koodali

Monday, January 11, 2016

సేంద్రియ పద్ధతి..



ఎక్కువగా పాలిష్ చేసిన ఆహారదినుసులను వాడటం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోవటం జరుగుతుందంటున్నారు.

ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటున్నారు. 


పాతకాలంలో దంపుడుబియ్యం  ఎక్కువగా వాడేవారు.దంపుడు బియ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ఇప్పటివాళ్ళు దంపుడు బియ్యం  ఎక్కువగా వాడుతున్నారు. 


దంపుడు బియ్యంతో వండిన అన్నం తినలేని వారు దోసెలు , ఇడ్లీ వంటివి చేయటానికి  వాడుతున్నారు.   


పాతరోజుల్లో  సన్నబియ్యం ఎక్కువ ధర ఉండేవి,  దంపుడు బియ్యం,  రాగులు, జొన్నలు  తక్కువ ధరకే లభించేవి. 

ఈ రోజుల్లో దంపుడుబియ్యం, రాగులు, జొన్నలు వంటివి కూడా  ధరలు బాగా పెరిగాయి.

  పేదవారు కొనాలంటే  పప్పుదినుసుల  రేట్లు బాగా పెరిగాయి.

విదేశాల వాళ్లు రసాయన పురుగుమందుల వాడకాన్ని చాలావరకూ తగ్గించుకుంటున్నారు.

 భారతదేశంలో పండించిన పంటలలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో కొన్ని దేశాల వాళ్ళు భారతదేశం నుంచి ఎగుమతి అయిన కొన్ని ఆహార ఉత్పత్తులను వెనక్కి తిప్పి పంపటం కూడా జరిగింది. 

రసాయన పురుగుమందులు హానికరం అని తెలిసినా కూడా మనదేశం వాళ్ళు  విచ్చలవిడిగా పురుగు మందులను వాడుతున్నారు. 

పండలను త్వరగా మగ్గించటానికి కూడా రసాయనాలను వాడుతున్నారు కొందరు.

పాతకాలంలో సేంద్రియపద్దతిలో పండించే పంటలే ఉండేవి. ఈ రోజులలో సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలను చాలా ఖరీదుకు అమ్ముతున్నారు.

ఆరోగ్యం కావాలంటే సేంద్రియ పద్ధతిలో పంటలను పండించటాన్ని తిరిగి అలవాటుచేసుకోవాలి.


No comments:

Post a Comment