koodali

Thursday, January 22, 2015

షిరిడి సాయిబాబా గురువుకాదు అనటం అన్యాయం..

 
ఎన్నో చక్కని బోధలు చేసిన  సాయిబాబా గురువు కాదనటం అన్యాయం. సమాజంలో పెరుగుతున్న మతఘర్షణలను నివారించే విధంగా బోధనలు చేసిన సాయిబాబాను తప్పుపట్టటం సమంజసం కాదు. 

సాయికి మతం లేదు. దైవం ఒక్కరే అని సాయి బోధ. సబ్ కా మాలిక్ ఏక్ హై..

సాయిబాబా అల్లామాలిక్ అనటం వల్ల హిందువు కాదు అంటున్నారు. మరి, సాయి హిందువులలాగ ధునిని వెలిగించారు, విబూదిని(ఊదీని)   పంచేవారు...మతసామరస్యం కొరకు సాయిబాబా అలా చేసిఉండవచ్చు.

.....................

సాయిపూజా విధానంలో , సరళమైన విధివిధానాలు  ..వంటివెన్నో  ప్రజలను ఆకర్షించాయి. క్రమంగా ఎందరో ప్రజలు  సాయిబాబాను గురువుగా  ఆరాధించటం మొదలుపెట్టారు. 
 
పశుపక్ష్యాదులనే గురువులుగా స్వీకరించవచ్చని సాక్షాత్తూ దత్తాత్రేయుల వారే తెలియజేసినప్పుడు సాయి వంటి గొప్ప వ్యక్తిని గురువుగా భావించకూడదని ఎందుకంటున్నారు ?

.........................
 
సాయి ముస్లింలకు  సంబంధించిన  విధంగా అల్లామాలిక్  అనేవారు,  అలాగే   హిందువులకు   సంబంధించిన  విధంగా ధునినీ వెలిగించేవారు, ఊదీని(విభూతిని) పంచేవారు.సాయికి మతం లేదు. దైవం ఒక్కరే అన్నదే సాయి బోధ.

 దైవం ఒక్కరే  అన్నది  ఏ మతం వారు  అయినా అంగీకరించవలసిన విషయం. ఏ మతం వారైనా విశ్వాన్ని తాము పూజించే దైవమే సృష్టించారని నమ్ముతారు. విశ్వం మొత్తాన్నీ ఒకే దైవం సృష్టించారనే  మాటను గమనిస్తే  అన్ని మతాల ప్రజలనూ సృష్టించిన దైవం  ఒక్కరే అవుతారు  కదా ! 


ప్రతి మతానికీ  వేరువేరు  దైవాలున్నారని  అనుకుంటే వారివారి  దైవాల  గొప్పతనాన్ని  వారు  తక్కువ  చేసుకున్నట్లే. నా దృష్టిలో  దైవం  ఒక్కరే. సూర్యుని  కొందరు సన్  అంటారు, కొందరు సూర జ్ అంటారు..కొందరు సూర్యుడు అంటారు..


అలాగే ఏ మతం వాళ్ళయినా పూజించే దైవశక్తి ఒక్కటే. కొందరు క్రీస్తు అంటారు, కొందరు అల్లా అంటారు, కొందరు 
దుర్గమ్మా శివా కేశవా..  అంటారు..కొందరు  దైవాన్ని నిరాకారంగా ఆరాధిస్తారు.హిందూ మతంలో కూడా నిరాకార ఆరాధన ఉంది.
 
 
ఎవరి దేవతారూపాలను వారు ఆరాధించుకోవచ్చు. అయితే, కొన్ని మతాలవారు ఇతర మతాలను నాశనం చేయటానికి ప్రయత్నిస్తుంటారు. నయానాభయానా ఇతరులను తమ మతంలోకి మార్చటానికి ప్రయత్నిస్తుంటారు. ఇది తప్పు.
......................... 

అయితే, వ్యాసపూర్ణిమ వ్యాసమహర్షిది కాబట్టి,  వ్యాసమహర్షిని స్మరించుకోవాలి.

...................

 మరికొన్ని విషయాలు..ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.

............
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. 

  షిరిడి సాయిబాబా తన పాటికి తాను ఉండగా, హిందువులే ఆయన వద్దకెళ్లి సలహాలను అడిగితే, వారు  తన అభిప్రాయాలను  చెప్పి ఉంటారు. 
 
సాయిబాబా షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని  సాయి అని పిలిచారట. తరువాత భక్తులు రావటం పెరిగింది. షిర్డిసాయి తనకు ఆడంబరంగా పూజలు చేయటం వద్దనేవారట. అయినా భక్తులు వినరు కదా..
 
సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు. 
 
కొందరు మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత, వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ సమాజంలో ఉంటారు.
.....................
 
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.

అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.

సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే.  దైవము ఒకే శక్తి.
 ...........................
 
కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
 .....................
 
 హిందువుల్లోనే బోలెడుమంది దేవతలుండగా కొత్తగా ఎందరినో ఎందుకు ఆరాధిస్తారో ? తెలియదు.
 
కొందరు వ్యక్తులు తాము ప్రజలతో ఎక్కువ కలవకుండా తమ పనితాము చేసుకుంటున్నా కూడా, కొందరు హిందువులు వారి వెంట కూడా పడుతుంటారు...ఇది కొందరు హిందువులలో సమస్య. 
 
 ఉదా.. ఆ మధ్యన కొందరు తిరువణ్ణామలై లో ఒకామె చుట్టూ చేరి, కొందరు ఆమె తినిపడేసిన ఆహారాన్ని తినటం కూడా చేసారట. అలా చేస్తే కష్టాలు పోతాయనే ప్రచారం కూడా జరిగిందట....ఆమె గిరిప్రదక్షిణ కూడా చేస్తుందట.

 తిరువణ్ణామలై లో, తిరువణ్నామలై స్వామి అమ్మవారు ఉన్నారు. దైవ ప్రసాదాన్ని తింటే ఎంతో మంచిది కదా..

 దైవప్రసాదం ఉండగా, టోపి అమ్మ తిని పడేసిన ఆహారాన్ని ఎందుకు తినటం? హిందువులు ఎందుకు ఇలా చేస్తున్నారో? అర్ధం కావటం లేదు.
 
దైవభక్తులకే మహిమలున్నప్పుడు దైవానికి  మరెన్నో మహిమలుంటాయి కదా.
............

సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము,  ఎక్కువ సమయం 
చేయలేము...అనుకుంటే, తక్కువ ఖర్చుతో, కొంత సమయంలో  పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా.. అనుకుంటున్నాను.

 
హిందువులు చాలా నియమాలను  పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
 
హిందు పెద్దలు కూడా ఈ విషయాలను గమనించాలి.  
ఈ  రోజుల్లో ఆచారవ్యవహారాలంటూ  బోలెడు నియమాలను చెబితే, పాటించలేక సరళంగా దైవపూజ చేసే మార్గాల వైపు జనం వెళ్లే అవకాశం ఉంది.

 పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా,  సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.

 ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
**********
 వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 

No comments:

Post a Comment