koodali

Sunday, August 18, 2024

ఏవి నిజాలో ?ఏవి ప్రక్షిప్తాలో? ... కొన్ని విషయములు..

ఇక్కడ పోస్టును వేరే వద్ద వేసి అక్కడ పోస్టును ఇక్కడ వేయటం జరిగిందండి.

 ....................................

 Friday, October 24, 2025
ఏవి నిజాలో ?ఏవి ప్రక్షిప్తాలో? ... కొన్ని విషయములు..

 ఈ మధ్య ఒక దగ్గర విన్న విషయం గురించి నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

 శ్రీరాముల వారు మాంసాహారాన్ని తీసుకున్నారో? లేదో? అనే విషయాల గురించి గొడవలు జరుగుతున్నాయి.

అయితే, ఈ మధ్యన ఒకరు ఏమన్నారంటే, శ్రీ ఆంజనేయుల వారు లంకకు వెళ్లినప్పుడు  సీతాదేవితో ..శ్రీ రాముల వారు సీతాదేవి మీద బెంగతో మధుమాంసాదులను కూడా తీసుకోవటం లేదని అన్నట్లు.. ఆ శ్లోకాన్ని చెప్పి, అంటే శ్రీరాముల వారు ఇంతకుముందు తింటేనే కదా.. ఇప్పుడు తినటం లేదని హనుమంతుల వారు చెపుతారు..అన్నారు.

ఈ విషయాలను గమనించిన తరువాత నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

  నారదుస్తులను ధరించి కొన్ని నియమాలతో వనవాసానికి వెళ్ళిన శ్రీరాముల వారు నియమాలను పాటించారని నేను ఒకదగ్గర విన్నట్లు గుర్తుంది.

ఆ విషయాలను గమనించిన తరువాత, వనవాస సమయంలో రాముల వారు ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించారన్నట్లు  నాకు అర్ధమయింది.

మరి, సీతాదేవి పట్ల బెంగతో శ్రీరాములవారు మధుమాంసాలను తీసుకోవటం లేదని హనుమంతుల వారు సీతాదేవికి చెప్పారంటున్నారు..

మరి ఇంతకుముందు నేను విన్నది సరైనదా? కాదా? నారవస్త్రాలు ధరించి వనవాస నియమాలను పాటించినప్పుడు, మధుమాంసాదుల గురించి నియమాలు ఉన్నాయా? లేవా? అని సందేహాలు కలిగాయి.
 
 కొందరేమో వనవాస సమయంలో వారు ఆహార విషయంలో  కొన్ని నియమాలతో ఉన్నారంటారు. కొందరేమో మాంసాహారాన్ని తిన్నారంటారు..ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.

ఏమిటో? అప్పుడు ఏం జరిగిందో? గ్రంధాలలో  ఏవి నిజాలో ? ఏవి ప్రక్షిప్తాలో?  
..........

 నాకు ఏమనిపిస్తోందంటే, సంస్కృతంలో  అనేక అర్ధాలుంటాయి...ఒక్క అక్షరాన్ని కలిపి లేక విడదీసి చదివినా అర్ధాలు మారిపోయే అవకాశముంది. అందువల్ల ఆ శ్లోకాన్ని సరిగ్గా ఎలా అర్ధం చేసుకోవాలో మనకు తెలియకపోవచ్చు.

మధు(మధువు) అంటే అనేక అర్ధాలుంటాయి. మాంసం.. అన్నా కూడా అనేక అర్ధాలుంటాయి.

మాంసం అనే పదానికి బలాన్ని కలిగించే ఆహారం అని కూడా అర్ధం ఉండవచ్చు...పండ్ల రసాలను కూడా మధు.. అని అంటారు కావచ్చు..

వనాల్లో సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు సీతాపహరణానికి ముందు,  బలమైన ఆహారం కొరకు కొన్ని పంటలను కూడా వారు పండించుకుని ఉండవచ్చు.

 ఉదా..కొన్ని పప్పుధాన్యాలు పండించుకున్నారేమో? మినుములు(మాష)వంటివి.. కూడా మాంసాహారంతో సమానమైన బలమైన ఆహారమని అంటారు.

 నానబెట్టిన పప్పుధాన్యాలు లేక ఉడికించిన గుగ్గిళ్ళు వంటివి..వారు తీసుకున్నారేమో..

........................
నాకు ఏమనిపిస్తోందంటే... అపహరణ తరువాత  సీతాదేవి పట్ల బెంగతో రాముల వారు తన ఆహారం పట్ల  శ్రద్ధ వహించలేదని ...

పువ్వులు, పండ్ల నుంచి లభించే తీపి పదార్ధాన్ని.. పండ్ల రసాలను(మధు..), బలాన్ని కలిగించే మినుముల(మాష) వంటి పప్పుధాన్యాలను  భుజించటం పట్ల.. శ్రద్ధ వహించలేదని అర్ధం చేసుకోవచ్చని.. నాకు అనిపిస్తుంది.


రామాయణం జరిగిన త్రేతా యుగంలో, మనుషులు జీవించే కాలమూ ఇప్పటితో పోలిస్తే చాలా ఎక్కువేనంటారు. అప్పటి కాలంలో వారి ఆకారాలు ఇప్పటివారితో పోలిస్తే భారీగా ఉండేవారంటారు. అప్పట్లో మొక్కలు, చెట్లు కూడా ఆకారాలు భారీగా ఉండేవి కావచ్చు.

 అప్పట్లో ఇప్పటిలా తేనెటీగల నుంచి నుంచి తేనె సేకరించటం కాకుండా, భారీ పరిమాణంలో తేనె వంటి తీపి పదార్ధం పువ్వులు, పండ్ల నుంచి తేలికగా లభించేది కావచ్చు.  

 వేల సంవత్సరాల క్రిందట విషయాలను గ్రంధాలలో చదివిన వాటిని కొన్నిసార్లు మనం సరిగ్గా తెలుసుకోలేకపోవచ్చు.

ఏది ఎలా జరిగిందో.. దైవానికి సరిగ్గా తెలుస్తుంది.
............................

 నాకు సంస్కృతం తెలియదు. నేర్చుకోవాలనే  ఆసక్తి కూడా  ప్రస్తుతం లేదు.  నాకు తోచింది రాయాలనిపించి వ్రాసాను.

అయితే, ఈ విషయాల గురించి నాకు సరిగ్గా అర్ధం కాలేదు. సందేహాలున్నాయి.
..........

అయినా, రాములవారు మాంసాహారాన్ని భుజించారని చెప్పటానికి కొందరు ఎందుకు పదేపదే ప్రయత్నిస్తున్నారో? అర్ధం కావటం లేదు.  

ఇంతవరకు మాంసాహారం తిన్నారని చెప్పారు. ఇప్పుడు మధు.. కూడా స్వీకరించారని అంటున్నారు.

మధు ..అంటే మత్తెక్కించే సారా వంటిదని కొందరు భావించే ప్రమాదం కూడా ఉంది.

...................... 

సత్యము కొరకు రాజ్యపట్టాభిషేకాన్ని తృణప్రాయంగా వదిలి వనవాసానికి  వెళ్ళిన గొప్ప వ్యక్తి శ్రీ రాములవారు.
 ..................

 ప్రాచీనకాలంలో రాక్షసుడు వేదాలను అపహరించితే, శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని సంహరించి వేదాలను రక్షించారని గ్రంధముల ద్వారా తెలుస్తోంది.

 వేదాలనే అపహరించగలిగినప్పుడు, ఎవరైనా గ్రంధాలలో మార్పులుచేర్పులు(ప్రక్షిప్తాలు)చేసారనే విషయంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
  ..............

 నేను ఈ పోస్టును కొంతసమయం తరువాత డిలిట్ చేస్తానేమో?

 వ్రాసిన వాటిల్లో తప్పులు ఉంటే దయచేసి క్షమించమని  దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 ..............

 గ్రంధాలలో 
ఎన్నో అర్ధం కాని విషయాలుంటాయి.  ప్రక్షిప్తాలు కూడా ఉంటాయి.

ఇవన్నీ  అదేపనిగా ఆలోచిస్తూ, వాదిస్తూ సమయాన్ని గడపటం కన్నా, ఇవన్నీ విని గందరగోళం పడటం కన్నా..కొంతవరకు తెలుసుకుని..అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుని మన శక్తికొలది చక్కగా దైవాన్ని ఆరాధించుకోవటం మంచిది.

****************

క్రింద ఒకరు ఒక వ్యాఖ్య వ్రాసారు. పొరపాటున ఆ వ్యాఖ్య డిలిట్ అయ్యింది. వారి కొరకు ఈ లింక్ ఇస్తున్నాను.

 మాంసాహారం గురించి కొంత వివరంగా ఇంతకుముందు పోస్టులో వ్రాసాను.  ఒక లింక్ ఇస్తాను..మీకు ఆసక్తి ఉంటే మరికొన్ని విషయాలను చదవచ్చు.

LINK..... .....
పాలు, తేనె వంటివి శాకాహారం ఎలా అవుతాయి?..హింస..అహి...



Wednesday, August 14, 2024

ప్రపంచంలో మతాల పేరిట, అధికారం పేరిట, సంపదల...



 ప్రపంచంలో మతాల పేరిట, అధికారం పేరిట, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం. దైవం అంటేనే శాంతి. అలాంటి దైవం పేరిట రక్తపాతాలు, మారణహోమాలు జరగటం ఏమిటో అర్ధంకాదు.

 మతాల పేరుతో క్రూరంగా ప్రవర్తిసున్నవారు దైవం వద్ద తప్పక శిక్షను పొందుతారు.


అధికారం, సంపద కొరకు మతాలను
కూడా  స్వార్ధపూరితంగా వాడుకుంటారనిపిస్తుంది.  ఇలాంటివారు   సామాన్యప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. వాళ్ళ మాటలు నమ్మిన జనాలు ...వారు ఏం చెపితే అది చేస్తారు. ఇది బాధాకరం.  ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. 

అభద్రత భావం, తమ మాటే నెగ్గాలనే పట్టుదల ..వంటి లక్షణాల వల్ల ..కుటుంబాలలో కానీ, సమాజంలో కానీ గొడవలు వస్తుంటాయి. 

 

పాతకాలంలో యుద్ధాలలో కూడా కొన్ని నియమాలు ఉండేవి. యుద్ధంలో స్త్రీలకు, పిల్లలకు, అమాయకులైన వారికి హాని చేయకూడదని నియమాలతో భారత దేశంలో  యుద్ధాలు చేసేవారు. అక్కడక్కడా కొన్ని నేరాలు జరిగినా కూడా,  ఎక్కువ హింస ఉండేదికాదు. విదేశీ దాడులలో మాత్రం  పెద్ద ఎత్తున దాడులు జరిగాయి.



గతకొంతకాలంగా ప్రపంచంలో జరుగుతున్న 
హింస  చాలా బాధగా ఉంది.   పిల్లలు, స్త్రీల పట్ల,  మగవారి పట్ల  .. దారుణాలు  చేయటం ఏమిటో?     వాళ్లు మనుషులేనా? అనిపిస్తుంది. అలాంటి వాళ్లను ఏం చేసినా పాపం ఉండదు. అలాంటి దారుణాలు చేసిన  వారికి  దైవం సరైన బుద్ధి తప్పక చెబుతారు.

 

సనాతనధర్మం, హిందువులు బాగుండాలని  కోరుకుంటున్నాను.

  ఏ దేశానికి చెందినవాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళైనా అమాయకులు, మంచివాళ్ళు  బాగుండాలని కోరుకుంటున్నాను.  ఏ దేశానికి చెందినవాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా  వారి చెడ్డతనం  ...నాశనం అవ్వాలని కోరుకుంటున్నాను.   (వారి చెడ్డతనం పోని పరిస్థితిలో ఆ చెడ్డవాళ్లు నాశనం అవ్వాలని కోరుకుంటున్నాను.)


లోకకల్యాణం కొరకు పాతకాలంలో యజ్ఞయాగాదులు చేసేవారు. ఈ రోజుల్లో 
చాలావరకు   కల్తి వస్తువులు ఉన్నాకూడా, వాటితోనే యజ్ఞయాగాదులు చేస్తే ఎంతోకొంత ఫలితం తప్పక ఉంటుంది.



 ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి. 
దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.

 

 ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా,  నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం?   వారి సంగతి దైవం చూసుకుంటారు.

 కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.



ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ,  పాపాలు చేసి  అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.

 

సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు. 


ఎవరైనా ఘోరమైన నేరాలు చేస్తే వారిని కఠినంగా   శిక్షించేలా చట్టాలు ఉండాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే,  ఎవరైనా నేరాలు చేయాలంటే ..భయంతో వణికిపోయేలా ఉండాలి.    హింసతో కూడిన ప్రసారాలకు, సమాజానికి హాని కలిగించే వ్యవహారాలకు.. ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకట్ట వేయాలి.   ప్రభుత్వాలు ఎప్పుడు ఇవన్నీ చేస్తాయో అర్ధం కావటం లేదు.

 

 ఎవరైనా మనకు ఆపద కలిగించాలని చూస్తే, భయపడి కూర్చోము కదా..మన రక్షణ కొరకు ఎంతకైనా పోరాడుతాము.  ఎవ్వరైనా తమకు ఆపదలు సంభవించినప్పుడు అధైర్యపడకుండా, దైవాన్ని నమ్మి ఆ ఆపదల నుంచి రక్షించుకోవాలి. శత్రువులను ఎదుర్కుని గెలవాలి.
 


ఆ మధ్య ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు చెప్పినదాన్ని బట్టి ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది. అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు. 

 

మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.


కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న 
ఘోరాలు వింటుంటే,  చూస్తుంటే ..భరించలేని బాధగా ఉంది. రాక్షసమూక పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి.   ఇక దైవమే దిక్కు. 


అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి. 

అంతా దైవం దయ .

**************

 ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎందరో భక్తులు, ఎన్నో పూజలు జరుగుతున్నాయి.ఎన్నో శుభాలు జరుగుతున్నాయి... యుద్ధాలు, గొడవలు, నేరాలు, ఘోరాలు, ప్రమాదాలు, అన్యాయాలు..కూడా జరిగాయి.

 ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి. యుద్ధాలు, రక్తపాతాలు జరిగినప్పుడు అమాయకులైన పిల్లలు, మంచివారైన పెద్దవాళ్లు కష్టాలు పడుతున్నప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. దైవం చెడ్దవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది. 

పురాణేతిహాసాలలో దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.


 అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు. కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు.  

  మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి.  దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.

దైవం మహాశక్తి....


 

సృష్టిలో దైవం మహాశక్తి. ఒక్క దైవశక్తే ప్రపంచంలో అందరినీ సృష్టిస్తారు. అంతేకానీ, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దైవం సృష్టించరు. విశాలమైన భూప్రపంచంలో  వివిధ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అనేక మతాలు పద్ధతులు ఏర్పడ్డాయి. ఎవరి పద్ధతిలో వారు దైవాన్ని ఆరాధిస్తున్నారు. 

అయితే, ఎవరైనా పాటించే పద్ధతులు ఇతరులకు హానికలిగించే విధంగా ఉండకూడదు.


 భగవంతుని పేరుతో కూడా కొందరు ఇతరులను బాధించడానికి ప్రయత్నిస్తారు. అలా చేయటం చాలా తప్పు.  జీవితంలో కష్టాలు పోవాలని దైవాన్ని ప్రార్ధిస్తాము. అలాంటప్పుడు  దయామయులైన దైవం పేరు చెప్పి  క్రూరమైన పనులు చేయటం ఏమిటి?

***************
సనాతనధర్మం మతం కాదంటారు కొందరు. సనాతనధర్మము ఆదర్శవంతమైన  గొప్ప విధానము.


మన ప్రాచీనులు ..లోకాః సమస్తాః సుఖినో భవంతు..అని తెలియజేసారు. ఆ విధంగా ప్రపంచంలోని అందరూ బాగుండాలని కోరుకుంటాము. 

పరమతసహనం, సహనం..వంటి లక్షణాలు కలిగిఉండాలని మన పెద్దలు మనకు నేర్పించారు. పెద్దవాళ్ళు సహనాన్ని గురించి గొప్పగా నేర్పించినప్పుడు ప్రజలు సౌమ్యంగా తయారవుతారు.


సహనము, పరమతసహనం..వంటిలక్షణాలు కలిగిఉండాలని  పెద్దలు చెప్పటంలో తప్పులేదు. వాళ్లు అలాగే చెప్పాలి కూడా. అలాకాకుండా ఒకరినొకరు చంపుకోమని చెబితే అందరూ ఒకరినొకరు చంపుకుంటారు. అప్పుడు అందరూ బాధలు పడవలసి వస్తుంది. 

 అయితే,  ఎవరైనా  పరమత సహనం లేకుండా ప్రవర్తిస్తునప్పుడు మాత్రం అందుగుతగ్గ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

***********

అన్ని మతాలవారు చక్కగా జీవించవచ్చు. అయితే,  ఎవరైనా  హిందు మతాన్ని లేకుండా చేయాలని.. మతమార్పిడులకొరకు నయానాభయానా ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. 

  ఎవరైనా మనపట్ల దాడులు చేస్తే మనం శాంతి అంటూ చేతులు ముడుచుకుని కూర్చోము కదా ..మన రక్షణ కొరకు ఎంతకైనా పోరాడుతాము. 

 

లోకంలోని అమాయకులు, మంచివారికొరకు..

లోకాః సమస్తాః సుఖినో భవంతు ..అనుకోవాలి కానీ, 

చెడ్డవారి కొరకు కాదు.


పరమతసహనం, సహనం..వంటి లక్షణాలు మంచివే. అయితే, ఇతరులు పరమత సహనం లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు, మనల్ని మనం కాపాడుకోవటం తప్పనిసరి పరిస్థితి అవుతుంది. అలాంటప్పుడు సహనం..అని నింపాదిగా కూర్చుంటే ఏం జరుగుతుందో చెప్పలేం.

 మనల్ని రక్షించుకోవటానికి  తెలివిగా ఏదో ఒకటి చేయాలి. దైవాన్ని ప్రార్ధిస్తూ మన వంతు ప్రయత్నం మనం తప్పక చేయాలి.

******************
హిందువులకు పరమత సహనం ఎక్కువ. రామకృష్ణమఠంలో అన్ని మతాలవారికి ప్రవేశం ఉంది. ఒక యోగి ఆత్మ కధ పుస్తకంలో ఇతరమతముల ప్రస్తావన ఉంది. 

************

నా ఫ్రెండ్ ఒకామె నాకు శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణ చరితామృతము గ్రంధాన్ని ఇవ్వటం జరిగింది.ఆ విధంగా నాకు శ్రీ దత్తాత్రేయ అవతారమైన శ్రీపాదుల వారి గురించి తెలిసింది. మేము కురువపురం కూడా వెళ్లి దర్శించుకున్నాము. ఆ గ్రంధంలో శాయి గురించి కొన్ని విషయములున్నాయి. ఈ విషయాల అంతరార్ధం ఏమిటో.. ఆ విషయాల గురించి దైవానికే తెలుస్తుంది.
 

***************

 కొన్ని సంవత్సరాల క్రితం వరకు షిరిడిసాయిబాబా గురించి చాలామందికి తెలియదు. కొందరు శిరిడిసాయిబాబా గురించి సినిమాలు తీయటం జరిగింది. ఆ సినిమాలో కొందరు బ్రాహ్మణులు కూడా పాత్రధారులుగా నటించారు, పాటలు వ్రాసారు, పాడారు. ఆ పాటలు ఎలా ఉన్నాయో చాలామందికి తెలుసు. ఆ సినిమాల ద్వారా ఎందరో ప్రభావితులయ్యారు.  కొందరు పండితులు కూడా సాయిబాబా పూజల గురించి గొప్పగా ప్రచారం చేసారు, గ్రంధాలు కూడా వ్రాసారు.

 

సమాజంలో గొప్ప పేరు ఉన్నవారు చెబుతున్న విషయాలను సామాన్యప్రజలు నమ్ముతారు. వారు చెప్పిన విషయాలను పాటిస్తారు. సమాజంలో ఆధ్యాత్మిక విషయాలలో దిశానిర్దేశం చేసే బ్రాహ్మణులు చెప్పే విషయాలను చాలామంది నమ్ముతారు. శిరిడి లోని కొందరు బ్రాహ్మణులు కూడా సాయిని అనుసరించారు.

 

 క్రమంగా సాయి పూజలు పెరిగేసరికి..కొన్ని సందేహాలు కలిగి, సాయిబాబా పూజలు ఎందుకు చేస్తున్నారంటూ.....ఇప్పుడు సామాన్యప్రజలను తప్పు పడుతున్నారు. 


కొంతకాలం క్రిందట సాయిబాబాను గురించి గొప్పగా చెప్పి సమాజంలో వ్యాపింపచేసినది హిందువులే. సామాన్యజనం ఆకర్షించబడి సాయిపూజలు ఎక్కువయ్యేసరికి, ఇప్పుడేమో సాయికి పూజలు చేయవద్దని చెప్తున్నవారు కూడా హిందువులే.

**************

జనాలు  షిరిడి సాయి వెంట  పడితే, ఆయన తన అభిప్రాయాలను  చెప్పి ఉండవచ్చు. 

     సాయిబాబా హిందుదేవతలతో పాటు ఇతరమతాల దేవతలను కూడా స్మరించేవారు కాబట్టి,  భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయంతో కొందరు హిందువులు .. షిర్డిసాయిని పూజించవద్దని అంటుండవచ్చు.  ఇలాంటి పరిస్థితిలో  దైవమే దారి చూపాలి.

**************
 

    నాకు ఏమనిపిస్తుందంటే, హిందువులలో ఉన్న కొన్నివిధానాలను చాలామంది హిందువులు పాటించలేకపోతున్నారు.  షిర్డిసాయిబాబా  చెప్పిన విధానాలు తేలికగా ఉంటాయి. అందువల్ల కూడా అనేకమంది సాయి విధానాల పట్ల ఆకర్షితులు అయి ఉండవచ్చు.   విధానాలు సులభంగా ఉంటే,  ఆధునిక కాలంలో ప్రజలు త్వరగా ఆకర్షితులవుతారు. 

**************

ఇంకా, ఇంకొక విషయం ఏమిటంటే.. హిందువులకు బోలెడుమంది దేవతలుండగా,   బోలెడు పండుగలు ఉండగా చాలనట్లు ఇంకా,  ఇతర మతాల వారి పండుగలు కూడా ఎందుకు చేస్తారో? ఏమిటో? అందరూ ఆలోచించవలసి ఉంది.

 *************

ప్రతిదానికి మీరు ఇలా చేయకూడదు..ఇలానే చేయాలి..లేకపోతే కష్టాలు మీద పడిపోతాయంటూ చెబుతుంటే, ఈ కలికాలంలో అవన్నీ పాటించటం అందరికి కుదరకపోవచ్చు.  తేలికగా ఆచరించే విధానాలు ఎవరైనా చెబితే అటు వెళ్ళటానికి ఇష్టపడతారు.

  
దైవం అందరికీ అవసరమే. దైవం అంటే భయంతో కాకుండా, జీవితంలో కష్టసుఖాలను దైవంతో చనువుగా, ప్రశాంతంగా, అరమరికలు లేకుండా పంచుకోవాలని ఉంటుంది. అయితే  పూజలు అంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి......అనుకునేవిధంగా పరిస్థితి ఉంది.


 ప్రశాంతంగా దైవపూజ చేయాలన్నా, అక్కడా అనేక ఆంక్షలు. అది అలా చేయకూడదు, ఇది ఇలాగే చేయాలంటూ చెబుతారు.  జీవితంలో నియమాలు ఎంతో అవసరం. అయితే,  ఆ నియమాలు తట్టుకోలేంత ఉంటే మాత్రం పాటించటం కష్టమవుతుంది.
వన్నీ పాటించలేక  వదిలేయాలనిపిస్తుంది.

ఇవన్నీ పాటించలేక నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే,  మతంతో  సంబంధం లేకుండా నాకు తోచినట్లు దైవాన్ని పూజించుకుంటే ఎంత బాగుంటుంది.. అనిపిస్తుంది. పండుగ అంటే..దైవాన్ని స్మరించుకోవటం కన్నా, తప్పులు జరగకుండా  పనులు ఎలా జరుగుతాయో? అని టెన్షన్ ఎక్కువగా ఉండేది.

  ఇప్పుడు అతిని చాలావరకూ తగ్గించుకుని, నాకు తోచినంతలో ప్రశాంతంగా దైవాన్ని ఆరాధించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను.

*************

అనేక విషయాలను పాటించే ఆసక్తి ఉన్నవారు పాటించవచ్చు. అయితే, అందరూ పాటించలేకపోవచ్చు. ఎవరి పరిస్థితి వారిది.

 పాతకాలంలో ఇన్నిరకాల విషయాలు అందరూ పాటించేవారు కాదు.    కొన్ని విషయాలలో వారి వంశాచారం ప్రకారం ..వారి పెద్దవారిని అడిగి పాటించేవారు.   

 

కొందరు.. కోరికలు, కష్టాలు.. తీరాలంటే ఇలా చేయండి..అంటూ అనేక పద్ధతులను చెబుతారు.  సోషల్ మీడియాలో ఉండాలంటే..  ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి,   కొందరు ఎప్పుడూ ఏదో ఒకటి   చెబుతున్నారు. వీటివల్ల  కూడా  హిందువులు మరింత అయోమయంలో ఉంటున్నారు.   ఇవన్నీ ఎప్పుడు పరిష్కారమవుతాయో?

******************

హిందువులలోనే కొందరు, మా దేవత గొప్ప అంటే.. మా దేవతే గొప్ప అంటూ.. గొడవలు పడ్డారు. గొడవలు పడే హిందువులవల్ల హిందుమతానికి నష్టం జరిగింది. అలాంటివారు హిందువుల బాగోగుల గురించి పాటుపడుతున్నామనటం విచిత్రం.

 
హిందువులు  అభివృద్ధి చెందాలంటే, కొన్ని విషయాలను  సరిదిద్దుకోవాలి. హిందువులలో ఐక్యత ఉండాలి.   వైష్ణవులు, శైవులు, శాక్తేయులు..అంటూ  గొడవలు పడకూడదు.   

 అంటరానితనం..వంటివి కూడా ఉండకూడదు. మూఢనమ్మకాలను వదిలేయాలి. ఆచారవ్యవహారాలను విచక్షణతో ధర్మబద్ధంగా పాటించవచ్చు.

 

 ఒకే హిందూ మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి.   ఆచారవ్యవహారాల విషయంలోను అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.

 ***********

 భారతీయులలో ఐకమత్యం లేకపోవటం వల్ల, భారతీయుల అతి సహనశీలత వల్ల విదేశీయులు ఇక్కడకొచ్చి ఈ దేశాన్ని అనేకసంవత్సరాలు పాలించారు. ఇప్పటికీ భారతీయులలో ఐకమత్యం అంతగా లేదు. విదేశీమతాలవాళ్ళు ఇక్కడకొచ్చి ఇక్కడి వారిని మతాలమార్పిడి చేస్తున్నా కూడా  పట్టించుకోవటం లేదు. పరిస్థితి ఏమవుతుందో ? 

 

మన బలహీనతలను మనం సరిదిద్దుకోకుండా.. అంతా అవతలవారివల్లే అనుకోవటం కన్నా,  తమ బలహీనతలను సరిదిద్దుకుంటే బలవంతులవుతారు. తాము బలవంతులయితే శత్రువులను తేలికగా జయించగలరు.

 ************

పరమతసహనం కొందరికి ఉంటే సరిపోదు..అందరికీ ఉండాలి. మతాల పేరుతో జరుగుతున్న దారుణాలను గమనిస్తే అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో? ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో? దైవానికే తెలియాలి.

***********

వేదములు, పురాణేతిహాసాలు ..ఎంతో గొప్పవి. వేదాలు, పురాణేతిహాసాల ద్వారా ఎన్నోవిషయాలను తెలుసుకోవచ్చు.  

 పురాణేతిహాసాల ద్వారా..జీవితంలో ఎలా ప్రవర్తించితే ఎలాంటి ఫలితాలుంటాయి. ఏది ధర్మం.. ఏది అధర్మం.. ఎలా ప్రవర్తించాలి.. ఎలా ప్రవర్తించకూడదు.. ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలుంటాయి..వంటి విషయాలను కూడా పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా ప్రాచీనులు మనకు తెలియజేసారని నా అభిప్రాయము. 

 

ఒక్కో యుగంలో దైవం అవతారాలను ధరించినప్పుడు, ఆ అవతారాలను పూజిస్తారు.  హిందువులు, తరతరాలనుంచి ఎందరినో  దేవతలుగా పూజిస్తున్నారు.

 

హిందువులకు చాలామందిదేవతలు ఉన్నా కూడా, కొత్తవాళ్ళను ఎందుకు పూజిస్తున్నారంటూ కొందరు మాట్లాడుతున్నారు. అయితే, క్రొత్త దేవతలను ఆరాధించటం హిందువులకు క్రొత్తకాదు.

 

 ప్రాచీనగ్రంధాలలో లేని దేవతలు ఎందరినో ఇప్పుడు దేవతా అవతారాలుగా పూజిస్తున్నారు. ఉదా.. కొందరు గొప్పవారు మానవులుగా జీవించినప్పుడు గొప్పమహిమలు కలిగి ఉంటారు. అలాంటి కొందరి శరీరత్యాగం తరువాత, వారిని కూడా దేవతలుగా గుడికట్టించి పూజిస్తున్నారు. వారి పూజా విధానాలు ఏర్పరుస్తారు.



మహిమలు గలవారు గొప్పవారే.. దేవతలవంటివారే. వారిని గౌరవించవలసిందే. అయితే, ఇలా  హిందువులకు మరింత ఎక్కువమంది దేవతలు పెరుగుతారు. భవిష్యత్తులో ఇంకా ఎందరిని దేవతాస్వరూపాలుగా

పూజిస్తారో
.. చెప్పలేము.


 అనేకమంది దేవతలు ఉన్నా కూడా, అవధూతలను, ఇంకా చాలామందిని పూజిస్తుంటారు. అవధూతలు వంటివారు గొప్పవారే. అలాగని అవధూతలు ఎవరైనా పరమపదించితే వారి విగ్రహాలను తయారుచేసి దేవతలుగా పూజలు మొదలుపెడితే .. బోలెడు పూజలు, బోలెడు ఆచారవ్యవహారాలు అవుతాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.

 

దైవం సృష్టి అంతటా ఉంటారు. అలాగని ప్రతి జీవినీ దైవంగా భావించి విగ్రహాలు చేసి, గుడులు కట్టి పూజించలేరు కదా.. దైవాన్ని ఒకమహాశక్తిగా భావించి చక్కగా ఆరాధించుకోవచ్చు. 

ఏ దేవతను పూజించినా.. ఉదా..అమ్మవారిని పూజించినా..శివుణ్ని పూజించినా.. విష్ణువును పూజించినా.. ఒకే దైవశక్తిగా భావించి పూజింవచ్చు.  

అందరు దేవతలలో ఒకే దైవశక్తిని భావించి పూజించవచ్చు. ఒకే దైవంలో అందరు దేవతలను భావించి పూజించవచ్చు.

 

శ్రీరాముడు హనుమంతుని మధ్య గల ఆప్యాయత అందరికి తెలిసిందే. హనుమంతుడు శివుని అంశ కలవారు. శిశువును కంసుడు చంపడానికి పైకి విసిరేయగా, ఆ శిశువు యోగమాయగా ప్రత్యక్షమయ్యి.. కొన్ని విషయాలను పలికి అదృశ్యమవుతారు. అమ్మవారు(యోగమాయ).. శివుడు.. విష్ణువు..వీరందరూ ఒకటే. వీరు వేరువేరు ..అని మనుషులు గొడవలు పడకూడదు.

హిందువులు ఇంకాఇంకా ..కొత్త  పూజావిధానాలను  పెంచుకుంటూ వెళ్తే, భవిష్యత్తులో భక్తుల మధ్య గొడవలు వచ్చి, వివిధ శాఖలుగా చీలే అవకాశమూ ఉంది. ఇప్పటికే హిందువులు బౌద్ధులు, జైనులు..ఇంకా కొన్ని శాఖలుగా అయ్యారు.


ఇప్పటికే ఒకే మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. పూజా విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆచారవ్యవహారాల విషయంలోను   అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.

 

దైవశక్తిని చక్కగా పూజింవచ్చు. భవిష్యత్తులో అయినా మరింతగా  పూజావిధానాలను  పెంచుకోకుండా పూజించుకుంటే  సరిపోతుంది.  వేదములలో, పురాణేతిహాసాలలో, ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో.. చెప్పబడిన దేవతలను చక్కగా పూజించుకుంటే చాలా గొప్ప. 

 

ఇంకా కూడా కొత్తగా పూజించాలంటే, వారిని  వేదములలో.. పురాణేతిహాసాలలో.. ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో..చెప్పబడిన దేవతాస్వరూపాలుగా భావించి, ఒకరితోఒకరు గొడవలు లేకుండా, హిందుమతంలో మరిన్ని విభజనలు జరగకుండా పూజించుకోవాలి.

 

 పూజించటానికి  ప్రాచీనులు తెలియజేసిన దేవతలు ఉన్నారు... కఠినమైన ఆచారవ్యవహారాలను పాటించి పూజలు చేయకపోయినా, దైవాన్ని నమ్మి,  చక్కగా ప్రేమగా స్మరించుకోవచ్చు.

 

ఈ రోజుల్లో కొందరు తాము దైవాంశగలవారమని, ప్రజల కష్టాలు తీరుస్తామని మోసం చేస్తున్నవారూ ఉన్నారు. ఇలాంటివారు తామే దేవుళ్ళమన్నట్లు పూజలు కూడా జరిపించుకుంటుకున్నట్లు వార్తల ద్వారా తెలుస్తోంది. ఇలాంటివారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు తమ వ్యాపారాల కొరకు కొత్తగా  పూజలను పెంచుతున్నారనిపిస్తోంది.

 

ఎవరిని ఏ విధంగా  పూజించాలి ? అనే విషయాల గురించి  బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. హిందుత్వానికి నష్టం జరగకుండా ఉండాలి.

మాజంలో అనేక అభిప్రాయాలుంటాయి.  కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి. కొన్నిసార్లు ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదు. ఇలాంటి పరిస్థితిలో దైవమే దారి చూపాలి.

 **********

ప్రపంచంలో కొందరు మనుషుల ఆలోచనలు గమనిస్తే , ప్రపంచం ఎటుపోతుందో అర్ధంకావటంలేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. అందువల్ల, ఎవరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. దైవమే దిక్కు.
......

ఈ పోస్ట్ చాలా పెద్దగా అయ్యింది .

*************

  అందరూ దైవభక్తిని కలిగి..ధర్మముగా
జీవించడానికి ప్రయత్నించాలి.


ప్రాచీనకాలంలో ప్రపంచంలో చాలావరకు ఒకే పోలికలున్న మతం...

 

  ప్రాచీనకాలంలో... ప్రపంచంలో  చాలావరకు ఒకే పోలికలున్న పద్ధతి ఉండేదేమో అనిపిస్తుంది.   విదేశాల్లో ప్రాచీన ఆనవాళ్ళకు.... భారతీయ సంస్కృతికి పోలికలు ఉన్నాయని కొందరు కనుగొన్నారట. 

 
విదేశీ పేర్లకు మన దేశంలో కొన్ని పేర్లకు దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపిస్తాయి. ఉదా..విదేశాల్లో కొందరికి స్మిత్ అనే పేరు ఉంటుంది. మనదేశంలో కూడా స్మిత అనే పేరు ఉంటుంది.

పేర్లు అన్నీ మరీ ఒకేలా ఉండకపోవచ్చు. కాలక్రమేణా పేర్లలో మార్పులు వచ్చి ఉండవచ్చు.

మనదేశంలో కొన్ని ఊర్లకు ఆ పేర్లు రావడానికి వెనుక కొన్ని కధలు చెబుతారు. ఆ పేర్లు కాలక్రమేణా కొన్ని మార్పులు చెందాయని చెబుతుంటారు.

 *********
 మెక్సికో, ఇరాన్లో కొన్ని జాతులు, గ్రీక్, ఈజిప్ట్..ఇలా అనేకదేశాల సంస్కృతికి భారతీయ సంస్కృతికి ఉన్న పోలికలను తెలియజేస్తున్నారు.

links....