koodali

Thursday, September 8, 2016

1.దృష్టిలోపం తగ్గటానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులు....2.కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి....





ఆసక్తి ఉన్నవారు లింక్స్ వద్ద చూడగలరు.

   Ayurveda For Improving Eyesight
ayurveda-foryou.com/treat/improve-eyesight.



       Ayurvedic Remedy for Eye Sight Improvement | Ayurpedia

      ************************

      ఇంతకుముందు నాకు కళ్లజోడు లేదు. ఈ  మధ్యనే కళ్ళజోడు అవసరం పడింది. 

       బై  ఫోకల్  మరియు  ప్రొగ్రెస్సివ్ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి.

       బై ఫోకల్ నుండి కొన్ని లక్షణాలను ప్రొగ్రెస్సివ్ నుండి కొన్ని లక్షణాలను తీసుకుని కొత్తరకం కళ్ళజోడు తయారుచేస్తే బాగుంటుంది అనిపించింది.

      అంటే కళ్ళజోడును బై ఫోకల్ విధానంలోనే ఉంచి  మధ్యలో విభజన గీత ప్రదేశంలో మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే బాగుంటుందనిపించింది.

       అంటే కళ్ళజోడు అంతా ప్రొగ్రెస్సివ్ విధానం కాకుండా కళ్ళజోడు అంతా బై ఫోకల్ పద్ధతిలో తయారుచేసి ... విభజనగీత  వద్ద మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే బాగుంటుందని నాకు అనిపించింది.

       ప్రొగ్రెస్సివ్లో దృశ్యాన్ని చూడటానికి కళ్లు తమకు తామే సర్దుకోవలసి ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త దృశ్యాన్ని చూసినప్పుడల్లా కళ్లు అలసిపోయే అవకాశం ఉందనిపించింది.

      అదే బై ఫోకల్ మధ్యలో కొద్ది భాగానికి మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే కళ్ళకు కలిగే శ్రమ గణనీయంగా  తగ్గుతుందనిపించింది.

      ఇలాంటి  విధానం సరైనదో కాదో నాకు తెలియదు.నాకు కళ్ళజోడు తయారీ గురించి తెలియదు. అయితే వివిధ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను.
      ...................... 

      రీడింగ్ గ్లాసెస్ తో కొందరికి దూరపు దృశ్యాలు సరిగ్గా కనిపించవట.

      మొదట్లో  నాకు రీడింగ్ గ్లాసెస్  ఉండేవి. నా విషయంలో రీడింగ్ గ్లాసెస్తోనే దగ్గర దృశ్యాలు, దూరపు దృశ్యాలు కూడా చక్కగా కనిపించేవి.

      ( బహుశా అప్పుడు నాకు ఉన్న దూరదృష్టి, దగ్గరదృష్టి కూడా  1.5 రీడింగ్ గ్లాసెస్ కు సరిపోయి ఉంటుంది.)

      అయితే కళ్ళజోడు షాప్ వాళ్ళు రీడింగ్ గ్లాసెస్ తో దూరపు దృశ్యాలు చూడకూడని చెప్పటంతో డాక్టర్ వద్దకు వెళ్లి బై ఫోకల్ వేయించుకున్నాను.

       బైఫోకల్ నాకు అనీజీగా ఉండటంతో ప్రొగ్రెసివ్ మార్చాను ప్రొగ్రెసివ్ ఇంకా అనీజీగా ఉండేది. ఇలా కళ్లజోడ్లు మార్చటంతో కళ్లు అలసి దగ్గరదృష్టిలోపం మరికొంచెం పెరిగింది. కొద్దిగా మెడనొప్పులు కూడా వచ్చాయి.

      ............................


      ఇంకో విషయం ఏమిటంటే,  రీడింగ్ గ్లాసెస్ తో దూరపు వస్తువులను చూడకూడదని కొందరు అంటారు.


      ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే ,  కొందరు  దూరపు వస్తువులను సరిగ్గా చూడలేని  వాళ్ళకు ఇచ్చే  కళ్ళజోడుకు విభజనగీత  ఉండదు. అద్దం అంతా ఒకే పద్ధతిలో ఉంటుంది. 

        వీళ్లు ఆ అద్దాలతోనే దూరపు వస్తువులనూ చూడగలరు..దగ్గర వస్తువులనూ చూడగలరు.

       ఈ విషయాన్ని గమనిస్తే ఏమనిపిస్తుందంటే ...

      . కొందరు   ఒకే అద్దంతో దూరపు  మరియు దగ్గర వస్తువులను చూస్తున్నప్పుడు ( వాళ్ళు అలా చక్కగా చూడగలిగినప్పుడు)..

      . రీడింగ్ గ్లాస్ వాడేవాళ్ళు ...వాటితో దూరపు వస్తువులను  కూడా చూడటానికి కూడా ఉపయోగిస్తే తప్పేమిటి  ? అనే సందేహం అనిపిస్తుంది.

       దృస్టి లోపం ఎక్కువ పెరిగినప్పుడు  ఎలాగూ బైఫోకల్  గానీ ప్రొగ్రెస్సివ్ గానీ ఇస్తారు.

      నాకు కళ్ళజోడు తయారీ గురించి తెలియదు. అయితే వివిధ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను.

       దైవం దయవల్ల నాకు ప్రస్తుతం దృష్టిలోపం ఎక్కువగా లేదు.

      అవసరమైనప్పుడు  రీడింగ్ గ్లాసెస్ వాడుతూ కళ్ళజోడు పవర్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.




    దృష్టి లోపాలు..కళ్ళజోడుతో సమస్యలు..




    ఈ రోజుల్లో అనేక  కారణాల వల్ల దృష్టి లోపాలు బాగా పెరిగాయి.చాలామందికి కళ్ళజోడు వాడే అవసరం వస్తోంది.

    అయితే కళ్ళజోళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి.

    కొద్దిపాటి దృష్టి లోపం ఉన్నప్పుడు రీడింగ్ గ్లాసెస్ వంటి వాటితో సరిపెట్టుకోవచ్చు.

    సమస్య మరింత పెరిగితే బై ఫోకల్ గ్లాసెస్  లేక  ప్రొగ్రెస్సివ్   గ్లాసెస్  వేసుకోవలసి ఉంటుంది.

     ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి.

    బైఫోకల్స్ అంటే కళ్ళజోడు రెండు భాగాలుగా ఉండి మధ్య ఒక గీత ఉంటుంది. ఈ గీత భాగంలో చూస్తున్నప్పుడు గందరగోళంగా ఉంటుంది.

    ఇలాంటప్పుడు మెట్లు ఎక్కే సమయంలో సరిగ్గా కనిపించక పడిపోయే అవకాశం కూడా ఉంది.

     అయితే ఇదంతా కొన్ని రోజులలో అలవాటు అవుతుంది లెమ్మని సర్దిచెబుతారు.

    అలవాటు అవుతుందా లేదా అన్నది ఎవరి అభిప్రాయం వారిది.అలవాటు కాలేకపోయినా వేరే దారి లేక సరిపెట్టేసుకుంటారు చాలామంది.
    ...................

    కళ్ళజోడు తయారీలో తప్పులుంటే,  కొత్త కళ్ళజోడు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి ఉంటుంది. 

     కళ్ళజోడు షాపుకు వెళ్ళి అడిగితే కొందరు సరిగ్గా చేసి ఇస్తారు. 

     ఏం చేయలేం .అలాగే సర్దుకోవాలని చెప్పే వాళ్ళూ కొందరు ఉంటారు. 

    ************
     బైఫోకల్స్తో ఉన్న  సమస్య నుంచి బైట పడటం కోసం ప్రొగ్రెస్సివ్  అనే కొత్త కళ్ళజోళ్లు వచ్చాయి. అయితే వీటితో  కూడా సమస్యలు ఉన్నాయి.

    చాలామంది విషయంలో ప్రోగ్రెస్సివ్ అద్దాలు అలవాటు కావటం కష్టమని అద్దాల తయారీ దారులు కూడా చెబుతారు.

      కొందరు అద్దాల తయారీదారులేమో ప్రోగ్రెస్సివ్ మంచివి అంటారు  . కొందరేమో బైఫోకలే మంచివి అంటారు.

     మరికొందరేమో లేసర్ ఆపరేషన్ మంచిది కదా... అంటూ సలహాలు ఇస్తారు.

    లేసర్ ఆపరేషన్తో కూడా సమస్యలు ఉంటాయి. ఇలా  ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి.

    కళ్ళజోడు సరిగ్గా లేకకపోతే మెడ నొప్పులు వచ్చే ప్రమాదముంది.

    ఏతావాతా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే.. శరీరంలో ఏ భాగమైనా సమస్య రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటమే అన్నింటికన్నా మంచిది.

    అవసరం ఉన్నా లేకపోయినా కంప్యూటర్లు, టీవీలు అదేపనిగా చూడటం వల్ల ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదముంది.

     అందువల్ల నా అభిప్రాయం ఏమిటంటే ఎంతవరకూ అవసరమో అంతవరకే  టీవీని, కంప్యూటర్ వాడాలి.

    అయితే దురదృష్టం ఏమిటంటే .. ఈ రోజుల్లో చాలా మందికి ఉద్యోగరీత్యా  కంప్యూటర్ వాడకం తప్పనిసరి అయ్యింది.

    ఇందువల్ల ఎందరో స్పాండిలైటిస్,వెన్ను నొప్పి, నరాల సమస్యలు, కళ్ళ సమస్యలు... వంటి సమస్యలతో బాధపడుతున్నారు.


    Monday, September 5, 2016

    వినాయక చవితి శుభాకాంక్షలు....



    అందరికి  వినాయక  చవితి  శుభాకాంక్షలు.

    ***********
    mari konni vishayaalu..

    ప్రపంచంలో అనేకప్రాంతాలున్నాయి. అక్కడి వాతావరణపరిస్థితులను బట్టి మొక్కలు, చెట్లు..ఉంటాయి. చలిప్రాంతాలలో యాపిల్స్ బాగా పెరుగుతాయి. వేడిప్రాంతాలలో  ఉసిరి..వంటివి పెరుగుతాయి. ఏ ప్రాంతాలవారు ఆ ప్రాంతంలో లభించే ఆహారాన్ని తింటే మంచిదంటారు. ఇది నిజమే.


     కానీ,ఈ రోజుల్లో భారతదేశం నుంచి చలిప్రాంతాలైన విదేశాలకు వెళ్తున్నారు. అలాంటప్పుడు ఏం తింటే మంచిదని సందేహాలు వస్తాయి. తరతరాల నుంచి వరి,జొన్న..వంటివి తినే వారికి వారి జీన్స్ కు అవి అలవాటుఉండి, అవి తింటే చక్కగా ఉంటుందట. చలి ప్రాంతాలవారికి గోధుమ,బార్లి వంటివి బాగా పండుతాయి కాబట్టి, అవి తినటం అలవాటు. 


    అయితే, గోధుమలో  ఉండే గ్లుటెన్ చాలామందికి పడదు. ఈ రోజుల్లో గోధుమ పంటలు వేయని దక్షిణభారతం వారు కూడా గోధుమరొట్టెలు తింటున్నారు. యాపిల్స్ తింటున్నారు. విదేశాలకు వెళ్లినవారికి కూడా తరతరాలనుంచి అలవాటైన తమ సొంత దేశం యొక్క ఆహారానికి వారి జీన్స్ అలవాటుపడిఉంటాయి.


     కాబట్టి, నాకు ఏమనిపిస్తుందంటే, ఎక్కడపండే పంటలు అక్కడివారు తింటే చాలా మంచిది. అయితే ఇతర ప్రాంతాల పంటలను తిన్నా కూడా శరీరం క్రమంగా అలవాటు పడుతుందనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళిన భారతీయులు అక్కడ ఉండే ఓట్స్, ఆలివ్స్..వంటివి తినొచ్చు, భారతదేశం నుంచి ఎగుమతి చేస్తున్న వరి, కూరగాయలు కూడా తినొచ్చు అనిపిస్తోంది.


    మనుషుల కోణం సంగతి అటుంచితే, మొక్కలు, చెట్లు కోణం నుంచి కూడా పరిశీలించాలి. కొన్ని మొక్కలు వాటికి అనువైన వాతావరణంలోనే చక్కగా పెరుగుతాయి. కొన్ని మొక్కలు విదేశాల నుంచి తెచ్చినా కూడా, భారతదేశంలో కూడా పెరుగుతాయి. ఉదా..యాపిల్స్ మొక్కలను విజయవాడ వంటి వేడి ప్రాంతాలలో పెడితే సరిగ్గా పెరగవు. అవకాడో మొక్కలను గుంటూరు లో పెంచితే కాయలు కాస్తున్నాయి.

    ఈ విషయాల గురించి మరిన్ని పరిశోధనలు జరగాలి.


    Friday, September 2, 2016

    మరి కొన్ని విషయాలు....గంగా నది వంటి నదిలో కూడా..


    ఈ మధ్యనే దేవాలయాలలో వరుణయాగాలు చేసారు . 

    దైవం  దయ వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి.

     దైవానికి అనేక కృతజ్ఞతలు.                                        
    .......................................

    వర్షాల వల్ల  ఊళ్ళలోని నీరు కాలువల ద్వారా నదులలోకి చేరుకుంటుంది.  ఊళ్ళలో  పడ్డ వర్షంతో పాటు  ఊరిలోని మలినాలు కూడా నదిలోకి చేరుకుంటాయి. 

    అయితే, పాతరోజుల్లో రసాయన వ్యర్ధాలు, ప్లాస్టిక్  వంటివి లేవు కాబట్టి , సహజసిద్ధమైనవే వాననీటితో కలిసి నదులలోకి చేరి, నదులు కలుషితం కావటం తక్కువగా ఉండేది.

     అయితే, ఈ రోజుల్లో  కొన్ని  పరిశ్రమల ద్వారా విడుదలయ్యే  రసాయన వ్యర్ధాలు... వంటివి కూడా డ్రైనేజ్ ద్వారా  నదులలో , సముద్రాలలో కలిపేస్తున్నారు. 

    ఇంటి  శుభ్రతకు వాడే అనేక రసాయనాలు, ఆసిడ్స్ వంటివి కూడా  డ్రైనేజ్ ద్వారా మట్టిలో, నీటిలో.... కలిసిపోతున్నాయి.

    గంగా నది వంటి నదిలో కూడా ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చే వ్యర్ధాలను వదులుతున్నారంటే  ఏమనుకోవాలి?

     డ్రైనేజ్  నీరు నదులలో కలువకుండా , డ్రైనేజ్  నీటిని శుద్ధి చేసి ..ఆ శుద్ధి చేసిన నీటి  ద్వారరహదారుల ప్రక్కన మొక్కలను పెంచవచ్చు.

     నదులలో, సముద్రాలలో  మురికిని కలుపకుండా 
    జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కూడా నదులను, సముద్రాన్ని పూజించిన పుణ్యాన్నిపొందవచ్చు.  


         

    Wednesday, August 24, 2016

    కొన్ని విషయాలు.... ఎండల్లో ఊరేగింపుల వల్ల పిల్లలు..


    కృష్ణా పుష్కరాలు ముగింపు కార్యక్రమాలు కూడా బాగున్నాయి.

     అయితే సింధు రాక సందర్భంగా జరిగిన  ఊరేగింపు బాగా ఎండలో జరిగింది.

     ఎందరో  పిల్లలు కూడా ఆ ఎండలో రోడ్డుకు ఇరువైపులా  ఉండటం టీవీలలో చూశాము.  

    ఎండల్లో ఊరేగింపుల వల్ల అందరూ అలసిపోతారు. 

    ఆహ్వానితులు.... ఆహ్వానించేవాళ్లు కూడా ఎండకు అలసిపోతారు.

    స్టేడియంలో సన్మానం మరియు  సాయంత్రం హారతి కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించటం బాగుంది.

     అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.





    Monday, August 22, 2016

    కృష్ణా పుష్కరాలలో..........

     కృష్ణా పుష్కరాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రభుత్వం వారు చాలా చర్యలను చేపట్టారు.

     విజయవాడలో చూస్తే .. ఎక్కడికక్కడ డస్ట్ బిన్లను ఏర్పాటు చేసారు. సిబ్బంది ఎక్కడికక్కడ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. 


    ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా చెత్తడబ్బాలలోనే చెత్తను వేస్తే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి.

    ఘాట్లో కూడా ఎందరో వాలంటీర్లు , పోలీసు వారు భక్తులకు సహాయం చేస్తున్నారు.

    పిల్లలు, పెద్దవాళ్ళకు టాగ్స్  వేయటం  అనేది ఎంతో చక్కటి ఆలోచన.

    అన్నదానం కూడా జరుగుతోంది.

    అయితే,  నేను ఒక దగ్గర  గమనించిన విషయం ఏమిటంటే..  కొంతమంది పొంగలిని  మొత్తం తినకుండా చెత్త బుట్టలో పడేసారు.

    ఆహారాన్ని వృధా చేయకూడదని తెలిసి కూడా ప్రజలు ఇలా వృధాగా పారవేయటం బాధాకారం. ఎక్కువ తినలేమనుకున్నప్పుడు ఎక్కువ  తీసుకోకుండా ఉండాలి.

    పుష్కరాలకు లక్షలాది భక్తులు వచ్చినా కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచటంలో ఎందరో  సిబ్బంది  చక్కగా కృషిచేసారు.
    ...........................


    తిరుమలలో కూడా రోజూ ఎందరో భక్తులు వచ్చినా కూడా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు.

      తిరుమల చూస్తే భారతదేశం అంతా తిరుమలలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.

    భారతదేశం అంతటా తిరుమలను ఆదర్శంగా తీసుకుని చర్యలు చేపడితే బాగుంటుంది.


     తిరుమలలో  ప్రతి రోజూ ఎందరో భక్తులు వస్తున్నా కూడా అన్నదానం అద్భుతంగా  నిర్వహిస్తున్నారు. అక్కడ తక్కువ ధరకే  ఆహారం లభించే జనతా క్యాంటీన్లు వంటివి కూడా ఉన్నాయి. 

    ...............................


     దేశం అంతటా  పేదవారికి తక్కువ ధరకు ఆహారం లభించే  క్యాంటీన్ల వంటివి ఏర్పాటు చేయటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం, మొక్కలు ఎక్కువగా నాటి పెంచటం, ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవటం..వంటి చక్కటి కార్యక్రమాలు మరింతగా జరిగేలా అందరూ కృషి చేయాలి.



    ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు.. చిత్తశుద్ధితో కృషి చేస్తే  భారతదేశం ప్రపంచంలోనే ఆదర్శ దేశం అవుతుందనటంలో ఎటువంటి సందేహమూ లేదు.


    Wednesday, August 10, 2016

    ఓం..





    శ్రావణ శుక్రవారం  వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ పూర్ణిమ..హయగ్రీవ జయంతి..ఈ సంవత్సరపు శుభప్రదమైన  అమరనాధ్ యాత్ర  శ్రావణ పౌర్ణమికి  పూర్తవుతుంది..శ్రావణ శనివారం శనిదేవుని పూజ..శ్రావణ మాసంలో ఎన్నో విశేషాలు ఉంటాయి.

    ****************
     కొందరు ఎక్కువ సంఖ్యలో దైవనామాలను అనటం కొరకు.. గబగబా చాలా స్పీడుగా అనేస్తారు. ఇలాంటప్పుడు గొంతునొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుందేమో? 

    అలా చేయటం కన్నా, సంఖ్య తక్కువైనా.. దైవనామాలను నిదానంగా, ప్రశాంతంగా అనుకోవటం మంచిదని నాకు అనిపిస్తున్నది.