koodali

Thursday, August 28, 2014

ఓం,


 వినాయకచవితి పూజలో ఉపయోగించే పత్రి ఎన్నో ఔషధవిలువలు గలిగిన పత్రి. 


ఇప్పుడంటే  పత్రిని  బజారులో  కొంటున్నారు  గానీ, ఇంతకుముందు రోజుల్లో అయితే ఈ పత్రిని  సేకరించటంలో  పెద్దవాళ్ళతో  పాటు పిల్లలు  కూడా పాల్గొనేవారట. అందువల్ల  పిల్లలకు  రకరకాల  మొక్కల  గురించిన వివరాలు, వాటికి  గల  ఔషధగుణాలు   తెలిసేవి . 


  పూజ  తరువాత  , పూజలో  వాడిన  పత్రిని  కూడా  నీటిలో  కలుపటం  ద్వారా  పత్రిలోని  ఔషధ  గుణాలు  నీటిలో  కలిసి  నీరు  బాగుంటుంది.


మట్టితో  తయారుచేసిన   విగ్రహాల   వల్ల     కలిగే  మంచి  గురించి   ఎందరో  ప్రచారం  చేస్తున్నారు.  అందువల్ల  ప్రజలలోనూ  క్రమంగా   చక్కటి  చైతన్యం  పెరుగుతోంది.  


  పర్యావరణానికి  హానిని    కలిగించని   విగ్రహాలను  వాడటానికి  ముందుకొచ్చే  ప్రజల  సంఖ్య  పెరగటం   మంచి  పరిణామం.

2 comments:

  1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete