koodali

Tuesday, April 22, 2014

ఈ నాటి పిల్లలకు ఏ విధమయిన ఎడ్యుకేషన్ అవసరము అంటే .......



ఈ రోజుల్లో చదువు అన్న పదానికి అర్ధమే మారిపోయిందని అనిపిస్తోంది . అంటే సంపాదన కోసమే చదువు అన్నట్లు ఉంది కదా మరి.



భుక్తితో పాటూ దైవ భక్తి, ఉన్నతవిలువలతో కూడిన చదువు అవసరమని నా అభిప్రాయం.



సమాజములో పేదరికం పెరిగిపోవటానికి ,ఇన్ని నేరాలు, ఘోరాలు జరగటానికి ముఖ్యకారణం
నైతిక విలువలు తగ్గటం .....అంతేకాని డబ్బు లేకపోవటం కారణం కాదని అనిపిస్తోంది.


ఉదాహరణకు....నైతిక విలువలు  ధర్మం మీద గౌరవం ఉన్నవారు ప్రపంచములో సంపద అంతా తనకే కావాలని అత్యాశ పడరు.



ఇందువలన సంపద అందరికీ సమానముగా అందుబాటులోకి వచ్చి పేదరికం ఉండదు.తిండి లేక చనిపోయేవాళ్ళు ఉండరు.
 

ధర్మాన్ని పాటించేవారు మగవారయినా , ఆడవారయినా ,ఎటువంటి బలహీన క్షణము ఎదురయినా సరే పరాయి స్ర్తీ,పురుషులను పూజ్యభావంతో మాత్రమే చూస్తారు.

ఇందువలన అందరి కుటుంబములు పచ్చగా ఉంటాయి.కుటుంబ వ్యవస్థ   విచ్చిన్నం అవటం జరగదు.హత్యలు,ఆత్మహత్యలు ఉండవు.
 

ధర్మాన్ని పాటించేవారు అసూయ,లోభం, దొంగతనం, పరాయి సొమ్ముకు ఆశపడటం జరగదు.  ధర్మబద్ధముగా అభివృద్ధి చెందటానికి ప్రయత్నిస్తారు. కుదరకపోతే తమకు అంతే ప్రాప్తం అని సరిపెట్టుకుంటారు. 


ఇందువలన వ్యక్తులు,కుటుంబాలు,దేశాలు మద్యన కక్షలు, యుద్ధవాతావరణం ఉండదు. బోలెడు డబ్బు నష్టం ఉండదు.

 
ధర్మాన్ని పాటించేవారు సమస్త జీవకోటి యందు దయను కలిగి ఉంటారు.పర్యావరణానికి విచ్చలవిడిగా హాని కలిగించరు.



ఇందువలన జీవ పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. చెట్లు పచ్చగా ఉండి సకాలంలో వర్షాలు పడతాయి.అప్పుడు ఆహారం కొరత ఉండదు.


వీటివలన అర్ధమయ్యేది ఏమిటంటే,   ప్రపంచములో ఆనాడు కానీ, ఈనాడు కానీ ఇన్ని యుద్ధాలు, ఇంత గందరగోళం ,ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయంటే  దైవభీతి, పాపభీతి .. లేకపోవటం,  ధర్మం నైతిక విలువ
ను  పాటించని కొంతమంది ప్రజలవల్లనే.


అందువలన పిల్లలకు మంచి విలువలను నేర్పించటం ఎంతో ముఖ్యం. చాలా సమస్యలకు అది పరిష్కారమని  అనిపిస్తుంది.



ఎడ్యుకేషన్  అంటే  కేవలం  పాఠశాలలో  మాత్రమే  నేర్పించేది  కాదు,  తల్లితండ్రులు  మరియు  సమాజం  నుంచి  కూడా  పిల్లలు  ఎంతో  నేర్చుకుంటారు. ఎన్నో  విషయాలను  తెలుసుకుంటారు.

 అందుకని   తల్లితండ్రి,  పాఠశాల,  మరియు  సమాజం  ..ఇలా  అన్ని  చక్కగా  ఉండేలా  జాగ్రత్తలు  తీసుకోవాలి.



No comments:

Post a Comment