koodali

Monday, October 27, 2014

మురుగునీటిని నదులలో, సముద్రాలలో కలపకుండా.....మురుగునీటితో విద్యుత్ తయారుచేయవచ్చేమో..


నదులలోను,  సముద్రాలలోనూ  ...డ్రైనేజీ  నీటిని  లేక  పరిశ్రమల  నుంచి  వెలువడే  రసాయనిక  వ్యర్ధాలను  వదలటం  ఎంతో  ఘోరం. 

 నదుల పరీవాహక  ప్రాంతం  వెంబడి ఉన్న  నగరాల  నుంచి  వచ్చే మురుగును  అక్కడి నదులలో  వదిలేస్తున్నారట.  


నదులలో  డ్రైనేజీ  నీటిని  వదలటమంటే ....మన  ఇంట్లోని  మంచినీటి  బిందెలో  డ్రైనేజీ  నీటిని  తెచ్చి  కలుపుకుంటే  ఎంత  ఘోరంగా  ఉంటుందో  అంత  ఘోరం. 


జీవుల  మనుగడకు   నీరు  ఎంతో  ముఖ్యం.  అలాంటి  నీటిలో  పనిగట్టుకుని  మురికినీటిని  కలుపుకోవటం విచారించవలసిన విషయం . 

  ................................ 

జీవుల  మనుగడలో  నదులు, సముద్రాల  యొక్క  పాత్ర    ఎంతో  ముఖ్యమైనది. 


సూర్యరశ్మి  వల్ల  నీరు  ఆవిరి  కావటం..ఆ  ఆవిరి  తిరిగి  వర్షంలా  నేలపై  కురియటం .. ఈ  ప్రక్రియలో   సముద్రం  యొక్క  పాత్ర  ఎంతో  ముఖ్యమైనది.


సముద్రాలలో  వదులుతున్న  కాలుష్యం  వల్ల  సముద్రంలోని  ఎన్నో జీవుల  మనుగడకు  ముప్పు  వస్తోంది.  


...................


 మురుగునీటిని  నదులలో, సముద్రాలలో  కలపకుండా... ..కాలువలలో  నిల్వ  చేసి, ఆ మురుగునీటితో   విద్యుత్  తయారుచేయవచ్చేమో .. 


పేడ  ద్వారా  బయో గ్యాస్ ఉత్పత్తి  చేస్తున్నారు... చెత్తతో  కూడా  విద్యుత్  ఉత్పత్తి  చేస్తున్నారు.


మురుగునీటితో   విద్యుత్  తయారయితే  మురుగునీటి  సమస్య   తగ్గుతుంది .  అలాగే  విద్యుత్  సమస్యా  తగ్గుతుంది  

.........................

మురుగునీటిని  నదులలో,  సముద్రాలలో  కలపకుండా , ఆ మురుగునీటిని  కొంతవరకు  శుద్ధిచేసి  పంటలు పండించటానికి  వాడుకోవచ్చు.


అయితే , ఈ  రోజుల్లో  మురుగునీటిలో  అనేక  రసాయనాలు  కలుస్తున్నందువల్ల    హానికరమైన  రసాయనాలతో  కూడిన  మురుగునీటితో  పండించిన ఆహారపదార్ధాలను  తింటే  జబ్బులు  వచ్చే  అవకాశముంది.


ఆధునిక కాలంలో  రసాయనాల   వాడకం  విపరీతంగా  పెరిగింది.


 రసాయనాలు  ఉన్న  డిష్  వాషర్,  రసాయనాలతో  కూడిన  సబ్బులు,  షాంపూలు, డిటర్జెంట్లు, ఇంటి  శుభ్రతకు  వాడే  యాసిడ్లు...ఇలా  ఎన్నో  ప్రమాదకరమైన  గాఢమైన  రసాయనాలు  మురుగునీటితో  కలిసి  నదులలో  కలుస్తున్నాయి.


ఇక  పరిశ్రమల  నుంచి  విడుదలయ్యే  రసాయనాలు   మరింత  హానికరం.


ఇవన్నీ  భూమిలో  కూడా  కలుస్తున్నాయి.  ఇలా  భూమి,  నీరు,  గాలి..కలుషితం  అయిన  వాతావరణం  వల్ల  అనేక  జబ్బులు  పెరుగుతున్నాయి.

.................................. 

మన  పూర్వీకులు  నదులను,  సముద్రాలను  పూజించేవారు. 


పాతకాలం వాళ్ళు  శుభ్రత  కొరకు   మట్టి,  బూడిద, నిమ్మరసం,  శనగపిండి,  కుంకుడురసం...వంటి  సహజసిద్ధమైన  పదార్ధాలనే  వాడేవారు.వీటివల్ల  పొల్యూషన్  ఉండదు.

...............

మోడీ గారు  చెప్పినట్లు  త్రాగునీరు  స్వచ్చంగా  ఉంటే  ఎన్నో  రోగాలు  దరిచేరవు.


నదులలో ,  సముద్రాలలో .. మురుగునీటిని  వదలకుండా  ప్రభుత్వం,  ప్రజలూ జాగ్రత్తలు  తీసుకోవాలి.



No comments:

Post a Comment