koodali

Wednesday, April 22, 2015

ప్రకృతి రక్షణ అంటే మనిషి మనుగడకు రక్షణ. ..

 
ఈ రోజు ధరిత్రీ దినోత్సమట . పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడే ధరిత్రి (భూమి ) బాగుంటుంది.

మొక్కలను బాగా నాటి చక్కగా పెంచాలి. ఇందువల్ల అధిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.


అడవులను రక్షించుకోవాలి. అడవులు దట్టంగా ఉంటే వర్షాలు చక్కగా కురుస్తాయి. నీటి కరువు రాకుండా ఉంటుంది. 


అడవులు అంతరించకుండా కాపాడుకోవటానికి హెలికాప్టర్లను ఉపయోగించి వర్షాకాలం ప్రారంభంలో  కొండలపై విత్తనాలను చల్లవచ్చు. 

.............

శేషాచలం అడవుల్లో నిప్పు వ్యాపించటం గురించిన వార్తలు వచ్చినప్పుడు , కేవలం చెట్లకొమ్మలను చేత్తో పట్టుకుని నిప్పును ఆర్పటానికి  ప్రయత్నించే  సిబ్బంది చిత్రాలను మీడియా ద్వారా చూసి ఉంటాము. 


 అగ్ని ప్రమాదాలను అదుపు చేయటానికి అవసరమైన సామాగ్రిని  సిబ్బందికి  అందించ వచ్చు . 


  శేషాచలం కొండలపైన  ఇంతకుముందు  ఒకసారి అగ్నిప్రమాదం జరిగినప్పుడు , హెలికాప్టర్ల సాయంతో నీటిని జల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు గుర్తుంది.


 అగ్నిప్రమాదం చిన్నదిగా ఉన్నప్పుడు ..   ఫయర్ ట్రక్స్ సాయం కూడా తీసుకోవచ్చు. (ఫైర్ ట్రక్స్..కొండదారులలో ప్రయాణించటానికి వీలుగా డిజైన్ చేసుకోవచ్చు.)


మరికొన్ని వివరాలను ఇక్కడ చూడవచ్చు .. 

3 Ways to Fight a Forest Fire - wikiHow

.........
ప్లాస్టిక్ వస్తువుల తయారీ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో బొమ్మలను తయారుచెయ్యటం వంటి వృత్తులలో ఎందరో జీవిస్తున్నారు, వాళ్ల పనిని అడ్దగిస్తే వాళ్లు ఎలా బ్రతుకుతారు? అంటారు కొందరు. కొందరు బ్రతకటం కొరకు అని,  టెక్నాలజి పెరగాలి అని కొందరు..ఇలా ఎవరికి వారు తోచినట్లు  ప్రపంచాన్ని పొల్యూట్ చేస్తే, రాబోయే తరాల వాళ్లు బతకటానికి భూమి పనికిరాదు. కాలుష్యం పెరిగి జీవులు బతకటానికి వీలులేని పరిస్థితి రావచ్చు.

 ఎవరికైనా తక్కువమంది పిల్లలుంటే వారి బాగోగులు చూడటం తేలిక. అదేపనిగా పిల్లల్ని కని అందరికి ఉపాధి కావాలంటే ఎక్కడ వస్తుంది. ఇప్పుడు యంత్రాలే చాలా పనులు చేస్తున్నాయి. మనుషులు చేయడానికి సరిగ్గా పనులు లభించటం లేదు. మనిషికి తక్కువ కోరికలు ఉంటే బాగానే జీవించవచ్చు. చాలామందికి కోరికలు పెరిగాయి.ఇలాంటి పరిస్థితిలో జనాభా తగ్గితే చాలా సమస్యలు తగ్గుతాయి.

  ఒక్కో మనిషికి తిండికే బోలెడు మొక్కలు కావాలి. మాంసాహారులైతే చాలా మాంసాహారం కావాలి. మానవ జనాభా విపరీతంగా పెరగకుండా చూసుకోవాలి. అప్పుడే చాలా సమస్యలు తగ్గుతాయి.ప్రపంచం బాగుంటుంది.
..........................

మడ అడవులను కూడా రక్షించుకోవాలి. వీటివల్ల సముద్ర తీరం కోతకు గురికాకుండా ఉంటుందంటారు.

............
మొక్కలు బాగా పెంచితే ఎన్నో లాభాలున్నాయి. వృక్షాల  వల్ల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. 
................
 వృక్షాల వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని అంటారు. అయితే, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా ! 

వాతావరణ కాలుష్యం మరీ ఎక్కువైతే వృక్షాలు కూడా తట్టుకోలేవు.

మనుషులు తమ  అంతులేని కోరికలను తగ్గించుకోవటమే ఎన్నో సమస్యలకు పరిష్కారం.




No comments:

Post a Comment