koodali

Saturday, March 24, 2018

ఓం ...కొన్ని విషయాలు...మనుషులు మాంసాహారాన్ని తినటం గురించి...



రాబోయే  శ్రీ రామనవమి సందర్భంగా  శుభాకాంక్షలండి.  
.............................
marikonni vishayaalu..  
 
 2026 సెప్టెంబర్ లో ఒక చానల్ వారు, మనుషులు మాంసాహారాన్ని తినటం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని, కొన్ని విషయాలను తెలియజేసారు.  మాంసాహారాన్ని తినకపోతే ఎలా అంటూ..ఒకరు కామెంట్ రాసారు..

 ఆ కామెంట్ చదివి నాకు కలిగిన ఆలోచనలతో ఈ విషయాలను రాసి ఇక్కడ పోస్ట్ చేసాను. 


మనుషులు మాంసాహారాన్ని తినటం గురించి కొందరు ఎలా చెబుతున్నారంటే, మనుషులు పశుపక్ష్యాదులను చంపి తినకపోతే వాటిసంఖ్య బాగా పెరిగిపోతుందట. మనుషులు శాకాహారమే తింటే, అంత ఆహారం ఎక్కడినుంచి వస్తుందీ..అంటున్నారు.
.............................................
ఇక్కడ విషయం ఏమిటంటే, మనుషులు వాటిని చంపి తినకపోయినా వాటి సంఖ్య విపరీతంగా పెరగదు. అలా పెరగకుండా ప్రకృతిలో సహజమైన ఏర్పాటు  ఉంది.

సృష్టిలో...
మొక్కలు బాగాఎక్కువగా పెరగకుండా శాకాహారజంతువులైన కుందేళ్లు, మేకలు, ఆవులు, గేదెలు, ఏనుగులు..ఉన్నాయి.
శాకాహారజంతువుల సంఖ్య బాగాఎక్కువగా పెరగకుండా వాటిని తినే మాంసాహార జంతువులున్నాయి.
మాంసాహార జంతువులు బాగాఎక్కువగా పెరగకుండా తమలో తాము దాడి చేసుకుని కూడా చనిపోతాయి.
ఉదా..సింహాలు మధ్య, తోడేళ్లు గుంపుల మధ్య దాడులు జరుగుతాయట.

ప్రకృతిలో సహజంగా ఉండే వ్యవస్థలో, జీవజాతులు విపరీతంగా పెరగకుండా వ్యవస్థ ఉంది.మనుషులు ఆ వ్యవస్థను పాడుచేసారు.
...........................
 వాటి సంఖ్య పెరగకుండా, మనుషులు పశుపక్ష్యాదులను అడవుల్లో నుంచి పట్టుకుని తెచ్చి తినటంలేదు కదా..

 మనుషులు మాంసాహారం తినడం కొరకు..కోళ్లను, మేకలను, గొర్రెలను, కుందేళ్లను, ఆవులను, గేదెలను ఫాంస్ లో పుట్టించి, పెంచి తింటున్నారు. అలా వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వాటిని పెంచడానికి మరింత నీరు, ఆహారం (గడ్ది,మొక్కలు..) అవసరం అవుతుంది.

సహజంగా ప్రకృతిలో,  కోట్లాది జనాలకు రోజూ తినడానికి సరిపడా మాంసాహారం పెద్ద ఎత్తున దొరకదు కదా..అందుకే ఫాంస్ లో 
పెద్ద ఎత్తున  పెంచి, చంపి తింటున్నారు.

అలా పశుపక్ష్యాదులను పెద్ద ఎత్తున ఫాంస్ లో పెంచటం ద్వారా..ప్రకృతిలో జీవులసంఖ్య విపరీతంగా పెరగకూడదనే సహజమైనవ్యవస్థను పాడుచేసారు.

.....................................
ప్రపంచవ్యాప్తంగా జనం రోజూ ఎన్నో లక్షల, కోట్ల పశుపక్ష్యాదులను, చంపి తింటున్నారు. కొందరు కీటకాలను, పాములనుకూడా తింటారట. ప్రతిది తినటమే, ప్రపంచంలో ఉన్న జీవులన్ని మనుషుల కొరకు మాత్రమే ఉన్నాయి..అని అనుకుంటున్నారు కాబోలు.
..............................

మనుషులకు శాకాహారం సరిపోదంటున్నారు. మరి, మాంసాహారం కొరకు ఫాంస్ లో పెంచే లక్షల ..మేకలు, కుందేళ్లు, ఆవులు, గేదెలకు పెట్టడానికి చాలా గడ్డి, మొక్కలు కావాలికదా. అదంతా ఎలా తెస్తారు?
 
 ఉదా..ఒక్కో గేదెకు ప్రతిరోజు కొన్ని కిలోల గడ్డి అవసరమవుతుంది.

శాకాహారాన్ని తెచ్చి పశుపక్ష్యాదులకు తినిపించి, వాటిని చంపి తినేబదులు, శాకాహారాన్నే తినవచ్చు కదా.
..................................
భూమిపైన చాలామొక్కలు పెంచవచ్చు. ఆహారధాన్యాలు పాడుకాకుండా సరిగ్గా నిల్వ ఉంచుకోవాలి. ధాన్యం గోడవున్లలో బూజుపట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి.
.............................
 మనుషులు జనాభా బాగా పెరిగింది. మనుషులు అవసరమైనదానికంటే ఎక్కువ తింటున్నారు.  అతిగా తినటాన్ని తగ్గించాలి.
...........................
 కొందరు ఇంకా ఏమంటున్నారంటే, మనుషులు చేపలను తినకపోతే, చేపలు పెరిగిపోతాయట.

చేపలు పెరిగి ఊళ్లపైకి రావులెండి. సృష్టిలో చిన్నచేపలను తినటానికి పెద్దచేపలు, వాటిని తినడానికి తిమింగలాలు ఉంటాయి.

మనుషులు తమ ఇష్టారాజ్యంగా చేపలను, తిమింగలాలను చంపుతున్నారు. అడవుల్లో చెట్లను కొట్టేస్తున్నారు. అడవుల్లో జంతువులను చంపేస్తున్నారు. అందుకే 
 జంతువులు ఊళ్లపైకి వస్తున్నాయి.
..................................
పాతకాలంలో మనుషుల ద్వారా ఇంత జీవహింస జరిగేది కాదు. ఇప్పుడు టెక్నాలజి సాయంతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. టెక్నాలజి సాయంతో పశుపక్ష్యాదులను సులభంగా చంపి,  తింటున్నారు. 
 
టెక్నాలజి పేరుతో మనుషులు చేసే వాతావరణకాలుష్యం వల్ల ఎన్నో జీవజాతులు అంతరించే స్థాయికి చేరుకున్నాయి.
................................
ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తుందంటే,  ప్రపంచం బాగుండాలంటే, మనుషుల జనాభా తగ్గాలనిపిస్తుంది.  అప్పుడే ఇతరజీవులు కూడా ఊపిరి పీల్చుకుంటాయి.

 మనుషులు చేసే పనుల వల్ల ప్రపంచంలో సమతుల్యత దెబ్బతింటోంది. ఇంకా, బాగా మాంసాహారాన్ని తినడానికి సాకులు చెబుతున్నారు.
.....................................................................................................
హిమాలయాల వద్ద కొందరు తపస్సు చేసుకుంటారట. అక్కడ అంత చలిలో కొందరు చాతీపైన వస్త్రం లేకపోయినా తిరుగుతారు.  సామాన్యులు కోట్లు వేసుకున్నా కూడా చలి ఉంటుంది.
 
 మరి, ఆ తపస్వులు మాంసాహారాన్ని తినకపోయినా కూడా, శక్తికలిగి ఉంటారు.బహుశా,ఆ తపస్వులు, దైవశక్తి వల్ల..యోగావల్ల అలా శక్తికలిగి ఉంటారు కావచ్చు.

సూర్యరశ్మిలో డి విటమిన్ లబిస్తుంది. ఇంకా, సూర్యరశ్మి ద్వారా చాలా శక్తి వస్తుంది.అందుకే, ప్రతిరోజు ఉదయం, సాయంకాలం కొంతసేపైనా సూర్యరశ్మి తగలాలి.

..........................................................................
పాతకాలంలో ఇప్పటిలా వాహనాలు లేవు.  కాలుష్యం ఉండేది కాదు, బోలెడు కాంక్రీట్ భవనాలు లేవు. 
వాళ్లు  వ్యవసాయంలో ఉపయోగం కొరకు ఎద్దులను పెంచటం మొదలుపెట్టారు. పశువులు తరువాత తరం పెరగాలంటే ఎద్దులు, ఆవులు కావాలి.. 
 
వాళ్లు పశువులను మంచిగా చూసుకునేవారట.  ఆవులను, ఎద్దులను చంపితినటానికి పెంచేవారు కాదు.   వాళ్లు  జంతువులను తమ అవసరాలకొరకు కొంతవరకుపెంచటం జరిగింది.

అయితే, ఆవులకు ప్రత్యేకమైన శక్తి ఉందని, వాటివల్ల పర్యావరణానికి ఉపయోగమని అంటారు.   పాతకాలంలో పశుసంపద అంటే, దేశవాళి గోవులను పెంచటం(దేశవాళి గోవులు వృషభాలు.).
 
అంతేకాని  మేకలను, గొర్రెలను, గేదెలను,  కోళ్లను, కుందేళ్లను లక్షలుగా పెంచి, రోజూ చంపి తినటం కాదు.
క్రమంగా మనుషులు తిరగటానికి  గుర్రాలను పెంచటం మొదలయ్యింది.  గుర్రాలను అందరూ పెంచి వాటిపై తిరిగేవారుకాదు.
 
  పాతకాలం వారిలోకూడా కొందరిలో  రాగద్వేషాలు,  అత్యాశలు పెరిగి యుద్ధాలు జరిగి, ఎందరో చనిపోయారు... 
 భూభారంపెరిగి, యుద్ధాలో ఎందరో మరణించారు కదా. 
 ...................................
పాతకాలమైనా, ఆధునికకాలమైనా ... లిమిట్ దాటి మనుషుల కోరికలు పెరిగితే అనర్ధమే. అది ప్రకృతికి విరుద్ధమే.
.........................
ఆధునికకాలంలో కాంక్రీట్ బిల్డింగులు బాగా పెరిగాయి. జనాభా బాగా పెరిగి, కొండలపైన కూడా ఇళ్లు కట్టేస్తున్నారు. పరిశ్రమలకు చాలాభూమి కావాలి. ఎక్కడి భూములు చాలటం లేదు.
ఆధునికకాలంలో టెక్నాలజి వల్ల కాలుష్యం బాగా పెరిగి, అనేక సమస్యలు వస్తున్నాయి. పంటలు పండాలన్నా రసాయనికమందులు వాడుతున్నారు.
 
 ఆధునికకాలంలో టెక్నాలజి వల్ల వాహనాలు కనిపెట్టటం వల్ల, జంతువులకు పనితప్పింది. ఎడ్లబండ్లు వాడినప్పుడు, ఎడ్లు మనుషులను..ఎంతో బరువును లాగవలసి వచ్చేది.ఇది మాత్రం టెక్నాలజివల్ల జరిగిన ఎంతో మంచి విషయం.
......................................

ఈ రోజుల్లో, రోజూ లక్షలాది పశుపక్ష్యాదులను చంపి తినటం, ఎప్పటికప్పుడు, కొత్తవాటిని పుట్టించి పెంచి తినటం జరుగుతోంది.  
మనుషులకు తెలివిఉంది. మనుషులు పశుపక్ష్యాదులను చంపితింటే, మనుషులకు జంతువులకు తేడా ఏముంది?
.......................................
 పెరుగుటవిరుగుటకొరకే అన్నట్లు, 
 జనాల అత్యాశ, స్వార్ధం, అంతులేని కోరికలు బాగా పెరిగితే, భూభారం తగ్గటానికి ప్రకృతి చర్యలు ఉంటాయి. 

అందువల్ల, పాతకాలం అయినా, ఆధునికకాలమైనా శాయశక్తులా జీవహింస చేయకుండా ప్రయత్నించాలి. అత్యాశ లేకుండా, అతి చేయకుండా  ప్రకృతికి తగ్గట్లు ప్రవర్తిస్తే మంచిది.



No comments:

Post a Comment