koodali

Friday, September 28, 2012

కొన్ని విషయాలు మరియు జీవవైవిధ్యం....

అంతర్జాతీయ  జీవ  వైవిధ్య  సదస్సు  మన  దేశంలో  జరగటం    సంతోషకరమైన  విషయం.

ప్రపంచంలో   ఎన్నో  జీవజాతులు   అంతరించి   పోతున్నాయంటున్నారు.  కొంతకాలం  క్రిందట  ఇళ్ళలో  పిచ్చుకలు  వంటివి  కనిపించేవి.  ఇప్పుడు  అంతగా  కనిపించటం  లేదు.  పెరిగిన  కాలుష్యం  వల్ల  వాటి  సంఖ్య  తగ్గిపోతోందట .


ఈ  మధ్య  మేము  కురువపురం  వెళ్ళినప్పుడు  అక్కడ  దేవాలయం  వద్ద  పిచ్చుకలు,  ఇంకా  ఇతర  పక్షుల    కిలాకిలారావాలతో  ఆ  ప్రదేశం  ఎంతో  ఆహ్లాదకరంగా  ఉంది.


కాలుష్యం  వల్ల  పశుపక్ష్యాదులకు  ముప్పు  కలుగుతుంటే  ఆ  కాలుష్యం   వల్ల   మనుషులకు  కూడా  ముప్పు  పొంచి  ఉన్నట్లే  కదా  !     ఇప్పటి నుంచైనా  తగు  జాగ్రత్తలు  తీసుకోకపోతే  అంతరించే  జాతుల్లో  మానవజాతి  కూడా  ఉంటుంది.


మనం  వాడే  రసాయనాలు    గాలిలో,   భూమిలో ,  నీటిలో  కలిసి ....  తిరిగి    ఆహారం  ద్వారా  మనలో  ప్రవేశించటం  వల్ల  ఎంతో  అనారోగ్యం  కలుగుతుంది.  ఇప్పుడు  మనుషులు  ప్రకృతికి  దూరంగా  వెళ్తూ  అదే    అభివృద్ధి   అని  భ్రమిస్తున్నారు. 


మనుషులకు  కోరికలు  ఎక్కువై,    తమకు  ఏం  కావాలో  తెలియని  అయోమయ  పరిస్థితి  ప్రస్తుతం  ప్రపంచంలో  నెలకొని    ఉంది.  ఎందుకో,  ఏమిటో  తెలియని  పోటీతో   ప్రపంచదేశాలు  పరిగెడుతున్నాయి.  


ఈ  పోటీని  అభివృద్ధి   అని  కొందరు   అపోహపడుతున్నారు.

 అయితే,   ఈ  పోటీ    సహజ  వనరులను  వేగంగా  వాడే  విషయంలో  జరుగుతున్న  పోటీ  అని  చెప్పుకోవచ్చు. 


 సహజవనరులు   ప్రకృతిలో   ఏర్పడాలంటే  వేల,  లక్షల  సంవత్సరాల  కాలం  పడుతుంది.  కానీ,  వాటిని  వాడేయటం  తేలిక.  గత  కొద్ది  సంవత్సరాల  కాలంలో  విపరీతమైన    వాడకం  వల్ల   బొగ్గు,  వంటి  ఇంధన  వనరులు  ఖాళీ  అయ్యే  పరిస్థితి  వచ్చింది.



  ఎన్నో  ఖనిజవనరులు  కూడా     వేగంగా  తరిగిపోతున్నాయి.  ఇవన్నీ  అయిపోయాక   ప్రపంచదేశాల  మధ్య  ఇక  పోటీయే  ఉండదు.

 (  అప్పటికి  మానవజాతి   అంతరించకుండా  మిగిలి  ఉంటే..  )

  మన  పూర్వీకులు  ఇంతలా  ఖనిజాలను  వాడినట్లయితే  మనకు  ఇప్పుడు  ఒక  చెంబు  గానీ,  తప్పేలా  గానీ  తయారుచేసుకోవటానికి  ఖనిజపదార్ధమే  ఉండేది   కాదు.  పాపం  వాళ్ళు  మనలా  విపరీతమైన  కోరికలు   కలవాళ్ళు  కాదు  కాబట్టి,  మనం  ఇంకా   వస్తువులను  వాడుకోగలుగుతున్నాము.  


వస్తువులు  తయారు  కావాలంటే  ఇనుము,  బాక్సైట్ ...... వంటి   పదార్ధాలు  కావాలి  కదా  మరి......పారిశ్రామిక  అభివృద్ధి  అంటూ  ఇలాగే   ఖనిజాలని    తవ్వుకుంటూ   పోతే    రాబోయే  తరాల వారికి  ఖనిజాలే  మిగలవు.  


ఇప్పుడు   ప్రపంచ  దేశాల  వద్ద  అంతగా  డబ్బు  లేకపోయినా  ,  పేదరికం,  నిరుద్యోగం,  ఆర్ధికమాంద్యంతో  సతమతమవుతున్నా   కూడా   , విపరీతమైన  .... ఆయుధపోటీలు,  అంతరిక్ష 
పోటీలు..  కొనసాగుతూనే  ఉన్నాయి.

ఈ  మధ్యే  అంగారకయాత్ర  కూడా  జరిగింది  కదా  !
  అంగారకుడు.. వరాహస్వరూపుడైన విష్ణు మూర్తికి  భూదేవికి  కలిగిన   పుత్రుడని 
పూర్వీకులు  చెప్పటం  జరిగింది.

   భూమిపై  ధ్రువప్రాంతాల  వద్ద    వాతావరణంలోనే   మనుషులు    ఉండలేరు. .  ఇక  ఇతరగ్రహాలకు  వెళ్ళి  అక్కడ   బాగు  చేసుకుని  స్థిరపడటం  జరిగేపనేనా  ?    దీనికయ్యే  అంతులేని  డబ్బుతో   భూమిపై  పేదరికాన్ని  పోగొట్టవచ్చు.    


భూమిపై   ఉన్న  ధృవప్రాంతాల్లో  నివాసాలు  గట్రా  ఏర్పాటు   చేస్తే  మాత్రం  అక్కడ   వేడి   పెరుగుతుంది.   


అప్పుడు    అక్కడి  మంచు  కరిగి ,   సముద్రపు  నీటి  మట్టాలు  ఒకటి  లేక  రెండు  అంగుళాలు  పెరిగినా  కూడా  భూమిపైన  ఎన్నో  ప్రాంతాలు,  నగరాలు  మునిగిపోతాయట.  కనుక  ధృవ  ప్రాంతాలకు    వెళ్ళకపోవటమే  మంచిది. 

 మనుషుల్లో ,  వస్తువులపై 
పెరిగిపోయిన   మోజు  వల్లే  ఇన్ని  సమస్యలు    వస్తున్నాయి.  మన  పూర్వీకులు   ఇన్ని  వస్తువులు  లేకపోయినా  చక్కగా  జీవించారు. 

ఇవన్నీ  ఆలోచిస్తే,   భూమిపై  ప్రాణికోటి  మిగిలి  చక్కగా  జీవించాలంటే   మనుషులు  తమ  కోరికలను  తగ్గించుకోక  తప్పదు.


  పారిశ్రామిక  కాలుష్యాల  వల్ల    పర్యావరణానికి  ఎంతో    హాని  కలుగుతోంటే,  భక్తి  పేరుతో  కూడా  కొందరు  పర్యావరణానికి  చేటు  తెస్తున్నారు.  


  పూర్వీకులు,   వినాయకచవితి  పండుగలో  పర్యావరణానికి  మేలు  చేసే  చక్కటి   ఆచారాలను  ఏర్పాటు  చేసారు.

  వానాకాలంలో   ఔషధీయుక్తమైన  పత్రితో  దైవాన్ని  పూజించటం  ,  తరువాత  ఔషధీయుక్తమైన   పత్రితో  సహా  మట్టితో  చేసిన   వినాయకుని  ప్రతిమలను  నీటిలో   నిమజ్జనం  చేయటం  వల్ల   నీటిలో  ఉన్న  చెడు  బాక్టీరియా  నశిస్తుంది.   ఆ  నీటిని  వాడే  ప్రజల  ఆరోగ్యం  చక్కగా    ఉంటుంది.


   పత్రిని   సేకరించటం  ,  పూజ  చేయటం  వల్ల  ఆ  పత్రి  యొక్క   ఔషధీకరణ  గుణాలు  వంటి  విషయాల  గురించిన  వివరాలు    పిల్లలకు  తెలిసేవి. 


అయితే ,  ఇప్పుడు  వినాయక  చవితికి  పత్రి  కన్నా  , రసాయన  రంగులను  వేసిన  విగ్రహాలను  నీటిలో  కలపటం  వల్ల  నీరు  కలుషితం  అవుతోంది.  రసాయన  రంగులను  వాడవద్దని    ఎందరో  చెబుతున్నా  కూడా ,  ప్రజలు  ఎందుకు  పట్టించుకోవటం  లేదో  అర్ధం  కావటం  లేదు.


మనుషులు  తమ  స్వార్ధాన్ని  తగ్గించుకుని  ఇతరజీవులను  కూడా  బ్రతకనిస్తేనే  దైవ  కృప  లభిస్తుంది.




No comments:

Post a Comment