koodali

Thursday, March 23, 2017

కొన్ని విషయములు..

ఈ క్రింద విషయాలను చాలా కాలం తరువాత వ్రాసి ఇక్కడ పోస్ట్ చేసాను.

...........
ప్రాచీనులు ఏర్పాటు చేసిన వ్యవస్థలో చాలా విషయాలున్నాయి.

పాతకాలంలో చాలామంది, వృత్తివిద్యలను కుటుంబంలో పెద్దవాళ్ళనుండి నేర్చుకుని జీవనోపాధి పొందేవారు. ఎవరి బతుకులు వాళ్ళు బతికేవారు.

కొందరు విదేశీయాత్రికుల రచనల ప్రకారం భారతదేశంలో ఆ రోజుల్లో పేదరికం లేదని, అందరూ చక్కగా జీవించేవారని తెలుస్తుంది.(అంటే,అన్ని వర్గాల వారు చక్కగా జీవించారనే అర్ధం కదా..)

అయితే, కాలక్రమంలో కొందరు స్వార్ధపరులైన వారు , అంటరానితనం వంటివి మొదలుపెట్టి, సమాజంలో అసమానతలను వ్యాపింపజేసారు.మూఢనమ్మకాలను వ్యాప్తిచేసారు. వ్యవస్థను పాడుచేసారు.
................
అప్పట్లో సంస్కృతము.. మొదలైనవి నేర్పించటానికి కొన్ని గురుకులాలు ఉండేవి. ఇతర విద్యలు నేర్పించటానికి కూడా కొన్ని విద్యాలయాలు ఉండేవి.

 ఉదా.. నలందా విద్యాలయము వంటివి. అయితే, అవి అందరికి అందుబాటులో ప్రతి ఊరిలో ఉండటం కాకుండా, కొన్నే ఉండేవి కావచ్చు.

చాలామంది పెద్దవారికి అనేక కారణాలతో తమ పిల్లలను విద్యాభ్యాసం కొరకు వేరే ప్రాంతానికి పంపటం ఇష్టం ఉండదు.

పాతకాలంలో చాలామంది పెద్దవాళ్లు తమకు చక్కగా వచ్చిన వృత్తి విద్యలను, అందులో మెలకువలను తమ పిల్లలకు నేర్పించి, వారిని ఆ విద్యలలో నిష్ణాతులుగా చేసేవారు కావచ్చు.

ఇందువల్ల, పిల్లలకు కూడా విద్య కొరకు ఎక్కడికో వెళ్ళటం, అక్కడ ఆహారం, వసతి గురించి ఇబ్బందులు లేకుండా ఉండేది. పెద్దవాళ్ళకు.. దూరంగా ఉన్న పిల్లలు చక్కగా ఉన్నారో? లేక చెడు సావాసాలతో తిరుగుతున్నారో? అని భయాలూ లేకుందా ఉంటాయి.

అయితే, వంశానుచారం వచ్చే వృత్తులు నేర్చుకునే వారికి, వేరే వృత్తి నేర్చుకోవాలంటే అంత కుదరదు, మరల వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి నేర్చుకోవాలి.

ఇలా కొన్ని కారణాల వల్ల కూడా వంశపారంపర్యంగా కొన్ని వృత్తివిద్యలు అలా కొనసాగిఉండవచ్చు.
..............
ఎన్నో వృత్తివిద్యలుంటాయి. ఒక్కోదానికి కాలేజీలను ప్రతి ఊరిలోనూ ఏర్పాటుచేయాలంటే ఏ రోజుల్లో అయినా కష్టమే.
..............
ఈ రోజుల్లో కూడా కొందరికి అనేక కారణాల వల్ల తమకు ఇష్టమైన విద్య చదవటానికి సీట్ లభించక వేరే చదువు చదువుతారు.

ఈ రోజుల్లో మాత్రం అంతా సుఖంగా ఉందా? చిన్నప్పటినుంచి స్కూల్స్లో సీట్ల కొరకు పోటీలు, బోలెడు ఫీజులు, పెద్దయ్యాక.. ఉన్న ఊళ్ళో కాలేజీలో కోరుకున్న చదువులో సీట్ లభిస్తుందో? లేదో? అని టెన్షన్, తరువాత చదివిన చదువుకు ఉపాధి ఎప్పుడు లభిస్తుందో ? అనే టెన్షన్, ఉద్యోగం లభిస్తే పోకుండా ఎంతకాలం ఉంటుందో? అని భయాలు.

 ఇప్పటి వాళ్ళు కొందరు విద్యకొరకు వేరే ప్రాంతాలలో స్కూల్స్, కాలేజీలలో సీట్ల కొరకు ఎంతో కష్టపడి చదివి సీట్లు సంపాదించి హాస్టల్స్లో లేక బయట రూంస్ లో ఉండి చదువుతుంటారు.  కొందరు అక్కడ ఆహారం సరిగ్గా బాగుండక ఇబ్బందులు పడుతుంటారు.

పాతకాలంలో వాళ్ళు చాలామంది తమ పెద్దవాళ్ల ద్వారా వృత్తివిద్యలు నేర్చుకుని ఉపాధి పొందేవారు.
...............
అదొక పరిస్థితి..ఇదొక పరిస్థితి. కొన్ని లాభాలు..కొన్ని నష్టాలు.రెండింటి లోను కొన్ని సంతృప్తులు..కొన్ని అసంతృప్తులు.
............
పాతకాలంలో స్త్రీలు కుటుంబబాధ్యతలను చూసుకుంటే, పురుషులు బయటకెళ్లి, సంపాదన వ్యవహారాలను చూసుకునేవారు.ఉన్నదాంట్లో పొదుపుగా తృప్తిగా జీవించేవారు.

అయితే, అప్పట్లో వృత్తిపనులు చేసే మగవారు కొందరు ఇంటి వద్దే పనులు చేసేవారు.అప్పటి స్త్రీలు కొందరు ఇంటి పనుల తరువాత ఖాళీ సమయం ఉంటే కొంత రెస్ట్ తీసుకుని, మగవారికి వృత్తిపనులలో సాయం చేసేవారు.

పగలు పురుషులు పని చేసి, తరువాత విశ్రాంతి తీసుకునేవారు. స్త్రీలు ఇంటిపట్టున ఉండి, హడావిడి లేకుండా ఇంటిపనులు చూసుకునేవారు. వారికి పగలు కొంత విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఉండేది.

ఈ రోజుల్లో స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉద్యోగాలని బయటకెళ్ళి, రాత్రికి ఇంటికి వచ్చి, ఇంటి పనులు చేస్తూ ఎవరికీ విశ్రాంతి సరిగ్గా ఉండటం లేదు. పనివత్తిడి వల్ల ఇద్దరూ గొడవలు పడుతున్నారు.  
...........
పాతకాలంలో చాలా ఉమ్మడికుటుంబాల్లో స్త్రీలకు ఒకరిపై ఒకరికి అభద్రతాభావం తో, తమదే పై చేయి కావాలనే పెత్తందారి ధోరణి వల్ల స్త్రీలు గొడవలు పడేవారు.

 స్త్రీలలో ఐకమత్యం లేకపోవటం వల్లకూడా పురుషాధిక్యత పెరిగింది. ఇవన్నీ కలసి కుటుంబాల్లో గొడవలు జరిగేవి. ఆ విధంగా ఆ వ్యవస్థ బలహీనమయ్యింది.

చతురాశ్రమాల గురించి పెద్దలు తెలియజేసారు. వానప్రస్థంలో, సన్యాసాశ్రమాల్లో అడవులకు వెళ్ళకుండా కుటుంబాలతో ఉన్నా కూడా, కుటుంబ లంపటాలను తగ్గించుకుని దైవస్మరణ, అందరితో మంచిగా ఉండటం చేయాలి.

అలా కాకుండా, అప్పుడు కూడా కుటుంబం గురించి తీవ్రమైన కాంక్షతో ప్రాకులాడటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
ఉదా..కుటుంబంలో అందరూ తాము చెప్పినట్లే విని తీరాలి.. అనుకుంటే కష్టం.

ఈ రోజుల్లో చాలావరకు చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు.  వివాహం అయ్యాక ఇంటాబయటా పనివత్తిడి ఎక్కువ అయ్యి, భార్యాభర్త గొడవలు పడటం, సమయం లేదని బయట ఆహారం తినటం, ఇలా చాలామందికి అనారోగ్యాలు వస్తున్నాయి.

ఉద్యోగాల వల్ల కొందరు తమ చిన్నపిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. కొందరు తమ పిల్లల్ని చదువులంటూ చిన్నతనంలోనే హాస్టల్స్ లో వేస్తున్నారు.
..............
ఆధునిక కాలంలో ఇంటిపనులకు చిన్నయంత్రాలు వచ్చాయి. ఇంటిపని భారం తగ్గి ఖాళీ సమయం ఉందనుకుంటే, స్త్రీలు కొందరు కలసి సొంతంగా సంస్థలను మొదలుపెట్టి, ఉదయం పది నుండి సాయంకాలం 4 గంటల వరకు ఏదైనా చిన్న వ్యాపారాలు చేసి ఉపాధి పొందవచ్చు.

 అందరూ స్త్రీలే ఉంటే లైంగికవేధింపులు సమస్యలుండవు. పనిగంటలు తక్కువ ఉంటే అలసిపోరు.చిన్నపిల్లలను తమ దగ్గరే ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు.  
.........
 బాగా చదివి, బోలెడు జీతాలున్న ఉద్యోగాలు సంపాదించి, చాలా ఇళ్ళు, బోలెడు బంగారం, రకరకాల వస్తువులు కొనాలనే కోరికల వల్ల ఎంత డబ్బూ సరిపోదు. కొనేవాళ్లు పెరిగేసరికి వ్యాపారస్తులు వస్తువుల ధరలను బాగా పెంచేస్తున్నారు.

 వ్యవస్థలు మారిపోయాయి. పాపాలు చేసి అయినా, డబ్బు సంపాదించాలని అనుకునేవారు పెరిగారు. మనశ్శాంతి లేనప్పుడు ఎన్ని చేసినా ఏం లాభం? 

మనుషులు పట్టుదలలు, పంతాలు మాని, అభద్రత భావం, తమ మాటే చెల్లాలనే పెత్తందారి ధోరణి..వంటివి లేకుండా అందరూ మంచిగా ఉంటే బాగుంటుంది. 

అందరూ నైతికవిలువలను కలిగి మంచిగా జీవిస్తే సమాజం బాగుంటుంది.
............
oka link..
Friday, June 24, 2011
 
 గృహిణిగా ఉండటం ఎంతో గొప్ప విషయం. .

 
 

No comments:

Post a Comment