koodali

Tuesday, May 4, 2010

ఈశ్వరుడు , , లోని " ఈశా " అన్న అక్షరములను తిరగవేస్తేశాఈ (సాయి)...............

 
కొంచెం సేపు క్రితం t.v లో సాయిబాబా గురించిన ప్రోగ్రాం చూశారా అండీ?గుంటూరు నుంచి ఒక ఆయన సాయి హిందూ దేవుడు కాదని,సాయి అన్న పేరు హిందు లో లేదని అంటున్నారు. ఇంకా సాయిబాబా ను హిందువులు పూజించ రాదని అన్నారు.


ఈశ్వరుడు అన్న పదములోని " ఈశా " అన్న అక్షరములు తిరగవేసి చదివితే " " 'శాఈ " ( సాయి ) అని వస్తుంది.రామాయణములో వాల్మీకి మహర్షి, మహర్షి అవ్వకముందు రామనామమును మరా,మరా.... అని పలికినట్లు.....

..సాయి మాంసము అవి తినేవారు అంటున్నారు. హిందు మతములో కూడా కొందరు దేవతలకు మాంసమును నైవేద్యముగా ఉంచుతారు. అల్లా పేరు పలుకుతారు అంటే ఆయన శ్రీరామనవమి పూజ కూడా చేయించేవారు.

హిందు,ముస్లింస్ సఖ్యత కోసం సాయి క్రుషి చేశారు. దుని కూడా వెలిగించేవారు.ఊదీ అందులోనుండే వస్తుంది కదా.....


 
అమర్ నాధ్ గుహ పూర్వ కాలమునుండి ఉన్నదే అయినా , ఈ కాలములో కొత్తగా ఒక ముస్లిం వారే కనుక్కున్నారు. నాకు ఏమని అనిపించిందంటే ఆ దేవుడే అన్ని మతముల వారు కలిసి ఉండాలని ఈ విధముగా సందేశము ఇచ్చారేమోనని.
 
అమర్నాధ్ గుహ దగ్గర ముస్లింస్ పూజా సామాగ్రి అమ్ముతారు. అక్కడ చాలా మతసామరస్యముగా బాగుంది.  గుర్రాలపైన, డోలీలలో భక్తులను తీసుకువెళ్తారు.
 
నేను ఇలా వ్రాస్తున్నందుకు చాలా మందికి కోపం వస్తుందేమో. వస్తుంది లెండి. అయితే మనము మతమేమీ మారటము లేదు కదా ...మాకు సాయి అంటే నమ్మకము.

దేవుని ఏరూపములో అయినా పూజించవచ్చు. అన్ని మతముల వారు కలిసి గొడవలు లేకుండా ఉండాలి. .. .. వేరే దారి కూడా లేదు... 

...............................................

మరికొన్ని విషయాలు..ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.

............
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. 
 
సాయిబాబా షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని  సాయి అని పిలిచారట. తరువాత భక్తులు రావటం పెరిగింది. షిర్డిసాయి తనకు ఆడంబరంగా పూజలు చేయటం వద్దనేవారట. అయినా భక్తులు వినరు కదా..
 
సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు. 
 
కొందరు మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత, వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ సమాజంలో ఉంటారు.
.....................
 
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.

అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.

సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే.  దైవము ఒకే శక్తి.
 ...........................
 
కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
 .....................
 
 హిందువుల్లోనే బోలెడుమంది దేవతలుండగా కొత్తగా ఎందరినో ఎందుకు ఆరాధిస్తారో ? తెలియదు.
 
కొందరు వ్యక్తులు తాము ప్రజలతో ఎక్కువ కలవకుండా తమ పనితాము చేసుకుంటున్నా కూడా, కొందరు హిందువులు వారి వెంట కూడా పడుతుంటారు...ఇది కొందరు హిందువులలో సమస్య. 
 
 ఉదా.. ఆ మధ్యన కొందరు తిరువణ్ణామలై లో ఒకామె చుట్టూ చేరి, కొందరు ఆమె తినిపడేసిన ఆహారాన్ని తినటం కూడా చేసారట. అలా చేస్తే కష్టాలు పోతాయనే ప్రచారం కూడా జరిగిందట....ఆమె గిరిప్రదక్షిణ కూడా చేస్తుందట.

 తిరువణ్ణామలై లో, తిరువణ్నామలై స్వామి అమ్మవారు ఉన్నారు. దైవ ప్రసాదాన్ని తింటే ఎంతో మంచిది కదా..

 దైవప్రసాదం ఉండగా, టోపి అమ్మ తిని పడేసిన ఆహారాన్ని ఎందుకు తినటం? హిందువులు ఎందుకు ఇలా చేస్తున్నారో? అర్ధం కావటం లేదు.
 
దైవభక్తులకే మహిమలున్నప్పుడు దైవానికి  మరెన్నో మహిమలుంటాయి కదా.
............

సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము,  ఎక్కువ సమయం 
చేయలేము...అనుకుంటే, తక్కువ ఖర్చుతో, కొంత సమయంలో  పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా.. అనుకుంటున్నాను.

 హిందువులు చాలా నియమాలను  పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
 
హిందు పెద్దలు కూడా ఈ విషయాలను గమనించాలి.  
ఈ  రోజుల్లో ఆచారవ్యవహారాలంటూ  బోలెడు నియమాలను చెబితే, పాటించలేక సరళంగా దైవపూజ చేసే మార్గాల వైపు జనం వెళ్లే అవకాశం ఉంది.

 పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా,  సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.

 ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
**********
 వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 


2 comments:

  1. హిందూ ముస్లిం సఖ్యత అనేది హెచ్చరికలతో రాదు.కాని కానుకలద్వారా అవుతుంది.చికిత్స కంటే నివారణే మంచిది. దళితులను క్రైస్తవులుగా మారుస్తున్నారని,కుటుంబనియంత్రణ పాటించనందువల్ల ముస్లిముల జనాభా పెరిగిపోతున్నదని చాలాకాలంనుండి హిందూ నేతలు ఆందోళన చెందుతున్నారు. మతం ఏదైనా ఆర్ధికంగా మతాధిపతులకు ఉపయోగపడినట్లుగా సాధారణ ప్రజలకు ఉపయోగపడదు.నారుపోసినవాడే నీరుపోస్తాడులాంటి ఫాదర్లు,ముల్లాలు,స్వాముల మాటలు వినీ వినీ అమాయకజనం శక్తికి మించి పిల్లల్ని కని నిరుపేదలైపోతున్నారు.కాబట్టి ఒకరు లేదా ఇద్దరు బిడ్డలతో ఆపరేషన్ చేయించుకోటానికి ముందుకొచ్చిన మైనారిటీలకు హిందూ సంస్థలు,హిందువులకు మైనారిటీ సంస్థలు పదివేల రూపాయల ఆర్ధిక సహాయం కానుకగా అందజేస్తే ఈ ఫాదర్లు,ముల్లాలు,స్వాముల మాటలు లెక్కచేయకుండా అన్ని మతాలలోని నిరుపేదలు ఆపరేషన్లకు బారులు తీరి నిలబడతారు.దేశంలో అధికజనాభా సమశ్య కూడా కొద్దిగా తగ్గుతుంది.ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే వారిదే విజయం,పుణ్యం కూడా.పుణ్యం ఎలాగంటే మనిషి కష్టాలన్నిటికీ పుట్టుకే గదా కారణం?అసలు ఎన్నో కష్టాలకు కారణ భూతమైన పుట్టుకే కలుగకుండా ఎంతోమందికి ఆపరేషన్ల ద్వారా ముక్తిని మోక్షాన్ని ప్రసాదించటం ఎన్నో పుణ్యస్థలాల సందర్శన చేసినంత మహాపుణ్యం.ఈ పనికి పూనుకునే పుణ్యాత్ములకు మోక్షసిద్ధి ఖాయంగా కలుగుతుంది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete