koodali

Monday, July 2, 2018

ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది,


మా
నవ శరీరంలో ఆక్సిజన్ (65%), కార్బన్(18% ), హైడ్రోజన్ (10% )నైట్రోజన్ ( 3% )కాల్షియం ( 1.5 % ),ఫాస్ఫరస్ ( 1.0% ) ,పొటాషియం, సోడియం.......ఇలా ఇంకా కొన్ని ఉంటాయట. వీటన్నిటితో శరీరం తయారవుతుందట.


విశ్వం అంతా కూడా ఎన్నోఎలిమెంట్స్ఉంటాయి. 


 ఇది అంతా బౌతికశాస్త్రం.....అంతే కానీ, దైవం అని ఎవరూ లేరు అంటారు కొందరు భౌతికవాదులు.


శరీరం ఆక్సిజన్, హైడ్రోజన్ వీటితో తయారయ్యే మాట నిజమే అయినా..


ఈ ఆక్సిజన్,హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది, ఎన్నో భావాలను కలిగి ఉంటుంది.


అలాగే ఈ విశ్వం ఆవిర్భావానికి మూలకారణమైనఆ మూలశక్తి ( ఆ ఆదిశక్తి) మనిషికన్నా..ఎంతో ఊహాతీతమైన శక్తి గల పరమశక్తి అని ఆస్తికులు నమ్ముతారు. ఆ శక్తినేవారు దైవంగా భావిస్తారు.


* కొన్ని ఎలిమెంట్స్ తో తయారయిన మానవులే ఎంతో ఆలోచనా శక్తిని కలిగి ఉన్నప్పుడు.... 


అనంత విశ్వాన్ని అందులోని అన్ని తత్వాలను తనలో కలిగి ఉన్న ఆదిపరమశక్తికి అనంతమైన ఆలోచనాశక్తి ఉంటుంది.


అందువల్లే ఈ సృష్టి అంతా ఒక పద్దతి ప్రకారం తయారు కాబడింది.


సృష్టిలో చూడండి ... ఏది ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఏర్పడి ఉంది.

అంటే ....... ఒక పక్షి గాలిలో ఎగరాలంటే దానికి
ఎలాంటి శరీర నిర్మాణం ఉండాలో అలాగే ఉంది.

ఒక చేప నీటిలో ఈదాలంటే తోక, మొప్పలు ఎలా ఉండాలో అలాగే దాని శరీర నిర్మాణం ఏర్పాటు చేయబడి ఉంది.


మొక్కలు సూర్యరశ్మి నుంచి పత్రహరితం తయారుచేసుకోవటం..ఇవన్నీ ఎంతో పద్దతిగా ఏర్పడి ఉన్నాయి .


పెద్దచేపకు ఆహారంగా చిన్నచేపలు, వాటికి ఆహారంగా, చిన్న ప్రాణులు, వాటికి ఆహారంగా  ఆల్గే వంటివి.... ఇలా ఒక పద్దతి ప్రకారం అద్భుతంగా సృష్టి రచన సాగిపోవటం చూస్తూనేఉన్నాము.


కొందరు దేవుడు ఉంటే చూపించండి అంటారు..


గాలిని మనం చూడగలమా ? కేవలం ఫీలవుతాము అంతే.


శాస్త్రవేత్తలు విటమిన్స్ గురించి చెబుతారు. అవి ఉన్నాయన్నదీ నిజమే....


A,B,C,D ...విటమిన్స్... ..వీటిని చూడాలంటేకుదురుతుందా ?


ఒక వ్యక్తి ఉన్నాడు . అతనికి ఎందుకో  మామిడిపండు అంటే ఇష్టం లేక , పుట్టిన తరువాత  ఎప్పుడూ తినలేదు. దాని రుచి ఎలా ఉంటుందో అతనికి తెలియదు.

ఆ వ్యక్తి మామిడిపండును తింటున్న తనస్నేహితునితో ఇలా అంటున్నాడు.


"మామిడిపండు రుచి ఎలా ఉంటుంది " ?

" తియ్యగా ఉంటుంది. "

"తియ్యగా అంటే పంచదార లాంటి తీపి రుచా ?లేక పనస పండు లాంటి తీపి రుచా " ?


" రెండూ కాదు. పంచదార తీపి రుచి వేరు,పనసపండు తీపి రుచి వేరు, మామిడి పండు తీపిరుచివేరు. "

"అంటే ఎలాంటి తీపి " ?


"ఎలాంటి తీపి అంటే . అలా చెప్పటానికి కుదరదు. నువ్వు కూడా మామిడి పండు తింటేనే ఆ రుచి నీకు సరిగ్గా తెలుస్తుంది."


అలాగే దైవాన్ని గురించి సరిగ్గా  తెలుసుకోవాలనుకొనేవాళ్ళు ..... వాళ్ళుకూడా ఆ మార్గంలో పద్దతిగా ప్రయత్నిస్తే కానీదైవాన్ని తెలుసుకోవటం కుదరదు.



శరీరం రకరకాల ఎలిమెంట్స్ తో తయారయింది. నిజమే కానీ... అందులో ప్రాణం, చైతన్యం, బుద్ధి , మనసు.. ఇవన్నీ ఎలా ప్రవేశించాయో తెలియదు.


ప్రాణం శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో ? ఎలా నిష్క్రమిస్తుందో ?


కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే బాహ్యేంద్రియాల శక్తి సరిపోదని అంతఃకరణ ద్వారా మాత్రమే తెలుసుకోగలమని పెద్దలు చెబుతున్నారు .


ప్రాచీనులు కొందరు, తపస్సు వంటి వాటి ద్వారా..జీవుల పుట్టుకకు ముందు, మరణానికి తరువాత జరిగే ఎన్నో విశేషాల గురించి ,
ఇతర లోకాల గురించి ప్రాచీన గ్రంధాల ద్వారా తెలియజేసారు..


 వాటి గురించి తెలుసుకునేంత స్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా  ఎదగలేదు.


పూర్వం కొందరు తల్లులు , పిండాలను కుండలలో ఉంచి పెంచారు అని ప్రాచీన గ్రంధాలలోచదివి వెక్కిరించిన వారే ..... 


నేడు టెస్ట్ట్యూబుల లో పిండాలను పెంచడాన్ని చూస్తున్నారు.


పూర్వం అభిమన్యుడు, ప్రహ్లాదుడు వంటి వారు తల్లుల గర్భంలో ఉన్నప్పుడే  ఎన్నో విషయాలు నేర్చుకున్నారని చదివి వెక్కిరించిన వారే ........ 


నేడు  విదేశాల్లో కడుపుతో  ఉన్న తల్లులు కొందరు పుట్టబోయే పిల్లల కొరకు క్లాస్ లకు వెళ్ళి పాఠాలు  వినటాన్ని చూస్తున్నారు.


అందుకని నా అభిప్రాయం ఏమిటంటేనండి,  మనకు తెలియని విషయాలన్నీ అభూతకల్పనలు  అనటం సబబు కాదు.


ఈ భూమిపై మనకన్నా ముందు మనకన్నా ఎంతో గొప్ప నాగరికత కలిగి ,ఎంతో గొప్ప విజ్ఞానవంతులైన  వాళ్ళు నడయాడారేమో? ఎవరికి తెలుసు ?


కొన్ని కారణాల వల్ల ఆ నాగరికత అంతర్ధానమై ఉండవచ్చు గదా !


విశ్వం పుట్టిన ఇన్ని కోట్ల సంవత్సరాల్లో గత 200సంవత్సరాల్లో పుట్టిన మానవులే గొప్పవాళ్ళు .ఈ ఆధునిక విజ్ఞానమే గొప్పది అనుకోవటం తప్పు.

...................................................................
.  టపా రాసాక నాకు ఒక ఆలోచనవచ్చిందండి

రమణ మహర్షి గారుచెప్పినట్లు .. 

నేను అంటే ఏమిటి ?అని

ఆక్సిజన్ ..వీటితో కూడిన శరీరమా ? లేకమనసా ? లేక ? నేను అంటే అసలు ఏమిటి ?

ఏమో....అంతా దైవం దయ.

Friday, June 10, 2011





No comments:

Post a Comment