koodali

Monday, May 13, 2013

అక్షయతృతీయ నాడు దానం చేస్తే మంచిదంటారు .


 అక్షయ తృతీయ రోజున సింహాచలంలో చందనోత్సవాన్ని  చేస్తారు.

  ఈ  రోజున మంచినీరు, గొడుగు, విసనకర్ర ...వంటివి   ఇతరులకు  దానం చేస్తే   మంచిదని  కూడా  పెద్దలు  తెలియజేసారు.

 దానం చేయటం వల్ల దానం చేసినవారికి మంచి   జరుగుతుందని, ఆహారం, గృహం …వంటివి   కొరత లేకుండా లభిస్తాయని అంటారు.



 అయితే   ఈ రోజుల్లో, దానం చేసే  ఆచారం  తగ్గిపోయి, ఎవరికి వారు  బంగారం కొనుక్కోవటం అనే ఆచారం మాత్రమే బాగా ప్రచారంలోకి వచ్చింది. 


పూర్వీకులు  సమాజంలో  అందరికీ  ఉపయోగపడేవిధంగా  ఎన్నో  చక్కటి  ఆచారాలను ఏర్పాటుచేసారు. 


అయితే  కాలక్రమేణా  కొన్ని  ఆచారాలు  మార్పులుచేర్పులను  సంతరించుకుని  పూర్వీకుల  అసలు  ఉద్దేశ్యాన్ని  మరుగునపరచే  విధంగా  తయారవుతున్నాయి.



 అక్షయతృతీయ  పండుగ  వేసవిలో  వస్తుంది.  అప్పుడు  మంచినీరు, గొడుగు, విసనకర్ర వంటివి  దానం  చేయటం  వల్ల  ఎందరికో ఉపయోగం  కలుగుతుంది. 


ఈ రోజున బంగారం  కొనుక్కోవటం  మంచిదని  కూడా  పెద్దలు తెలియజేశారు. దానితో పాటూ దానం చేస్తే మంచిదని  కూడా చెప్పారు కదా!


అయితే ఇప్పుడు  ఇతరులకు  దానం  చేయవలసిన  విషయాలను  వదిలేసి , అక్షయతృతీయ  అంటే  బంగారం  కొనుక్కోవటమే ..అన్నట్లుగా  జరిగిపోతోంది.


 .............
లోకం అంతా బాగుండాలి. అంతా దైవం దయ.


 

2 comments:

  1. అక్షయ తృతియా నాడు బంగారం బాబ్బాబు కొనండి మీకు మంచిది భయంకరంగా కలిసొచ్చేస్తాది అని పత్రికలు/మీడియా కోడై కూస్తుంటే మీరేంటండీ ఆ రోజు దానాలు చేయమంటారు ? తప్పు కదూ

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      బంగారం కొనుక్కోమని మాత్రమే చెప్పలేదు. దానం కూడా చేయమన్నారు కదా మరి.

      Delete