koodali

Monday, July 15, 2013

సమాజం సజావుగా నడవాలన్నా ఎన్నో వృత్తుల వారి అవసరం ఉంది.


ఒక  సినిమా  తీయాలంటే  దాని  వెనుక  ఎందరో  వ్యక్తుల  అవసరం   ఉంటుంది.   


 కెమెరామెన్, ఎడిటర్, సంగీతాన్ని ,  కధను,  మాటలను  అందించేవారు ,   లైట్  బోయ్స్,  మేకప్  వాళ్ళు,  ఆహారాన్ని , దుస్తులను   సప్లయ్  చేసేవాళ్ళు, వాహనాలను  నడిపేవారు...ఇలా  ఎందరో  సమిష్టిగా  కృషి  చేస్తేనే  సినిమా  ప్రేక్షకుల  ముందుకొస్తుంది. 

(  సమాజం  సజావుగా  నడవాలన్నా  ఎన్నో  వృత్తుల  వారి  అవసరం  ఉంది.  )

 ఇక సినిమాకు  నిర్మాత,  దర్శకుడు ,  ఇతర  నటీనటుల  కృషి  ఎంతో  ఉంటుంది.  అయితే, ప్రేక్షకులు  ఏం  చేస్తారంటే,  


  హీరోహీరోయిన్స్  ను   మాత్రమే  ఆకాశానికి  ఎత్తేసి  గౌరవిస్తారు.   వారికే  ఎక్కువ  పారితోషికమూ  లభిస్తుంది.

  అందరి  కష్టమూ  ఒకటే .  తెర  వెనుక  పనిచేసేవారు  కూడా  ఎంతో  కష్టపడతారు.  అయినా  వారికి  హీరోహీరోయిన్స్ తో  సమానంగా  పేరు  గానీ  డబ్బు  గానీ  రాదు.
......................................

ఒక  పెద్ద  వ్యాపారసంస్థ  ఉంటుంది  అందులో  చైర్మన్   ఆఫీసుకు  రాగానే  అందరూ  నిలబడి  విష్  చేస్తారు.  ఆ  సంస్థలో  చిన్న  ఉద్యోగి  వస్తే   ఎవరూ  విష్  చేయరు.

  ఆఫీస్  సరిగ్గా  నడవాలంటే  చైర్మన్,  క్లర్క్  ఇద్దరూ  అవసరమే ,  ఇద్దరూ  రోజంతా  కష్టపడతారు.  అయితే  ఇద్దరికీ  జనం  ఇచ్చే  మర్యాదల్లో  ఎంతో  తేడా,  ఇద్దరూ  అందుకునే  జీతభత్యాల్లో  విపరీతమైన  అంతరం.

.............................

ఒక  రోడ్  ప్రక్కన  బిచ్చగాడు  అద్భుతంగా  చిత్రాలు  వేస్తాడు.  జనం  చిల్లర  నాణేలు  ఆ  చిత్రం  పై  వేసి  వెళ్తారు.


ఒక  ప్రముఖ  వ్యక్తి  వేసే  చిత్రాలకు  అంతర్జాతీయంగా  గుర్తింపు  లభిస్తుంది.  ఎన్నో  అవార్డులు  లభిస్తాయి. 


  రోడ్డు  ప్రక్కన  చిత్రాలు  వేసే  అతనికి  ఏ  గుర్తింపూ  లభించదు.  ఏ  అవార్డులూ  అతనిని  వరించవు. 
...........................

ఇలా  ప్రపంచంలో  ఎన్నో  అసమానతలు  జరుగుతున్నాయి.  


ఈ  అసమానతలకు  కులంతో  సంబంధం  లేదు.  ఇప్పుడు  డబ్బు, అధికారం ఉన్న వారిదే  రాజ్యంలా  ఉంది.

డబ్బు,
అధికారం ఉన్న వాళ్ళు శూద్ర కులానికి చెందినా అందరూ గౌరవిస్తారు.

డబ్బు, అధికారం  లేనివాళ్ళు బ్రాహ్మణకులానికి చెందినా గౌరవించటం లేదు.

అందరికీ సమానంగా హోదా, జీతభత్యాలు ఉన్నప్పుడే ఈ అసమానతలు తొలగిపోతాయి. మరి ఇలా చేయటానికి ఎందరు ఒప్పుకుంటారు?


అందరూ సమానమే అనే వారు ..... రోజంతా కష్టపడే ఒక కూలీకి, రోజంతా కష్టపడే ఒక ఉన్నత  స్థాయి ఉద్యోగికి ఒకే రకంగా హోదా, జీతభత్యాలు ఇస్తే ఒప్పుకుంటారా ?

.................................................


Saturday, July 13, 2013

పురాణేతిహాసాల గురించి మరికొన్ని అభిప్రాయాలు...

 
 జన్మల బంధం నుండి విముక్తి చెందాలంటే   యుక్తవయస్సులోనే  కుమారుడూ, భార్య, కుటుంబం బంధాలు వదలుకోవాలని కృష్ణుడు   బోధించలేదు  .

 కృష్ణుడు తో  సహా  పెద్దలు  ఏం  చెప్పారంటే,   ఒక  క్రమంలో  చతురాశ్రమ  పద్ధతిలో  చక్కగా  జీవించి  మోక్షాన్ని  పొందమన్నారు.  విద్యార్ధి  దశ,  గృహస్థ  దశ,  వానప్రస్తం,  తరువాతే  సన్యాసాశ్రమం  చెప్పారు.

చిన్న  వయస్సులోనే  శుకుల  వారు  సన్యాసాశ్రమం  స్వీకరిస్తానంటే   వ్యాసులవారు  అభ్యంతరం   చెప్పారు. 

....................

" ఒక  యోగి  ఆత్మ  కధ " గ్రంధములో  ఏం  చెప్పారంటే ,  ఈ  రోజుల్లో   అడవులకు  వెళ్ళటం  వంటివి  అందరికి  కుదరవు  .  కాబట్టి,   ఇంట్లోనే  ఉంటూ  కూడా  మోక్షాన్ని  పొందటానికి    నిష్కామయోగాన్ని  చక్కగా   అవలంబించవచ్చు..   అనే  అర్ధం  వచ్చే  విధంగా 
చెప్పారు.  
.......................................

భారతయుద్ధం   జరగటం  ద్వారా  ఎందరో  దుష్టులైన   వారి    పీడ  ప్రజలకు  వదిలింది.

భూమిపై  పాపాత్ములు  పెరిగిపోయారని  భూదేవి  దేవతల  వద్ద  మొరపెట్టుకోగా ,  మహాభారత  యుద్ధం  జరిగి ,  ఆ  యుద్ధంలో  ఎందరో  దుష్టులైన   రాజులు,  ప్రజలు    ప్రాణాలను  కోల్పోయారు.  


భూదేవి   భాదపడటానికి  ముందే,  భూమిపై  పాపాత్ములు  పెరిగిపోవటం  చూసి  భారత  యుద్ధానికి  చక్కటి   ప్రణాళిక  రచించి  అమలుచేయించిన  వారు  ఆదిపరాశక్తి.

భారతయుద్ధం  జరగకపోతే  భూమికి  పాపాత్ముల  భారం  తగ్గదు.  అందువల్ల  భారతయుద్ధం  జరగాలని  ఆ  యుద్ధంలో  ఎందరో  పాపాత్ములు  చనిపోవాలన్నదే   శ్రీ  కృష్ణునితో  సహా  దేవతల  ప్రణాలిక.  


సంధి కి  దుర్యోధనుడు,  జరాసంధుడు,  వంటి   దుష్టులైన    రాజులు  ఒప్పుకోరని  కృష్ణునికి  ముందే  తెలుసు.  
............................


సృష్టిలోని  ఏ  పదార్ధాన్ని,  శక్తిని  సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని  ఆధునిక  శాస్త్రవేత్తలు  కూడా  ఒప్పుకున్నారు.  ఆ  సూత్రం  ప్రకారం  చూసినా  జన్మలు,  పునర్జన్మలు  ఉంటాయి .  


పునర్జన్మలు  ఉన్నాయని  కొందరు  ఆధునిక  శాస్త్రజ్ఞులు  ప్రయోగాల  ద్వారా  నిరూపించారు  కూడా. 

 అయితే  కొందరు  హేతువాదులు  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పే  విషయాలలో  తమ  వాదనకు    అనుకూలమైన  వాటినే  స్వీకరిస్తారు. 
.............................

ఎంతో  పని  వత్తిడిలో  ఈ  వ్యాసాన్ని  వ్రాశాను.  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Friday, July 12, 2013

ఎవరూ తక్కువ కాదు , కులం కన్నా గుణం ప్రధానం..వంటి ఎన్నో మంచి విషయాలను తెలియజేసిన శ్రీ కృష్ణ పరమాత్ముని,భారతాన్ని,శంకరాచార్యుని విమర్శించటం సరైనది కాదు...


దయచేసి  ఈ  వ్యాసం  చివరి  వరకూ  చదువుతారని  ఆశిస్తున్నానండి.

కొందరు  ఏమంటారంటే ,  ప్రాచీన  గ్రంధాలలో  ఒకే  విషయం  ఎన్నో  విధాలుగా  ఉంటుంది.  అంటారు. 

 ఉదా..  సత్యమే  గొప్పది  కాబట్టి  అసత్యం  పలకకూడదు  అంటారు.


 అయితే,
  ఆపత్కాలంలో  అసత్యం  పలికినా   తప్పుకాదు  అంటారు. 

 ఇదంతా  మాకు  అర్ధం  కావటం  లేదు.  పెద్దలకు  సరైన  పంధా  లేదు  .  అని  కొందరు  విమర్శిస్తుంటారు.

ఆలోచించండి,   ప్రతిదానికి  అసత్యాలు  ఆడటం  వల్ల  సమాజంలో  అస్తవ్యస్థ  పరిస్థితులు  ఏర్పడుతాయి. 


ఎన్నో  ఘోరాలు,  నేరాలు  జరగటానికి  అబద్ధము  ఒక  ముఖ్యమైన  కారణం.  అందువల్ల  సత్యమే  పలకాలి.  అని  పెద్దలు  తెలియజేయటం  జరిగింది. 

అయితే,  అసత్యం  పలకటం  కొన్నిసార్లు  తప్పనిసరి  అవుతుంది. 

ఉదా...కొందరు  ఆకతాయి  కుర్రాళ్ళు   ఒక  సాధు  జంతువును  బాగా  కొడుతూ  వస్తున్నారు.  ఆ  జంతువు  అప్పటికే  బాగా  దెబ్బలు  తిని  ఆయాసంతో  వగరుస్తూ  మీ  ఇంటి  వద్దకు  వచ్చి   చెట్టు  క్రింద  దాక్కుంది.

ఆలస్యంగా   వచ్చిన   కుర్రవాళ్ళు  జంతువు   ఎటు  వెళ్ళిందని  మిమ్మల్ని  అడిగారు. అప్పుడు  మీరు  ఏం  చేస్తారు  ?

జీవితంలో  సత్యమే  పలుకవలెను...అని   ఆ  జంతువు  దాక్కున్న  ప్రదేశాన్ని  చూపించరు  కదా  !

అసత్యం  చెప్పకపోయినా , కుర్రవాళ్ళకు  యుక్తియుక్తంగా  జవాబు  చెప్పి  వాళ్ళను  అక్కడనుంచి   పంపించి  ఆ  జంతువును  రక్షించటానికే  ప్రయత్నిస్తారు  కదా !

( గ్రంధాలలోని ఒక  కధ ఆధారంగా ఈ సంఘటన వ్రాసాను.)

మనం  పలికే  సత్యం  వల్ల  నిష్కారణంగా  అమాయకుల  ప్రాణం  పోయే  పరిస్థితి  ఉన్నప్పుడు  సత్యం  పలికినా  అది  అసత్యం  పలికిన  దానితో  సమానమే  నంటారు. 


 అందువల్ల  పరిస్థితిని  విశ్లేషించుకుని   వివేకంతో  ప్రవర్తించాలన్నది  పెద్దల  అభిప్రాయం.

నిదానమే  ప్రధానం  అన్న  పెద్దలే  ఆలస్యం  అమృతం  విషం . అని  కూడా  అన్నారు.

ఇవన్నీ  చదివిన   కొందరికి  పెద్దల  మీద  కోపం  వచ్చేస్తుంది.  పెద్దలు  ఏమిటి ? గ్రంధాలలో  వాళ్ళ  ఇష్టం  వచ్చినట్లు  వ్రాశారు. 

కాసేపు  నిదానమే  ప్రధానమంటారు.  కాసేపు  ఆలస్యం  అమృతం  విషం  అంటారు.   పూర్వీకులకు  ఏమీ  తెలియదు . అని  ఇంకా  ఏమేమో  నోటికొచ్చినవన్నీ  అనేస్తారు.

పెద్దలు  చెప్పిన  దానిలో  తప్పేముంది ?  రెండూ  నిజమే.

జీవితంలో  కొన్నిసార్లు  నిదానమే  ప్రధానం . అన్నట్లు  ప్రవర్తించాలి.  కొన్నిసార్లు  ఆలస్యం  అమృతం  విషం . అన్నట్లు   త్వరగా  నిర్ణయాలు  తీసుకోవాలి.

భార్యాభర్త   కొట్లాడుకుని  న్యాయమూర్తి  వద్దకు    తీర్పు  కోసం  వస్తే  నిదానమే  ప్రధానం  అని  నిదానంగా  ఆలోచించి  తీర్పు  చెప్పాలి.   కొంచెం  సమయం  గడిస్తే  ఈ  లోగా   భార్యాభ
ర్త  మధ్య  కోపం  తగ్గి  వాళ్ళే  సర్దుకుపోయే  అవకాశం  ఉంది.

అయితే,  అగ్ని  ప్రమాదం  జరిగి  కొంపలు  అంటుకుపోతుంటే  .....నిదానమే  ప్రధానం  అన్న  సూత్రం  వర్తించదు.  ఆలస్యం  అమృతం  విషం.  అన్నట్లు  త్వరగా  నిర్ణయం  తీసుకోవాలి. 

వేదాలలో  చెప్పిన  విషయాలు   చక్కగా  అర్ధం  అవటం  కోసం  పురాణేతిహాసాలు  వెలువడ్డాయి.

పురాణేతిహాసాలను  మరింత  స్పష్టంగా  వివరించటానికి  అవధూతలు,  అవతారమూర్తులు , సద్గురువులు...ఎందరో  అవతరించి  ప్రపంచానికి  దిశానిర్దేశం  చేస్తున్నారు.

........................................

శ్రీకృష్ణుడు  తనను  విందుకు  ఆహ్వానించిన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని    తిరస్కరించి  విదురుని  ఇంట  విందును  స్వీకరించారు.  విదురుని  తల్లి  శూద్ర స్త్రీ. 


 ఈ  సంఘటన  ద్వారా   కులం  కన్నా  గుణమే  ప్రధానం  అని  లోకానికి  చాటినట్లయింది.

 శూద్రుడైన  ధర్మవ్యాధుడు  బ్రాహ్మణుడైన   పండితునికి   కర్తవ్యబోధ  చేసిన  సంఘటన  ఉంది.( భారతంలో..) 

   గొప్ప  సందేశాలున్న    మహా  భారతాన్ని,  అందులో  ముఖ్య పాత్రధారి   అయిన  శ్రీ  కృష్ణ  పరమాత్మను  విమర్శించటం  అంటే ,   విమర్శించిన  వారు   శ్రీ  కృష్ణపరమాత్మను  మరియు   ప్రాచీన  గ్రంధాలను  సరిగా  అర్ధం  చేసుకోలేదని  అర్ధం. 
...........................................

ప్రాచీన  గ్రంధాలలో  శివునికి  విష్ణువుకు  భేదం  లేదని  పెద్దలు  ఎన్నో  చోట్ల  తెలియజేయటం  జరిగింది.  


అయినా  ఎందరో  పండితులు  తరతరాలుగా  శివుడే  గొప్ప,  విష్ణువే  గొప్ప  అంటూ..    సమాజంలో    గొడవలను  సృష్టించారు.  ఆది  శంకరాచార్యుల  వారు  ఈ  భేదాలను  రూపుమాపటానికి  కృషిచేశారు.

 ఇంకా ,  మనీషాపంచకము  నాటి  సంఘటన  ద్వారా  అంటరానితనం  సరైనది  కాదని  లోకానికి  చాటి  చెప్పారు.  ఇంకా  ఎన్నో  చక్కటి  పనులను  చేశారు. 


 అంటరానితనం  తప్పని  లోకానికి  తెలియజేసిన  ఆది శంకరాచార్యుని  విమర్శించటం  సరైనది  కాదు.

 శివకేశవుల  మధ్య  భేదాలతో  కొట్టుకు చస్తున్న వారిని  ఉద్ధరించి , సమాజంలో  ప్రశాంత  వాతావరణాన్ని  ఏర్పరిచిన  ఆది శంకరాచార్యుని  విమర్శించటం  సరైనది  కాదు.

శూద్ర  వనిత  పుత్రుడైన  విదురుని  ఇంట  ఆతిధ్యం  స్వీకరించటం  ద్వారా  కులం  కన్నా  గుణం  గొప్పదని  లోకానికి  చాటిన   శ్రీ  కృష్ణుని  విమర్శించటం  సరైనది  కాదు.

ధర్మవ్యాధుని  కధ  ద్వారా  ఎవరూ  తక్కువ  వారు  కాదు ... మాంసాన్ని విక్రయించే వారు కూడా  గొప్పవారే .... అని  చాటిన  భారతాన్ని  విమర్శించటం  సరైనది  కాదు.

వ్రాసిన  విషయాలలో   పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


Wednesday, July 10, 2013

జగన్నాధ రధయాత్ర .... పురాణేతిహాసాల గురించి కొన్ని విషయములు....

 
ఓం,
ఈ  రోజు  జగన్నాధ  రధయాత్ర......
శ్రీ జగన్నాధస్వామి వారికి, శ్రీ బలభద్ర స్వామివారికి , శ్రీ సుభద్ర అమ్మ వారికి  అనేక  నమస్కారములు....

...................
వేదములు ,పురాణేతిహాసములు  చాలా గొప్పవి. వీటి గురించి మనము అర్ధం చేసుకున్నది చాలా తక్కువ. అని నా అభిప్రాయము.

వాటిలో ఎన్నో అంతుపట్టని ఆథ్యాత్మిక విషయాలు, వైజ్ఞానిక విషయాలు, సామాజిక విషయాలు.. ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.
 

  ప్రాచీనకాలపు పెద్దలు ,  పురాణేతిహాసములలో  ఎన్నో  విషయాలను సంకేతరూపములో ఉంచి ,  భద్రంగా మనకు అందించారని  ఈనాటి పెద్దల అభిప్రాయం. వాటిని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటం మన దురదృష్టం. 

అందులోని కధలను కొంతమంది అపార్ధం చేసుకుంటున్నారు.



పురాణేతిహాసాల ద్వారా పెద్దలు , మనకు  అవసరమైన  అన్ని విషయాలను  తెలియజేసారు. 

 రావణాసురుని  లేదా దుర్యోధనుని   ఇంకా   భూమి మీద రాక్షసులను, చెడ్డ శక్తులను  సంహరించాలంటే దైవానికి   చిటికెలో  పని.

కానీ అలా చంపకుండా .....


రామాయణం, భారతం వంటి ఇతివృత్తాల ద్వారా....ఎన్నో కధలను, అందులో పాత్రధారులను కల్పించి , వారి జీవితాల ద్వారా..వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇంకా ...

ఏది ధర్మం ? ఏది అధర్మం? వంటి ఎన్నో విషయాలను,   ఎంతో  విజ్ఞానాన్ని ...పురాణేతిహాసాల ద్వారా ,  దైవం   లోకానికి అందించటం జరిగిందని  అనిపిస్తుంది.
.......

 పురాణములలో సృష్టి ఎలా జరిగింది..... ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయంట.

నవగ్రహములు  గురించి మనవారికి ఎప్పుడో తెలుసు.  గ్రహాల గురించి విషయాలు, అవి ఎన్ని యోజనముల దూరంలో ఉంటాయి..  వంటి  విషయాలను  ప్రాచీన కాలం నాటి  పెద్దలు తెలియజేసారు కదా !

 పంచాంగం ప్రకారము   రాబోయే  గ్రహణాలను  సరిగ్గా  అంచనా  వేసి,
ఏ యంత్ర  సహాయం  లేకుండానే  సంవత్సరానికి  ముందే  పండితులు చెప్పగలుగుతున్నారు  కదా ! 

 (ఇలా సరిగ్గా చెప్పగలగటం సైన్స్ కాదా ?)
...............

ఇంకా,  పురాణేతిహాసాలలోని  పాత్రల ద్వారా  పెద్దలు మనకు ...... జీవితములో మనము ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు...వంటి విషయాలను  కూడా తెలియచేశారు.

 ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకోసారి  అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తితోపాటు  బంధువులు .. ఆ వ్యక్తి  రాజు అయితే  రాజ్యంలోని  ప్రజలు  కూడా  ఎన్ని కష్టాలను  అనుభవించే   అవకాశాలున్నాయో..వంటి  విషయాల  గురించి  కూడా మనము తెలుసుకోవచ్చు.


....................................................
 దైవం యొక్క ఈ విశ్వ సృష్టిలో ఎన్నో పాలపుంతలు, గ్రహాలు, గొప్పవయిన కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ......... ఇలా మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి.

ఈ అనంత విశ్వంలో మన సూర్యకుటుంబం ఒక భాగం ....... అందులో మన భూమి ఒక భాగం. ఆ భూమిమీది  మానవులం మనమెంత... మన బ్రతుకెంత. .......ఆ దేవుని దయవల్ల ఏ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టకపోబట్టి ఇలా బ్రతుకుతున్నాము.


అంతా  దైవం  దయ.....

Friday, July 5, 2013

నేను కొంతకాలం క్రిందట దైవాన్ని నమ్మని నాస్తికవాదిని...


 పెద్దవాళ్ళు  ప్రసాదాన్ని  ఇచ్చినా  తీసుకోకపోవటం,     దైవం  , పురాణేతిహాసాల  గురించి   ఫ్రెండ్స్ తో  వేళాకోళంగా  మాట్లాడటం  ఇలా ..... ఉండేది  నా  ప్రవర్తన. 

  క్రమంగా  దైవం  అంటే  నమ్మకం  కలగటం మొదలయ్యింది. (  కొన్ని కారణాల  వల్ల  ) 

పురాణేతిహాసాలలోని  విషయాలను  క్రొత్త  కోణంలో  తెలుసుకుంటూ    క్రొత్తక్రొత్త   విషయాలను   తెలుసుకుంటున్న  కొద్దీ  ఆశ్చర్యంగా  అనిపించేది. 


 అయ్యో ! ఇంతకు  ముందు  వీటిని  అపార్ధం  చేసుకున్నాను  కదా  !  అనిపించేది.

పురాణేతిహాసాల  గురించి  తెలిసినంతలో  పాత టపాలలో  వ్రాశాను.  నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  ఈ  మాత్రం  వ్రాయగలుగుతున్నానంటే ,  అంతా  దైవం  దయ.

 జీవితంలో  ఎలా  ప్రవర్తిస్తే  ఎలాంటి  ఫలితాలు  ఉంటాయో  ...ఎలా  ప్రవర్తించాలో...ఎలా  ప్రవర్తించకూడదో  పురాణేతిహాసాల  ద్వారా  పెద్దలు  మనకు  తెలియజేసారు.

  రామాయణం, భారతంలోని  విషయాలలో   ఎన్నో    కోణాలు  ఉంటాయి.  పురాణేతిహాసాలను  చదువుతున్నకొద్దీ ....  క్రొత్త  విషయాలు ( అర్ధాలు )  తెలుస్తుంటాయని  పండితులు  తెలియజేశారు.

  ప్రపంచంలో  ఉండే  అన్ని  విషయాల  గురించి  ప్రస్తావన  మహాభారతంలో  ఉన్నది. 

భగవద్గీత  గురించి  ఏమని   వర్ణించగలం...  భగవద్గీత   అత్యద్భుతమైన  గీత.

ఎన్నో  శాస్త్రాలు..... వైద్యశాస్త్రం,  ఆర్ధిక  శాస్త్రం,  ఖగోళ  శాస్త్రం,  రసాయనశాస్త్రం,   యంత్ర  శాస్త్రం, మానసిక  శాస్త్రం,   న్యాయశాస్త్రం,   లోహశాస్త్రం.......ఇలా  ఎన్నో  శాస్త్రాల  ద్వారా  ఎంతో  విజ్ఞానాన్ని  ప్రాచీనులు  మనకు  అందించారు.

దురదృష్టవశాత్తు  మనలో  కొందరు   ప్రాచీన  గ్రంధాలను  సరిగ్గా  అర్ధం  చేసుకోవటం  లేదు.

అయితే,  దైవాన్ని  పురాణేతిహాసాలను  విమర్శించేవారిని  చూస్తే  జాలిపడటం  తప్ప  ఏం  చేయగలం. 

 నేను  కూడా  నాస్తికవాదిగా  ఉన్నప్పుడు  దైవం  గురించి  పెద్దవాళ్ళు  ఎంత  చెప్పినా  వినిపించుకునేదాన్ని  కాదు.

ఎవరికైనా  తెలుసుకోవలసిన  సమయం  వచ్చినప్పుడు  తెలుస్తుందేమో.....

..........................


విదేశీయుల  రాక  మరియు   దండయాత్రల   పర్యవసానంగా    భారతదేశం  నుంచి  ఎంతో  సంపద  కొల్లగొట్టబడి,   విదేశాలకు  తరలిపోయింది. 

ఎన్నో  విలువైన  ప్రాచీన  విజ్ఞాన  గ్రంధాలను  కూడా  వాళ్ళు  తమ  దేశాలకు  తరలించుకుపోగా,   ఇక్కడ  ఉన్న  వాటిలో  కొన్నింటిని   నాశనం  చేశారు. 


 ఆ  విధంగా  తరతరాల  దోపిడీలో  మనం  ఎంతో  సంపదను  కోల్పోయాము.

  మెకాలే   విద్యావిధానాన్ని   భారతదేశంలో   ప్రవేశపెట్టేముందు   ఈ  దేశం  గురించి   అన్న  మాటలు  చాలా  మందికి  తెలుసు.

 ఇండియా  ఎంతో   సిరిసంపదలతో  ఉన్నదని ,  ఇక్కడ  బిచ్చగాళ్ళు  కనపడలేదని  ...అంటూ    మరెన్నో  విషయాలను  చెప్పటం   జరిగింది. 


Sunday Posts: Lord Macaulay's Speech on Indian Education: The ...


 బ్రిటిష్ వాళ్ళు  ఇండియాకు  రాకముందు  కూడా  కొన్ని  విదేశీ  దాడులు  జరిగాయి.  అయినప్పటికి ,   మెకాలే  కాలానికి  కూడా   ఇండియాలో  అంత  సిరిసంపదలు  ఉన్నాయంటే ......


 విదేశీయులు  భారతదేశంలో  ప్రవేశించి  దాడులు  జరగకముందు  ఈ  దేశం  ఎంత  గొప్పగా ఉండేదో  కదా!

 భారతదేశం  ఆర్ధికంగా  ఇప్పుడిలా  వెనకపడి  ఉండటానికి  అనేక  కారణాలున్నాయి.  అందులో  కొన్ని...

1.  మనలో  ఎక్కువమందికి    మన  పూర్వీకులన్నా , మన  ప్రాచీన  సంస్కృతి  అన్నా,   చులకన  భావం   ఉంది....


.మనకేమీ  తెలియదని..... విదేశాల  వాళ్ళకే  అన్నీ  తెలుసు .... అనుకుంటూ  గిల్టీగా  ఫీలవుతుంటారు . 

2. మనలో  ఐకమత్యం  తక్కువ.  భారతదేశం  తరతరాలుగా  విదేశీదాడులకు   గురవుతోందంటే   ఇలాంటి    కారణాలు  ఎన్నో  ఉన్నాయి.

ఇప్పటికీ  భారతదేశం  నుంచి  సంపద  విదేశాలకు    తరలిపోతూనే  ఉన్నది. రకరకాల మార్గాలలో  మరియు   విపరీ
తమైన   మేధావుల  వలస  రూపంలో...
.........................


ఆధునిక  కాలంలో  ప్రపంచం  ఎదుర్కొంటున్న.....  నైతికవిలువల  క్షీణత,  ఆర్ధిక  సంక్షోభం,  నిరుద్యోగం,   గ్లోబల్  వార్మింగ్  వంటి  పర్యావరణ  సమస్యలు   ...

ఇలాంటి  ఎన్నో   సమస్యల నుండి  ప్రపంచం  బైటపడాలంటే  మన  పురాణేతిహాసాలు  మరియు  ప్రాచీన  విజ్ఞానం  ద్వారా  చక్కటి  పరిష్కారాలు  లభిస్తాయి.


Wednesday, July 3, 2013

పురాణేతిహాసాలు , చరిత్ర ..... గురించి కొన్ని విషయాలు.



 పురాణేతిహాసాలు  రామాయణము,  భారతము,(భగవద్గీత ) ... ద్వారా  ఎన్నో  చక్కటి  విషయాలు  తెలుస్తాయి.

మరియు   శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ  చరితామృతము  గ్రంధములో  కూడా   ఎన్నో  చక్కటి  విషయాలు  ఉన్నాయి.
....................................................


భారతం,  రామాయణం  నిజంగా  జరిగినవా ? కాదా ? అని కొందరు  సందేహపడుతుంటారు. 


 ఈ  మధ్య  శాటిలైట్  చిత్రాల సమాచారం  ద్వారా  రామాయణకాలంలో  సముద్రంలో   నిర్మించిన  వారధి  మరియు  భారతకాలం  నాటి    ద్వారకానగర  సమాచారం  లభించింది.

  పూర్వ  కాలం  నాటి  రామసేతు,  మరియు  ద్వారకా  నగర  విశేషాలు  ఇప్పటికి  ఎలా  ఉన్నాయి   ?  అని   కూడా కొందరికి  అనుమానాలు  వస్తాయి.

 మంచుయుగం  ముందటి   డైనోసార్ల  ఎముకలు,  శిలాజాలు  ఇప్పటికి    లభించటం ...... వాటి  ఆధారంగా  డైనోసార్ల  కాలం నాటి  పరిస్థితిని  శాస్త్రవేత్తలు    నిర్ణయిస్తున్నారు  కదా  ! 

 మంచుయుగం  ముందటి  డైనోసార్ల  అవశేషాలే  ఇప్పటికీ  లభిస్తున్నప్పుడు  ,   నాగరికత  ఏర్పడిన  నాటి  రామసేతు,  ద్వారకానగర    నిర్మాణాలు    చక్కగా  ఉండటంలో  ఎటువంటి  ఆశ్చర్యము   లేదు.


  విదేశాల  వారు  వారి  ప్రాచీన  కట్టడాలను  ఎంతో  జాగ్రత్తగా  రక్షించుకుంటారు.  మన  దేశం  వారికి  పురాతన కట్టడాలంటే  నిర్లక్ష్యం  ఎక్కువ.  మనం  కూడా  ప్రాచీన  కట్టడాలను  రక్షించుకోవాలి.

దయచేసి ఈ  క్రింది  లింక్స్  చూడగలరు........

Amazing facts about - Ancient India: Scientific Dating of Ramayan Era  


Science & Technology in Mahabharatha: Material evidence ...

 

The Holy Science - Wikipedia, the free encyclopedia



Rama Setu - An Engineering Marvel of 5076 BCE - YouTube


Shocking Truth of Ram Setu - YouTube

...............................................

 
పూర్వం  భూమి  అంతా  ఒకే
ఖండముగా    ఉండేదని   కొన్ని    గ్రంధాల  ద్వారా  తెలుస్తుంది. 

  ఆధునిక  పరిశోధకులు  కూడా ,   పూర్వం  భూమి  అంతా  ఒకే  ఖండముగా  కలిసి  ఉండి  ఉండవచ్చని ఒప్పుకున్నారు.  దానిని  గోండ్వానా లేండ్  అనే  పేరుతో  వ్యవహరిస్తున్నారు.

భూమి  అంతా  ఒకే  ఖండముగా  ఉన్నప్పుడు  భూమి  మీది   ప్రజలు  మరియు  నాగరికతలో  ఎంతో  సారూప్యం  ఉంటుంది.

 ఖండాలు  విడిపోయిన  తరువాత  చరిత్రకారులు    భూమిలో  త్రవ్వకాలు  జరిపితే ,  దొరికిన  చారిత్రిక  ఆధారాల  మధ్య  ఎన్నో  పోలికలు  ఉంటాయి.  అయితే,   వాటి  ఆధారంగా  చరిత్రకారులు   నిర్ణయించే  విషయాలలో  తప్పులు  వచ్చే  అవకాశం  ఉంది.

 ఎందుకంటే  ఇప్పుడు  విడివిడిగా  ఉన్న  ఖండాలు  పూర్వం   ఒకే  ఖండముగా  ఉండేవన్న  విషయం  ఇంతకుముందు  తెలియదు  కాబట్టి.
 
 ......................... 

పూర్వం భారతదేశము, ఆఫ్రికా,   ఆస్ట్రేలియా  ఖండాలతో    కలిసి ఉన్నప్పుడు    ఒక పెద్ద భూఖండముగా    ఉన్నదని , దానిని   లిమూరియా  అంటారనే  మరొక  వాదన కూడా ఉంది.
.................... ...............
డైనోసార్లు  ఉన్న  కాలంలో  మానవులు  కూడా  ఉన్నారని  తెలిసే  శిలాజాల  గుర్తులు  లభించాయని  కూడా   కొందరు   పరిశోధకులు  చెబుతున్నారు. (  ఇది  ఎంతవరకు  నిజమో  మనకు  తెలియదు. )
........................................
ఋగ్వేదంలో  ......


 ఒక  కుటుంబంలోని  వారే  భిన్నవృత్తులను  స్వీకరించినట్లు 
గ్వేదంలో  చెప్పబడిందట.  నేను  కవిని,  మా  తండ్రి  వైద్యుడు,  మా  తల్లి  ఒడ్లు  దంచేది......

.. ఏ  వృత్తి  నీచంగా  చూడబడలేదు.   చర్మకారులను,  చర్మాలను  బాగుచేసేవారిని  కూడా    సంఘములో  తక్కువ  జాతివారుగా  ఎంచలేదు........ ఇలా   చెప్పబడిందట.

  తరువాత  కాలంలో  మనుషులలో  స్వార్ధం  పెరగటం  మరియు  తెలిసితెలియనితనం  వల్ల  సమాజంలో  అంటరానితనం  మరియు  కొన్ని  మూఢాచారాలు  వ్యాప్తిలోకి  వచ్చాయని  అనిపిస్తుంది. 
......................................


ప్రస్తుతం  ఉన్న  రూపములో  ,  ప్రమాణములో రామాయణ,  మహాభారత  కావ్యములు  ఒక  వాల్మీకి,  వ్యాసరచితములు  మాత్రమే  కావని  పలువురి  అభిప్రాయము. 

ఎన్నో  సంవత్సరాలుగా  ఈ  రెండు  కావ్యములలో అనేకమంది  కవులు  తమ  రచనలను  కూడా  చేర్చి  ఉంటారని  కొందరు  భావిస్తున్నారు. .....
.........................................


ఆధునిక  విజ్ఞానం  మరియు  చరిత్రకు  సంబంధించిన  విషయాల  నిరూపణలో  ఎన్నో  అభిప్రాయభేదాలు  ఉంటుంటాయి.  


సైన్స్   గురించి శాస్త్రవేత్తల  మధ్య ...... చరిత్ర  గురించి  చరిత్రకారుల  మధ్య  ఎన్నో  అభిప్రాయభేదాలు  ఉంటుంటాయి. .

ఆర్యుల  జన్మ  స్థానం  గురించి ......స్వామి దయానంద  గారి  ప్రకారం  ఆర్యులు  టిబెట్  నుంచి  వచ్చారు.

 లోకమాన్య  బాలగంగాధర  తిలక్  గారి  అభిప్రాయం  ప్రకారం  ఆర్యులు  ఉత్తరధృవం  నుంచి  వచ్చారు.


 ఫ్రొఫెసర్  మాక్డొనల్  గారి  ప్రకారం  ఆర్యులు  డాన్యూబ్ (  యూరోప్ )  నుంచి  వచ్చారు.  

 భారతీయులు,  పర్షియా  వారు  ఒకే  ఆర్యజాతికి  చెందిన  వారని  కొందరి  అభిప్రాయం. 

ఇలా  భిన్నాభిప్రాయాలు    ఉన్నాయి. 
 ..........................................

సింధు  నాగరికత  నిర్మాతల  గురించి  కూడా  ఎన్నో  అభిప్రాయాలు  ఉన్నాయి. 
ఉదా..  శాస్త్రాధారముల  ప్రకారం  పరీక్షించగా  ఈ  నాగరికతను  భిన్నజాతులవారు  కలిసిమెలసి  నిర్మించినట్లు  తెలిసిందట.


ఏదీ  నిర్ధారణగా  తేలనందున,.....

  ఫాదర్  హీరాన్  సింధు  నగరాలను  ద్రావిడులు  నిర్మించారని  ఆన్నారు.


డా.  లక్ష్మణ్  స్వరూప్,  కాంతి  స్వరూప్   ఆర్యులే  దీనిని  నిర్మించారని  అన్నారు.

మొహంజదారో  నగరము  ఏడుపొరలుగా   ( అంతస్థులుగా  )  బయటపడిందట.  ఒక్కొక్క  పొరకు  500  సంవత్సరముల  చొప్పున దాని  కాలాన్ని  క్రీ.పూ.  3500  సంవత్సరములకు  నిర్ణయించడమైనది.
.............................................. 


భారత దేశానికి  ప్రధమముగా  వలస  వచ్చిన  ఆర్యజాతులలో  ద్రావిడులు  ఒకరని  
కొందరు  చరిత్రకారుల  అభిప్రాయము.

   కొందరు  ఆర్యులు  తమను  ద్రావిడులుగా  పిలుచుకొన్నారని  మరి కొందరు   చరిత్రకారుల  అభిప్రాయము.

ద్రావిడులు  మధ్య  ఆసియాలోని   సీధియన్స్ కు  సంబంధించిన  వారని,  ఈ  రెండు  జాతుల  మధ్య భాషాసంస్కృతులకు  సంబంధం  ఉన్నదని  డా.  కాల్డ్వెల్  అభిప్రాయపడ్డారు.
..........................................


పురాణేతిహాసాలను  గమనిస్తే   కులాలను  బట్టి   అంటరానితనం  పాటించాలని  ఏమీ  చెప్పలేదని  చక్కగా  తెలుస్తుంది.

 పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలి...అని...  ప్రాచీనుల  ఉద్దేశం  అని  తెలుస్తుంది. 

ఈ  విషయాల  గురించి  ఈ  టపాలో  వ్రాయటం  జరిగింది. 


పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాల... 
..............

వ్రాసిన విషయాలలో ఏమైనా  పొరపాట్లు ఉంటే  దయచేసి  క్షమించాలని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 
 

Monday, July 1, 2013

జవానులు మన రక్షణకోసం కష్టపడుతుంటే అభినందనలతో సరిపెట్టేయటమేనా ? ..మరియు చిత్రాలు కూడా...

 
ఉత్తరాఖండ్  వరదల  సందర్భంగా  మన  రక్షణదళాల  వారు  అందించిన  ఆపన్నహస్తం  అద్భుతం,   జవానులు  అంతటితో  ఊరుకోరు.  మళ్ళీ  దేశరక్షణ  విధులను  నిర్వర్తిస్తారు. 

 జవానులు  సరిహద్దుల  వద్ద    దేశప్రజల  రక్షణ  కోసం  బాధ్యతలను  నిర్వర్తిస్తుంటే  మనము  ప్రశాంతంగా   నిద్రపోగలుగుతున్నాము.

వాళ్ళు   మన  రక్షణ  కోసం  సరిహద్దుల  వద్ద  కాపలా  కాస్తుంటే  మనం  ఏం  చేస్తున్నాము.......  సినిమాలు,  సీరియల్స్  లోని  నటీనటుల  గురించి  చర్చలు,  ఆలోచనలతో   కులాసాగా  బ్రతుకులను  వెళ్ళదీస్తున్నాము. 

జీవితంలో  వినోదం  ఉండవలసినదే.  అయితే  వినోదం  ఇప్పుడు  వ్యసనం  స్థాయికి  వచ్చేసింది.
..................................

పాత రోజుల్లో   ఎవరైనా  ప్రముఖ  వ్యక్తులు  మరణిస్తే  రెండుమూడు రోజులు  సంతాపదినాలను  పాటించేవారు.  అప్పుడు  రేడియోలో  భక్తిగీతాలు  వంటివి  మాత్రమే  వచ్చేవి.  వినోదకార్యక్రమాలను  ప్రసారం  చేసేవారు  కాదు. 

కాలం  మారింది.  ఇప్పుడు  ఎవరు  మరణించినా  పెద్దగా  పట్టించుకోవటం  లేదు.  ఉత్తరాఖండ్ లో  ఎంతోమంది  చనిపోయారు. 


పోయినవారు పోగా,   ఉన్నవారు  దిక్కుతోచక  గగ్గోలు  పెడుతుంటే   మనలో చాలామంది   మాత్రం  యధాప్రకారం  క్రికెట్,  సినిమా,  సీరియల్   ప్రసారాలు  చూడకుండా  ఉండలేకపోయాము. ..  ( జరిగిన  విషాదానికి  బాధపడుతూనే  . )

నేను  కూడా వినోద  కార్యక్రమాలను  చూసాను. ..  ( జరిగిన  విషాదానికి  బాధపడుతూనే  . ) 

 ప్రపంచం  చాలా  మారింది.  ఇప్పటికి  మనుషుల్లో    మానవత్వం  ,  ఇతరుల  బాధలకు  స్పందించే  గుణం  ,  పాపభీతి  ఇంకా  మిగిలే  ఉన్నాయి. అయితే,  భవిష్యత్తులో  మానవ  మనస్తత్వాలు   ఎలా  ఉంటాయో  ?

.................................... 


ఇంత విషాదం   జరిగినా  మనం  మారమా ? దేశంలో  ఇంత  అవినీతి,  ఇంత  పేదరికం,  ఇన్ని మురికివీధులు, ఇంత  వెనుకబాటుతనం  ఉన్నా  అవేమీ  మనకు  పట్టవా ?

భారతీయ  రక్షణ  దళాల  వారు   ఎంతో  కష్టపడి  బాధితులను  రక్షించారు. వాళ్ళను  చూసి  మనం  ఎంతో  నేర్చుకోవాలి.  దేశం  పట్ల  మన  బాధ్యతలను  మనము  సక్రమంగా  నిర్వర్తించాలి. 


 ఇప్పుడు  దేశప్రజలు  తమ   బాధ్యతలను  సక్రమంగా  నిర్వర్తించటం  లేదా  ?
అంటే ,  నిర్వర్తిస్తుంటే  దేశంలో    ఇంత పేదరికం, ఇంత  అవినీతి,   ఇన్ని  సమస్యలు,....  ఉండవు  కదా !


బాధ్యతలను  సక్రమంగా  నిర్వర్తిస్తున్నవారికి  వందనములు . 

  ఉత్తరాఖండ్ లో  వచ్చిన  విలయంలో  జవానులు   ఎంతో  కష్టపడ్డారు.  యంత్రాలలా  పనిచేసి  వేలమందిని  స్వస్థలాలకు  చేరవేశారు.  


 వాళ్ళు  అంత  కష్టపడుతుంటే    దేశాన్ని  బాగుచేయటం  కోసం  మనం  ఎందుకు  మన  వంతు  ప్రయత్నాన్ని  చెయ్యలేం  ?
  (  బద్ధకాన్ని,  సొంత  స్వార్ధాన్ని  కొద్దిగా  తగ్గించుకుంటే   ).
..............................

 భారత  రక్షణ  దళాల  వారు  ఎన్నో  కష్టాలకు  ఓర్చి  ప్రాణాలకు  తెగించి  బాధితులను  కాపాడారు.  . ప్రజలను   రక్షించే  ప్రయత్నాలలో  కొందరు  జవానులు  ప్రాణాలను  పోగొట్టుకున్నారు.  

ప్రాణాలను  కోల్పోయిన  జవానుల  యొక్క  కుటుంబసభ్యులు  ఎంతగా  తల్లడిల్లుతారో  కదా  ! 

 మన  సంతానం  వేరే  ఊరిలో  ఉంటే  మనం  ఎంతగానో  ఆలోచిస్తాము.  ఏ  కష్టమూ  రాకూడదని  కోరుకుంటాము.  మరి  సైనికుల  తల్లితండ్రులు,  మరియు   భార్యా  బిడ్డలు  తమ  వారి రక్షణ  కోసం  ఎంతగానో  ఆలోచిస్తారు  కదా  ! 

  జవానులు    మన  రక్షణకోసం  కష్టపడుతుంటే    అభినందనలతో  సరిపెట్టేయటమేనా  ? మనం  కూడా మనకు  చేతనైనంతలో ,  మన  పరిధిలో  సక్రమంగా  బాధ్యతలను  నిర్వర్తిస్తే   దేశంలోని  సమస్యలను  పారద్రోలటం  పెద్దపనేమీ  కాదు.

ఉత్తరాఖండ్  విలయంలో  బాధితులకు  సాయాన్ని  అందించిన  ప్రతి  ఒక్కరికీ ,  (  రక్షణదళాలు, పోలీసులు,   అధికారులు,  సేవాసంస్థలు,  స్వచ్చంద సేవకులు ...) అందరికి  కృతజ్ఞతలు. 


ఇతరులను  రక్షించే  సమయంలో   ప్రాణాలను  కోల్పోయిన  మహనీయులకు  నివాళులు.
...........................................


అయితే  ,  ప్రజలలో  ఈ సమయంలో   క్రికెట్  గురించి  ఆసక్తి  లేకుండా , వరదల   గురించి   బాధ   పడే వారూ  ఉంటారు .

 పై  చిత్రాన్ని  తయారు  చేసిన వారికి  కృతజ్ఞతలు. 

ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  కృతజ్ఞతలు.