koodali

Wednesday, May 2, 2012

నాకు తెలిసినంతలో..........


  ఇక  యయాతి  దేవయానిల  సంతానమైన  యదు ,   తండ్రి  యొక్క    వృద్ధాప్యాన్ని     స్వీకరించటానికి  నిరాకరించటం  వల్ల     శాపానికి  గురౌతారు. 

 యయాతి  శర్మిష్టల   సంతానమైన  పురు  ,  తండ్రి  అయిన  యయాతికి    శాపవశాత్తు  సంక్రమించిన  వృద్ధాప్యాన్ని  కొంతకాలం  స్వీకరించి  తద్వారా    రాజ్యపాలనకు  అర్హతను  పొందారు.

  (  ఏమైనా,  పురు   ఇలా  వృద్ధాప్యాన్ని    స్వీకరించటమనేది  గొప్ప  విషయమే. )

 
నాకు  తెలిసినంతలో..........

పురు వంశంలో   క్రమంగా    ...... శంతనుడు.......  శంతనుని      కుమారుడైన  భీష్ముడు ,  తండ్రి  కొరకు   ప్రతిజ్ఞ    చేసి  రాజ్యపాలనకు  దూరమై   అవివాహితుడుగా  ఉండిపోవటం,  శంతనునికి  సత్యవతిదేవి  వల్ల  జన్మించిన    కుమారులిద్దరూ     వారసులు  లేకుండానే  మరణించటం,  తరువాత  వ్యాసుని  వల్ల  అంబిక   ,అంబాలికలు  సంతానాన్ని  పొందటం,     కౌరవులు , తరువాత    పాండవులు      జన్మించటం  ఇలా  .......కధ    జరిగింది.


యదు  వంశంలో    క్రమంగా......   ......    దేవకీదేవి  వసుదేవులకు  శ్రీకృష్ణుడు  జన్మించటం ,   అంతకుముందే  దేవకీ  గర్భం  నుంచి  సంకర్షించబడి  రోహిణీదేవి  గర్భాన       బలరాముడు  జన్మించటం ఇలా......  కధ    జరిగింది.


పాండవులను  శ్రీకృష్ణుడు  ఎన్నోసార్లు  ఆదుకున్నారు. ఆ  క్రమంలో    గాంధారి  వల్ల    శాపాన్ని కూడా   పొందారు.


ఇవన్నీ  గమనిస్తే  ఎన్నో  విషయాలు  మనకు  అర్ధమవుతాయి..ఎన్నో  మనస్తత్వాలు., ఎన్నో  విషయాలు,   ఎన్నో  చిత్రవిచిత్రమైన  మలుపులతో    భారతగాధ  అద్భుతంగా  సాగిపోయింది.   ఈ  గాధనుండి    ఎన్నెన్నో  విషయాలు    తెలుసుకోవచ్చు. ఇన్ని  గొప్ప  విషయాలను  అందించిన  పెద్దలకు  ధన్యవాదాలు..


No comments:

Post a Comment