ప్రజల మంచికోసం ప్రాచీనులు ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను తెలియజేసారు.
అయితే , ఆధునిక కాలంలో కొందరు ఆచారవ్యవహారాలను కొత్తగా మార్చుకుంటూ , తమకుతామే మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుంటున్నారు.
ఆధునిక కాలపు పరిస్థితులను ఊహించిన పూర్వీకులు ఎన్నో విషయాలను తెలియజేసారు.
ఉదా..కలికాలంలో కేవలం దైవనామాన్ని స్మరిస్తే చాలు ..గొప్ప ఫలితం లభిస్తుందని కూడా సడలింపులను తెలియజేయటం జరిగింది.
**************
ఆచారవ్యవహారాలలో ఏమైనా పొరపాట్లు వస్తే కష్టాలు వచ్చే అవకాశముందని కొందరు చెప్తుంటారు. ఇవన్నీ వింటుంటే భయంగా ఉంటుంది.
ఇలాంటప్పుడు దైవంపై ధ్యాస కన్నా ...ఆచారవ్యవహారాలను పాటించటానికి ఎక్కువ దృష్టి పెట్టవల్సి వస్తుంది.
ఆచారవ్యవహారాలను పాటించటం అవసరమే కానీ , దైవంపై ధ్యాస ఎంతో ముఖ్యం కదా!
మూఢత్వం పెంచే విధంగా కాకుండా, విచక్షణతో పాటిస్తూ.. దైవం పై ధ్యాస పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలన్నది నా అభిప్రాయం.
ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించాలనుకుంటూ విసుగు వచ్చేలా చేసుకోవటం కాకుండా..తమశక్తికి తగినంతలో పూజలు చేయవచ్చు.
***************
పెద్దలు తెలియజేసిన ఒక కధ...
ఒక భక్తుడు భక్తి పారవశ్యంలో పూజ చేస్తూ దైవానికి అరటిపండ్లను నివేదించబోయి, భక్తి పారవశ్యంలో అరటిపండ్లను ప్రక్కన పడవేసి వాటి తొక్కలు తీసి దైవానికి నివేదిస్తారు.
ఆ భక్తుని భక్తికి మెచ్చిన దైవం అతనికి దర్శనాన్ని అనుగ్రహించారని అంటారు.
తరువాత కొంతసేపటికి భక్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకుని..
ఈ సారి పొరపాటు రాకుండా పూజ చేయాలనే తాపత్రయంలో భక్తి కన్నా, పూజను చేసే విధానంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగా ఈసారి దైవం ప్రత్యక్షం కాలేదట.
ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే, పూజా విధానాలను, ఆచారవ్యవహారాలను చక్కగా పాటించటం మంచిదే కానీ, దైవంపై భక్తి అన్నింటికన్నా ముఖ్యం.. అని గ్రహించాలి.
శక్తి ఉన్నవారు ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించుకోవచ్చు.
అంత ఓపిక లేనివారు తమకు వీలున్నంతలో పాటించుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు.
************
మరికొన్ని విషయాలు..
కొందరు ... గ్రంధాలలోని విషయాల గురించి వాళ్ళకు తోచినట్లు చెబుతున్నారు.
గ్రంధాలలో కొన్ని విషయాలు ...ఉదా..ఎవరైనా స్త్రీలు, కోరి పరాయి పురుషుల వద్దకు వస్తే, వారిని తిరస్కరించకుండా ఆ స్త్రీ కోరికను పురుషుడు తీర్చాలని ఉన్నదట.
ఇంటికి వచ్చిన అతిధి ఇంటి ఇల్లాలిని కోరుకుంటే, ఆమెను ఆ అతిధి వద్దకు పంపించాలని ఉన్నదని కొందరివ్యాఖ్యలను చదివాను.ఉదా..ప్రాచీనకాలంలో శ్వేతకేతు కధలోని విషయాలు.
ఇవన్నీ మూఢనమ్మకాలే. గ్రంధాలలో ఇలాంటి సంఘటనలను కొందరు చేర్చి ఉండొచ్చు. గ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని అందరికి తెలుసు. కొందరు తమకు నచ్చిన విషయాలను గ్రంధాలలో వ్రాసి ప్రక్షిప్తాలు చేశారనిపిస్తుంది.
ఇలాంటివాటిని ప్రోత్సహిస్తే, ఇవన్నీ ఉదాహరణగా చూపుతూ కొందరు స్త్రీలు, పురుషులు విచ్చలవిడిగా తిరుగుతారు. అందువల్ల, ఇలాంటి విషయాలను సమర్ధించకూడదు.
ధర్మబద్ధంగా
వివాహం చేసుకున్న భార్యాభర్తలకు సంసారం చేయడానికి మాత్రం.. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి..అంటూ
అనేక ఆంక్షలు చెబుతారు. అక్రమసంబంధాలుగా ఉన్న వాటికి మాత్రం సరైనదే అంటూ
సమర్ధించటం ఏం న్యాయం?
ప్రాచీనకాలంలో
కొందరు కొంతకాలం ఇలాంటి ఆచారాలను పాటించినట్లు, కాలక్రమేణా ఈ ఆచారవ్యవహారాలను
సంస్కరించుకుని, పాటించటం మానేసినట్లు చెబుతున్నారు. ఏకపత్ని, ఏకపతి ...పద్ధతులను పునరుద్ధరించి ఉండవచ్చు.
కొందరు
గొప్పవారు కూడా కొన్ని మూఢనమ్మకాలను పాటించినట్లు అనిపిస్తుంది.కొందరు
కొన్ని విషయాలలో ఎంతగొప్ప అయినాకూడా, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొందరికి
కొన్ని బలహీనక్షణాలలో పట్టుతప్పవచ్చు.
వేదాల్లో ఏకపత్ని, ఏకపతి...గురించిన విషయాలున్నాయట...
మన వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది. భార్యను " అర్ధాంగి ' అంటారు. అంటే భర్తలో సగభాగం అని అర్ధం. వివాహం తరువాత భార్యాభర్తల శరీరాలు వేరైనా వారు ఒకటే . అని పెద్దలు చెబుతారు కదా !
ఒకరికొకరు అర్ధభాగాలైన భార్యాభర్తల జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించటం జరగదు. పెద్దలు ఏర్పరిచిన వివాహమంత్రాలు, నాతిచరామి...వీటిని పరిశీలిస్తే పెద్దల అభిప్రాయం మనకు తెలుస్తుంది.
ఇవన్నీ గమనిస్తే బహువివాహాలను పెద్దలు సమర్ధించలేదనిపిస్తుంది. ( అయితే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటే, భార్య మరణించినప్పుడు, భార్య ఇతరులను వివాహం చేసుకున్నప్పుడు...ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేరొక వివాహం చేసుకోవచ్చేమో..)
పురాణేతిహాసాల్లో ఎక్కువవివాహాలు చేసుకున్న వారి గురించిన విషయాలున్నాయి. వారు అలా చేసుకోవటానికి వెనుక ఎన్నో కారణాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ( అవన్నీ గమనించి మనం జీవితంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దల అభిప్రాయం కావచ్చు.)
పర స్త్రీ తల్లి వంటిదని పెద్దలు చెప్పటం జరిగింది. అలాంటప్పుడు, ఇంటికి వచ్చిన అతిధి , ఇల్లాలిని కోరుకోవటాన్ని పెద్దలు అస్సలు సమర్ధించరు. అతిధి మర్యాదలకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా !
ఎవరు కోరుకుంటే వారి కోరికలు తీర్చాలంటే ఇక వివాహవ్యవస్థ ఎందుకు? కుటుంబవ్యవస్థ ఎందుకు?
వివాహం మరియు కుటుంబవ్యవస్థకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిన వ్యవస్థ మనది.
అందువల్ల,
ఇలాంటి మూఢనమ్మకాలను, ప్రక్షిప్తాలను గుర్తించి వదిలిపెట్టాలి. అంతేకానీ,
వాటిని సమర్ధించి.. పాటించాలనుకుంటే కుటుంబవ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది.
హత్యలు, ఆత్మహత్యలు జరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. గ్రంధాలలో ఉన్నాయి
కాబట్టి, వాటిని ఎలాగైనా బలపరచాలనుకోవటం తప్పు.
సనాతనధర్మం మూఢత్వాన్ని, విచ్చలవిడితనాన్ని.. ఒప్పుకోదు.
************
ఈ రోజుల్లో కొందరు ఏమంటారంటే, మర్చిపోతారేమోనని గుర్తుచేస్తున్నామంటూ..రోజూ ఏదో ఒక పూజ గురించి చెబుతూ నియమాలు పాటించాలని చెబుతుంటారు.
రోజూ ఏదో ఒక పూజ అంటే, ఇక భార్యాభర్తలకు సంసారం ఎప్పుడు చెయ్యాలో తెలియక భయంగా ఉంటుంది. రోజూ బ్రహ్మచర్యం..వంటి నియమాలు పాటిస్తే ఇక హిందువులు అందరూ సన్యాసుల్లా బ్రతకాలో ఏమిటో?
రోజూ పూజలు చేసినా కూడా బ్రహ్మచర్యం వంటి నియమాలు రోజూ పాటించనక్కరలేదు. ముఖ్యమైన కొన్ని పూజలకు, పండుగలకు.. ఉపవాసం, బ్రహ్మచర్యం..వంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది.
****************
భార్యాభర్త
చక్కగా అన్యోన్యంగా ఉంటే అక్రమసంబంధాలు చాలావరకు తగ్గుతాయి.కుటుంబాలూ
బాగుంటాయి.. తద్వారా సమాజం కూడా బాగుంటుంది. సంసారంలో అతి లేకుండా
ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకోవచ్చు.
బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం,
వానప్రస్తం, సన్యాసాశ్రమం..గురించి ప్రాచీనులు తెలియజేసారు. సన్యాసాశ్రమంలో
అడవులకు వెళ్ళలేకపోయినా, ఇంట్లో ఉండి కూడా లౌకికవిషయాల పట్ల ధ్యాసను
తగ్గించుకుని, మనస్సును ఎక్కువగా దైవస్మరణతో గడపవచ్చు.
సమాజం
సజావుగా సాగాలంటే అనేక వృత్తులు అవసరం. ప్రాచీనులు అనేక వృత్తుల గురించి
తెలియజేసారు. అలాంటి వ్యవస్థను ఏర్పరిచారు. కొన్ని వృత్తులవారు అనేక నియమాలను పాటిస్తూ.. ..బోలెడుసమయం
కూర్చుని పూజలు చేయాలంటే చేయలేరు. ఇవన్నీ ఆలోచించి, సమాజక్షేమం కొరకు
ఎక్కువసేపు పూజలు చేయడానికి కొందరు ఉండాలని భావించి, అలాంటి పద్ధతిని కూడా
ఏర్పరిచారు.
సమాజంలో లౌకికమైన విషయాలను ఎవరూ పట్టించుకోకుండా ఉంటే ఎలా.. శత్రువులను ఎదుర్కోవాలి ....కుటుంబనిర్వహణకు అవసరమైన వస్తువులను తయారుచేయాలి .....వ్యవసాయం, వ్యాపారం, చేతిపనిముట్లు....ఇవన్నీ చేయాలి కదా..
ఇవన్నీ ఆలోచించి ప్రాచీనులు ఎన్నో వృత్తుల గురించి తెలియజేసారు. ఎవరు చేసే పనిని వారు చక్కగా చేయాలని తెలియజేసారు.
ఉదయం
కొంతసేపు పూజ చేసుకుని, తరువాత ఎవరి పనిని వారు చక్కగా చేస్తే అది కూడా
పూజయే.. అని తెలియజేసారు. అప్పుడప్పుడు పండుగలు , కొన్ని ప్రత్యేకమైన పూజలు,
వ్రతాలు అందరూ చేసుకోవచ్చు.
వేదాలు ఎంతో గొప్పవి. అలాంటి వేదాలను
కూడా కొందరు రాక్షసులు ఎత్తుకుపోతే.. దైవం రాక్షసులను వధించి, వేదాలను
తిరిగితీసుకువచ్చినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది. వేదాలు ఒక పద్ధతి ప్రకారం ఉంటాయని, ఎవరూ మార్చడానికి వీలు ఉండదని ..తెలిసినవారు చెబుతున్నారు.
గ్రంధాలు మాత్రం ఎవరైనా మార్పులుచేర్పులు చేసే అవకాశం ఉందని.. తెలిసినవారు చెబుతున్నారు. ప్రాచీనకాలం నుంచి కొందరు
స్వార్ధపరులు, కొందరు తెలిసితెలియనివాళ్లు, కొందరు అతి భయస్తులు..
గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు చేసి ఉంటారు.
అందువల్ల, జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలో అర్ధం కానప్పుడు దైవాన్ని ప్రార్ధించుకోవాలి.
************
oka link
* ఓం ..నిష్కామ కర్మ యోగం అద్భుతమైన మార్గం..