koodali

Wednesday, May 22, 2013

ఎండలు .. మొక్కలకు చల్లటి నీళ్ళు .

 
ఎండలు  విపరీతంగా  ఉన్నాయి.  ఎంత  వేడిగా  అంటే,  నీళ్ళకోసం  పంపు  తిప్పితే  చేయి  చురుక్కుమనేంతగా....   

 ఇలాంటప్పుడు  ఇళ్ళల్లో  పెంచుకునే  మొక్కలకు  నీరు  పోయాలంటే  కొన్ని   జాగ్రత్తలు  తీసుకోవాలి.   

వేసవికాలంలో  మొక్కలకు  నీరు  పోయాలంటే  ఉదయం  సూర్యుని  వేడి  పెరగకముందే  పోయాలి.  సాయంత్రం   వాతావరణం  కొంచెం  చల్లబడిన  తరువాత  పోయాలని పెద్దలు  తెలియజేసారు. 


   వేసవికాలంలో  .... చెరువుల్లో,  నూతిలో  నీరు  చల్లగా  ఉంటుందో ? వేడిగా  ఉంటుందో?   నాకు  తెలియదు  కానీ, 

 డాబాపైన  కట్టిన  నీళ్ళ టాంకుల  ద్వారా  పంపుల్లో  వచ్చే  నీళ్ళు   మాత్రం  చాల  వేడిగా ఉంటాయి . 

    వేసవికాలంలో మొక్కలకు  నీరు  పెట్టాలంటే   కొన్ని  జాగ్రత్తలు  తీసుకోవాలి. 

 పంపులకు   పైప్  తగిలించి ,  వచ్చే  వేడినీటిని   డైరెక్ట్  గా  మొక్కలకు  పట్టకూడదు.  

  ఇప్పటి  ఎండలకు  సాయంత్రం  6  గంటలకు  కూడా  పంపుల్లో  వేడినీరే  వస్తోంది.  

 అందువల్ల   ఏం  చేయాలంటే ..  ఉదయం  ఎండ  పెరగకముందే   మొక్కలకు  నీరు  పెట్టి , ఇంకొక  బక్కెట్ తో  నీరు  పట్టుకుని  నీడలో  ఉంచుకోవాలి.  ఆ  చల్లటి  నీటిని  సాయంత్రం  మొక్కలకు  పోయాలి. 

 లేకపోతే  మధ్యాహ్నం  ఒక  బకెట్ తో  నీరు  పట్టుకుని  నీడలో  ఉంచితే  సాయంత్రానికి  ఆ   వేడి   నీరు  చల్లగా  అవుతాయి.   అప్పుడు  ఆ  నీటిని  మొక్కలకు  పోయాలి.  వేసవికాలం  అంతా  ఇలా  చేయాలి.

 
...............

ఎండలు  ఇలా  పెరుగుతూ  పోతే .. కొంతకాలానికి  ధృవ  ప్రాంతాల్లో  మంచు  కరిగి  సముద్రనీటిమట్టాలు  పెరిగిపోతాయట.  సముద్రనీటిమట్టం  అతికొద్దిగా  పెరిగినా  ప్రపంచంలోని   ఎన్నో  నగరాలు  మునిగిపోతాయట.


 ( పర్యావరణకాలుష్యం  ఇదే  తీరులో  ఉంటే, మంచు  కరిగి   సముద్రనీటిమట్టం  పెరగటానికి   50  సంవత్సరాల  కన్నా  ఎక్కువకాలం  పట్టదంటున్నారు . ) 

 హిమాలయాలలో  మంచు  కూడా  కొద్దికొద్దిగా  కరుగుతోందంటున్నారు.

 అభివృద్ధి పేరుతో  మానవులు  పర్యావరణాన్ని    పాడుచేయటం  వల్ల  వాతావరణంలో  ఎన్నో  మార్పులు  వస్తున్నాయి.  వాటి  ఫలితమే  విపరీతమైన  ఎండలు,  విపరీతమైన  వరదలు.


కొంతకాలం  క్రిందట  రెంటచింతల  వంటి  కొన్ని  ప్రాంతాల్లో  మాత్రమే  వేడి  40  డిగ్రీలు  దాటేది.  ఈ  సంవత్సరం  మన  రాష్ట్రంలోని  చాలా  ప్రాంతాల్లో  వేడి  40  డిగ్రీలు  దాటిపోయింది. 


 మానవుల  అవసరాలు  పెరుగుతున్న  కొద్దీ   ..   ఎండలు,  వరదలు ,  పొల్యూషన్....పెరిగిపోతున్నాయి .


 కూర్చున్న  కొమ్మనే  నరుక్కుంటూ .. ..ఇదే    గొప్ప అభివృద్ధి .    అని  సంబర పడిపోతున్న  మానవుల  ప్రవర్తనకు  కాలమే  తగిన తీర్పును  చెబుతుంది .



2 comments:

  1. మొక్కలకి ఉదయమే నీరు పోయడం మంచిది. మా గో.జిలలో ఈ మధ్య వేడిమి 41 నుంచి 45 మధ్య ఉంటోందండి.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    అవునండి ఈ మధ్య ఎండవేడిమి బాగా పెరిగింది.
    ఇలా ఉష్ణోగ్రతలు పెరిగితే చాలా కష్టం.

    ReplyDelete