koodali

Wednesday, November 9, 2011

ఒకప్పుడు త్రిమూర్తులు సుధాసముద్రంలో గల ఆదిపరాశక్తిని( పరమాత్మను ) దర్శించి స్తుతించారు.

* ఓం.

* ఒకప్పుడు త్రిమూర్తులు సుధాసముద్రంలో గల ఆదిపరాశక్తిని( పరమాత్మను ) దర్శించి స్తుతించారు.

వారు
అక్కడకు వెళ్ళే దారిలో ఎన్నో బ్రహ్మాండాలనూ, అక్కడ కూడా ఎందరో త్రిమూర్తులను దర్శించి ఆశ్చర్యపోతారు.

* బ్రహ్మదేవుడు ఆదిశక్తిని స్తుతించి కొన్ని సందేహాలను కూడా అడగటం జరిగింది. .అందులో కొంత భాగం...

.......ఏకమేవాద్వితీయంబ్రహ్మ అనికదా వేదాలు చెబుతున్నాయి. అది నువ్వా, లేక నీ విభుడైనపరాత్పరమహాపురుషుడా ?....అని,

ఇంకా ఎన్నో విషయాలను అడగటం జరిగింది.

* అప్పుడు
, ఆదిపరాశక్తి ..ఎన్నోవిషయాలను బ్రహ్మదేవునికి చెప్పటం జరిగింది. అందులో కొంతభాగం.......

.....చతుర్ముఖా ! నాకూ నా పురుషుడికీ భేదం లేదు. ఎప్పుడూ ఏకత్వమే. అతడే నేను. నేనే అతడు. భేదం మతివిభ్రమం..అంటూ

ఇంకా
ఇలా చెప్పటం జరిగింది..దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను.శక్తి రూపంలో ఉంటాను...అని,

ఇంకా
ఇలా చెప్పటం జరిగింది..నీళ్ళలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యుడిలోని జ్యోతిస్సు, చంద్రుడిలోనిమంచు- నేనే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను.

నేను లేనిది - ఏదీ స్పందించదు. శంకరుడైనా సరే నేనువదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు. దుర్బలుడై పోతాడు.

లోకంలో
దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి ? శక్తిహీనుడు అనే కదా ! రుద్రహీనుడు, విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా ? శక్తిహీనుడు అని మాత్రమే అంటారు...అని ,

ఇంకా చాలా విషయాలను చెప్పటం జరిగింది.

* ఆదిపరాశక్తి, విష్ణుమూర్తికి ఎన్నో విషయాలను తెలియజేయటం జరిగింది........

అందులో కొద్ది భాగం...

.....నా విహారాన్ని ముగించి విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురూ కూడా నాలో లీనమైపోతారు. ...అని ఇంకా చాలా విషయాలను చెప్పటం జరిగింది.

* ఆదిపరాశక్తి శివునికి చాలా విషయాలను చెప్పటం జరిగింది..

తరువాత, శివునితో ఇలా కూడా అనటం జరిగింది....మీమీ కార్యాలు నిర్వహించండి. విషమపరిస్థితి ఏదైనాఎదురైనప్పుడు నన్ను స్మరించండి. స్మరణ మాత్రం చేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను. అలాగే సనాతనుడైనపరమాత్మను కూడా తలుచుకోండి. మా ఇద్దరినీ తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది. అనిచెప్పటం జరిగింది.

...............................

* ఒకప్పుడు మధుకైటభులు అనే రాక్షసులు బ్రహ్మదేవుని , విష్ణుమూర్తిని ఇబ్బందిపెట్టగా ఆదిశక్తి సహాయంతో విష్ణుమూర్తి రాక్షసులను సంహరించగలిగారన్నది తెలిసిన విషయమే.

* ఇంకొకసారి దుర్గముడనే రాక్షసుని వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆదిపరాశక్తి రాక్షసుడిని కూడా సంహరించటంజరిగింది. సందర్భంలో శక్తిని శతాక్షి ( శాకంభరి ) , దుర్గ అని దేవతలు కీర్తించారు.

* ఒకప్పుడు మహిషాసురుడు వరగర్వంతో విర్రవీగుతూ లోకాలని పీడిస్తుంటే ఎవరూ మహిషాసురుని సంహరించలేకపోతారు.

అప్పుడు
విష్ణుమూర్తి సలహాతో దేవతలందరూ తమలోని తేజోంశలను స్త్రీ మూర్తులుగా అభ్యర్ధిస్తూ ప్రార్ధిస్తారు. అప్పుడుసకల దేవతాంశలనూ తేజశ్శక్తులను కలబోసుకుని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించటం జరుగుతుంది.

ఆమె మహిషాసురుని సంహరించటం జరిగింది.
ఆమే మహిషాసురమర్దని.
...................................................

* లలితా సహస్రనామాలలోని కొన్ని నామములు..............

శ్రీ మాతా
కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతి పణస్తనీ
చింతామణి గృహాంతస్థా
మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా
నిరాకారా
దుర్గా
మహాలక్ష్మీ
పార్వతీ
సృష్టికర్త్రీ
బ్రహ్మరూపా
గోవిందరూపిణీ
రుద్రరూపా
హరిబ్రహ్మేంద్ర సేవితా
రామా
వివిధాకారా
గాయత్రీ
పరాశక్తిః

అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్యవిగ్రహా
ఉమా
గౌరీ
రాజరాజేశ్వరీ
సరస్వతీ
బ్రహ్మజననీ
మూలవిగ్రహరూపిణీ
వైష్ణవీ
విశ్వమాతా
శాశ్వతీ
అనఘ
శివశక్త్యైక్య రూపిణీ
నామాలను గమనిస్తే చాలా విషయాలు తెలుస్తాయి..
....................................
* ఆదిపరాశక్తిపరమాత్మకు అనేక నమస్కారములు.
...................................

* నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. తోచినట్లు వ్రాస్తున్నాను.
ఇందులో ఏమైనా అచ్చుతప్పులు గానీ, ఇతరత్రా ఏవైనా పొరపాట్లు ఉన్నచో దైవం దయచేసి క్షమించాలని పార్ధిస్తున్నాను. అంతా దైవం దయ......

ఇంకో విషయం..ఈ మధ్య ఒకాయన ( స్వామి.......) అమర్ నాధ్ యాత్ర గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారట, ఎవరు ఏమన్నా అమర్ నాధ్ యాత్ర , అక్కడి దైవము ఎంతో గొప్ప....


No comments:

Post a Comment