koodali

Friday, February 22, 2013

దైవమే దిక్కు. ..


నిన్న  హైదరాబాద్ లో  జరిగిన  బాంబుపేలుళ్ళలో   కొందరు  చనిపోవటం ,  మరి కొందరు  గాయాల  పాలవటం అత్యంత  విషాదకరమైన సంఘటనలు.  

 పేలుళ్ళు  జరిగే  అవకాశముందని   చూచాయగా   తెలిసినా , సరిగ్గా  ఎక్కడ  జరిగే  అవకాశం  ఉందో  ముందే  కనిపెట్టటం  అనేది    కష్టమైన  విషయం.  

ముందు  సాయిబాబా  గుడి  వద్ద  పేలుళ్ళు  జరపాలని నిందితులు  పధకం  వేసుకున్నారని  వార్తల  ద్వారా  తెలుస్తోంది.  గురువారం  గుడివద్ద   భక్తుల  రద్దీ  ఎక్కువగా  ఉంటుంది  కాబట్టి  ఎక్కువ  జననష్టం  కలిగించాలని  నిందితుల  ఉద్దేశ్యంగా  వార్తలు  వస్తున్నాయి. అయితే,  సాయిబాబా  గుడిలో  పోలీస్  కమిషనర్  గారు  పూజలు  చేయించటం,  అక్కడ   పోలీసు  పహరా   ఎక్కువగా  ఉండటం  వల్ల  నిందితులు  పేలుళ్ళ  స్థలాన్ని  మార్చారని  అంటున్నారు. 


 ఇలాంటి  సంఘటనలు  జరిగినప్పుడు  కొన్ని  విషయాలు  ఆశ్చర్యాన్ని  కలిగిస్తాయి.  కొందరు  అనుకోకుండా   ఏదో  ఒక  పనివల్ల  సంఘటనా స్థలానికి  వచ్చి  ప్రాణాలు  కోల్పోవటం  జరుగుతోంది. కొందరు  మృత్యుంజయులు  సంఘటనా  స్థలానికి  దగ్గరలోనే  ఉన్నా  కూడా  కొద్దిపాటి  గాయాలతో  ప్రమాదం  నుంచి  బయటపడటం   కనిపిస్తోంది. 

  ఏది  ఎప్పుడు  ఎందుకు  ఎలా జరుగుతుందో ? ఏమిటో  ? అన్నీ  భగవంతునికే  తెలియాలి.
 
 ఈ  సంఘటనలో   కొందరు  చనిపోవటం  అత్యంత  దురదృష్టకరం. వారి  ఆత్మలకు  శాంతి  లభించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

............

దైవభక్తి   నైతికవిలువలను  పాటించటం, దేశభక్తి,  ఎవరి  బాధ్యతను  వారు  చక్కగా  నిర్వర్తించటం   ద్వారా   సమాజంలో  నేరాలు..ఘోరాల  నుండి  విముక్తి  లభిస్తుంది.

 

No comments:

Post a Comment