koodali

Monday, September 5, 2016

వినాయక చవితి శుభాకాంక్షలు....



అందరికి  వినాయక  చవితి  శుభాకాంక్షలు.

***********
mari konni vishayaalu..

ప్రపంచంలో అనేకప్రాంతాలున్నాయి. అక్కడి వాతావరణపరిస్థితులను బట్టి మొక్కలు, చెట్లు..ఉంటాయి. చలిప్రాంతాలలో యాపిల్స్ బాగా పెరుగుతాయి. వేడిప్రాంతాలలో  ఉసిరి..వంటివి పెరుగుతాయి. ఏ ప్రాంతాలవారు ఆ ప్రాంతంలో లభించే ఆహారాన్ని తింటే మంచిదంటారు. ఇది నిజమే.


 కానీ,ఈ రోజుల్లో భారతదేశం నుంచి చలిప్రాంతాలైన విదేశాలకు వెళ్తున్నారు. అలాంటప్పుడు ఏం తింటే మంచిదని సందేహాలు వస్తాయి. తరతరాల నుంచి వరి,జొన్న..వంటివి తినే వారికి వారి జీన్స్ కు అవి అలవాటుఉండి, అవి తింటే చక్కగా ఉంటుందట. చలి ప్రాంతాలవారికి గోధుమ,బార్లి వంటివి బాగా పండుతాయి కాబట్టి, అవి తినటం అలవాటు. 


అయితే, గోధుమలో  ఉండే గ్లుటెన్ చాలామందికి పడదు. ఈ రోజుల్లో గోధుమ పంటలు వేయని దక్షిణభారతం వారు కూడా గోధుమరొట్టెలు తింటున్నారు. యాపిల్స్ తింటున్నారు. విదేశాలకు వెళ్లినవారికి కూడా తరతరాలనుంచి అలవాటైన తమ సొంత దేశం యొక్క ఆహారానికి వారి జీన్స్ అలవాటుపడిఉంటాయి.


 కాబట్టి, నాకు ఏమనిపిస్తుందంటే, ఎక్కడపండే పంటలు అక్కడివారు తింటే చాలా మంచిది. అయితే ఇతర ప్రాంతాల పంటలను తిన్నా కూడా శరీరం క్రమంగా అలవాటు పడుతుందనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళిన భారతీయులు అక్కడ ఉండే ఓట్స్, ఆలివ్స్..వంటివి తినొచ్చు, భారతదేశం నుంచి ఎగుమతి చేస్తున్న వరి, కూరగాయలు కూడా తినొచ్చు అనిపిస్తోంది.


మనుషుల కోణం సంగతి అటుంచితే, మొక్కలు, చెట్లు కోణం నుంచి కూడా పరిశీలించాలి. కొన్ని మొక్కలు వాటికి అనువైన వాతావరణంలోనే చక్కగా పెరుగుతాయి. కొన్ని మొక్కలు విదేశాల నుంచి తెచ్చినా కూడా, భారతదేశంలో కూడా పెరుగుతాయి. ఉదా..యాపిల్స్ మొక్కలను విజయవాడ వంటి వేడి ప్రాంతాలలో పెడితే సరిగ్గా పెరగవు. అవకాడో మొక్కలను గుంటూరు లో పెంచితే కాయలు కాస్తున్నాయి.

ఈ విషయాల గురించి మరిన్ని పరిశోధనలు జరగాలి.


No comments:

Post a Comment