koodali

Sunday, March 18, 2018

ఓం,

ఓం,

దైవానికి  అనేక  వందనములు,


సుధా సముద్రములో, మణిద్వీపములో, చింతామణిగృహములో నివసించే ఆదిదంపతులైన  పరమాత్మకు {శ్రీమన్మహాదేవుడుశ్రీమన్మహాదేవి} వందనములు.


అందరికి శ్రీ  విళంబి  నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలండి.

వసంత  నవరాత్రులు  ప్రారంభమయ్యాయి.

మహారాష్ట్రీయులు  ఏ  శుభకార్యక్రమము  ప్రారంభించిన  ప్రప్రధమమున  శ్రీ  గణపతి దేవునితో  సహా  నవగ్రహాలు, ముఖ్యముగా  శనేశ్వరుణ్ణి  పూజించటము  అనాదిగా  వస్తున్న  సుసంప్రదాయము.

 చైత్రశుద్ధ  ప్రతిపాదా  (  గుడిపాడువ  )   అంటే  ఉగాది  పర్వదినమున శని శింగణాపూర్  లో  విశేష  ఉత్సవాలు  జరుగుతాయట.

నూతన  సంవత్సరములో  ఆటంకాలు, అవరోధాలు,  కష్టనష్టాలు తొలగించి  సుఖశాంతులు  ప్రసాదించుమని  ఆ  కరుణాలవాలను భక్త  సముదాయము  శిరోధార్యులై  వేడుకుంటారట. 


అందరికి   శ్రీ  విళంబి  నామ సంవత్సర 
ఉగాది శుభాకాంక్షలండి.
***************

( 2014 సంవత్సరములో వ్రాసిన ఉగాది పోస్టులోని విషయములతో..  ఇప్పటి తెలుగు సంవత్సరము   పేరు  వేసి  పోస్ట్ చేయడమైనది.)




No comments:

Post a Comment