త్రిమూర్తి స్వరూపమైన .. శ్రీఅనంత లక్ష్మిసత్యవతిదేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారికి వందనములు.
Monday, November 14, 2016
కార్తిక పౌర్ణమి.. సోమవారం..
త్రిమూర్తి స్వరూపమైన .. శ్రీఅనంత లక్ష్మిసత్యవతిదేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారికి వందనములు.
Saturday, November 12, 2016
కొంత పన్నులు తగ్గిస్తే ..
మన ప్రజలకు క్యూలు కొత్త కాదు. సామాన్యులకు కొన్ని కష్టాలూ కొత్తకాదు.
నల్లడబ్బు సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే తాత్కాలిక క్యూలు, కొన్ని కష్టాలు పెద్దలెక్కలోనివి కావు.
అయితే పెద్దనోట్లు రద్దు విషయం కొందరు పెద్దలకు ముందే తెలిసి సర్దుకోవటం జరిగితే మాత్రం అది అన్యాయమే.
..............
పన్ను కట్టే విషయంలో పెద్దవాళ్ళను వదలకూడదు.
విదేశాలలో దాచిన నల్లడబ్బు వెనక్కి వచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలి.
.........
దేశప్రజలు ఎందరో తిండి లేక బాధపడుతుంటే పార్లమెంట్ వద్ద తక్కువరేటుకు భోజనం ఎందుకు? దేశప్రజలకు కూడా తక్కువరేటుకు భోజనం అందించండి.
...................
ప్రజలు కూడా పన్నులు కట్టడంలో మోసాలు చేయకూడదు.
ప్రభుత్వం ఖజానా బాగుంటేనే కదా దేశం అభివృద్ధి చెందుతుంది.
............
ఇక, ప్రభుత్వాలు విపరీతమైన పన్నులతో బాదటం, పెనాల్టీ టాక్స్ అంటూ భారీ మొత్తం ...కాకుండా కొంత పన్నులు తగ్గిస్తే ఎక్కువమంది ప్రజలు పన్ను కట్టడానికి ముందుకు వస్తారు.
తద్వారా నల్లడబ్బు తగ్గుతుంది.
100, 50, 10...నోట్ల సమస్య... ఇంతకుముందు కూడా ఉంది...
100, 50, 10...నోట్ల సమస్య ఇప్పుడు వచ్చింది కాదు. ఇంతకుముందు కూడా ఉంది.
ఇంతకుముందు కూడా రైతుబజారు వెళ్తే 500, 1000..నోట్లు తిసుకునేవారు కాదు. చిల్లర ఇవ్వమంటారు.
అందువల్ల చిన్న నోట్లు అవసరం ఎక్కువగా ఉంటుంది.
ఇంతకుముందు కూడా పెద్దపెద్ద మాల్స్ లో ఎక్కువగా పెద్దనోట్లు తీసుకునేవారు.
చిన్న షాప్స్ లో పెద్ద నోట్లకు చిల్లర దొరకటం కష్టం.
బస్సులలో టికెట్ తీసుకునే విషయంలో, తక్కువ మొత్తంలో సరుకులు కొనే సందర్భాలలో.. చిల్లర లేక వ్యాపారస్తులు వినియోగదారులు గొడవలు పడటం ఇంతకుముందే ఉంది.
ఇలాంటప్పుడు ప్రభుత్వాలు 100, 50.10..నోట్లు ఎక్కువగా ముద్రించాలి.
చిన్న నోట్లను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
................
పెద్దనోట్ల రద్దుతో ఎక్కువమంది సామాన్య మధ్యతరగతి వారు కూడా తమ వద్ద ఉన్న 100, 50..నోట్లు దాచుకుని బయట కొనుగోళ్ళ కోసం 500, 1000 నోట్లే తెస్తున్నట్లున్నారు.
పాత నోట్లను బ్యాంకులలో మార్చుకోవచ్చు లేక ప్రభుత్వ కార్యాలయాలలో పన్నులు కట్టుకోవచ్చు.
అంతేకానీ కూరల షాపులలో, టీ కొట్టులలో పెద్దనోట్లు ఇస్తే వాళ్ళు మాత్రం ఆ పెద్ద నోట్లను ఏం చేసుకుంటారు ?
ఈ విషయం తెలిసికూడా కొందరు ప్రజలు సరుకులు కొనటానికి చిన్నవర్తకుల వద్దకు వెళ్ళటం.. వాళ్ళు తీసుకోమని తిరస్కరిస్తే...ఆ విషయాన్ని ఫిర్యాదు చేయటం జరిగింది.
చిన్న టీ షాపుకు,చిన్న కూరల షాపుకు 500, 1000 నోట్లు ఎందుకు పట్టుకెళ్ళటం?
మనీ,మనీ.....
ఇప్పుడు జరిగిన పెద్దనోట్ల రద్దు.. తదనంతర పరిణామాల వల్ల దేశంలో అందరికీ పన్నుల గురించి చాలా అవగాహన వచ్చింది.
పన్ను కట్టకపోయినా ఏమీ కాదులే..అనే ధోరణి తగ్గుతుంది. బడా వాళ్ళకు కూడా కొంత కదలిక వస్తుంది.
..................
అయితే ఇప్పుడు పెద్దనోట్లు ఎందుకు రద్దు చేయటం... మళ్ళీ తిరిగి తేవటం ఎందుకు ?అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. కొత్తనోట్లు పాతనోట్లను పోలిలేవు. కొత్తనోట్లు డిజైన్ మారింది.
ఇలా అప్పుడప్పుడు పాతనోట్లను రద్దుచేయటం..కొత్త డిజైన్ తో కొత్తనోట్లను తేవటం వల్ల దొంగనోట్లు సమస్య, నల్లడబ్బు సమస్య కొంతకాలం.. కొంతవరకూ తగ్గుతుంది.
అయితే ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల ఇకపై ప్రజలు 2000నోట్లను భారీగా నిల్వ చేయటానికి భయపడతారు.
...........
ఈ చర్యల వల్ల రియల్ ఎస్టేట్ భారీగా దెబ్బతిని సామాన్య ,మధ్యతరగతి ప్రజలు నష్టపోతారని కొందరు ప్రచారం చేస్తున్నారు.
నిజం చెప్పాలంటే ..ఇప్పుడు ఇళ్ళు, స్థలాలు ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయా?
ఈ పరిణామాల వల్లనయినా రియల్ ఎస్టేట్ ధరలు దిగివస్తే మంచిది.
ఇక , భారీ ఎత్తున బంగారం కొంటున్నవారిపై నిఘా ఉంచుతున్నారు కదా!
............
అయితే మనదేశంలో చాలామంది చదువుకున్నవాళ్ళకు కూడా బ్యాంక్ వ్యవహారాల గురించి సరిగ్గా తెలియదు.
ఇలాంటప్పుడు పెద్దనోట్లన్నీ రద్దు చేయటం సరైనది కాదు.
2000 నోటు బదులు కొత్త 1000నోటు వస్తే బాగుంటుంది.
100 నోట్లతో మాత్రమే ఎక్కువమొత్తంలో లావాదేవీలు నిర్వహించటం కష్టం. అందువల్ల 500, 1000 నోట్లు ఉండటం అవసరమే.
అన్ని లావాదేవీలూ బ్యాంకుల ద్వారా మాత్రమే నిర్వహించటం ఇంకా అభివృద్ధి చెందని మన దేశంలో ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు.
సైబర్ నేరాలు జరుగుతున్న ఈ రోజుల్లో అన్ని లావాదేవీలు ఆన్ లైన్ ద్వారానే జరగాలన్నా కష్టమే.
Wednesday, November 9, 2016
చిల్లర సమస్యలు....మరికొన్ని విషయాలు..
500, 1000 నోట్లు వాడకుండా రెండురోజులు జీవించలేమా ? 100, 50, 10..నోట్లు అందరివద్దా ఉంటాయి కదా!
రెండురోజులు ఊరుకుంటే 500, 1000 నోట్లు మార్చుకోవచ్చు.
500, 1000నోట్లు తప్ప .. వంద, వందకు తక్కువ నోట్లు లేనివారు సామాన్యులు ఎలా అవుతారు?
తెల్లడబ్బు ఎప్పుడయినా మార్చుకోవచ్చు. నల్లడబ్బు ఉన్నవారే బ్యాంకులకెళ్లి మార్చుకోలేరు. తెల్లడబ్బు వాళ్ళకు ఇబ్బందేమీ లేదుకదా!
************
అయితే, తెల్లడబ్బుఉన్న వాళ్ళలో కూడా కొందరికి ఇబ్బంది వచ్చే అవకాశముంది.కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు తప్పవు మరి.
***************
నిజమే, ఇంతటితో నల్లడబ్బు పూర్తిగా పోదు. దేశంలో లంచం వంటివి పోవాలి.
లంచం ఇచ్చి పని చేయించుకునే వ్యవహారంలో ఇతరులకు డబ్బు ఆశ చూపటం లంచమే ...అయితే... డబ్బు బదులు వస్తువులు, ఉద్యోగాలు, పదవులు ఆశచూపటం కూడా లంచమే.ఇవన్నీ కూడా మారాలి.
******************
ఈ రోజుల్లో చాలామంది ప్రజలు స్వార్ధంగా ఆలోచిస్తున్నారు.
ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు విలాసవంతంగా జీవించటం కొరకు ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చుపెడుతున్నారు.
వ్యాపారులు కూడా బోలెడు ధరలు పెట్టి సరుకులు అమ్ముతున్నారు.
ఎన్నో లక్షలు పెట్టి స్థలాలు కొనటం... రిజిస్టర్ చేసుకునేటప్పుడు తక్కువధర చూపించటం వంటివి అలవాటయిపోయాయి.
(అయితే టాక్సులు కొంతవరకూ తగ్గిస్తే పన్ను ఎగవేతలు తగ్గుతాయేమో?)
..........................
10వేలకు మించిన నగదు లావాదేవీలు బ్యాంక్ ద్వారా మాత్రమే జరిగేలా చట్టం తెస్తే నల్లడబ్బు తగ్గుతుందనే వారూ ఉన్నారు.(ఇది కొంతవరకు ఉపయోగపడవచ్చు.)
అయితే పెరిగిన టెక్నాలజీ వల్ల లాభాలతోపాటు నష్టాలూ ఉన్నాయి.
ఆ మధ్యన కొన్ని బ్యాంకుల వాళ్ళ వెబ్సైట్లు హ్యాకింగ్ గురవటం గురించి బ్యాంకుల వాళ్ళు, కస్టమర్లు.. కంగారుపడటం జరిగింది.
టెక్నాలజీ వల్ల అంతా మంచే జరుగుతుందనీ చెప్పలేం.టెక్నాలజీని వాడుతూ మోసాలు చేసే వారూ ఎక్కువయ్యారు.
******************
ఏదిఏమైనా సమాజంలో సమస్యలు తగ్గాలంటే టెక్నాలజీ అవసరమే కానీ , అంతకంటే ముందు నైతికవిలువలు పెంపొందేలా చర్యలు తీసుకోవాలి.
మనుషులలో నైతిక విలువలు పెరిగినప్పుడే నల్లడబ్బు, లంచం.. వంటి సమస్యలు తగ్గి సమాజం బాగుపడుతుంది.
చిల్లర సమస్యలు..కొందరి అసహనం..
పాతకాలంలో వస్తుమార్పిడి విధానం ఉన్నప్పుడే బాగుందనిపిస్తోంది.
ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా కొన్ని నోట్లను రద్దు చేస్తూ ఉంటే బాగుంటుందనిపిస్తుంది.
అయితే వీటితో పాటూ విదేశాలలో దాచిన నల్లడబ్బును కూడా తిరిగి రప్పించే ప్రయత్నాలు చేయాలి.
ఇప్పుడు 500, 1000..నోట్ల గురించిన భయం తగ్గింది.
నిన్నటి వరకూ ఏది దొంగనోటో? ఏది సరైన నోటో? తెలియక అయోమయంగా ఉండేది. ప్రస్తుతానికి ఆ భయం లేదు.
అయితే, మళ్ళీ 500, 2000..నోట్లు వస్తాయంటున్నారు.
అయితే కొత్తనోట్ల విషయంలో దొంగ నోట్లు తయారీ కష్టం అంటున్నారు.
ట్రాక్ చేసే పద్ధతి వల్ల నల్లడబ్బు చలామణీ కూడా కష్టమే అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?
...................
కొందరు ఏమంటున్నారంటే,ఈ అకస్మాత్తు చర్య వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందే విషయాలు చెప్పి చేస్తే బాగుండేది అంటున్నారు.
( అంటే, ఇన్ కం టాక్స్ వాళ్ళు ముందే చెప్పి దాడులు చేయాలి... అన్నట్లు ..ముందే చెప్పి చేస్తే ఇంకేముంటుంది?
ముందే చెపితే తమవద్ద ఉన్న నల్లడబ్బును జాగ్రత్తగా మార్చేసుకునేవారు.
.ముందే పెద్ద ఎత్తున వందనోట్లను బాంకులకు పంపినా విషయాన్ని పసిగట్టి చాలామంది జాగ్రత్తగా సర్దుకునేవారు.)
ఇలా అకస్మాత్తుగా ప్రకటించటమే కరెక్ట్. అయితే ఈ చర్య వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినా తప్పని పరిస్థితి.
********************
ప్రజలకు మంచి చేయటం కోసం ఒక చిన్న ప్రయత్నం ప్రయత్నిస్తే చాలామంది ప్రజలు అర్ధం చేసుకోకుండా మాట్లాడటం అత్యంత బాధాకరం.
చాలామంది సామాన్యప్రజలు కూడా తమ వద్ద 500, 1000 నోట్లు తప్ప చిన్న నోట్లు లేవన్నట్లు మాట్లాడుతున్నారు.
ఇవన్నీ గమనిస్తుంటే భారతప్రజలు అందరూ సంపన్నులు అయ్యారు కాబోలు అనిపిస్తోంది.
వీళ్ళకు తోడు కొన్ని చానల్స్ వాళ్ళు ప్రజలకు వివరించి చెప్పాల్సింది పోయి ప్రజలు చాలా కష్టాలు పడిపోతున్నారంటూ అందరికీ చూపెడుతున్నారు.
అయితే, కొన్ని చానల్స్ వాళ్ళు ప్రజల సందేహాలకు తగిన సమాధానాలు తెలియజేస్తూ సహాయం చేస్తున్నారు.
***********************
ఈ చిల్లరసమస్య తగ్గాలంటే రెండురోజులు ఆఫీసులకు సెలవులు ప్రకటించటం మంచిది.
కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ప్రజలు ఓర్చుకోవాలి.
హుధుద్ తుపాన్, నగరాలలో వరదలు .. వంటివి వచ్చినప్పుడు ప్రజలు ఇంట్లోనే ఉన్నారు కదా! అలాగే రెండురోజులు ఇబ్బంది భరించలేరా ?
ఇంత అసహనం వ్యక్తం చేయటం ఎంతవరకూ సమంజసం?
అత్యవసరంగా హాస్పిటల్ వంటి ఖర్చులకు మినహాయింపు ఇచ్చారు కదా!
నిజమే ఈ ప్రయత్నం వల్ల నల్లడబ్బు పూర్తిగా తగ్గకపోవచ్చు, ఇందులో కొన్ని రాజకీయాలూ ఉండవచ్చు.
అయితే ఒక ప్రయత్నం చేస్తుంటే.. ప్రజలు ఇంత అసహనం వ్యక్తం చేస్తుంటే ఇక ప్రజల సమస్యలు తగ్గించటానికి కొత్త ప్రయత్నాలు చేయటానికి ఎవరూ ముందుకు రారు. వారి ఖర్మకు వారిని వదిలివేయటం తప్ప.
******************
సరిహద్దులలో సైనికులు దేశప్రజల రక్షణ కొరకు ఎన్నో కష్టాలు పడుతున్నారు.
అలాంటిది దేశప్రయోజనాల కొరకు ప్రజలు కొన్ని రోజులు ఇబ్బందులు పడలేరా?
Friday, November 4, 2016
ఈ రోజుల్లో ఆరోగ్యం అని గానుగనూనెలు.. మరికొన్ని విషయములు..అనారోగ్యాలకు అనేక కారణాలు..
ఈ రోజుల్లో ఆరోగ్యం అని గానుగనూనెలు వాడటం మొదలెట్టారు.. పాతకాలంలో యంత్రాలు లేనికాలంలో పశువులసాయంతో గానుగ తో నూనెలు తీసేవారు. గానుగ తిప్పటానికి పశువులు చాలాసేపు తిరగవలసి వస్తుంది. మనిషి కూడా చెక్కపైన కూర్చుని అప్పుడప్పుడు పశువులను కొడుతుంటాడు.
యంత్రాలు లేని కాలంలో అలా తీయటం సరే కానీ, ఇప్పుడు యంత్రాలు ఉన్నరోజుల్లో కూడా పశువులను కష్టపెడుతూ అలా నూనెలు తీయటం ఎంతవరకు సరైనది?
నూనె వేడెక్కకుండా యంత్రాలతో నూనెను తీయవచ్చు. అంటే, వెట్ గ్రైండెర్ తో పప్పును రుబ్బడానికి రుబ్బురాయిని యంత్రం సాయంతో తిప్పినట్లుగా..చెక్కగానుగను యంత్రంతో తిప్పుతూ నూనెను తీసే విధానం కూడా ఉంది. అలా చక్కగా గానుగ నూనెను తీసి వాడుకోవచ్చు.
మనుషులు అంతా పొల్యూషన్ చేస్తూ ఇంకా ఆరోగ్యం పేరుతో పశువులను కష్టపెట్టటం సరైనది కాదు.
మనుషులు అంతా పొల్యూషన్ చేస్తూ ఇంకా ఆరోగ్యం పేరుతో పశువులను కష్టపెట్టటం సరైనది కాదు.
***********
అనారోగ్యాలకు అనేక కారణాలు..
..........
ఈమధ్య B12 గురించి చాలామంది చాలా విధాలుగా చెబుతున్నారు.B 12 శరీరంలో లోపిస్తే చాలా జబ్బులు వస్తాయని, B12 లభించాలంటే మాంసాహారం తినటం వల్లనే లభిస్తుందన్నట్లు చెబుతున్నారు.
అనారోగ్యాలకు ఎన్నో కారణాలుంటాయి. అవన్నీ వదిలి, కేవలం మాంసాహారం తినకపోవటం వల్లే B12 రోగాలు వస్తున్నాయన్నట్లు కొందరు చెబుతున్నారు.
గమనించవలసిన విషయం ఏమిటంటే, మాంసాహారం బాగా తినే చాలామందిలో కూడా B12 లోపం ఉంటోంది. శాకాహారం తినే చాలామంది ఆరోగ్యంగా చక్కగా ఉండటం కూడా చూస్తున్నాము.
కొందరు విదేశాల వాళ్ళు కొన్ని కూరగాయలు, కొన్ని చిక్కుడురకాలు, మాంసాహారాన్ని ఎక్కువగా తింటారు.వాళ్ళు ఎక్కువ పప్పుధాన్యాలను వాడరు.
..........
ఈమధ్య B12 గురించి చాలామంది చాలా విధాలుగా చెబుతున్నారు.B 12 శరీరంలో లోపిస్తే చాలా జబ్బులు వస్తాయని, B12 లభించాలంటే మాంసాహారం తినటం వల్లనే లభిస్తుందన్నట్లు చెబుతున్నారు.
అనారోగ్యాలకు ఎన్నో కారణాలుంటాయి. అవన్నీ వదిలి, కేవలం మాంసాహారం తినకపోవటం వల్లే B12 రోగాలు వస్తున్నాయన్నట్లు కొందరు చెబుతున్నారు.
గమనించవలసిన విషయం ఏమిటంటే, మాంసాహారం బాగా తినే చాలామందిలో కూడా B12 లోపం ఉంటోంది. శాకాహారం తినే చాలామంది ఆరోగ్యంగా చక్కగా ఉండటం కూడా చూస్తున్నాము.
కొందరు విదేశాల వాళ్ళు కొన్ని కూరగాయలు, కొన్ని చిక్కుడురకాలు, మాంసాహారాన్ని ఎక్కువగా తింటారు.వాళ్ళు ఎక్కువ పప్పుధాన్యాలను వాడరు.
భారతదేశం వాతావరణం వల్ల చాలా పంటలు పండుతాయి.
భారతదేశంలో ఎన్నోరకాల పంటలు పప్పుధాన్యాలు పండించి తింటారు. మనకు ప్రొటీన్స్ చక్కగా లభిస్తాయి.
అయితే, ఇప్పుడు కొందరు పప్పుధాన్యాల ద్వారా ప్రొటీన్స్ సరిపోవని, మాంసాహారం తప్పక తినాలన్నట్లు చెబుతున్నారు. పాతకాలంలో చాలామంది మాంసాహారులు కూడా ఇప్పటిలా రోజూ మాంసాహారాన్ని తినేవారు కాదు. కొన్నిసార్లు మాత్రమే తినేవారు. కాయకష్టం చేసినా కూడా, ఆరోగ్యంగా ఉండేవారు.
మరి, చాలామంది మాంసాహారులలో కూడా బి12 లోపం ఎందుకు ఉంటోంది? అనేదానికి ఏవేవో కారణాలు చెబుతారు.
ఈ రోజుల్లో అనారోగ్యాలకు అనేక కారణాలున్నాయి. పాతకాలంలో స్త్రీలు, పురుషులు రోజులో కొంతసేపయినా ఎండలో గడిపేవారు. స్త్రీలు ఆరుబయట పెరట్లో గిన్నెలుకడగటం, దుస్తులు ఉతకటం, పెరట్లో పనులు..చేసేవారు. వారికి ఎండ తగిలి డి విటమిన్ చక్కగా లభించేది.
భారతదేశంలో డి విటమిన్ కొరకు ఎండ చక్కగా ఉంటుంది. మనదేశంలో ఎండ ఉన్నా కూడా, చాలామందిలో డి విటమిన్ లోపం ఉంటోంది.
ఇప్పుడు అన్నీ ఇంట్లోనే వాషింగ్ మెషిన్, వంటగదిలో సింక్..అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఎండ తగలదు, సరిగ్గా నడవటం కూడా లేదు. స్త్రీలు ఇంట్లో, పురుషులు ఆఫీసుల్లో.. ఆ కొద్దిస్థలంలోనే ఉంటారు.
అయితే, ఇప్పుడు కొందరు పప్పుధాన్యాల ద్వారా ప్రొటీన్స్ సరిపోవని, మాంసాహారం తప్పక తినాలన్నట్లు చెబుతున్నారు. పాతకాలంలో చాలామంది మాంసాహారులు కూడా ఇప్పటిలా రోజూ మాంసాహారాన్ని తినేవారు కాదు. కొన్నిసార్లు మాత్రమే తినేవారు. కాయకష్టం చేసినా కూడా, ఆరోగ్యంగా ఉండేవారు.
మరి, చాలామంది మాంసాహారులలో కూడా బి12 లోపం ఎందుకు ఉంటోంది? అనేదానికి ఏవేవో కారణాలు చెబుతారు.
ఈ రోజుల్లో అనారోగ్యాలకు అనేక కారణాలున్నాయి. పాతకాలంలో స్త్రీలు, పురుషులు రోజులో కొంతసేపయినా ఎండలో గడిపేవారు. స్త్రీలు ఆరుబయట పెరట్లో గిన్నెలుకడగటం, దుస్తులు ఉతకటం, పెరట్లో పనులు..చేసేవారు. వారికి ఎండ తగిలి డి విటమిన్ చక్కగా లభించేది.
భారతదేశంలో డి విటమిన్ కొరకు ఎండ చక్కగా ఉంటుంది. మనదేశంలో ఎండ ఉన్నా కూడా, చాలామందిలో డి విటమిన్ లోపం ఉంటోంది.
ఇప్పుడు అన్నీ ఇంట్లోనే వాషింగ్ మెషిన్, వంటగదిలో సింక్..అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఎండ తగలదు, సరిగ్గా నడవటం కూడా లేదు. స్త్రీలు ఇంట్లో, పురుషులు ఆఫీసుల్లో.. ఆ కొద్దిస్థలంలోనే ఉంటారు.
సూర్యరశ్మిలో ఎంతో శక్తి ఉంటుంది, సూర్యుడు ఆరోగ్యప్రదాత అంటారు. సూర్యరశ్మిలో డి విటమిన్ తో పాటు మరెన్నో విటమిన్లు కూడా ఉంటాయనిపిస్తుంది.
మట్టినేలమీద నడవటం, కష్టపడి పనిచేయటం..వంటివి చేస్తే ఆరోగ్యం.
ఈ రోజుల్లో వాతావరణ పొల్యూషన్ కూడా ఉంది.
టెన్షన్ వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయంటారు. ఈ రోజుల్లో టెన్షన్లు లేనివాళ్లు ఎవరు?
........................................
అనేకకారణాలతో చాలామంది హైదరాబాద్ వంటి నగరాలకు వస్తున్నారు. అయితే, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నీరు హార్డ్ గా ఫ్లోరైడ్ నీరులా ఉంటుంది. ఈ నీరు తాగితే కిడ్నీసమస్యలు వచ్చే అవకాశముంది.
అనేకకారణాలతో చాలామంది హైదరాబాద్ వంటి నగరాలకు వస్తున్నారు. అయితే, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నీరు హార్డ్ గా ఫ్లోరైడ్ నీరులా ఉంటుంది. ఈ నీరు తాగితే కిడ్నీసమస్యలు వచ్చే అవకాశముంది.
తాగేనీరు బాటిల్లో కొనుక్కుని తాగినా కూడా, వంటకు కూరలు కడగటానికి పంపులో నీరు వాడితే ఆ నీరు కొంతయినా కడుపులోకి వెళ్ళే అవకాశముంటుంది. స్టీల్ పాత్రలు కడిగి బోర్లించకుండా అలాగే ఉంచితే ప్లేటులో నీరు ఉన్నచోట తెల్లగా ఏర్పడటం గమనించవచ్చు.
కొందరు ఏమంటారంటే, ఫ్లోరైడ్ నీటితో పండే కూరలు, ఆకుకూరలు కూడా తినకూడదంటున్నారు.
సిటీల్లో కిక్కిరిసి జనాలు వచ్చి నీటిని తోడటం వల్ల కూడా నీటిసమస్యలు, కాలుష్యము ఎక్కువవుతాయి. ఉపాధి అవకాశాలు ఎక్కడికక్కడ నగరాల్లో, పల్లెల్లో కూడా ఉంటే, అందరూ నగరాలకు వలసరారు.
యువత చాలామంది చదువు కొరకు, ఉపాధి కొరకు సిటీలకు వచ్చి హాస్టల్స్లోను, వేరే గదుల్లోను ఉంటారు. బయట తింటారు. ఆ ఆహారం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అలా కూడా అనారోగ్యం వచ్చే అవకాశముంది.
పంటలు పండటానికి వేసే పురుగుమందులు , గిన్నెలు, ఇంటిని శుభ్రం చేయటానికి వాడే రసాయనాలు హాని కలిగించేవి ఉంటాయి.
అందరికి సెల్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు ముందు కూర్చుని సెల్ఫోన్లను అదేపనిగా చేత్తో నొక్కుతూ మార్చటం వల్ల, నరాల జబ్బులు, కళ్లజబ్బులు, మెడనొప్పులు వస్తున్నాయి.
పంటలు పండటానికి వేసే పురుగుమందులు , గిన్నెలు, ఇంటిని శుభ్రం చేయటానికి వాడే రసాయనాలు హాని కలిగించేవి ఉంటాయి.
అందరికి సెల్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు ముందు కూర్చుని సెల్ఫోన్లను అదేపనిగా చేత్తో నొక్కుతూ మార్చటం వల్ల, నరాల జబ్బులు, కళ్లజబ్బులు, మెడనొప్పులు వస్తున్నాయి.
ఇక, బి 12 లోపం అని చెప్పి, మాంసాహారాన్ని మరింత తినాలని చెబుతారు. అవన్నీ తిని కొవ్వు పెరిగి గుండె జబ్బులొస్తాయి.
ప్రోటిన్ అదేపనిగా తింటే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉందని కొందరు చెబుతున్నారు.
........................కొందరు ఇంగ్లిష్ (అల్లోపతి) వైద్యులు ఆయుర్వేదాన్ని, హోమియోని నమ్మరు. అవేం పనిచేస్తాయని తక్కువగా మాట్లాడతారు. కాని, అవి వాడినవారికి అవి ఎంత బాగా పనిచేస్తాయో తెలుసు. కొందరు తమకు తెలిసింది, తాము చదువుకున్నది మాత్రమే కరెక్ట్ అనుకుంటారు.
కొందరు తాము మాంసాహారం తినకుంటే బలహీనులమైపోతామని భయపడతారు. ఆ భయం వల్ల వాళ్లకు బలహీనంగా అనిపిస్తుంది. అది మానసికబలహీనత. . ఇక, మాంసాహారాన్ని అమ్మే వాళ్ళకు, మందులను అమ్మే షాపుల వాళ్ళకు మాంసాహార ప్రచారం వల్ల లాభమే కదా..
జనాలు తాము ప్రాణమున్న జీవులను చంపి ఆ మాంసాన్ని తింటున్నాము అనేవిషయాన్ని మర్చిపోతున్నారా ఏమిటి? ఇతరజీవుల ప్రాణాన్ని తీసి తినటం వీళ్ళ హక్కులా.. మాంసాహారాన్ని తినండి.. అని అలాఎలా తేలికగా చెప్పేస్తున్నారు?
కొందరు తాము మాంసాహారం తినకుంటే బలహీనులమైపోతామని భయపడతారు. ఆ భయం వల్ల వాళ్లకు బలహీనంగా అనిపిస్తుంది. అది మానసికబలహీనత. . ఇక, మాంసాహారాన్ని అమ్మే వాళ్ళకు, మందులను అమ్మే షాపుల వాళ్ళకు మాంసాహార ప్రచారం వల్ల లాభమే కదా..
జనాలు తాము ప్రాణమున్న జీవులను చంపి ఆ మాంసాన్ని తింటున్నాము అనేవిషయాన్ని మర్చిపోతున్నారా ఏమిటి? ఇతరజీవుల ప్రాణాన్ని తీసి తినటం వీళ్ళ హక్కులా.. మాంసాహారాన్ని తినండి.. అని అలాఎలా తేలికగా చెప్పేస్తున్నారు?
ఆ మూగజీవులు బలవంతులైన మనుషుల్ని ఎదుర్కోలేక భయంతో, నొప్పితో నిస్సహాయంగా చూస్తూ మరణిస్తాయి. ఈ మనుషులకు ఒక వేలు తెగితే భరించగలరా?
...................
...................
పాతకాలంలో చాలామంది ఇళ్లలో చాలా ఆవులు ఉండేవి. వాటిని ఆరుబయట పచ్చిక మేపుతూ అవి ముసలివి అయినాకూడా వాటిని చక్కగా చూసుకునేవారు. ఒక్కో ఆవు వద్ద పావులీటరు పాలు తీసుకుంటే, నాలుగు ఆవుల వద్ద లీటర్ అయి ఒకకుటుంబానికి సరిపోతాయి.
ఆవుపాలు దూడకోసమే కాబట్టి, దూడకు సరిపడా పాలు తప్పక ఉంచాలి. దూడకు సరిపోకుంటే ఆ పాలను మనుషులు పిండకూడదు. కొందరు ఏమంటున్నారంటే, ఆవుపాలు మనుషులు వాడకుంటే ఎక్కువ మిగిలిపోతాయి, అందువల్ల మనుషులు పిండాలి అంటారు..
ఆవుపాలు దూడకోసమే కాబట్టి, దూడకు సరిపడా పాలు తప్పక ఉంచాలి. దూడకు సరిపోకుంటే ఆ పాలను మనుషులు పిండకూడదు. కొందరు ఏమంటున్నారంటే, ఆవుపాలు మనుషులు వాడకుంటే ఎక్కువ మిగిలిపోతాయి, అందువల్ల మనుషులు పిండాలి అంటారు..
అడవిలో కూడా గేదెలు, ఆవులు ఉంటాయి. మరి అడవుల్లోకి వెళ్లి ఎవరూ వాటి పాలు తీయకపోయినా, అవి బాగానే జీవిస్తున్నాయి. మనుషులు వాటి పాలు తాము వాడటం కోసం తోచినట్లు మాటలు చెబుతారు.(బహుశా మనుషుల వద్ద పెరిగే జంతువుల లక్షణాలు కొన్ని మారాయేమో?)
ఈ రోజుల్లో కొందరు ఇరుకు ప్రదేశాల్లో ఆవులను, గేదెలను పెంచుతూ వాటి దూడలను చంపి పాల వ్యాపారం చేస్తున్నారు. ఇవేవీ పట్టకుండా కొందరు , ఆ పాలతో చేసిన స్వీట్లను , పన్నీరును.. అదేపనిగా తింటున్నారు.
ఈ రోజుల్లో కొందరు ఇరుకు ప్రదేశాల్లో ఆవులను, గేదెలను పెంచుతూ వాటి దూడలను చంపి పాల వ్యాపారం చేస్తున్నారు. ఇవేవీ పట్టకుండా కొందరు , ఆ పాలతో చేసిన స్వీట్లను , పన్నీరును.. అదేపనిగా తింటున్నారు.
............................
చాలామంది విదేశీయులు మాంసాహారాన్ని మాని శాకాహారానికి వచ్చినవారు ఎందరో ఉన్నారు. వీళ్ళు ఆరోగ్యంగా ఉండి బలంగా ఉన్నామని చెబుతున్నారు.. వారిలో కొందరు వీగన్ గా మారి పాలు, నెయ్యి వంటివి తీసుకోకుండా కూడా ఉంటున్నారు. ఈ రోజుల్లో పాలు, నెయ్యి, మాంసాహారం హార్మోన్ల దోషం వల్ల జబ్బులొస్తున్నాయని వాళ్ళు మాంసాన్ని మానివేస్తున్నారు.
ఉదా..Dr. Caldwell Esseltyns,
Dr. Brook Goldner..
ఒక వైద్యురాలు తనకు వచ్చిన వ్యాధిని ఈ పద్ధతిలో తగ్గించుకోవటం జరిగిందట.
వీరి గురించి తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ లో చూడవచ్చు.
ఒక విదేశీ డాక్టర్ గారు పెద్ద అనారోగ్యం బారిన పడగా.. మాంసాహారాన్ని, పాలు,పాల ఉత్పత్తులను కూడా మాని.. ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో చేర్చుకుని అనారోగ్యాన్ని తగ్గించుకుని, అనారోగ్యంగా ఉన్న ఇతరులకు కూడా ఈవిధానం ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నారట.
మాంసాహారం, పాలు, నెయ్యి తినకుండా కూడా బలంగా ఉండవచ్చు. ఈ మధ్య చాలామంది మాంసాహారాన్ని, పాలను కూడా మాని వీగన్లుగా మారి చక్కగా బలంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు.
మాంసాహారం తినటం వల్ల అనారోగ్యం కలిగి, శాకాహారులుగా మారిన వారు చాలామందే ఉన్నారు. మైక్ టైసన్ వంటివారు కూడా ఇలా మారారట.
ఆ మధ్య..THE GAME CHANGERS..అనే డాక్యుమెంటరీ వచ్చింది. అందులో చాలామంది గురించి ఎన్నో విషయాలను తెలియజేసారు. చాలామంది తాము శాకాహారులుగా మారిన తరువాత మరింత శక్తివంతగా ఉన్నట్లు తెలియజేసారు.
సాత్విక్ మూవ్మెంట్ వారు .. ఇండియాలో శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నారు.
.........................
అనారోగ్యం కలగటానికి ఎన్నో కారణాలున్నాయి. అవన్నీ పట్టించుకోకుండా, మాంసాహారం తింటే చాలు అనారోగ్యసమస్యలు అన్నీ సర్దుకుంటాయన్నట్లు చెప్పటం సరైనది కాదు. సమాజంలో సమూలంగా ఎన్నో మార్పులుచేర్పులు జరిగితేనే సమస్యలు తగ్గుతాయి.
Subscribe to:
Posts (Atom)