నాకు కొన్ని సందేహాలు కలిగాయి.
నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.
కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...
అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..
మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది.
అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు.
పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?
ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా?
పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే, ఆ సంగతిని వాళ్ళు చెప్పకపోవచ్చు.
అంటుముట్టు..మైల
ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.
ఇన్ని సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.
స్త్రీల అంటుముట్టు గురించి పబ్లిక్ గా మాట్లాడటం ఏమిటీ అంటున్నారు కొందరు.
మరి స్త్రీల నెలసరి గురించి అలా చేయకూడదు..ఇలా చేయకూడదు..చేస్తే కష్టాలు వస్తాయని పబ్లిక్ గా కొందరు చెబుతున్నప్పుడు, ఆ సందేహాల గురించి పబ్లిక్ గా మాట్లాడితే తప్పేమిటి?
ఇంకా, చాలా విషయాల గురించి కూడా.. ఇలా చేయకూడదు..అలా చేయకూడదు..చేస్తే కష్టాలు వచ్చి మీద పడిపోతాయని చెబుతున్నారు. ఇవన్నీ విని, ఏం చేస్తే ఏం తప్పో? అనే పరిస్థితితో భయం, అయోమయం కలిగి, అనేక సందేహాలతో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది.
.............................
లోకకల్యాణం కొరకు పూజలు చేసే సందర్భాలలో.. లోకంలో అంతా బాగుండాలని పూజ చేస్తారు.
ఎవరికి వారు పూజలు చేయించుకునే సందర్భాలలో.. అంటుముట్టు, మైలలో ఉన్నవారు కొన్ని రోజులు ప్రత్యేక పూజలు చేయడానికి దూరంగా ఉండాలంటారు.
నాకు ఏమనిపిస్తోందంటే, అర్చన, అభిషేకం వంటి సందర్భాలలో..వేరే ఊరిలో ఉన్న కుటుంబసభ్యులందరి పేర్లు చెప్పటం సంగతి ఏమోకానీ..
అంతా బాగుండాలని, కుటుంబంలో అందరూ బాగుండాలని.. భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది.
(వేరే ఊరిలో ఉన్నవారి పరిస్థితి(అంటుముట్టు..) గురించిన సంగతులు తెలియనప్పుడు, ఇలా కూడా చేయవచ్చేమో?..అనిపించింది.)
.........................
ఇంకొక విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.
మేము చెన్నైలో ఉన్నప్పుడు, అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా, స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు.
పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.
....................
గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా, దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.
మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.
............................
వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment