koodali

Monday, December 29, 2014

హరిశ్చంద్రుని కధ చదివి..


హరిశ్చంద్రుని కధ చదివి.. సత్యం కోసం అన్ని కష్టాలు పడటం ఎందుకు ?  అనుకుంటున్న వాళ్ళూ ఈ సమాజంలో  ఉన్నారు.

చిన్న  అబద్ధమే కదా అనుకుంటే అదే అలవాటై ఒకరిని చూసి ఒకరు  అంతా అబద్ధాలే  చెబితే  సమాజంలో ఎన్నో గొడవలు మొదలవుతాయి. అసత్యం  విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి..మొదలే  దానిని అరికట్టాలి.       

( అయితే కొన్ని సందర్భాలలో, ఉదాహరణకు అన్యాయంగా ప్రాణాలకు హాని కలిగే సమయాలలో అసత్యం చెప్పినా ఫరవాలేదని మినహాయింపును ఇచ్చారు పెద్దలు.. ఇలాంటి  సందర్భాలలో  విచక్షణ ప్రకారం నడుచుకోవాలని పెద్దలు సూచించారు.)

 సత్యం విలువ ఎంతో  గొప్పది.  రాజే  అసత్యవంతుడైతే, యధారాజా తధాప్రజా  అన్నట్లు ...సమాజం  అంతా అబధ్ధాలు, మోసాలతో  అస్తవ్యస్తమైపోతుంది.

 లోకహితం కోసం, లోకానికి సత్యం యొక్క విలువను తెలియజెప్పటం కోసం  హరిశ్చంద్రుడంతటి వారు ఎన్నో కష్టాలను సహించారు. నేను రాజును కదా, సత్యం కోసం ఎందుకు కష్టాలు పడాలి ? అని వారు అనుకోలేదు.

ఈ విషయం గురించి మరిన్ని  వివరాలను  చదవాలనుకుంటే  దయచేసి  ఈ  లింకుల  వద్ద  చదవగలరు..  

No comments:

Post a Comment