ఆహారం తగినంతలో సరైన విధంగా తీసుకోవాలి.
కొందరు పండ్ల రసం మంచిదని భావించి రోజూ కొన్ని గ్లాసుల పండ్ల రసం త్రాగుతారు.
పుల్లటి పండ్ల రసం అధికంగా త్రాగితే అనారోగ్యం కలిగే అవకాశం ఉంది.
ఉదా .. ఒకే రోజు నాలుగు గ్లాసుల పుల్లటి పండ్ల రసం మరియు టమేటో సాస్ ఎక్కువగా తీసుకుంటే, శరీరానికి అవసరం అయినదానికన్నా ఎక్కువగా సి విటమిన్ చేరుతుంది.
పండ్ల రసంలో నీరు కలిపి త్రాగటం మంచిది.
ఈ రోజుల్లో టమెటో వాడకం కూడా బాగా పెరిగింది.
పులుపు మరీ ఎక్కువైతే యాసిడ్ పెరిగి కిడ్నీలు పాడవటం, కడుపులో అల్సర్లు వంటి జబ్బులు వచ్చే ప్రమాదముంది.
కొందరు విటమిన్ టాబ్లెట్లు మంచిదని ఎక్కువగా వాడతారు.
విటమిన్లు అయినా సరే, మోతాదు మించితే అనర్ధాలు వచ్చే అవకాశముంది.
సోయా కూడా మోతాదు వరకు తీసుకుంటేనే మంచిది.
మోతాదు మించితే అనారోగ్యమని చెబుతున్నారు.
పసుపు, చింతపండు, అల్లం, వెల్లుల్లి కూడా వంటల్లో విస్తారంగా వాడకూడదు. తగుమోతాదులో మాత్రమే వేయాలి.
ఆహారం ఎలా ఉంటే మంచిదో.. పూర్వీకులు తెలిపిన విషయాలు మరియు ఇప్పటి నిపుణుల నుండి తెలుసుకుని వాడాలి.
No comments:
Post a Comment