koodali

Wednesday, January 20, 2016

సంపద కొందరి వద్దే ఉండటం అనేది ముఖ్యమైన సమస్య..


గత కొన్ని సంవత్సరాలుగా దేశం నుంచి ఎంతో డబ్బు విదేశాలకు తరలిపోయిందని అంటున్నారు.

తరలిపోయిన డబ్బును వెనక్కి రప్పించటం , ఇక ముందు సంపద తరలిపోకుండా తగు చర్యలను తీసుకోవటం ఎంతో అవసరం. 

ధనవంతులైన భారతీయుల వద్ద కొన్ని వేల కోట్ల సంపద ఉంది.

 సంపద కొందరి వద్దే ఉండటం అనేది ముఖ్యమైన సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోకుండా పేదరికం, నిరుద్యోగం పోగొట్టడం సాధ్యం కాదు.

 ప్రభుత్వం  వద్ద డబ్బు ఉంటే  ఎన్నో ఉద్యోగావకాశాలను మనమే సృష్టించుకోవచ్చు.

ఉద్యోగావకాశాల కోసం సహజవనరులను పెద్ద ఎత్తున తవ్వేసి నష్టపోనవసరం లేదు. మన పూర్వీకులు పెద్ద ఎత్తున సహజవనరులను వాడకుండానే చక్కగా జీవించారు.

ఆధునికకాలంలో చదవటం దగ్గర నుంచి.. ఉద్యోగం పొందటం.. పొందిన ఉద్యోగాన్ని నిలుపుకోవటం వరకూ అన్నీ సమస్యగానే మారిపోయాయి.

సంపద కొందరి వద్దే ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు పెట్టినా పెద్ద లాభం లేదు. పరిశ్రమల లాభాలు పరిశ్రమల అధిపతుల వద్దే ఉంటాయి.

 ఈ రోజుల్లో ధనవంతులు మరింత ధనవంతులు కావటం, పేదలు అలాగే ఉండటం జరుగుతోంది. 

ప్రజలు, పాలకులు నైతికవిలువలను మాటలలో కాకుండా చేతలలో చూపించాలి. 

కఠిన చట్టాలను చేసైనా సరే సంపద దేశం నుంచి తరలిపోకుండా , సంపద కొందరి వద్దే ప్రోగుపడకుండా  కఠినమైన చర్యలు తీసుకోవాలి.

పాలకులు, ప్రజలు, అధికారులు అందరూ ఎవరి పరిధిలో వారు చిత్తశుద్ధితో పనిచేస్తే భారతదేశంలో పేదరికం పోగొట్టుకోవటం పెద్దపనేమీ కాదు.

 అంతేకానీ , ఎవరి స్వార్ధాన్ని వారు చూసుకుంటూ దేశం అభివృద్ధి చెందాలంటే అయ్యే పని కాదు.

No comments:

Post a Comment