koodali

Wednesday, August 28, 2013

శ్రావణ మాసంలో వచ్చే కొన్ని విశేషాలు మరియు మన రాష్ట్ర విషయాలు....జై తెలంగాణా జై సమైక్యాంధ్ర అంటూ........


శ్రావణ మాసంలో  ఎన్నో  పండుగలు  వస్తాయి.   ఈ  సంవత్సరపు   శుభప్రదమైన  అమరనాధ్  యాత్ర  శ్రావణ  పౌర్ణమికి  పూర్తయింది.  అందరికి  కృష్టాష్టమి  శుభాకాంక్షలు.
........

జై  తెలంగాణా  జై  సమైక్యాంధ్ర , అంటూ  తెలుగు  వాళ్ళు  చేస్తున్న  ఉద్యమాలు  ముచ్చటగా  ఉన్నాయి. 

అయితే,  దేశంలో,  రాష్ట్రంలో  ఎన్నో  సమస్యలు  ఉన్నాయి.  పేదరికం,  అవినీతి,  లంచగొండితనం,  ఆర్ధిక  అసమానతలు, .ఇలా  ఎన్నో  సమస్యలు  ఉన్నాయి.   ఈ   సమస్యల  పరిష్కారానికి  ప్రజలు  ఎందుకు  ఉద్యమాలు  చేయరు  ?  అన్నదే అత్యంత  ఆశ్చర్యంగా  ఉంది. 

స్వాతంత్ర్యం  వచ్చి  ఎన్నో  ఏళ్ళు  గడిచిపోయాయి.  రాష్ట్రంలో   ఎన్నో   ప్రాంతాలలో  ఫ్లోరైడ్  సమస్య  అలాగే  ఉంది. అవయవాలు  కొంకర్లు  పోయిన   ఫ్లోరైడ్  బాధితులను  చూస్తే    ఎంతో  బాధగా  ఉంటుంది.  ఈ  సమస్య  వల్ల  ఎందరో  బాధలు  పడుతున్నారు.   ఫ్లోరైడ్  సమస్య  తగ్గించటానికి  కుటుంబానికి  రోజు  వంటకు,  త్రాగటానికి  రెండు  బిందెల  శుద్ధజలం  అందిస్తే  చాలు.  ఫ్లోరైడ్  సమస్య  తీవ్రత  చాలా  వరకు  తగ్గుతుంది. 

రాష్ట్రంలో   ఎందరో  రైతులు,  చేనేత    శ్రామికులు  పేదరికాన్ని  తట్టుకోలేక    వేలాది  మంది  ఆత్మహత్యలు  చేసుకున్నారు.
..............................................

తమ  ప్రాంతపు  సమస్యలు  పరిష్కారం  కాకపోవటానికి  ఇతర ప్రాంతాల  వారే  కారణమని   ఒకరినొకరు  తిట్టుకోవటం    ఏమిటో  అర్ధం  కావటం  లేదు.
...............................................

 సీమాంధ్ర  వాళ్ళు  కూడా    రాష్ట్ర  విభజన  విషయంలో  తమ  అభిప్రాయాన్ని  ఇంతకుముందే   గట్టిగా  వినిపించితే  బాగుండేది.

 హైద్రాబాద్ లో  ఎన్నో  పెద్ద  సంస్థలు  ఉన్నాయి,  ఎన్నో  ఉద్యోగ  అవకాశాలు  ఉన్నాయి  హైదరాబాద్  బాగా  అభివృద్ధి  చెందింది.  సీమాంధ్ర  సరిగ్గా  అభివృద్ధి  చెందలేదు.  హైదరాబాద్  సహా  తెలంగాణా  విడిపోతే  మా  ప్రాంతాలలో  అభివృద్ధి  చెందాలంటే  చాలా  కాలం  పడుతుంది.  అని  సీమాంధ్రం  వాళ్ళు  అంటున్నారు.

  సీమాంధ్ర  వాళ్ళు   ముందుచూపుతో   తమ  పెట్టుబడిని  హైదరాబాద్  లో  కాకుండా  తమ  ప్రాంతపు  నగరాలలో  పెట్టుబడి  పెట్టి  అభివృద్ధి  చేసుకుంటే   ఇప్పుడు  ఈ  పరిస్థితి  వచ్చేది  కాదు.
............................................

సీమాంధ్ర  ప్రాంతాలు  హైదరాబాద్ లా  అభివృద్ధి  చెందకపోవటానికి    తెలంగాణా  ప్రజలు  కారణం  కాదు కదా  !  
 
తమ  ప్రాంతాలను  కూడా  హైదరాబాద్ లా   అభివృద్ధి  చేయమని  సీమాంధ్ర  ప్రజలు  తమ  ప్రజాప్రతినిధులను  గట్టిగా  అడిగి   అభివృద్ధి  చేయించుకోవలసింది . 
 ..........................................

 తెలంగాణాలోని   ఫ్లోరైడ్  సమస్యలు  , రైతుల  సమస్యలు,    చేనేత  శ్రామికుల  సమస్యలు,  పరిష్కారం  కాకపోవటానికి  సీమాంధ్ర  ప్రజలు  కారణం  కాదు కదా  ! 

 ఫ్లోరైడ్  వంటి  ఎన్నో  సమస్యలు  పరిష్కారం  చేయాలని   తెలంగాణా  ప్రజలు   తమ  ప్రజాప్రతినిధులను  గట్టిగా  అడిగి   పరిష్కారం   చేయించుకో
వలసింది .
...........................................
 
 సమస్యలు  పరిష్కారం  కావాలంటే ఆ ప్రాంత  ప్రజలు  మరియు  ప్రజా  ప్రతినిధులు ,  అధికారులు   కృషిచేయాలి.    తమ  ప్రాంత  అభివృద్ధి    మరియు   సమస్యలు   పరిష్కారం  కోసం   ప్రజలు  ఉద్యమాలు   చేస్తే  బాగుంటుంది.
............................................

. ఇంకా  ఏమనిపిస్తుందంటే,.............

ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన   వెంటనే   హైదరాబాద్ ను   రాష్ట్ర ముఖ్య రాజధానిగాచేసి....... కర్నూలు, వైజాగ్, విజయవాడలను ...... మిగతామూడు   ప్రాంతాలకూ   ఉప రాజధానులుగా చేసి , అభివృద్ధి చేస్తే బాగుండేదని అనిపిస్తుంది.

అంటే ,  ఒక ముఖ్య రాజధాని , మూడు ఉప రాజధానులు అన్నమాట.........

 అంటే,  రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రతిచిన్నపనికీ హైదరాబాదుకు రాకుండా హైదరాబాదులోని ముఖ్య కార్యాలయాలకు ఉప కార్యాలయాలను ... ఉప రాజధానుల్లోనే ఏర్పాటు చేస్తే   బాగుండేది అనిపిస్తుంది. .

 అన్ని ప్రాంతాల పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులను తమ ప్రాంతంలోనే పెట్టి అభివృద్ధి చేసుకుంటే ........ ఇప్పుడు ఇలా బాధపడవలసి వచ్చేది కాదు అనిపిస్తుంది.

అప్పుడు ఎక్కడికక్కడ అభివృద్ధి జరిగి అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు రాకుండా అందరూ బాగుండేవారు అనిపిస్తుంది.
..............................................

 ఇప్పుడు  కృష్ణా,  గోదావరి,  నీటి  వాటాల  కోసం   తెలుగువాళ్ళు  తమలో  తాము  తిట్టుకుంటున్నారు. 


 ఎగువ  రాష్ట్రాలైన  కర్ణాటక,  మహారాష్ట్రలు    మరిన్ని  నీటి  ప్రాజెక్ట్స్  కట్టుకుంటే  కృష్ణా,  గోదావరి  నీటి  కోసం  తెలంగాణా  , సీమాంధ్ర  వాళ్ళు  కొట్లాడుకునే  అవసరం  భవిష్యత్తులో  ఉండదు.
.....................................................

   ఈ  దేశ  ప్రజలు  ఎందరో  పేదరికంతో  అల్లాడుతుంటే   అభివృద్ధి  చెందిన   విదేశాల  వాళ్ళు  కూడా   మరింత  అభివృద్ధి  కోసం  ఈ  దేశం   వచ్చి  సంస్థలు  పెట్టి   లాభాలను  పొందుతున్నారు. మన  దేశంలోని   చిల్లర  మరియు  మధ్య  తరగతి   వర్తకులతో  పోటీ  పడుతున్నారు. 

ఇతరదేశాల  వాళ్ళు  ఇక్కడికి  వచ్చి   వ్యాపారాలు,  సంస్థలు  పెట్టుకుని  లాభాలను  పొందుతున్నా  మనకేమీ  బాధ  ఉండదు.  సాటి  తెలుగువారు  వచ్చి  సంస్థలు  పెట్టి  లాభాలు  పొందితే  మాత్రం  మనకు  బాధ  కలుగుతుంది.

మనలో  మనమే  కొట్టుకోవటం    మానివేసి  దేశాభివృద్ధికి  కృషిచేసినప్పుడే  అందరికి  అభివృద్ధి  ఉంటుంది. 
................................................



ఇక  ఉద్యోగాలు  గురించి    తెలుగువారి  మధ్య  జరుగుతున్న  మాటల  యుద్ధం  గమనించితే   ఎంతో  ఆశ్చరంగా  ఉంటుంది.  హైదరాబాద్లో  సీమాంధ్ర  వాళ్ళే  కాదు  ఇతరరాష్ట్రాల    వాళ్ళు  ఎందరో  వచ్చి  ఉద్యోగాలు,  వ్యాపారాలు  చేసుకుంటున్నారు. 


రాజధానిని  త్యాగం  చేసిన  సీమాంధ్ర  వాళ్ళు  వస్తే  మాత్రం  వలసవాదుల  వల్ల  మా  ఉద్యోగాలు,  వ్యాపారాలు  పోతున్నాయి .  అనటం  ఆశ్చర్యంగా  ఉంది.


ఆ  మాటకొస్తే   అన్ని  ప్రాంతాల  తెలుగు  వాళ్ళు    మెరుగైన  ఉపాధి  కోసం  ఇతర  రాష్ట్రాలకు  ,  ఇతర  దేశాలకూ   వెళ్తున్నారు. 



 మనము   ఉపాధి  కోసం  ప్రపంచం  అంతా  తిరుగుతున్నప్పుడు  మన ప్రాంతానికి  ఎవరూ  రాకూడదు  అంటే  న్యాయం  కాదు  కదా ! 

 మన  ప్రాంతానికి  ఎవరూ  రాకూడదు  అన్నప్పుడు  మనమూ  ఇతర  ప్రాంతాలకు  వెళ్ళకూడదు ,  వెళ్ళిన   వాళ్ళు   తిరిగి  వచ్చేయాలి..  భవిష్యత్తులో  మన  పిల్లలను  విదేశాలకు  పంపకూడదు.

ఉపాధి  కోసం   మనము  ఇతర  దేశాలకు   వెళ్తే   కొంతకాలానికి  అక్కడి  వాళ్ళూ  మనల్ని  పొమ్మంటారు.  వాళ్ళ  ఉపాధి  అవకాశాలను  మనం  కొల్లగొడుతున్నామని.

 స్థానికులు  వలసవాదుల  మధ్య  జరుగుతున్న  గొడవలు  ప్రపంచమంతటా  ఎన్నో  దేశాలలో  జరుగుతున్నాయి.  అయితే  ఒకే  భాష   మాట్లాడే  వారి  మధ్య  ఇలాంటి  విభేదాలు  రావటం  పరిస్థితి  తీవ్రతను  తెలియజేస్తోంది. 



 ఇవన్నీ  గమనించే  మన  పూర్వీకులు  జననీ  జన్మభూమి  స్వర్గాని  కంటె  గొప్పవని  తెలియజేశారు. అందుకే   ఎక్కడివారు  అక్కడే  ఉండి  తమ  ప్రాంతాలను  అభివృద్ధి   చేసుకునేవారు.  అప్పుడు  ఇన్ని  సమస్యలు  ఉండేవి  కాదు.


............................

కొందరు  ఉద్యోగస్తులకు  ట్రాన్స్ఫర్ల  బాధ  ఒకటి. 

 ట్రాన్స్ఫర్ల  వల్ల  అక్కడికి  ఇక్కడికి  మారే  ప్రజల  పరిస్థితి  మరీ  ఘోరం    వారికి  తమ  స్థానికత  ఏమిటో  తెలియదు.    స్థానికులు  వలసవాదులు  అంటూ  గొడవలు  వచ్చినప్పుడు  తాము  ఏ  ప్రాంతానికి  చెందుతామో  దిక్కుతోచని  పరిస్థితి  వారిది. 


 అందుకే  సంస్థలు  ఉద్యోగాలు  ఇచ్చేటప్పుడు  స్థానికులకే  ప్రాముఖ్యతనివ్వాలి.
 ............................
 
ప్రజలు  తమ  సమస్యల  పరిష్కారానికి,  ఉద్యమాలు  చేయాలి  గానీ  రాజకీయులకు  ఉపయోగపడే  విధంగా  ఉద్యమాలను  చేసి  ఎందుకు  కష్టపడతారో  అర్ధం  కాదు. 



  దేశంలోని  రాష్ట్రాలను  విభజిస్తే  ఎంతో  అభివృద్ధి    ఉంటుందని     కొందరు  అరచేతిలో  స్వర్గాన్ని  చూపిస్తున్నారు. 

విభజించినా  మనకు  ఇదే  నాయకులు  ఉంటారు.  కదా  ! వీళ్ళు  ఫ్లోరైడ్  వంటి  సమస్యలను  ఇంతకు  ముందే  ఎందుకు  పరిష్కరించలేదో  అర్ధం  కాదు.

ఎన్నికలప్పుడు   అధికారం  కోసం  రాజకీయ  నాయకులు  ఎన్నో  వాగ్ధానాలను  చేస్తారు.  ప్రజలకు  అరచేతిలో  స్వర్గం  చూపిస్తారు. 


  ఎన్నికలలో  గెలిచిన  తరువాత  ఎక్కువమంది  నాయకులు  తాము  చేసిన  వాగ్ధానాలను  అమలు  చేయరు.  చేస్తే   స్వాతంత్ర్యం  వచ్చిన  ఇంతకాలం  తరువాత  కూడా  దేశంలో   ఇన్ని  సమస్యలు  ఎందుకుంటాయి  ?
...................................


ఎన్నో  భాషల  ప్రజలు  ఉన్న  మన  దేశంలో  భాషా  ప్రయుక్త  రాష్ట్రాల  ఏర్పాటు  వల్ల  ఎన్నో  లాభాలున్నాయి.  పరిపాలన  ఆ  రాష్ట్ర  ప్రజల  మాతృ  భాషలలో  ఉండటం  వల్ల  ప్రజలకు చట్టం  గురించి  సులభంగా  అర్ధం  అవుతుంది.

 ఎక్కువగా  తెలుగు  మాట్లాడే  ప్రజలున్న  ఒకే  రాష్ట్రంలో  తెలంగాణా  అని,  రాయలసీమ  అని,  కోస్తా  అని,  ఉత్తరాంధ్రా  అని  ఎందుకు  పేర్లు  పెట్టారో?  అంతా  మన  ఖర్మ.

 ఇప్పుడు  అన్ని  ప్రాంతాల  వాళ్ళు  రాజధాని  మా  ప్రాంతంలోనే  ఉండాలని  పట్టుబడుతున్నారు.  కొందరు  మూడు  లేక  నాలుగు  రాష్ట్రాలు  చేయమంటున్నారు.  కొందరు  మన్య  సీమ  రాష్ట్రం  కావాలంటున్నారు.  కొందరు   రాయలసీమలోని  కొన్ని  ప్రాంతాలను  కర్ణాటకలో  కలపాలంటున్నారు.  ఇలా   మనలో  మనము  తిట్టుకుంటుంటే  కొందరు  చిత్తూరు  సహా  తిరుమలను  తమ  రాష్ట్రంలో   కలపాలంటున్నారు.  


ఇవన్నీ  చూస్తుంటే  కొంతకాలానికి  తెలుగువాళ్ళకంటూ  ఒక్క   రాష్ట్రం    అయినా  ఉంటుందా ?  అనిపిస్తోంది.  
........................

 తమలో  తాము  గొడవలు  పడే  కుటుంబం  కాని  రాష్ట్రం  కానీ  దేశం  కానీ  బాగుపడినట్లు  చరిత్రలో  లేదు.

 
రాష్ట్రం విడిపోయినా, విడిపోకున్నా ఎప్పటికీ ప్రక్కప్రక్కనే జీవించవలసిన ప్రజల మధ్యన ఇంతలా అపార్ధాలు, ఆవేశాలూ పెరగటం మంచిదికాదు.

అది ముందుముందు అనర్ధాలకు దారి తీస్తుంది.
 .........................

మనదేశ  రక్షణ శాఖలో    అన్ని  రాష్ట్రాలకు  చెందిన   సైనికులు    ఉన్నారు.  వాళ్ళందరూ   కాపలా  కాస్తుంటే  మనం  తీరికగా  మనలో  మనం  గొడవలు  పడుతున్నాము.



ఎంతైనా మనమందరం ఒకటి.

 ఈ సమస్యలు సామరస్యంగా , త్వరగా పరిష్కారం అవ్వాలనీ ,అప్పుడు పేదప్రజల సమస్యల పరిష్కారానికి  ఎక్కువ   సమయం ఉంటుందని ఆశిద్దాము.

 
ఈ  దేశ  ప్రజలతో పాటూ ప్రపంచ దేశాలలోని ప్రజలందరూ ,ఇంకా లోకమంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను.


Monday, August 26, 2013

ఓం,


  దైవం  దయ  వలన  మాకు  శుభకరమైన  సంఘటనలు  జరిగాయి.  కొన్ని  పనుల   వల్ల  ఈ  మధ్య  కొంతకాలం  బ్లాగ్  వ్రాయలేదండి. 


నాకు  వీలుకుదిరినప్పుడు   సాయిసాయి  అని  స్మరించుకుంటాను ....  అని  ఇంతకు  ముందు   టపాల  ద్వారా    తెలియజేశాను.  ఈ  విషయం  గురించి  ఈ  మధ్య  మరికొన్ని  ఆలోచనలు  వచ్చాయి.  


సాయిసాయి  అని  మామూలుగా  స్మరించుకోవచ్చు. ఇంకా ,  సాయి  నామాన్ని    పాటలాగా  కూడా  పాడుకుంటూ  స్మరించుకోవచ్చు  అనిపించింది.  


పాటలాగా  స్మరించుకుంటున్నప్పుడు   గబగబా  శ్వాసలు  తీసుకోకుండా   రెండు  శ్వాసల  మధ్య  కొంచెము  దూరం  పెరిగి  తక్కువ  శ్వాసలు  తీసుకునే  విధంగా  కూడా  నామాన్ని  స్మరించుకోవచ్చు.  అనిపించింది.  


 ఎవరైనా  దైవనామాన్ని  స్మరించే  విషయంలో  ఎలా  స్మరిస్తే  సులువుగా  ఉంటుందో  కాలక్రమేణా    ఎవరికి  వారికే  తెలుస్తుంది. 

 అంతా  దైవం  దయ. 

 


Friday, July 26, 2013

గీత ( భక్తి యోగము ) లోని కొంత భాగము మరియు కొన్ని విషయములు.


 ఏ  మతమూ  చెడ్డ  విషయాలను  బోధించదు.    గ్రంధాలలోని  విషయాలను  సరిగ్గా  అర్ధం  చేసుకోని  వారి  వల్ల  మరియు  కొందరు  స్వార్ధపరుల   వల్ల   తరతరాలుగా సమాజంలో  అపార్ధాలు  ఏర్పడ్దాయి.


ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే , ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.

కొందరు స్వార్ధం వల్ల ,  మరి కొందరు తెలిసీతెలియనితనం వల్ల సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.


 ప్రాచీన  గ్రంధాలను  సరైన  తీరులో  అర్ధం  చేసుకుంటే  సమాజం  ఎంతో  బాగుంటుంది.

.......................
ఓం.

శ్రీ  కృష్ణ  పరమాత్మ  బోధించిన  భక్తి యోగములో   కొంత భాగము.....

వివేకముతో గూడని అభ్యాసము కంటె , ( శాస్త్రజన్య ) జ్ఞానము శ్రేష్ఠమైనదై కదా !( శాస్త్రజన్య ) జ్ఞానము కంటె , ధ్యానము శ్రేష్ఠమగుచున్నది.ధ్యానము ( ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగ నుండు మనఃస్థితి ) కంటె కర్మఫలమును విడుచుట ( ప్రవృతి యందును విషయదోషము లేకుండుట ) శ్రేష్ఠమై యున్నది. అట్టికర్మఫలత్యాగముచే శీఘ్రముగ
( చిత్త ) శాంతి లభించుచున్నది.

సమస్తప్రాణులయెడల ద్వేషములేనివాడును, మైత్రి, కరుణగలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపఱచు కొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందు భక్తిగలవాడును ఎవడు కలడో, అతడు నాకు ఇష్టుడు.



ఎవని వలన ప్రపంచము ( జనులు ) భయమును బొందదో,  లోకము వలన ఎవడు భయమును బొందడో
ఎవడు సంతోషము , క్రోధము, భయము, మనోవ్యాకులత - మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు.

.....................................................

గీత  మరియు  
ప్రాచీన  గ్రంధాల  ద్వారా  మనము  ఎన్నో  చక్కటి  విషయాలను  తెలుసుకోగలము.  తెలుసుకున్న  విషయాలను  ఆచరణకు  ప్రయత్నించాలి.  

అప్పుడు,   అత్యాశ,  అవినీతి,  ఇతరులతో  అనవసరంగా  పోటీపడటం, ఇతరుల  సొమ్మును  అపహరించటం,  వంటి  దుర్లక్షణాలు  తగ్గిపోతాయి.  నైతికవిలువలతో  జీవించటం  అలవాటవుతుంది.
  లోకం  ప్రశాంతంగా  ఉంటుంది. 

 
ఈ  రోజుల్లో  నైతికవిలువలకు  ప్రాధాన్యత  తగ్గి,  ఎలాగైనా  సరే  డబ్బును  సంపాదించి  విలాసంగా  జీవించాలి . అనుకునే   వారి  సంఖ్య  పెరిగింది.  


అత్యాశ,  అనవసరపు  పోటీ  , అధికారదాహం  వల్ల    అణ్వాయుధాల  పోటీ     పెరుగుతుంది.  



 అందువల్ల , సమాజంలోని  ఎంతో  సొమ్మును  ఆయుధ  పోటీకే  ఖర్చు  చేయవలసి  వస్తోంది. 


అందువల్ల ,  పేదరిక  నిర్మూలన  కార్యక్రమాల  కోసం    డబ్బు  సరిపోవటం  లేదు.

పరస్పర  అపనమ్మకాల  వల్ల   ఇప్పుడు  ప్రపంచదేశాల  వద్ద  అణ్వాస్త్రాలు  గుట్టలుగా  పడి  ఉన్నాయి. 


  ఆయుధాల  గుట్టల  మధ్య   ప్రపంచం  ఇంకా  క్షేమంగా  ఉందంటే  దైవం  దయ   వల్లనే.  



 ఈ  ఆయుధాలు  చెడ్డవారి  చేతిలో  పడకూడదని  దైవాన్ని  ప్రార్ధించటం  మినహా  సామాన్య  ప్రజలు  ఏం  చేయగలరు  ?


ఆధునిక  విజ్ఞానాన్ని కూడా  కొందరు  వ్యక్తులు   మితిమీరి  ఉపయోగిస్తున్నారు. 

 ఈ  ప్రపంచంలో  మనుషులే  మాత్రమే  కాదు.  ఇతర  జీవులు  ఎన్నో  ఉన్నాయి.   

కొందరు  తమ అత్యాశ ,అంతులేని  కోరికల  కోసం  పర్యావరణాన్ని  పాడుచేస్తూ , ఇతరజీవులకు  ముప్పును  కలిగిస్తున్నారు.


మితిమీరిన   పారిశ్రామీకరణ  వల్లే   ఆమ్ల  వర్షాలు  పడుతున్నాయట.

  ఇలాంటి  ఎన్నో  పెను  ప్రమాదసూచికలు  కనిపిస్తున్నా  కూడా  ప్రజలు  సరిగ్గా  పట్టించుకోవటంలేదు.  నిమ్మకు  నీరెత్తినట్లు    ఉంటున్నారు.  
 
 
   ఇక   ప్రపంచాన్ని  దైవమే  రక్షించాలి.


Wednesday, July 24, 2013

మూడు విధాలైన టెక్నాలజీ................



కొందరు ఏమంటారంటే............టెక్నాలజీని శాంతియుత ప్రయోజనాలకు కూడా వినియోగించవచ్చు కదా......... అని .......

ఉదా....కత్తిని శాంతియుత ప్రయోజనాలకూ వాడొచ్చు,......అశాంతిని కలిగించే విధంగానూ వాడొచ్చు కదా అని........ కానీ కత్తి వేరు........ అణు శక్తి వేరు........... రెండిటికి ఎంతో తేడా ఉంది.

కత్తి వల్ల కొందరినే చంపగలరు. కానీ అణుశక్తివల్ల కొద్ది సమయంలోనే కొన్ని లక్షలమందిని చంపే అవకాశం ఉంది.

ఇంకా, కొన్ని వేలసంవత్సరాల వరకూ అణుధార్మికత యొక్క దుష్ప్రభావం రాబోయే తరాలను పీడించే అవకాశం ఉంది. అణుబాంబులకు ఎంతో వినాశనాన్ని కలగచేసే శక్తి ఉంటుందట.

*  కత్తివల్ల ఎక్కువ లాభాలు....తక్కువ నష్టాలు ఉన్నాయి.
అదే అణుశక్తి వల్ల తక్కువ లాభాలు........చెప్పలేనన్ని నష్టాలు ఉన్నాయి. 


ఈ తేడాను జాగ్రత్తగా గమనించాలి.

అందువల్ల అణుశక్తిని పూర్తిగా వదిలిపెట్టటమే ఏకైక పరిష్కారం.

నా అభిప్రాయంలో......టెక్నాలజీని మూడువిధాలుగా చెప్పుకుంటే....

1.
ఈ    రకమైన టెక్నాలజీ మనకు నిత్యావసరాలకు ఉపయోగపడే టెక్నాలజీ...................

దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రాచీన కాలం వాళ్ళు తాము కష్ట పడిపనిచేసి పర్యావరణానికి ఎటువంటి హాని కలగని వస్తువులను వాడుతూ, హానిలేని పధ్ధతులను పాటించేవారు.
ఆ విధంగా వారు కూడా ఆరోగ్యంగా ఉండేవారు.


ఆ రోజుల్లో కూడా గొప్ప గొప్ప నాగరికతలు విలసిల్లాయి. అప్పట్లో కూడా ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, ఎన్నోరకాల వృత్తివిద్యలు, ఆర్ధికశాస్త్రం, గణితం ఇలా నిత్యావసరాలకు ఉపయోగపడే విజ్ఞానం వారికి తెలుసు.

ఇంకా, ప్రాచీనుల విజ్ఞానాన్ని తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పటి వాళ్ళు కలలు కంటున్న ( టెలి పోర్టేషన్ ) వంటి ఎంతో విజ్ఞానం వారికి తెలుసు.

మనిషి మాయమయి తిరిగి ప్రత్యక్షమవటం, అణిమ, గరిమ వంటి సిధ్ధులు, పరకాయప్రవేశం , టెలిపతి ఇవన్నీ నేటి శాస్త్రజ్ఞులు భౌతికశాస్త్ర పధ్ధతులలో సాధించటానికి ప్రయత్నిస్తున్నారు.

కానీ ప్రాచీనులు వీటిని దైవసహాయంతో ఆధ్యాత్మికయోగశక్తి ద్వారా సాధించారు.

కానీ ....ఇప్పటి కాలపు భౌతికశాస్త్ర టెక్నాలజీతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.



ఎక్కువగా పర్యావరణానికి హానికలగని ........... విధంగా   ఆ నాటి వారి జీవితం ఉండేది.
అంతే కానీ,   అభివృధ్ధి పేరుతో వస్తువులను విపరీతంగా ఉత్పత్తి చేసి గుట్టలుగా పోయటం వారికి అలవాటు లేదు..


ఇంకా,   వారు తమ నిత్య జీవితంలో అవసరమైన వస్తువులకు ........ ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చేవారు. ఉదా..... కత్తి చూడండి.   మనకు దీని అవసరం ఎంతో ఉంది.

పంటలు పండించటానికి , కూరగాయలను తరగటానికి, వైద్యులు శస్త్రచికిత్సలు చేయటానికి, అలాగే యుధ్ధంలోశత్రువులనుచంపటానికి ............. ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

కానీ ఒకోసారి దుర్మార్గుల చేతిలో పడితే హత్యలు లాంటివి చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి కొద్ది నష్టాలు తప్పితే ..............
దీనివల్ల పర్యావరణానికి పెద్దగా హాని లేదు.

.
ఈ రకమైన టెక్నాలజీ వల్ల నష్టాల కన్నా లాభాలే ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకోవచ్చు.

*  దుర్మార్గుల చేతిలో ఉన్న కత్తి వల్ల ..........జరిగే నష్టం కొద్దిగానే ఉంటుంది. దుర్మార్గుల చేతిలో ఉన్న అణుశక్తి వల్ల ........... జరిగే నష్టం ఎంతో ఎక్కువగా
ఉంటుంది.

అందువల్ల అణుశక్తిని పూర్తిగా వదిలిపెట్టటమే ఏకైక పరిష్కారం.

2.   ఈ   రెండో  రకమైన టెక్నాలజీ వల్ల ..... లాభమా.....నష్టమా ? అన్నది ఎవరికీ సరిగ్గా తెలియదు. దానిని మనం వాడుకునే విధానం బట్టి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చేమో !

మానవులకు కష్టాన్ని తగ్గించే యంత్రాలు, వాహనాలు, టివీలు, సినిమాలు, ఎలెక్ట్రానిక్ వస్తువులు, ఇలా చెప్పుకోవచ్చు. ఈ కోవలోకి వచ్చే వస్తువులు ఉన్నాలేకపోయినా మనిషి బ్రతకగలడు.

ఇవన్నీ మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తాయి. వీటిని తగిన పరిమితిలో వాడుకోవాలి.

మరీ ఎక్కువగా వాడితే పర్యావరణానికి ముప్పు, సహజ వనరులు ఖాళీ అయిపోవటం, రాబోయే తరాలకు సహజ వనరులు లేని ఖాళీ భూగోళాన్ని ఇవ్వటం ,.... ఇప్పుడు ఉన్నవాళ్ళకి పనిలేకపోవటం వల్ల నిరుద్యోగ సమస్య, శారీరిక శ్రమ లేకపోవటం వల్ల శరీరం బలహీనపడటం , జబ్బులు రావటం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

అందుకని ఈ టెక్నాలజీ వల్ల లాభం ఎక్కువా ? నష్టం ఎక్కువా ? అన్నది ఇతమిధ్ధంగా చెప్పలేము. అది మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది.

అయితే ఇందులో మనకు ఏది ఎంతవరకు మంచిదో, అవసరమో అంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.

3.    ఈ  మూడో  రకమైన టెక్నాలజీ వల్ల లాభాలు ఉంటాయని జనం ( ఎండమావి లాంటి ) భ్రాంతిలో మునిగిపోతారు దానివల్ల ......... అంతా నష్టమే తప్ప లాభం అస్సలు ఉండదు.


ఉదా........అణుశక్తి. దీని సంగతి ఇప్పుడు చాలామందికి తెలుసు. తాత్కాలిక ప్రయోజనాల కొరకు ఆశపడితే ........ వేలసంవత్సరాలు భూమిని పీల్చిపిప్పిచేసే దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి , అణుశక్తిని వాడటం పూర్తిగా విడిచిపెట్టెయ్యటమే ఏకైక మార్గం.

ఇలా టెక్నాలజీని వాడుకోవటంలో ....... ప్రపంచం పైన వాటి ప్రభావాన్ని బేరీజు వేసుకుని మాత్రమే ఉపయోగించుకోవాలి... ....
.......
.......................
ఇంకా నాకు ఏమనిపిస్తుందంటేనండి,......అణుశక్తి విషయంలో ప్రమాదాలను నివారించటం అసాధ్యం. ఇంకా, వైద్యరంగంలో దీని సహాయంతో చికిత్సను అందించేవారికి కూడా రేడియేషన్ ప్రభావం వల్ల మొండివ్యాదులు త్వరగా వచ్చే అవకాశముందట.

కొద్ది లాభం కోసం ఎంతో వినాశనాన్ని కలిగించే ప్రమాదం గల దాన్ని ఎవరైనా కోరుకుంటారా ? అందుకే నాకు అనిపిస్తుంది......ఈ అణుశక్తిని కనిపెట్టకుండా ఉంటే బాగుండేది అని....
 ఈ  టపా  పాతదే .  మరల    వ్యాఖ్యలతో   వేసాను.

2 comments:

  1. అణు శక్తిని జబ్బులు నయం చెయ్యటానికి ఉపయోగిస్తారు. దానిని Nuclear Medicine అంటారు. అల్లాగే లాబోరేటరీల్లో సైనైడు, వైరసుల దగ్గరనుండీ అన్నీ ఉంటాయి. అవి బయటకి వస్తే ఎందర్నైనా నాశనం చెయ్యగలవు.మనవాళ్ళు చెప్పినట్లు మనం మన పరిమితులు తెలుసుకుని జీవించాలి. ఇష్టం కదా అని కనపడినంతా తినలేము కదా కడుపు నిండిన తరువాత. అల్లాగే అన్నిట్లోనూ సంయమనం పాటిస్తే అందరికీ బాగానే ఉంటుంది.

    మీరు చెప్పినట్లు:
    అయితే ఇందులో మనకు ఏది ఎంతవరకు మంచిదో, అవసరమో అంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.
    ReplyDelete
  2. కృతజ్ఞతలండి.
    మీరు చెప్పినట్లు సైనైడ్, వైరస్ లు ఎంతోమందిని నాశనం చెయ్యగల శక్తి కలవే కావచ్చు. అంటే వాటిని చిన్నపాటి భూతాలుగా చెప్పుకోవచ్చు.

    అణుశక్తిని పెద్దభూతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైనైడ్, వైరస్ ల దుష్ప్రభావాలతో పోల్చితే ............... అణుశక్తి విషయంలో జరిగే పొరపాట్ల వల్ల ................. కలిగే దుష్ప్రభావాలు, వినాశనం ........................ ఊహకందనంత ఉంటాయట.

    వాటి ప్రభావం .........వేల సంవత్సరాలు భూమిపై ఉంటుందని చెబుతున్నారు కదండి. దానివల్ల ఎన్నో తరాల వరకు రకరకాల జబ్బులతో బాధపడే అవకాశం ఉందట.

    అలాంటి ప్రమాదాలు జరిగిన  చోట్ల ఇప్పటికీ చిన్నమొక్కలు కూడా మొలవలేదట. మొలిచినా ఆ మొక్కలలో, అక్కడి నీటిలో, గాలిలో కొన్ని వందల సంవత్సరాలు అణుధార్మికత నిండి ఉంటుందట.

    ఇలాంటి అణుశక్తిని వైద్యంకొరకు ఉపయోగించటం కూడా కొరివితో తల గోక్కోటంలా వుతుందేమో అనిపిస్తోంది. అందుకని దాన్ని ఏ విధంగానూ ఉపయోగించకుండా ఉండటమే శ్రేయస్కరమేమోనని ఒకోసారి అనిపిస్తుంది.

    నిజమే అణుశక్తిని వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. దానివల్ల జబ్బు ఉన్న సెల్స్ నాశనం అవుతాయి గానీ, ప్రక్కనున్న మంచి సెల్స్ రేడియేషన్ కు గురయ్యి దెబ్బతిని ............... మళ్ళీ వాటికి ట్రీట్మెంట్ ............. ఇలా అంతులేని కధలా సాగే అవకాశం కూడా ఒకోసారి ఉందట.

    అసలు ఈ మధ్య కాలంలో మనం వాడుతున్న వస్తువుల ద్వారా వెలువడుతున్న రేడియేషన్ వల్లనే జనానికి మొండి జబ్బులు రావటం ఎక్కువయ్యిందని అంటున్నారు .


    కొన్ని మొండి జబ్బులు ఆయుర్వేదం , హోమియో లాంటి వాటికి తగ్గటం జరుగుతోంది. ఈ రకమైన మొండిజబ్బులను తగ్గించటానికి ప్రాచీన వైద్యగ్రంధాలను శోధించితే తప్పక మంచి పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయమండి.

    అప్పటివరకూ,వేరేదారిలేక ఇప్పుడున్న విధానాలను వాడుతూనే ఉంటారేమో ప్రజలు ?

    ప్రతి సమస్యకు చక్కటి పరిష్కారముంటుందట......... శోధించగలిగితే..............( దైవానుగ్రహం తోడయితే.).


Monday, July 22, 2013

గురుపూర్ణిమ.

గురుపూర్ణిమ.

ఓం,
 ఎందరో  గురువులు.  అందరికి  అనేక  వందనములు.



Friday, July 19, 2013

షిర్డి సాయి అంటే మాకు ఎంతో ఇష్టం. మరియు కొన్ని విషయములు..

 
ఓం,
ఈ  రోజు   ఆషాఢ  ఏకాదశి  ఉత్సవాలు  జరుగుతున్నాయి.

దైవం సర్వాంతర్యామి. దైవాన్ని ఏ రూపంతోనయినా, ఏ నామంతోనయినా ఆరాధించుకోవచ్చు.
( నిరాకారంగా కూడా ఆరాధించుకోవచ్చు.)

 
 **********
పాపవిమోచన పొందుట….
మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుద్ధిని మరలించనప్పుడు , తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వార కూడ ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు…షిర్డి సాయిబాబా వారు ఇలాంటి ఎన్నో  విషయాలను తెలియజేశారు.



 ఈ రోజుల్లో ఎందరో భక్తులు విపరీతమైన కోరికలతో భక్తిమార్గాన్ని ఆశ్రయిస్తున్నారు.  కష్టాలలో ఉన్నప్పుడు లేక కొన్నిసార్లు కోరికలు కోరుకోవటం మానవనైజం.

అయితే  తమ   పిల్లలు   అదేపనిగా స్వార్ధపరమైన   కోరికలతో   విసిగిస్తే   తల్లితండ్రులకైనా   విసుగు వస్తుంది  కదా  !

కోరికలు కోరేముందు అందుకు తగ్గ అర్హతను సంపాదించుకోవాలని ఒక బోధకులు   తెలియజేశారు. 

అర్హత ఏమీ లేకుండానే   తేరగా   పెద్దపెద్ద   కోరికలు   కోరే స్వార్ధపరులైన భక్తుల సంఖ్య   ఈ  రోజుల్లో  బాగా  పెరిగిన మాట వాస్తవం.

అయితే మొదట కోరికల కోసం భక్తి మార్గాన్ని ఆశ్రయించినా క్రమంగా కోరికలను తగ్గించుకునే స్థాయికి వచ్చే అవకాశమూ ఉంది.

అంతా  దైవం  దయ.


ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  ధన్యవాదాలండి.
 
వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

..............................................
 
సాయిబాబా పుట్టుకతో ఏ మతస్తులో ఎవరికీ తెలియదు. సాయిబాబాను గత కొన్ని సంవత్సరాలుగా ఎందరో పూజిస్తున్నారు. కొందరు హిందువులు కూడా బాబా వారి గురించి ప్రజలలో ప్రచారం చేసారు. బాబావారి విధానాలు తేలికగా ఉండి హిందువులను ఆకర్షించాయి.

 
 చాలామంది హిందువులు తమ దేవతలతోపాటు బాబావారినీ ప్రార్ధించుకోవటం జరిగింది. అలాంటప్పుడు బాబాను పూజించకూడదు.. అంటే చాలామందికి ఏంచేయాలో తెలియక ఇబ్బందిగా  ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టసుఖాలలో హిందూ దేవతలతోపాటే బాబాకు కూడా తమ కష్టసుఖాలను చెప్పుకునేవారు. 

 
కొందరు హిందువులలో కూడా చాలా గొడవలున్నాయి. శైవులు, వైష్ణవుల మధ్య అనేక గొడవలు జరిగాయి. శివుడు గొప్ప అంటే కొందరు వైష్ణవులు ఒప్పుకోరు. విష్ణువు గొప్ప అంటే కొందరు శైవులు ఒప్పుకోరు. అమ్మవారు గొప్ప అంటే కొందరు ఒప్పుకోరు. 
 
 
కొందరు హిందువులు మాత్రం ..అమ్మవారు శివుడు విష్ణువు..అని తేడాలు లేకుండా చక్కగా దైవాన్ని ఆరాధించుకుంటారు.

సాయిబాబా విగ్రహం పాదాల వద్ద శివుడు, విష్ణువు వంటి దేవతల విగ్రహాలను పెట్టకూడదు. పక్కన పెట్టుకోవచ్చు. హిందూ దేవాలయాల్లో కూడా ఏ దేవత పాదాల వద్ద కూడా ఇంకో దేవతల విగ్రహాలను పెట్టకూడదు.
 
***************
 
ఈ క్రింది విషయాలను కొంతకాలం తరువాత వ్రాసి పోస్ట్ చేసానండి..2024లో..

ఆచారాలను ఎక్కువగా పాటించలేక, తప్పుగా పాటిస్తే ఏమవుతుందో అని నాకు కూడా భయంగా ఉండేది. నేను హిందూ దేవతలతోపాటు షిర్డిసాయిని పూజించాను . షిర్డి సాయికి ఎక్కువ నియమనిబంధనలు ఉండవు కాబట్టి ,సరళంగా ఉండేది.   కొత్తదేవతలను ఆరాధించమని మొదలుపెడతారు..కొంతకాలం తరువాత వద్దంటారు.

 
నాకు తెలిసినంతలో, ఇతరమతాల వాళ్ళు కొత్తగా ఎవరినీ
పూజించరు. పాతకాలం నుంచి పూజించేవారినే పూజిస్తారు. హిందువులు మాత్రం దేవతలను పెంచుకుంటూ ఉంటారు.
 
 
 ప్రతి జీవిలోను దైవం అంతర్యామిగా ఉంటారంటారు. అలాగని ప్రతిజీవికి గుడికట్టి పూజలు చేయలేరు కదా..మహిమలు గల గొప్పవారిని గొప్పవారిగా గౌరవించవచ్చు. అలాగని, గొప్పవాళ్ళందరిని దేవతలుగా గుడులు కట్టి పూజలు చెయ్యాలంటే చాలా అవుతుంది.. 
 
 
చాలామంది దేవతలు, అనేకరకాల దేవాలయాలు, అనేకరకాల పూజలు పెరిగితే..అన్నింటినీ పాటించటం కష్టం..కాబట్టి, అలా ఎందుకనుకుంటే, కొద్దిమందిని దేవతలుగా పూజించుకోవచ్చు. అందరిని ఒకే దైవశక్తిగా కూడా పూజించుకోవచ్చు.

....................
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. 
 
సాయిబాబా షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని  సాయి అని పిలిచారట. తరువాత భక్తులు రావటం పెరిగింది. షిర్డిసాయి తనకు ఆడంబరంగా పూజలు చేయటం వద్దనేవారట. అయినా భక్తులు వినరు కదా..
 
సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు. 
 
కొందరు మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత, వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ సమాజంలో ఉంటారు.
.....................
 
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.

అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.

సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే.  దైవము ఒకే శక్తి.
 ...........................
 
కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
 .....................
 
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము,  ఎక్కువ సమయం చేయలేము...అనుకుంటే, తక్కువ ఖర్చుతో, కొంత సమయంలో  పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా.. అనుకుంటున్నాను.
.......................

 
హిందువులు చాలా నియమాలను  పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
 
హిందు పెద్దలు కూడా ఈ విషయాలను గమనించాలి.  
ఈ  రోజుల్లో ఆచారవ్యవహారాలంటూ  బోలెడు నియమాలను చెబితే, పాటించలేక సరళంగా దైవపూజ చేసే మార్గాల వైపు జనం వెళ్లే అవకాశం ఉంది.

 పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా,  సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.


 ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
 
**********
 వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 
 

Thursday, July 18, 2013

మన ప్రాచీన గ్రంధాలలో ఎంతో విజ్ఞానం.........

 
మన  ప్రాచీన  గ్రంధాలలో  ఎంతో  విజ్ఞానం  మరెన్నో  విశేషాలు ఉన్నాయి  కాబట్టే  విదేశీయులు ఎన్నో  గ్రంధాలను   తమ  దేశాలకు తీసుకువెళ్ళి , సంస్కృతం  నేర్చుకుని వాటిని  పరిశోధిస్తున్నారు.
............................


  భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ఇలా అన్నారు..  


ఒక  సూత్రంలో మణులు కూర్చినట్లు  ఈ జగత్తంతా నాలో  ఇమిడి  ఉన్నది. 

శ్రీ కృష్ణ  భగవానుడు  చెప్పినట్లు  అనంతం  నుంచి  అణువు  వరకూ  జగత్తంతా ఒక  సూత్రంలో  బంధింపబడింది. దీనినే  ఆధునిక  శాస్త్రవేత్తలు  Super  String   అంటున్నారు.

.......................


భూమి  గుండ్రంగా  ఉన్నదని  వేదకాలం  నుంచే  మనకు  తెలుసు.

  గోళం  అంటే  గుండ్రనిది అని  అర్ధం కదా! భూమి  గుండ్రంగా ఉన్నదని భారతీయులకు తెలుసు.

ఋగ్వేదంలో  1.33.8  మంత్రంలో ఇలా ఉంది...

"  చక్రాణాసః పరీణహం  పృధివ్యా...

భూమి  యొక్క  వృత్తపు  అంచున  ఉన్నవారు  అని  భావం.

భూమి  తన  కక్ష్యలో  తాను  తిరుగుటకు  23  గంటల  56  నిమిషాల  4.1  సెకన్ల  కాలము   పడుతుందని  ఆనాడే  చెప్పారు. 


 ఇది  ఆధునిక  కాలగణనకు ఖచ్చితంగా సరిపోతుంది కదా!
................


పురాతనమైన  వేదవిజ్ఞానంలోనే సూర్యకిరణాలలో  ఏడురంగులున్నాయని  చక్కగా  వివరింపబడింది.

అశ్వం అంటే  కిరణం  అని  కూడా  అర్ధం. సూర్యుని  కిరణాలలో  పలురంగులు  దాగి  ఉన్నాయని  ప్రాచీనులు  తెలియజేశారు.
....................


కాంతి  వేగమును  లెక్కించిన  ప్రాచీనులు........

"యోజనానాం సహస్రం ద్వే ద్వేశతే ద్వే చ యోజనే!
ఏకేన  నిమిషార్ధేన క్రమమాణ  నమోస్తుతే  !! "



అనగా  అర  నిమిషానికి  2202  యోజనాల  దూరం  ప్రయాణించు  ఓ  కాంతికిరణమా  నీకు  నమస్కారము.  అని  భావం. 


 యోజనం=  9  మైళ్ళ  160  గజాలు. 

ఇవన్నీ  ఆధునికులు  కనుగొన్న  కాంతివేగానికి  దాదాపు  సమీపంగానే  ఉన్నవి.


(  ఇక్కడ  నేను  గ్రంధము  లోని  చాలా  వివరాలను   వ్రాయలేదు.  )

......................


గురుత్వాకర్షణ  సిద్ధాంతం........... 

సిద్ధాంత  శిరోమణి  ( భాస్కరాచార్యుడు)  అనే  గ్రంధములో  భువనకోశం  అనే అధ్యాయంలో  6వ  శ్లోకంలో  గురుత్వాకర్షణ  శక్తి  గురించి  చాలా  చక్కగా  వివరించారు.

ఆకృష్టిశక్తిశ్చ మహీతయా  యత్  స్వస్థం / గురు  స్వాభిముఖం స్వశక్త్యా
ఆకృప్యతే తత్పతతీవభాతి/ సమే  సమంతాత్ క్వ పతత్వియం  ఖే 11

భూమి  ఆకాశంలో  ఉన్న  వస్తువులను  సహజంగా  స్వశక్తితో  ..తనవైపుకు  ఆకర్షిస్తుంది.ఈ  ఆకర్షణ  వల్ల  అన్ని  వస్తువులు  భూమిపై  పడతాయి.....అని  తెలియజేశారు. 

జగద్గురువు  ఆదిశంకరుల  వారు  వారి  ప్రశ్నోపనిషత్  భాష్యంలో  అపానశక్తి  గురించి  వ్రాస్తూ...

ఒక  వస్తువును  పైకి  ఎగురవేస్తే  దానిని  భూమి  ఎట్లు  ఆకర్షిస్తుందో ..అటులనే  పైకిలాగబడే  ప్రాణశక్తిని  అపానశక్తి  కిందకు  లాగుతోంది  (  3-8  శ్లో  ) అని  చెప్పారు. 


...............

వేద  రుషులు  ఖగోళ  శాస్త్రానికి  సంబంధించిన  గణనలో....

భూమికి,  చంద్రునికి  మధ్య  దూరం,  చంద్రుని  వ్యాసానికి  108  రెట్లు  ఉందని,

భూమికి  సూర్యునికి  మధ్య  దూరం,  సూర్యుని  వ్యాసానికి  108  రెట్లు  ఉందని,


సూర్యుని  యొక్క  వ్యాసం  భూమి  వ్యాసానికి  108  రెట్లు  ఉందని  తెలియజేశారు.


ఈ వేద గణన  ఆధునిక  సాంకేతిక  విశ్వగణనలో  లభించిన  భూమికీ,  చంద్రునికీ,  భూమికీ  సూర్యునికీ  ఉన్న  దూరంతో  దాదాపు  సరిపోయింది.

.............................


ప్రపంచంలోనే  మొదటి  ఆనకట్ట  భారతదేశంలోనే  నిర్మించబడిందని  మీకు  తెలుసా !

 ఇది  కలవై  ఆనకట్ట  .తమిళనాడులో  కావేరీ  నదిపై  నిర్మించబడింది.  క్రీ.శ. 2 వ  శతాబ్దంలో  చోళరాజు  కరికాలచోళుడు  కాలంలో  నిర్మించబడిందట. 

 దీని  నిర్మాణంలో  సిమెంట్  మొదలైన  బైండింగ్  మెటీరియల్  ఏదీ  ఉపయోగించబడలేదు.

క్రీ. పూ.4వ  శతాబ్దంలోనే  నేటి  గుజరాత్  రాష్ట్రంలో  అతి  పెద్ద  సుదర్శన  జలాశయం  నిర్మించబడింది.  ఇవి  ఆనాటి  విజ్ఞానానికి  నిలిచి  ఉన్న  తార్కాణాలు.

..........................


అతి  ప్రాచీన  ఓడరేవు  లోతల్.....( సింధూ నాగరికత). 

క్రీ,పూ, 2400  సంవత్సరం  నాటికి  సింధూ నాగరికతలో  ప్రాముఖ్యం  కలిగిన  ఓడరేవు.  ఆనాటి  లోతల్  నగరం  చక్కటి  ప్రణాళికతో  నిర్మించబడింది.

దిక్సూచి...
ఇక్కడి  త్రవ్వకాలలో  షెల్ కంపాస్  లోహశాస్త్రానికి  సంబంధించిన  పరికరాలు  లభించాయి. ఇక్కడి నాగరికత  ప్రశస్తమైనది. ఓడల  విశ్రాంతికి  ప్రత్యేక  డాక్ లు  ఉండేవి. 

.......................


జె.పి  బోస్.  ఈయన  గొప్ప  శాస్త్రవేత్త.  మొక్కలు  మానవులలానే  స్పందిస్తాయి,  రోదిస్తాయి,  హర్షిస్తాయి.  అని  ప్రపంచంలో  తొలిసారిగా  నిరూపించిన  శాస్త్రవేత్త.

 ఈయన భౌతిక  శాస్త్రవేత్తే  కాకుండా వృక్షశరీరధర్మశాస్త్రం  మీద  కూడా  పరిశోధనలు  చేసి  150  పరిశోధనా  వ్యాసాలను  ప్రపంచవ్యాప్తంగా  అనేక  సభలలో  సమర్పించారు.

పరిశోధనల  కోసం  ఎన్నో  పరికరాలను  నిర్మించుకున్నారు.  వాటిలో  ముఖ్యమైనది  క్రిస్కోగ్రాఫ్. ఇది  ఒక  వస్తువును  10  మిలియన్ల  రెట్లు  పెద్దది  చేసి  చూపిస్తుంది.

.........................

.......
గణితంలో  దిట్టలు...భారతీయులు....

ప్రసిద్ధ  శాస్త్రవేత్త  ఐన్ స్టీన్  ఏమన్నారంటే, మనం  భారతీయులకు  ఎంతో  రుణపడిఉన్నాం. భారతీయులే  ప్రపంచానికి  గణితంలో  సులభంగా  లెక్కించే  దశాంశపద్ధతిని  కనుగొన్నారు.  అదే  లేకపోతే  ఎన్నో  వైజ్ఞానిక  పరిశోధనలు  సాధింపబడేవి  కాదు.  అన్నారట. 


 సున్నాను  గురించి  ప్రపంచానికి తెలియజేసింది  భారతీయులే. 

.............................


ఈ  టపాలోని  విషయాలను .. వివేకానంద  లైఫ్ స్కిల్స్  అకాడమీ , హైదరాబాద్  వారి  "భారతీయ ప్రతిభా విశేషాలు  108 నిజాలు " అనే  గ్రంధము  నుంచి  సేకరించి  వ్రాయటమైనది.  వారికి  కృతజ్ఞతలు.

ఆ  గ్రంధములోని  విషయాలను  టపాలో  వ్రాయటం  పట్ల    వారికి  ఏమైనా  అభ్యంతరం  ఉంటే  దయచేసి  తెలియజేయగలరు.

ప్రాచీన యంత్ర  శాస్త్రం, అగస్త్యుని విద్యుత్ ఉత్పత్తి విధానం , వేప, పసుపు కోసం యుద్ధాలు , తులసీ మాహాత్మ్యం ... వంటి  ఎన్నో  విశేషాలున్నాయి.  ఆసక్తి  ఉన్నవారు  
"భారతీయ ప్రతిభా విశేషాలు  108 నిజాలు " అనే గ్రంధమును  చదవగలరు.