇతరుల అభివృద్ధికీ ఉపయోగపడాలి.
.................
మనలో మార్పు రావాలి. 

 మాది పేదదేశం అంటూ అందరినీ  అప్పులు అడుక్కునే పరిస్థితి మారాలి. 

ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలబడేలా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. 

No comments:

Post a Comment