koodali

Sunday, February 8, 2026

కొన్ని విషయములు..


దైవమా మీరు శాశ్వత పరమానంద స్వరూపులు. అత్యంత శక్తిమంతులు. 

దైవము, సృష్టిలో జీవులకు అవసరమైనటువంటివెన్నో సృష్టించి ఇచ్చారు. చక్కటి వాతావరణం, ఆహారానికి అవసరమైన ఎన్నో మొక్కలు, ఎన్నో పువ్వులతో కూడిన మొక్కలు, ఎన్నో సుందరదృశ్యాలను..  ఇచ్చారు. అంతా మీ దయ. 

దైవానికి అనేక కృతజ్ఞతలు. 
....................

జీవులు ధర్మబద్ధంగా జీవిస్తూ హాపీగా ఉండాలి. అందరూ మంచి బుద్ధితో మంచిగా ఉండాలి. మంచి బుద్ధి ఉంటే అంతా మంచిగా ఉంటుంది.

....................

ప్రపంచంలో  ఎన్నో సమస్యలున్నాయి. ఎవరికి ఏం చెప్పినా వినే వాళ్ళెంతమంది? పాటించేవాళ్లెంతమంది?

చిన్నపిల్లలు కష్టాలు పడినట్లు, మంచివాళ్ళు కష్టాలు పడినట్లు, మూగజీవులు కష్టాలు పడినట్లు.. విన్నప్పుడు చాలాచాలా బాధ కలుగుతుంది.

..............................

దైవపూజలు చేసినప్పుడు ప్రజలు , ప్రపంచంలో అందరికి తమతో సహా బుద్ధి సరిగ్గా ఉండాలని కూడా దైవాన్ని ప్రార్ధించుకుంటే మంచిది. బుద్ధి సరిగ్గా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. 
 ******************

లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు  మనకు ఏమనిపిస్తుందంటే,   దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. 

అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం  చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా? 
 

 దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా,   సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.
 

మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అంతా దైవము దయ.

................................ 

ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి.

 ప్రపంచంలో మతాల పేరిట, అధికారం గురించి, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం.

 ప్రపంచంలో జరుగుతున్న హింస చాలా బాధగా ఉంది.

ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ,  పాపాలు చేసి  అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. 

డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.

మద్యపానం, మత్తుపదార్ధాల వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతోంది. 

సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు. 

    ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా,  నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం?  వారి సంగతి దైవం చూసుకుంటారు.

 కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.

ఆ మధ్య ఒక పేరుపొందిన 
వారు  చెప్పినదాన్ని బట్టి.... ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది... 

అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు. 

మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.

కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న  ఘోరాలు వింటుంటే చాలా బాధగా ఉంది. రాక్షసప్రవృత్తి కలవారి పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి. 

అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి. 

************** 

మనుషులు చేస్తున్న పాపాల వల్ల ఎవరి కర్మ వారిదని దైవము ఊరుకుంటున్నారేమో? 

   అయితే, యుద్ధాలు, హృదయవిదారకమైన ఘటనలు, యాక్సిడెంట్లు, రక్తపాతాలు జరిగినప్పుడు అమాయకులైన పిల్లలు, మంచివారైన పెద్దవాళ్లు, అమాయక
మూగజీవులు .. కష్టాలు పడినప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. 

దైవం చెడ్డవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది. 
..........................................

గ్రంధాల ద్వారా దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.

 అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు. 

కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. అలా జరగడానికి గల కారణాలు మనకు తెలియకపోవచ్చు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు. దైవానికి అన్నీ తెలుస్తాయి.

  మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి.  దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.
...............

 ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి.  దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.

అంతా దైవము దయ...

..................

 నైతికవిలువలను పాటించే మనుషులున్న సమాజం ప్రశాంతంగా ఉంటుంది.నేరాలు..ఘోరాలు ఉండవు. అందరికి  దైవభక్తి.. ధర్మబుద్ధి ఉండాలని గట్టిగా కోరుకుందాము.
 ..................

దైవమే దిక్కు.

 

ఈ రోజుల్లో ..వచ్చాక ...


ఈ రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు..వచ్చాక ఎన్నో ప్రోగ్రాంలు ప్రపంచమంతటా ప్రసారమవుతున్నాయి. 
 
మంచి ప్రోగ్రాంస్ తో పాటు హారర్ ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి.
 
  ఈ తరంగాలు వాతావరణంలో ఉండి, వాటి ప్రభావం మనుషుల మీద ఉంటుందనిపిస్తుంది.

చెడుప్రసారాల వల్ల మనుషుల్లో చెడ్డతనం పెరుగుతుందనిపిస్తుంది. అయితే, చెడుప్రసారాలను ఎంతకని ఆపగలం?

మంత్రాలను పఠిస్తే, ఆ తరంగాల వల్ల వాతావరణం శుద్ధి అవుతుందంటారు. మంత్రాలను మనస్సులో కూడా అనుకోవచ్చు.

 ఇళ్ళలో వీలున్నప్పుడు కొద్దిసేపయినా  భక్తిగీతాలు..పెట్టుకుంటే మంచిది. తక్కువ సౌండుతో తప్పుల్లేకుండా ఉన్న మంత్రాల కాసెట్ పెడితే మంచిది. 

 వాటిని వింటూ పనులు మాని అక్కడే కూర్చోవాలని ఏమీ లేదు.
  మన పనులు మనం చేసుకుంటూనే అవి వాతావరణంలో ప్రసారమవుతాయి. 

(ఇళ్ళలో నెలసరి సమయంలో మంత్రాలు పెట్టకూడదు కావచ్చు.)

చాలామందికి వినిపించాలని పెద్దశబ్దంతో పెట్టనవసరం లేదు.. 
 
 అందరికీ గట్టిగా వినిపించకపోయినా ఫరవాలేదు. చిన్న శబ్దంతో పెట్టినా కూడా, ఆ మంత్రశక్తి వాతావరణంలో వ్యాపించి, మంచిమార్పు వచ్చే అవకాశముంది.

 పెద్ద సౌండ్ వల్ల చుట్టుపక్కల వారికి చాలా సమస్యలు ఉంటాయి. మైకులో పెద్దశబ్దం పెడితే, కొన్ని విషయాలు ఆలోచించాలి....  
 
ఒకరిమాట ఒకరికి వినిపించదు. ఫోన్లో మాట్లాడలేము. ఇంట్లో సరిగ్గా పూజ చేయలేము. కొందరికి తలతిరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల చిన్నశబ్దంతో ఉంటే హాయిగా ఉంటుంది.

దేవాలయాల్లో పూజాకార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల, వాతావరణం కూడా శుద్ది అవుతుంది. కొన్ని దేవాలయాల్లో మైకుద్వారా వినిపించేలా కాసెట్ పెట్టి మంత్రాలను, భక్తిగీతాలను వినిపిస్తారు. 

ధ్యానం ఎంతో శక్తివంతమైనదని అంటారు. ధ్యానము పైకి అందరికి వినిపించేలా చేయకపోయినా కూడా, ధ్యానము శక్తివంతమైనది.

ఇంకా, మనుషుల్లో, దైవభక్తి..మంచితనం ఉన్నాయి కాబట్టి,  ప్రపంచం ఈ మాత్రం అయినా బాగుంది. 
 
*********************
   ఈ రోజుల్లో  ఎన్నో ప్రోగ్రాంలు ప్రపంచమంతటా ప్రసారమవుతున్నాయి.  మంచి ప్రోగ్రాంస్ తో పాటు హింసతో కూడిన ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి. 
 
చాలామంది పిల్లలు, పెద్దవాళ్లు హారర్ ప్రోగ్రాంస్ భయపడుతూ కూడా చూస్తారు. 

సీరియల్స్ చూస్తే,  ఇళ్లలో ఒకరితో ఒకరు కొట్లాడుకోవటమే ఎక్కువవుంటుంది. 

అస్తమానం హింసతో కూడిన ప్రోగ్రాంస్, గొడవలు కాకుండా,కామెడీ ఎక్కువ ఉండే ప్రోగ్రాంస్ ఎక్కువ రావాలి. 

కొన్ని వీడియోగేంస్ కూడా ఒకరితోఒకరు కొట్టుకోవటం వంటివి ఉంటాయి. అవి ఆడినవారికి ఇరిటేషన్ పెరిగే పరిస్థితి రావచ్చు.

చాలాసమయం సెల్ఫోన్లు చూస్తే ఇరిటేషన్ వస్తుంది. చేతులు, మెడ నొప్పులు వస్తాయి. ఇంకా కొన్ని శారీరిక, మానసిక సమస్యలు వచ్చే అవకాశముంది.

 ఆరుబయట ఆడుకోవటం, నడవటం, ఇరుగుపొరుగు వారు కబుర్లు చెప్పుకోవటం, తోటపని, బాల్కనీలో కూర్చుని మంచిపాటలు వినటం.. చేయవచ్చు. 

సెల్ఫోన్లు పట్టుకుని చూడటం తగ్గించి, ఫోన్ పక్కన పెట్టి రేడియోలా వినవచ్చు.


Monday, December 22, 2025

పగిలిన గాజుముక్కలను....

 

ఎన్నో గాజు సామాన్లను వాడతాం. అవి పగిలినప్పుడు మాత్రం వాటిని ఎక్కడ ఎలా పడెయ్యాలో అనేది కష్టంగా ఉంటుంది.


 పగిలిన గాజుముక్కలను అలాగే బయట పడేస్తే అవి గుచ్చుకుని పారిశుధ్యసిబ్బందికి, బయట ఆహారం కొరకు తిరిగే జంతువులకు గుచ్చుకుని గాయాలు అయ్యే ప్రమాదముంది.

 అందువల్ల గాజు ముక్కలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి,  పాతబట్టలను మందంగా వాటికి గట్టిగా చుట్టి,  మరల ప్లాస్టిక్ కవర్లో చుట్టి అప్పుడు వాటిని ప్లాస్టిక్ చెత్త వేసే డబ్బాలలో వేయాలి. 

ఏదైనా పెట్టెలో పెట్టి పడేస్తే ఇంకా మంచిది. ఇంకా ఏమైనా పద్దతులు కూడా ఉండవచ్చు. 


ప్లాస్టిక్ కాకుండా, చిన్న గోనె సంచి లేక కాటన్ సంచిలో వేసి చుట్టి, తాడుతో కట్టి కూడా పడేయవచ్చు. కొబ్బరి పీచుతో కూడా సంచులను తయారుచేయవచ్చు.

 పగిలిన గ్లాస్ పడెయ్యటానికి విడిగా చెత్తబాక్సులను ఏర్పాటు చేయాలి.

 గాజు సామాను కొనకుండా జాడీలను, మట్టిపాత్రలను కొనవచ్చు.

పాతకాలంలో జాడీలను వాడేవారు. ఇప్పుడు కూడా జాడీలను అమ్ముతున్నారు. అలాగే జాడీలు తయారుచేసే పద్ధతిలో కప్పులు, చిన్న జాడీలు, మగ్గులను కూడా అమ్ముతున్నారు. అవి పగిలినా కూడా గాజుగ్లాసులా పదునుగా గుచ్చుకోవు. 
 

ఈ రోజుల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా పడేసి వదిలేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సమాజంలో. అలాకాకుండా, సమాజం బాగుండేలా పాటించటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. 


Monday, November 24, 2025

కొన్ని విషయములు..

 

 link..

ఓం, దైవానికి అనేక వందనములు...

 link..

  • ఓం..
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2
  •  
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1
  •  
  • *కొన్ని ఆహార విషయాలు... మూడవ భాగం...

     

    కొన్ని సందేహాలు..కొన్ని ఆలోచనలు..

     

     నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

    నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

      కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

    అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

    మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

    అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

    పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

     ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

    పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
    ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

    అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా  చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

     ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.

    స్త్రీల అంటుముట్టు గురించి పబ్లిక్ గా మాట్లాడటం ఏమిటీ అంటున్నారు కొందరు.

     మరి స్త్రీల నెలసరి గురించి అలా చేయకూడదు..ఇలా చేయకూడదు..చేస్తే కష్టాలు వస్తాయని పబ్లిక్ గా కొందరు చెబుతున్నప్పుడు, ఆ సందేహాల గురించి పబ్లిక్ గా మాట్లాడితే తప్పేమిటి?

    ఇంకా, చాలా విషయాల గురించి కూడా.. ఇలా చేయకూడదు..అలా చేయకూడదు..చేస్తే కష్టాలు వచ్చి మీద పడిపోతాయని చెబుతున్నారు. ఇవన్నీ విని, ఏం చేస్తే ఏం తప్పో? అనే పరిస్థితితో భయం, అయోమయం కలిగి, అనేక సందేహాలతో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది.

      .............................

    లోకకల్యాణం కొరకు పూజలు చేసే సందర్భాలలో.. లోకంలో అంతా బాగుండాలని పూజ చేస్తారు. 

    ఎవరికి వారు పూజలు చేయించుకునే సందర్భాలలో.. అంటుముట్టు, మైలలో ఉన్నవారు కొన్ని రోజులు ప్రత్యేక పూజలు చేయడానికి దూరంగా ఉండాలంటారు.

    నాకు ఏమనిపిస్తోందంటే,  అర్చన, అభిషేకం వంటి సందర్భాలలో..వేరే ఊరిలో ఉన్న కుటుంబసభ్యులందరి పేర్లు చెప్పటం సంగతి ఏమోకానీ..

    అంతా బాగుండాలని, కుటుంబంలో అందరూ బాగుండాలని.. భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది. 

    (వేరే ఊరిలో ఉన్నవారి  పరిస్థితి(అంటుముట్టు..) గురించిన సంగతులు తెలియనప్పుడు, ఇలా కూడా చేయవచ్చేమో?..అనిపించింది.)

    .........................

      ఇంకొక విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా  గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

     మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

    పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

    ....................

    గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

    మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

     ............................

    వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

     

    Sunday, November 9, 2025

    చక్కగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు. ...

     

     సోషల్మీడియాలో చెప్పేవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయపడనవసరం లేదు.

     అందరూ అన్నింటినీ పాటించలేరు. కలియుగంలో దైవస్మరణ..దైవనామస్మరణతోనే తరించవచ్చని ప్రాచీనులే తెలియజేసారు.

     ఎవరి శక్తికి తగ్గట్లు వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. 
     

    దైవానికి మన విషయాలను చెప్పుకోవచ్చు. 

    హిందూత్వంలో నిరాకారం, సాకారం..ఇలా ఇంకా ఎన్నో పద్ధతులున్నాయి. మన శక్తికి తగ్గట్లు చక్కగా హాయిగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

     సరైన విధంగా జీవించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.

     ...................................

     marikonni vishayamulu..

     దైవ సృష్టి ...

     సృష్టిలో , ఆకాశంలో ఎగిరే పక్షుల శరీరం , ఎగరటానికి తగ్గట్లుగా సృష్టించబడింది. నీటిలో ఈదే చేపలశరీరం అందుకు తగ్గట్లుగా ఉంది. 

    ఇవన్నీ ఇలా ఉండాలంటే ఎంతో ఆలోచనకల శక్తికే సాధ్యం. ఆ మహాశక్తే దైవము.

    ఆలోచనాశక్తి లేనిదే ఏదైనా పద్ధతిగా ఎలా ఏర్పడుతుంది..ఒకగదిలో నాలుగు చెక్కముక్కలనుపడేసి ఎంతకాలం ఉంచినా అవన్నీ కలసి కుర్చీలా అవవుకదా.

     
    ఇంత పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే, ఊహాతీతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఈ మహాశక్తినే   దైవము.. అని దైవాన్ని నమ్మే వారు(ఆస్తికులు) పిలుచుకుంటున్నారు.

    ఆధ్యాత్మికవాదులు..  దైవానికి   ఆది ,  అంతమూ ..లేవు .  అని తెలియజేసారు. 

    ".Matter and energy cannot be created or destroyed "....... అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ..యొక్క రూపం మారుతుంది .

     అంతేకానీ, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.

    ఉదా...నీరు ఆవిరిగా మారుతుంది ... ఆవిరి మరల నీరుగా మారుతుంది, నీరు మంచులానూ మారవచ్చు, ఆ మంచు మరల నీరుగానూ , ఆ నీరు ఆవిరిగానూ మారవచ్చు.

    విశ్వాన్ని దైవం సృష్టించారు అంటే,  మరి దైవం  ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్న వేస్తారు భౌతికవాదులు. 

     మరి , పదార్ధం లేక శక్తి  మొదట ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్నకు భౌతికవాదులు ఏం సమాధానం  చెబుతారు ?

     పదార్ధానికే పుట్టుక , నశించటం అనేవి లేనప్పుడు , పదార్ధాన్ని సృష్టించిన దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .... అని పెద్దలు చెప్పిన మాట నిజమని తెలుస్తోంది కదా !
      
    దైవం వద్ద   జీవులకు కలిగే  అన్ని సందేహాలకు  సమాధానాలు ఉంటాయి . 

    అయితే,   విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలంటే   జీవులు  తగిన అర్హతలు సంపాదించుకోవాలి. 

     దైవకృపను పొందగలిగిన జీవులకు ఆ రహస్యాలు తెలిసే అవకాశం ఉందనిపిస్తుంది. ఉదా.. మోక్షాన్ని పొందిన జీవులకు  విషయాలు తెలుస్తాయి .  అనిపిస్తుంది . 

     విమానం ఎలా ఎగురుతుంది ? అని చిన్న పిల్లవాడు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళు ఎంత వివరించినా పిల్లవాడికి అర్ధం కాకపోవచ్చు. 

    అదే పిల్లవాడు పెద్దవాడయి చదువుకుంటే ఆ విషయాలు సులభంగా బోధపడతాయి. 

    విశ్వరహస్యాలు తెలుసుకోవాలన్నా తగిన  అర్హతలను సంపాదించుకోవాలి.
     
    *******
    సృష్టి ఎలా ఏర్పడింది? అనే  ప్రశ్నకు,   దైవం  వల్ల   సృష్టించబడింది.. అని  ఆస్తికులు ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.

    సృష్టి ఎలా ఏర్పడింది?  అనే  ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.

    కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఏర్పడ్డారని  ప్రశ్నిస్తారు.

    సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు..  మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా
    ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. 
    దైవము  ఎప్పుడూ ఉంటారు.
     ......................


    ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు...



    చిన్నపిల్లలు వాళ్ళకువాళ్ళు చేత్తో తీసుకుని సరిగ్గా తినలేరు. చిన్నపిల్లలు పెద్దవారిలా గబగబా నమిలి తినలేరు. నిదానంగా తింటారు. అలాగని పిల్లలకు ఆహారాన్ని కుక్కి అదేపనిగా బోలెడు తినిపించకూడదు. 
     
    వాళ్ళకు ఎంతకావాలో అలాగ తల్లి దగ్గరుండి  ఓపికగా తినిపించాలి. అందుకు ఎక్కువ సమయమే పడుతుంది.

    అయితే, ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఉద్యోగాల కొరకు వెళ్ళటం వల్ల పిల్లలకు చక్కగా తినిపించటానికి కూడా సమయం ఉండటం లేదు. 
     
    పిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తున్నారు. లేదంటే చిన్నప్పుడే స్కూల్లో వేస్తున్నారు. పిల్లలను త్వరగా అక్కడ దింపాలని ఉదయాన్నే వాళ్లకు హడావిడిగా ఏదో కుక్కి తినిపిస్తారు.

     ఇంట్లో ఉండే తల్లులు కూడా కొందరు ఈ విషయంలో ఓపికగా చేయటం లేదు. చిన్నపిల్లలు ఏమీ చేయలేరు కదా..
     
    కొందరు పిల్లలు ఉదా..3 సంవత్సరాల చిన్నపిల్లలు నాకు తినిపించమని పెద్దవాళ్ళను అడిగినా, నువ్వే తినాలంటూ తినిపించకుండా ఉండే పెద్దవాళ్ళను నేను చూసాను.. 
     
    పాపం చిన్నపిల్లలు తమకు తాము సరిగ్గా తినలేని వయస్సు వాళ్ళది...అలా అర్ధాకలితో ఉంటే  బాధ అనిపిస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో?

    చాలామంది పిల్లలు తినటం విషయంలో విసిగిస్తారు. ఆ వయస్సు పిల్లలు చాలామంది అలాగే ఉంటారు. 
     
    కొందరు తల్లులు మాత్రం ఓపికగా మాటలు చెబుతూ తినిపిస్తారు. ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు.
     ......................................
     
    చంటిపిల్లల్ని క్రెచ్లలో వేసి పెద్దవాళ్లు ఉద్యోగం కోసం వెళ్తున్నారు. పిల్లల కొరకు డబ్బు సంపాదించటం కోసమే అలా చేస్తున్నామంటున్నారు కొందరు. 
     
    తల్లి వద్ద ఆప్యాయంగా పెరగవలసిన ....మాటలు కూడా సరిగ్గారాని చంటి పిల్లల్ని  పగలు ఎక్కడో బయట ఉంచుతున్నారు. అక్కడ వారిని మంచిగా చూస్తున్నారో ? లేదో? తెలియదు. చంటి పిల్లలు ఏమీ చెప్పలేరు. 
     
    పిల్లల్ని కొట్టిన కొన్ని సంఘటనల గురించి వార్తల ద్వారా తెలిసింది. కనీసం పిల్లలకు బాగా మాటలు వచ్చి తమ గురించి చెప్పేవరకయినా వారిని తల్లి దగ్గరుండి చూసుకోవాలి. 
     
    పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఉద్యోగం రాకుంటే, సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేస్తూ అయినా ఉపాధి పొందవచ్చు. 
     
    పిల్లల క్షేమం ముఖ్యం కదా.
    .....................................
     
    కొందరు తల్లితండ్రి , తమ పిల్లలను సరిగ్గ చూసుకోవటానికి కూడా సమయం లేదంటూ  బిజి అంటారు. 
     
    తాము పెద్దయ్యాక  మాత్రం,  ఏమీ తోచక ఫోన్ పుచ్చుకుని అస్తమాను పిల్లల జీవితాల్లో కల్పించుకుంటూ.. అదేపనిగా వాళ్లకు సలహాలిస్తూ పిల్లల విడాకులకు కారణమవుతున్న పెద్దవాళ్ళూ ఉన్నారు.
    ............................

    ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఉద్యోగాలని బయటకు వెళ్లటం వల్ల సమయం సరిపోక హడావిడిగా వండుకుని తింటున్నారు. పిల్లలు చదువులని బయట ఉండటం, ఇంకా అనేక కారణాల వల్ల చాలామంది బయట ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. బయట ఆహారం పరిస్థితి ఎలా ఉందో.. ఈ లింక్ వద్ద గమనించవచ్చు.
    ................
     ఇంట్లో ఉండే స్త్రీలు కూడా కొందరు బయట ఆహారాన్ని ఎక్కువగా తెప్పించుకుంటున్నారు.

    ఇంట్లో సరైన ఆహారం లేక బయట ఎక్కువగా తింటే, పిల్లలకు, పెద్దవాళ్లకు అనారోగ్యం వచ్చే అవకాశముంది. ఆరోగ్య సమస్యలు వచ్చాక ఎంత డబ్బున్నా కూడా కొందరికి కొన్నిసార్లు అనారోగ్యం తగ్గటం కష్టమవుతుంది. అందువల్ల, అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిది.
    ............
    ఈ మధ్య కొందరు యువతులు తాము ఇంజనీరింగ్ వంటివి చదువుకుని ఉద్యోగాలు చేయకుండా ఇంటిపనులు చేయటాన్ని తక్కువగా భావిస్తూ ..తామెంతో చిన్నపనులు చేస్తున్నట్లుగా పోస్టులు పెడుతున్నారు...
     
     స్త్రీలు కుటుంబబాధ్యతలను చక్కగా  నిర్వహించటం, పిల్లల్ని చక్కగా పెంచి శారీరికంగా, మానసికంగా ఉత్తమ పౌరులుగా చేయటం చాలా గొప్ప పనులు. 
     
     తమకు తమ కుటుంబసభ్యులకు ఇంత ఆహారాన్ని చక్కగా వండుకుని తినటం, ఇంటిని చక్కదిద్దుకోవటం తక్కువ పనులనుకుంటే ఎలా?
    ..................................
     కష్టాలున్నా కూడా , కుటుంబాన్ని చక్కగా చూసుకునే స్త్రీలు చాలామందే ఉంటారు.  అలాంటి వారు ఎంతో గొప్పవారు....అభినందనీయులు...
    ..............................
       యూట్యూబ్లో కొందరు అమ్మాయిలు తాము అత్తగార్లను ఎలా కంట్రోల్ లో పెడుతున్నది చూపిస్తున్నారు. పాతకాలంలో అత్తగార్లు కోడళ్లను కంట్రోల్లో పెట్టారు కాబట్టి, ఇప్పుడు కోడళ్ళు అత్తగార్లను కంట్రోలో పెట్టి మురిసిపోతున్నారు.

     అత్తగార్లు ఒకప్పటి కోడళ్ళే అని, కోడళ్ళూ కాబోయే అత్తగార్లేనని గుర్తంచుకుంటే అందరికి మంచిది.
    ............................

     చంటిపిల్లలు తల్లి దగ్గర ఉండాలనుకుంటారు. ఆ వయస్సులో వారిని 
    డేకేర్లో వేసి, వారి కొరకు బోలెడు డబ్బు సంపాదిస్తామంటారు. పెద్దవారిని వృద్ధాప్యంలో వృధాశ్రమంలో వేస్తే బాధపడతారు కదా..పిల్లలకు కొంత మాటలు చెప్పే వయస్సు వచ్చేవరకైనా ఇంట్లో వారు చూసుకుంటే మంచిది.

     పిల్లల్ని మంచిగా చూసుకునే సంస్థలు ఉండి, వారు పిల్లల్ని బాగా చూస్తారనే నమ్మకం కలిగితే వీడియో ద్వారా ఎప్పటికప్పుడు పిల్లల్ని చూసుకునే అవకాశం ఉంటే కొంతవరకు ఫరవాలేదు. ఇవన్నీ ఉండాలంటే ఎక్కువ డబ్బు అవుతుంది. 

     
    పిల్లల పెంపకం తేలిక కాదు. అయితే, చిన్న పిల్లల ముద్దు ముచ్చట్లను  చూస్తే, ఆ కష్టం కష్టంగా అనిపించదు. పిల్లల ముద్దుముచ్చట్లను   చూసుకునే సమయం జీవితంలో మళ్లీ వస్తుందా?

    చదువులు, ఉద్యోగాల కొరకు రాత్రింబగళ్లు చదివి ఎంత కష్టమైనా చేస్తున్నారు కదా.. అవన్నీ కూడా ఎంతో కష్టమైన పనులే. కుటుంబబాధ్యతలంటేనే బొర్ అనటం బాధాకరం.
     ....................
     కొందరు తల్లులు తమ పిల్లల్ని చావబాదిన  కేసులను గురించి కూడా విన్నాము. ఇదంతా ఎంతో బాధాకరం. 
    ..............

    చిన్నతనంలో పునాది బాగుంటే జీవితంలో మంచిపౌరులుగా తయారయ్యే అవకాశం ఉంది. తల్లితండ్రి ఎన్ని మంచి విషయాలను నేర్పించినా కూడా, బయటప్రపంచం, సోషల్మీడియా..వాటి ప్రభావం చాలానే ఉంటుంది..

    అయితే, తల్లితండ్రి మరీ స్ట్రిక్టుగా చెప్పటం కాకుండా, కొంత ఫ్రెండ్లిగా పిల్లలకు విషయాలను చెప్పటం మంచిది.

    తల్లి చెప్పిన మాటలను చాలామంది పిల్లలు వింటారు. అయితే, తల్లులు మంచి విషయాలను నేర్పించాలి. పిల్లల మనస్సులో పంతాలు, పట్టుదలలు, ఆవేశకావేషాలు, పాపాలు చేసైనా డబ్బు సంపాదించాలి..అనే విధంగా చెప్పకూడదు.

    అమ్మాయిలు..అబ్బాయిలు ఒకరినొకరు గౌరవించుకోవాలని, జీవితంలో అధర్మంగా ఉండకూడదని, ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించకూడదని చెపుతూ ఉంటే దాని ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది.  వాళ్లు మంచిపౌరులుగా తయారయ్యే అవకాశం ఎంతో ఉంటుంది.

    అయితే,  సమాజంలో చెడు ప్రభావం వల్ల, ఎంత చెప్పినా కొందరు త్వరగా మాట వినేటట్లు లేరు. 
     
     ఈ రోజుల్లో తల్లితండ్రికి పిల్లలతో గడపటానికి కూడా సమయం ఉండటం లేదు. 

    సరిగ్గా తినటానికి సమయం లేక, కుటుంబసభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి సమయం లేనప్పుడు ఎందుకొరకు అంత డబ్బు సంపాదించాలి? జీవితంలో డబ్బు ఎంతో ముఖ్యమే. అయితే, జీవితం కూడా ఎంతో ముఖ్యం.
    ................................

     కుటుంబసభ్యులకు తీరిక దొరికినా కూడా ఒకరితో ఒకరు ఏం మాట్లాడాలో తెలియక ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. కుటుంబసభ్యుల మధ్య అనేక కారణాల వల్ల సఖ్యత లేక గొడవలు పడుతున్నారు. మనుషుల్లో పంతాలు, పట్టుదలలు ఎక్కువయ్యాయి.

    కుటుంబం అంటే ఎన్నో సమస్యలుంటాయి. పెద్దవాళ్లతో అభిప్రాయ బేధాలు, భార్యాభర్త మధ్య ఇగోలు, పిల్లల సమస్యలు, డబ్బు సమస్యలు..ఎన్నో ఉంటాయి. ఇలాంటప్పుడు బయట వారితో స్నేహాలు బాగున్నట్లు అనిపిస్తాయి. 

    ఈ రోజుల్లో వ్యవస్థ అంతా మారిపోయింది కాబట్టి, ఎంతో ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి.

    ఒకే ఇంట్లో ఉంటూ  పెద్దవాళ్లతో సరిపడకుంటే , పెళ్లయిన పిల్లలు, పెద్దవాళ్లు..పక్కపక్కన ఇళ్లలో ఉండవచ్చు లేక ఒకే ఊరిలో దూరంగా వేరే ఇళ్ళలో ఉండవచ్చు. అప్పుడు సహాయం అవసరమైనప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉంటారు....ఇంకా కుదరకపోతే వేరే ఊర్లో ఉండవచ్చు.
    ...............

    చాలామంది డబ్బు సరిపోవటం లేదంటారు. 

    ఈరోజుల్లో ఒకరిని చూసి ఒకరు పోటీలుపడుతూ డబ్బు ఖర్చు చేసి అనేక వస్తువులను కొనటం ఎక్కువయ్యింది. చూసినవన్నీ కొంటూ పోతే ఇంట్లో అందరూ ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు సరిపోదు.

    వ్యాపారస్తులు వస్తువుల ధరలు పెంచేస్తున్నారు. ప్రజలు వస్తువులను అదేపనిగా కొనటాన్ని తగ్గిస్తే, వాళ్ళు ధరలు  కూడా తగ్గించక తప్పదు. 
     
     అదేపనిగా వస్తువుల్ని కొని పడేస్తుంటే చెత్త పెరిగి పర్యావరణసమస్యలు కూడా పెరుగుతాయి.
    ......................................

    సరైన ఆహారం, కుటుంబసభ్యుల మద్య ఆప్యాయతలకు సమయం లేనప్పుడు ఎంత డబ్బున్నా ఏం లాభం? సరైన ఆహారం, ఆప్యాయత ఉన్న కుటుంబాలలో వారు ఆరోగ్యంగా, చక్కగా జీవిస్తారు, అలాంటివారు ఉన్న సమాజమూ బాగుంటుంది.
    ....................

     ఈ రోజుల్లో 
    చాలామంది ఆదరాబాదరాగా ఉదయాన్నే పరుగులు పెడుతున్నారు. చంటిపిల్లల్ని డేకేర్లో వేయటం , పెద్దవాళ్ళు ఉద్యోగాలకు పోవటం..ఇలా ఉంటుంది.

     చిన్నతనంలోనూ టైం అయిపోతోందంటూ టెన్షనే, పెద్దయ్యాక అఫీసుల్లో టార్గెట్లతో టెన్షనే, ఇక వృద్దాప్యం వచ్చాక సంపాదించిన సొమ్ము హాస్పిటల్స్క్ పోస్తూ టెన్షన్లతోనే జీవితం సమాప్తం అవుతుంది. 
     
    చివరికి మిగిలేదేమిటి?