koodali

Saturday, July 14, 2018

ఓం...



 శ్రీ జగన్నాధ రధయాత్ర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.

.....................
  
 జీవులకు దైవము ఎన్నింటినో ఇచ్చారు. చక్కని ప్రపంచము..ఆహారం కొరకు ఎన్నో మొక్కలు, వృక్షాలు, నీరు..ఇచ్చారు. ఆహ్లాదము కొరకు చక్కటి ప్రకృతి దృశ్యాలను కల్పించారు. 
 
మనకు ఎవరైనా కొద్దిగా ఇస్తేనే థాంక్స్ అని కృతజ్ఞతలు తెలియజేస్తాము. మరి ఎన్నింటినో ఇచ్చిన దైవానికి పూజ చేయ్యటం ద్వారా కృతజ్ఞతలను చెప్పవచ్చు.


కష్టాలు తొలగటానికి గత పాపకర్మలు కరగటానికి.. పూజలు, పరిహారాలు చేయాలంటే కొందరు విమర్శిస్తారు. దేవునికి పూజలు చేస్తేనే కరుణిస్తారా, పూజలు చేయకపోతే కరుణించరా..అంటూ విమర్శిస్తారు.

ఇక్కడ విషయమేమిటంటే, మనము పూజలు చెయ్యకపోయినా దైవానికి వచ్చే నష్టమేమీ లేదు.

కష్టాలు తగ్గటానికి పాపపరిహారం కొరకు..పూజలు..మంత్రపఠనం..దానధర్మాలు చేస్తారు. దానధర్మాలు అంటే ఇతరులకు సహాయం చేయటం ద్వారా గతపాపకర్మ కరుగుతుంది. 

పూజలు..మంత్రాలను పఠించటం ద్వారా ప్రతికూలతలు తగ్గుతాయి. 
 
మంత్రాలంటే శబ్దశక్తి. ఆధునిక కాలంలో కూడా శబ్దశక్తి యొక్క శక్తిని గ్రహించి ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. ఉదా..అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటివి శబ్దశక్తి ద్వారా పనిచేస్తాయి.

 శబ్దశక్తికి చాలా శక్తి ఉంటుంది. మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది. మంత్రపఠనం ద్వారా నెగిటివిటి తగ్గిపోతుంది.

అయితే, గతపాపకర్మలు తొలగాలంటే, వర్తమానంలో పాపాలు చేయటం కూడా మానాలి.

No comments:

Post a Comment