(Indian Minerva )
సీతగారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి..
కానీ, నాకు ... తెలుగంత బాగా ఇంగ్లీష్ రాదు. అందుకని తెలుగులో వ్యాఖ్య వ్రాస్తే బాగుండేది అనుకున్నాను.
అయితే,నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదన్న విషయం మీకు తెలియదుకదా!
* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం ...........
దైవం భూమిపై జీవుల్ని రరకాలుగా సృష్టించటం జరిగింది.
అయినా పిండ దశలో ఉన్నప్పుడు వివిధ జీవజాతుల పిండాల్లో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి.అని శాస్త్రవేత్తలు అంటున్నారట.
మానవులకు జ్ఞానాన్ని , ఎన్నో తెలివితేటల్ని ఇచ్చిన దైవం తలచుకుంటే మొక్కలకూ, జంతువులకూ కూడా ఇవన్నీ ఇవ్వగలరు.
* కానీ ఏ జీవులకు ఏ లక్షణాలను ఇస్తే సృష్టి సజావుగా సాగుతుందో దైవానికే తెలుసు.
* పరిణామ సిద్ధాంతం కూడా సృష్టికి ఆటంకం కలుగకుండా పరిమితమైన పరిధిలోనే జరుగుతుంది అనిపిస్తుంది.
ఉదా... మొక్కలు ..వాటికి మనుషుల్లాగా మాట్లాడటం ,నడవటం చేతకాదు.
దైవం మొక్కలకు మాటలు, నడక ఇచ్చినట్లయితే మానవులకు ఆహారం పొందటం చాలా కష్టమయ్యేది కదా..
మనం కాయలు, పువ్వులు తెంపుకునేటప్పుడు, వాటిని పీకి ఆకుకూరగా వండుకునేటప్పుడు .... అవి బాధపడితే లేక పోట్లాడితే .... మనం కాయలు, పండ్లు కోయగలమా ? వాటిని ఆహారంగా తీసుకోగలమా ?
............................
* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం .
*. ఒక కుక్క పిల్లనో, కుందేలు పిల్లనో భారతదేశంలోని వేడిప్రాంతం నుంచీ విదేశాల్లోని చలిప్రాంతాలకు తీసుకువెళ్తే ......అక్కడి కొత్త వాతావరణానికి తట్టుకోవాలంటే శరీరం కొంత మార్పుకు అలవాటుపడాలి.
ఇలాంటప్పుడు దైవం జీవుల శరీరాలను ఎండకు, లేక చలికీ మాత్రమే తట్టుకునేటట్లు ముందే ఏర్పాటు చేస్తే జీవులకు కష్టమయిపోతుంది.
ఒకోసారి ఒకే దేశంలో కూడా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తూంటాయి.
ఇలాంటప్పుడు దైవం జీవులకు పరిణామలక్షణం ఉండేలా ఇచ్చిన అవకాశం మంచిదే కదా !
అయితే పరిణామ సిద్ధాంతం కూడా సృష్టికి ఆటంకం కలుగకుండా పరిమితమైన పరిధిలోనే జరుగుతుంది అనిపిస్తుంది.
ఉదా..నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నప్పటికీ జీవులు ఆల్గే, కప్పలు, చేపలు ఇలా...... విభిన్న రూపాల్లో ఉంటాయి కానీ, ఒకే లక్షణాలు కలిగిన జీవుల్లా మారిపోవటం లేదు కదా !
.....................
దైవం మానవులను చక్కగా సృష్టించారు. కానీ పాపాత్ములయ్యేది, పుణ్యాత్ములయ్యేదీ వారికి అవకాశాన్ని కూడా ఇచ్చారు.
పుణ్యాలు చేస్తే ఉత్తమలోకాల్లో గొప్ప జన్మ లభిస్తుంది. పాపాలు చేస్తే నీచజన్మ లభిస్తుంది.
అలాగే జీవులకు కూడా పై తరగతి జీవులుగానూ, లేక క్రింద తరగతి జీవులుగానూ పరిణామాన్ని చెందేట్లుగా అవకాశాన్ని ఇచ్చారేమో ?
( అంటే ఇక్కడ పాపపుణ్యాలు అని కాకుండా వేరే పద్ధతిలో చూడాలి. అంటే పరిస్థితులు, అలవాట్లకు అనుగుణంగా పరిణామం చెందే విధంగా అని అర్ధం చేసుకోవాలి. )
పరిణామవాదం నిజమే అయితే ....ఈ వాదాన్ని గమనిస్తే నాకు ఇలా కూడా అనిపించింది.
.................
దైవం తన సృష్టి రచనలో భాగంగా . జీవులకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పరిచారు. జీవులను సృష్టించారు.
* అయితే జీవనసమరంలో జీవుల ప్రయత్నాలకు గుర్తింపు, ప్రాముఖ్యత ఉంటుందని మనం తెలుసుకోవచ్చేమో !
* జీవులు ప్రయత్నిస్తే ఉన్నతస్థాయికి గానీ, అధమ స్థాయికి గానీ మారే అవకాశాన్ని దైవం కల్పించారు అనిపిస్తుంది.
అంటే కొందరు అనేటట్లు మనతలరాత.. మనం ఏం చేయగలం .. అని అనుకోకూడదనీ , జీవుల ప్రయత్నానికి కూడా ప్రాముఖ్యత ఉందని మనం అర్ధం చేసుకోవచ్చు.
లోకానికి మొక్కలు, వంటి జీవజాతులు చాలా సహాయపడుతున్నాయి.
* అవి కష్టపడకుండా , తమను తాము కాపాడుకోవటానికి వీలుగా అంటే పరిసరాలకు అనుగుణంగా పరిణామం చెందే అవకాశాన్ని దైవం కల్పించారేమో అనిపిస్తుంది.
........................
ఇంకా,
* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం .
* నిజమే కానీ ఈ భూలోకాన్ని జీవులకు పరీక్షాలోకం అనికూడా అనుకోవచ్చేమో !
( అయితే , ఆదిశక్తియైన పరమాత్మ యొక్క దయ ఉంటే , ఇహలోక భోగము ... పరలోకమోక్షము కూడా పొందవచ్చని పెద్దలు చెప్పటం జరిగింది.)
* పరిపూర్ణత్వమనేది పరమాత్మకే సాధ్యం.
జీవులు కూడా పరిపూర్ణత్వాన్ని పొందాలంటే పరమాత్మను పొందాలి. దానినే పెద్దలు మోక్షం అన్నారు.
భూలోకంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి..ఒక ప్రాణిని బాధించి లేక చంపి ఆహారాన్ని పొందటం ద్వారా ఇంకొక ప్రాణి జీవించటం వంటి పద్ధతి ఈ లోకంలో ఉంది.
ఈ లోకాన్ని దైవం ఇలాగే సృష్టించారు.
( కొందరు మహాత్ములు సమాధి వంటి పద్ధతుల ద్వారా ఆహారం లేకుండా కూడా జీవిస్తారు. అది వేరే విషయం . )
* భూమి కన్నా పైన ఎన్నో ఉత్తమ లోకాలున్నాయి. అక్కడ పద్ధతి వేరేగా ఉంటుంది.
ఆహారం గురించి ఇతర జీవులపై ఆధారపడే పద్ధతి అక్కడ ఉండదు.
పుణ్యాత్ములు వెళ్ళే ఆ లోకాల్లో వారికి సంకల్పమాత్రం చేతనే ఆహారాన్ని సృష్టించుకోగల శక్తి ఉంటుంది. ( వారికి ఆహారంతో అవసరం కూడా ఉండదేమో ! . . )
* అలా జీవులు పరమాత్మను చేరుకుంటే మోక్షమనబడే .....ఏ కష్టాలూ లేని పరిపూర్ణమైన పరమానందస్థితికి చేరుకుంటారు.
ఈ విధమైన చాలా విషయాలు " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలో చెప్పబడ్డాయి.
* విజ్ఞానం, విశ్వవిజ్ఞానం కూడా ఆధ్యాత్మికతలో భాగమే.
......................
ఒక ఇంట్లో పెద్దవాళ్ళు బాగా చదువుకుని ఎన్నో విషయాలు తెలిసినా కూడా........ చిన్నపిల్లలకు అక్షరాలను దిద్దించటం నుంచే ప్రారంభిస్తారు గానీ, అన్నప్రాశననాడే ఆవకాయ సామెతలాగ చెయ్యరు గదా !
* అలాగే సృష్టి విధానం ఈ భూలోకంలో మాత్రం ఈ క్రమంలో జరుగుతుంది అనిపిస్తుంది. . ( పసితనం నుంచి వృద్ధాప్యం వచ్చినట్లుగా. )
...................
* అసలు ఇలా జీవులను సృష్టించటం ఇదంతా ఎందుకు ? అనుకుంటే ఇదంతా దైవానికి ఒక వినోదం అనుకోవచ్చేమో ..
ఉదా...మన ఇంట్లో పిల్లలకు ఆహారం అన్నీ అమర్చి ఇంట్లో కదలకుండా ఉండమంటే పిల్లలు వింటారా ? వినరు కదా !
బయటకెళ్ళి ఆడుకుంటాము.. అని పెద్దవాళ్ళను అడుగుతారు.
ఆటల్లో కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయని తెలిసినా, ఒకోసారి ఓడిపోతామని తెలిసినా కూడా ఆడుకోవటానికే పిల్లలు ఉత్సాహ పడతారు.
* ఎంత బయట ఆడుకున్నా తిరిగి పిల్లలందరూ ఇంటికి వెళ్ళాలి కదా !
అలాగే లోకంలో జీవులు అందరూ కష్టాలనూ, సుఖాలనూ అనుభవించి ఈ జగన్నాటకమనే ఆట ముగించి తిరిగి ఇంటికి వెళ్ళవలసిన వారే. జగన్మాతాపితరుల్ని చేరుకోవలసిన వారే.
సరైన మార్గంలో నడిచిన పిల్లలు ఇంటికి త్వరగా చేరుకుంటారు. దారి తప్పిన పిల్లలు ఆలస్యంగా ఇంటికి చేరుకుంటారు....
ఇంటికి అంటే దైవం దగ్గరకు అన్నమాట. ( ఇలా నేను ఇంతకుముందు ఒక టపాలో వ్రాశానండి. . )
ఈ సృష్టి అనేది లేకపోతే విశ్వం స్తబ్దంగా బోర్ గా ఉండేది.....
............................
*..ఏంటో తోచినట్లు వ్రాశాను. వ్రాసినదానిలో పొరపాట్లు ఉంటే దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. ఇందులో తప్పులు ఉంటే నావిగానూ, ఒప్పులు ఉంటే దైవం దయగానూ నేను భావిస్తున్నాను.......అంతా దైవం దయ.
ఇదంతా పెద్ద వ్యాఖ్యగా రాయటం కుదరక ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది...