koodali

Wednesday, March 30, 2016

అమరావతి నమూనా..


అమరావతి నమూనా చక్కగా ఉంది. చక్కటి ఉద్యానవనాలు కూడా ఉంటాయంటున్నారు. అంతా బాగుంది.

 కొత్తగా నిర్మించే  భవనాలలోకి గాలి, వెలుతురు  ధారాళంగా  వచ్చేలా  నిర్మించాలనుకోవటం  ఎంతో చక్కటి విషయం. 

అయితే, ఈ రోజుల్లో భవనాలలో  ఎక్కువగా ఏసీలు ఉంటున్నాయి గానీ,  వీలైనంతలో వెలుతురు..  బాగా వచ్చేటట్లు నిర్మించుకుంటే విద్యుత్ ఖర్చు చాలావరకు  తగ్గుతుంది.

అమరావతి నమూనా  చాలా  బాగుంది .  

అయితే అసెంబ్లి మరియు శాసనమండలి భవనాల పై నిర్మాణాలు  గొట్టాలను పోలి ఉన్నాయని,  వాటి డిజైన్ మార్చితే బాగుంటుందని చాలామంది ప్రజలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. 

ఆ గొట్టాల ఆకృతులు చూస్తే అణుకర్మాగారాలు కూడా గుర్తు వస్తున్నాయి.. (  తప్పులు ఎంచుతున్నామని దయచేసి భావించవద్దు. ఏదో తోచినంతలో నా అభిప్రాయం రాయాలనిపించి వ్రాసాను  అంతే.)

అయితే మరి ఈ గొట్టాల ఆకృతి ఏ ఉద్దేశంతో వేసారో, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయేమో మనకు తెలియదు. 

  అమరావతి నిర్మాతలకు అభినందనలు. 

ఆంధ్రుల కలల  రాజధాని అమరావతి చరిత్రలో చిరకాలం  చక్కటి పేరుప్రఖ్యాతులతో నిలిచిఉండాలని ఆశిద్దాము.




Monday, March 28, 2016

రాష్ట్ర విభజన .... తరువాత..

  
రాష్ట్ర విభజన సమయంలో పార్టీలు అనేక హామీలిచ్చిన సంగతి అందరికీ తెలుసు.

తమకు జరిగిన అన్యాయం గురించి ఆంధ్ర ప్రజలు అరచి గోల చేయకపోవచ్చు. అయితే, తమకు అన్యాయం చేసే వారి విషయంలో తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. 

ఉదా.. అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఆ తరువాత భారీగా నష్టపోవటం  గురించి అందరికీ  తెలుసు. 

 ఇప్పుడు కేంద్రం  కూడా  సరిగ్గా ఆంధ్రప్రదేశ్  ను  ఆదుకోవటం లేదనిపిస్తోంది. 

హామీల  అమలు ఆశించినంతగా లేదనిపిస్తోంది. 

రాజధాని మరియు ఇతర విషయాల కోసం భారీగా నిధులు ఇవ్వవలసి ఉంది.

 వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు పన్నుల రాయితీల వంటివి కూడా ఇప్పటివరకూ అమలు చేయలేదు.

  బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు  సరైన న్యాయం జరగలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 

మిగతా రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ను పోల్చటానికి లేదు.

 రాష్ట్ర విభజన ఆంధ్ర ప్రజల అభిమతానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు  గణనీయంగా నిధులు ఇవ్వవలసి ఉంది.


 ఇవన్నీ ఎవరూ ఇచ్చే భిక్ష కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు.

 రాష్ట్ర విభజనలో ఇప్పుడు  కేంద్రప్రభుత్వంలో ఉన్న పార్టీ  ప్రమేయం కూడా ఉంది.

 విభజన జరిగిన కొత్తలో బిజేపీ పార్టీ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీలిచ్చింది.

 అయితే ఇప్పుడు... ఇతరుల  చెప్పుడు మాటలు వినో లేక మరేదైనా కారణాల వల్లో గానీ ఆ పార్టీ తీరు కొంచెం మారిందేమో ? అనిపిస్తోంది. 

 విభజన జరిగి చాలాకాలమయ్యింది. అరకొరగా ఇచ్చే నిధులతో  రాష్ట్రం ఎప్పటికి కోలుకుంటుంది ? 

 సరిపడినంత నిధులు ఇవ్వలేమని భావించినట్లయితే  అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించకుండా ఉండవలసింది.

ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని అప్పట్లో బీజేపీ వాళ్లు ప్రకటించారు. వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిద్దాము.
.......................

మరో విషయం ఏమిటంటే, 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండగా ఇప్పుడే అమరావతికి తొందరేమొచ్చిందని కొందరు అంటున్నారు. 

10 సంవత్సరాలూ హైదరాబాద్లోనే ఉండి  10 సంవత్సరాల తర్వాత తీరిగ్గా కళ్ళు తెరిస్తే రాజధాని అప్పటికప్పుడు ఆకాశం నుంచి ఊడి పడదు కదా ! 

ఇప్పటి నుంచీ కష్టపడితేనే 10 సంవత్సరాలకు రాష్ట్రం  అంతా  అభివృద్ధి చెందుతుంది. 

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులలో చాలామంది రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషిచేయటానికి  సిద్ధపడుతుండగా ...కొద్దిమంది  మాత్రం రాజధాని ఏర్పడి అన్ని సౌకర్యాలూ ఏర్పడితేనే వస్తామనటం బాధాకరం.

 తెలంగాణాకు చెందిన ఉద్యోగులు (ఆంధ్రలో ఉన్నవాళ్ళు ) తమను తమ రాష్ట్రానికి పంపివేస్తే తమ రాష్ట్ర అభివృద్ధిలో కృషిచేసుకుంటాము  అంటున్నారట ...

ఆంధ్ర  వాళ్ళు  కూడా తమ రాష్ట్రానికి వచ్చి.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఆశిద్దాము.
..........................
 
 ఈ క్రింద విషయాలు ఈ పోస్ట్ వేసిన చాలాకాలం తరువాత వ్రాసి ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది.

అమరావతిలో 30వేల ఎకరాలు తీసుకుని అక్కడ రాజధాని పెట్టటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, పంటలు ఎలా? అని బాధపడనక్కరలేదు. ఇంకా, కృష్ణా, గోదావరి జిల్లాల్లో చాలా పంటపొలాలు ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్ట్ వల్ల  సాగునీరు అంది, కొన్నివేల or  కొన్నిలక్షల ఎకరాలు సాగులోకి వస్తాయంటున్నారు. కొన్ని ప్రాజెక్టుల వల్ల ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుందంటున్నారు. అలా చాలా ఎకరాలు సాగులోకి వస్తాయి.

అందరూ బాగుండాలి.
 
 

Saturday, March 26, 2016

స్త్రీల సమస్యల గురించి కొన్ని అభిప్రాయాలు..



ఈ రోజుల్లో స్త్రీలకు ఎన్నో సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించటం పట్ల శ్రద్ధ చూపకుండా... కొన్ని దేవాలయాలలోకి స్త్రీలను ప్రవేశం లేకపోవటం వివక్ష అంటూ గొడవ చేయటం ఏమిటి?

 స్త్రీలను ఉద్ధరించాలనుకుంటే  పరిష్కరించటానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి.

 ఎందరో స్త్రీలు వేశ్యాగృహాలలో నరకాన్ని అనుభవిస్తున్నారు.

 ఎందరో స్త్రీలు  అత్తలు, ఆడపడుచులు, సవతులు వంటి..తోటి స్త్రీల వల్లే  వేదనకు గురవుతున్నారు. 

పాఠశాలల్లో, కాలేజీల్లో , ఆఫీసులలో  లైంగిక వేధింపులు వల్ల ఎందరో స్త్రీలు వేదనను అనుభవిస్తున్నారు. 

ఇంకా  ఎన్నో సమస్యలున్నాయి . ఈ సమస్యలను పరిష్కరించుకుంటే  బాగుంటుంది.
.................................

Posted by anrd at 10:39 PM 
8 COMMENTS:

AnonymousJanuary 30, 2016 at 1:27 AM

వేరే వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చే బదులు మీరు ఇంతగా బాధపడుతున్న సమస్యల గురించి మీరే పని మొదలుపెట్టొచ్చుగా. వాళ్లకి ఇబ్బందికి గురిచేస్తున్న సమస్యల గురించి వాళ్ళు పోరాడుతున్నారు, మీబోటి పెద్దలు అడ్డం పడకుండా ఉంటే అదే పదివెలు.

Reply
Replies

anrdJanuary 30, 2016 at 11:35 AM

మేము కొన్ని సంవత్సరాల క్రిందట శనిశింగణాపూర్ వెళ్లి వచ్చాము. అక్కడ దైవదర్శనం చేసుకోవాలంటే స్త్రీలు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అయితే మూలమూర్తి ఉన్న అరుగు పైకి మహిళలు వెళ్ళకూడదు. మూలమూర్తి ఆరుబయటే ఉంటారు కాబట్టి చక్కగా దర్శనమిస్తారు. 

పురుషులు పైన షర్ట్ లేకుండా తడి దుస్తులతో మూలమూర్తి వద్దకు వెళ్లాలనే నియమం ఉన్నట్లు గుర్తు. మరి ఈ విషయం పురుషుల పట్ల వివక్షగా భావించటం లేదు కదా ! 

అయ్యప్పస్వామి వద్దకు రజస్వల కాని ఆడపిల్లలు, బహిష్టులు ఆగిపోయిన ఆడవాళ్ళు వెళ్ళవచ్చు. కొన్ని ఆచారాలు అలా ఉంటాయి. 

శ్రీశైలంలో శివలింగాన్ని స్త్రీలు, పురుషులు అందరూ తాకవచ్చు.

ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా నియమాలు ఉంటాయి. పెద్దలు వద్దన్నదే చేయాలనే పంతం ఎందుకు ?


ఏ విషయంలో ఏ రహస్యం ఉందో తెలియదు. పెద్దవాళ్లు వద్దని చెప్పిన విషయాలే చేస్తామని పట్టుబట్టడం ఎందుకు ?


కొన్ని దేవాలయాల లోపలికి స్త్రీలు వెళ్ళవద్దు .. అని పెద్దలు చెప్పటంలో ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు. మేము ఎందుకు వెళ్ళకూడదు ? అని పంతాలు పోవటం ఏమిటి ? 



anrdJanuary 30, 2016 at 12:40 PM

హాస్పిటల్లో ఆపరేషన్ ధియేటర్లోకి అందరినీ రానివ్వరు. ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి. అంతమాత్రాన వివక్ష అంటారా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అయినా సరే పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చుంటామంటే ఎప్పుడుపడితే అప్పుడు అందరినీ వెళ్ళనిస్తారా ? ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి.అంతమాత్రాన వివక్ష అంటారా ? 

కొన్ని దేవాలయాల్లోకి వెళ్ళటానికీ కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఇందులో వివక్ష ఏమీలేదు.



Jai GottimukkalaFebruary 1, 2016 at 12:39 PM

సమానత్వం అనే హక్కు ప్రైవేటు సంస్థలకు వర్తించదు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలలో మందిరం తాలూకా అనాదిగా పాటిస్తున్న ఆచారాలు ఉంటాయి. సదరు ఆచారాలు హేతుబద్దమా కాదా అన్న చర్చ సరికాదు. వారి గుడి కనుక వారి ఆచారాలు అందరూ పాటించాలి. కాదు కూడదు అనుకుంటే యాజమాన్యంతో చర్చించాలి కానీ రోడ్డు మీద గొడవ చేయడం అనవసరం.

మహిళలకు అనేక సమస్యలు ఉన్న తరుణంలో ఇలాంటి చిన్న విషయాలు లేవనెత్తి ఉపద్రవం జరుగుతుందని గగ్గోలు పెట్టడం అసలు సమస్యలను దృష్టి మళ్లించడమే.


anrdFebruary 1, 2016 at 9:02 PM

అవునండి, మహిళలకు అనేక సమస్యలు ఉన్న తరుణంలో ఇలాంటి విషయాలు లేవనెత్తి ఉపద్రవం జరుగుతుందని గగ్గోలు పెట్టడం అసలు సమస్యలను దృష్టి మళ్లించడమే.


Reply

anrdJanuary 30, 2016 at 10:26 AM


ఈ మధ్య ఈనాడులో ఒక వార్త వచ్చింది.తెలుగురాష్ట్రాలలోని వైశ్యులలో కొందరికి భూటెల్ కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైం లోపం ఉన్నట్లు గుర్తించారట.ఈ లోపం ఉన్నవారికి ఏదైనా శస్త్రచికిత్స అవసరమైనప్పుడు మత్తుమందు ఇస్తే తిరిగి వారు స్పృహలోకి రావడం లేదట, కొన్ని సందర్భాలలో మృత్యువాత పడుతున్నారట. 

ఈ ఎంజైం లోపం గుర్తించిన తరువాత మత్తు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వైద్యులు ప్రత్యామ్యాయ మార్గాలు అనుసరిస్తున్నారట. 

దక్షిణభారతదేశానికి చెందిన వారు అమెరికాలో ఆసుపత్రికి వెళ్లినా ఇప్పుడు వారి కులం గురించి అడుగుతున్నారట. భారత్ లో వైద్యులు కూడా శస్త్రచికిత్స సమయంలో కులం గురించి అడుగుతున్నారట.

భిన్నకులాలు, మతాల సమ్మిళతమైన భారతదేశంలో జన్యు పరిశోధనకు అపారావకాశాలున్నాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయ జన్యుశాస్త్రవేత్త డేవిడ్ రీచ్ అనేవారు తెలియజేశారట.

( ఇందువల్ల .. మీది ఏ కులం ? అని వైద్యులు అడిగితే కులం సరిగ్గా చెప్పాలి. అంతేకానీ వైద్యులు కులవివక్ష చూపిస్తున్నారు. కులంగిలం అంటూ ఏమీలేద్.... అంటూ ఆవేశపడకూడదు.)


Reply

anrdJanuary 30, 2016 at 10:27 AM


స్త్రీల సమస్యల పట్ల శ్రద్ధచూపుతూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నవారు ఎందరో ఉన్నారు. సునీతాకృష్ణన్ వంటివారు ఎంతో ధన్యజీవులు. అలాంటివారికి అండగా నిలిచి స్త్రీల సమస్యలను పరిష్కరించితే అందరూ అభినందిస్తారు.

సతీసహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటం కూడా అభినందించతగినదే. 

( అయితే సతీసహగమనం ఏవో కొన్ని కారణాల వల్ల ఆచారంగా ఏర్పడి ఉంటుంది. అంతేకానీ సనాతనధర్మం సతీసహగమనాన్ని ఆచారంగా ఏర్పరచలేదు. రామాయణంలో కౌసల్య, సుమిత్ర, కైక సతీసహగమనం చేయలేదు, భారతంలో సత్యవతి, కుంతీదేవి కూడా సహగమనం చేయలేదు.)

అయితే, జోగిని వ్యవస్థ వంటివి దురాచారాలే. ఇలాంటి దురాచారాలను రూపుమాపటానికి ఎవరు ఉద్యమాలు చేసినా అభినందనీయమే. 

సమాజంలో ఎన్నో సమస్యలు ఉండగా అవి పరిష్కరించటం పైన శ్రద్ధ పెట్టకుండా ..స్త్రీలు అన్ని దేవాలయాల లోపలి వరకూ వెళ్ళి ముట్టుకుని తీరుతాం అంటూ ఉద్యమాలు చేయటమేమిటి ? దీని వెనుక ఉన్న విషయం ఏమిటి ?


Reply

anrdJanuary 30, 2016 at 12:35 PM

బహిష్టు సమయం లో స్త్రీలు నీరసంగా ఉంటారు కాబట్టి కొంత విశ్రాంతి అవసరం. 

ఆ సమయంలో ఎక్కువ పనులు చేయకుండా మైల అంటూ కట్టడి చేసారు. ఇలాగైనా ఆ నాలుగురోజులూ స్త్రీలకు విశ్రాంతి లభిస్తుంది.

నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది. అదేపనిగా పనిచేస్తే గర్భసంచి జారే అవకాశం కూడా ఉంది. అప్పుడు శాశ్వతంగా గర్భం ధరించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. 

అయితే ఈ రోజుల్లో శానిటరీనాప్కిన్స్ వాడుతూ గెంతులు వేయవచ్చునంటూ ప్రచారం చేస్తున్నారు.( ఇది సరైనది కాదు.)

కొంతమంది స్త్రీలలో నెలసరి సమయంలో విపరీతంగా కడుపునొప్పి ఉంటుంది. 

చదువులు.. పరీక్షలు, ఉద్యోగాలు..టార్గెట్లతో సతమతమవుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యం ఎలా ఉన్నా బయటకు వచ్చి కష్టపడటం స్త్రీలకు తప్పనిసరి అయ్యింది. 



Wednesday, March 23, 2016

బాధ్యతగల పౌరులు ఎక్కువగా ఉన్న దేశం బాగుపడుతుంది . ..

 
ఈ రోజుల్లో నీటి విలువ గురించి అందరికీ తెలిసినా కూడా చాలామంది  నీటిపొదుపును పాటించటం లేదు.

  కొందరు పెద్దవాళ్ళు బట్టలు ఉతికినంత సేపు పంపును అలాగే వదిలేస్తుంటారు. పెద్ద ధారతో నీళ్లు పోతూ ఉంటాయి. 

 వాకిలి కడగటానికి కొద్దిగా నీళ్లు చాలు. అయితే చాలామంది పైపుతో బోలెడు నీళ్లు గుమ్మరించి కడిగేస్తుంటారు.

 అసలే నీటికొరత బాగా ఉన్న ఈ రోజుల్లో నీళ్ళు ఉన్నవాళ్ళు ఇలా ధారాళంగా వాడేస్తుంటే క్రమంగా ఆ ప్రాంతంలో భూగర్భనీటిమట్టం పడిపోయి  అందరికీ నీటి కొరత ఏర్పడుతుంది. 


ఈ రోజుల్లో ఇళ్లలో ప్రతి గదికి పంపులు ఉంటున్నాయి.  

చాలా మంది ఇళ్లలో పంపులు లూజ్ అయి ఒక్కొక్క బొట్టూ నీరు  పోతూ ఉంటుంది . వాటిని రిపేర్ చేయకుండా అశ్రద్ధ చేస్తారు. 

ఒక్కొక్క బొట్టు పోతున్న పంపు క్రింద బకెట్ పెడితే గంటలో బకెట్ నిండిపోతుంది. ఇలా ఎంతో నీరు వృధాగా డ్రైనేజ్లోకి పోతుంటుంది. 

 పాతకాలంలో అయితే గదిగదికీ పంపులు ఉండేవి కాదు, నీళ్లను బయటనుంచి మోసుకుని తెచ్చుకోవాలి కాబట్టి , నీళ్ళను వృధాగా పారబోసేవారు కాదు. 

వాషింగ్ మెషిన్ వల్ల నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వేసవికాలం వాషింగ్ మెషీన్ వాడకం కొంత వరకూ తగ్గించుకుంటే మంచిది. 

కొన్ని దుస్తులు చేతితో ఉతుక్కుంటే నీరు పొదుపు అవుతుంది. 

నీటిని వృధాచేయవద్దని ఎందరు చెబుతున్నా  ఎవరూ పట్టించుకోవటం లేదు.

 డ్రైనేజ్ నీటిని శుద్ధి చేసి ,టాంకర్లతో తరలించి రోడ్ల ప్రక్కన పెంచే మొక్కలకు పోయవచ్చు.

 అందరూ బాధ్యత వహించితేనే నీటిసమస్యలు తగ్గుతాయి. 

బాధ్యతగల పౌరులు ఎక్కువగా ఉన్న దేశం బాగుపడుతుంది . 


Monday, March 21, 2016

ప్రకృతి వ్యవసాయం..




 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందరో రైతులు  ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్న  ప్రభుత్వం ఎంతో మంచిపని చేస్తోంది. 

ప్రకృతి వ్యవసాయం గురించి కొన్ని వివరాలను ఈ లింక్ వద్ద తెలుసుకోవచ్చు.

oka link..Margadarshi - Subhash Palekar - YouTube 

 

oka link..సేంద్రియ పద్ధతి..

..........................
 
 marikonni vishayaalu..
 
 రైతులకు కొన్ని సమస్యలున్నాయి.  పరిశ్రమల వాళ్ళు చిన్న వస్తువు తయారు చేసినా దానికి వారికి నచ్చినట్లు ధర చెబుతారు. ఈ రోజుల్లో రైతులకు తను పండించే పంటకు ధరను స్వంతంగా చెప్పుకునే హక్కు ఉందా? వ్యవసాయంలో సరైన ధరరాక రైతులెందరో కష్టపడుతున్నారు.

కూరగాయలు, పండ్లు పండించాలంటే, విత్తనం వేసి మొలకెత్తి, పెరిగి చీడపీడలకు తట్టుకుని, తుఫాన్లు వచ్చి పాడవకుండా పంట చేతికి అందాలంటే ఎంతో కష్టం ఉంటుంది. అలా పంట చేతికొస్తే,  దళారులు, వినియోగదారులు తక్కువ ధరకు అడుగుతారు.

గోడవున్లలో ఆహారపదార్ధాలు పాడవకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి.కొంత తక్కువధరకు పేదవారికి ఇవ్వవచ్చు.
...................................
ఐటి వంటి వారికి నెలకు కొన్నివేలు, కొందరికి లక్ష వరకు ఆదాయం వస్తోంది. రైతులకు కొన్నివేలు, లక్ష ఆదాయం రావాలంటే సంవత్సరం పడుతుందేమో?

ఐటీవాళ్లకు ఎంత కష్టపడి పని చేసినా కూడా, ఉద్యోగాలు ఎన్నాళ్లుంటాయో చెప్పలేము. చాలామంది ఉద్యోగాలు ఉన్నప్పుడే సంపాదించుకుని దాచుకుంటారు. ఒక ఉద్యోగం పోయినా ఇంకో ఉద్యోగానికి వెళ్తారు.

 రైతులకు ఉద్యోగం పోతుందని భయం ఉండదు. కాని,ఉద్యోగాల వాళ్లతో పోలిస్తే ఆదాయం తక్కువ ఉంటుంది. చక్కగా ప్రణాళిక వేసుకుంటే చక్కటి ఆహారం, ప్రకృతి మధ్య జీవితం ఉంటుంది.
..............................

ఈరోజుల్లో పల్లె జీవితం ఎక్కువమందికి నచ్చటం లేదు. సిటీలే నచ్చుతున్నాయి..చాలామంది వ్యవసాయం చేయటం కన్నా, ఉద్యోగాలే కావాలంటున్నారు.

ఉద్యోగాలు చేసేవాళ్ళు నెలకు వేలరూపాయలు సంపాదిస్తుంటే, రైతులు తక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయం చేస్తూ కష్టాలు పడుతూ అందరికి అన్నం పెట్టాలంటే కష్టం కదా..  రైతులు వ్యవసాయం మానకుండా ఉండాలంటే, రైతులకు కూడా ఆదాయం బాగుండాలి కదా.
..............................

పాతకాలంలో పల్లెల్లో వ్యవసాయంచేస్తూ చక్కటి ఆహారం తింటూ, పత్తితో దుస్తులు నేసేవాళ్లు నేస్తుంటే, ఆ దుస్తులు కొనుక్కుని, వృత్తివిద్యలు చేసేవాళ్లు చేసే పరికరాలను కొనుక్కుని ఉన్నంతలో చక్కగా జీవించేవారు.

పాతకాలంలో వృత్తివిద్యలు ఉన్నప్పుడు చదువు, ఉద్యోగం అని వేరే ఊళ్లకు వెళ్ళి హాస్టల్స్ లో ఉండటం తక్కువగా ఉండేది . పిల్లలు తమ పెద్దవారినుంచి వృత్తివిద్యలు నేర్చుకుని ఉన్నఉళ్లోనే ఉండేవారు. కాలేజీల్లో సీట్లకొరకు, ఉద్యోగాల కొరకు ఎదురుచూపులు ఉండేవికాదు.
...............................

పాతకాలంలో ఆధునిక టెక్నాలజి లేదు. సినిమాలు, టీవీ సీరియల్స్, సెల్ఫోన్లు, కార్లు, క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్స్, ఆధునిక విలాసాలు లేవుకదా..ఇప్పుడు ప్రజలు చాలామంది ఇవన్నీ అలవాటుపడ్దారు.

పల్లెలకు కొంతదూరంలో సిటీలు ఉంటే, పల్లెలో వ్యవసాయం చేసి అప్పుడప్పుడు సిటీకి వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు స్కూల్స్, కాలేజిలు ఒకసమస్య అంటారు కానీ, ఈ రోజుల్లో ఉన్నఊళ్లోనే అందరికి సీట్లు లభించటం లేదు కదా..చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారు.

 ఇప్పుడు చాలామందికి సిటీల్లో ఇళ్లు, కార్లు, విలాసవంతమైన ఇళ్ళు, ఆధునికటెక్నాలజి, రకరకాల కొత్తవస్తువులు కావాలి.

 టెక్నాలజి వద్దని నా అభిప్రాయం కాదు. పర్యావరణసహిత టెక్నాలజి మంచిది. టెక్నాలజిని అతిగా కాకుండా, ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవాలి.
....................................
 ఉపాధి అవకాశాలు సిటీల్లోనే ఉండటం వల్ల అక్కడకు వలసలు వెళ్ళి పొల్యూషన్ మధ్య బ్రతకవలసి వస్తోంది.

పరిశ్రమలు అన్ని సిటీల్లోనే కాకుండా, సిటీలకు కొంతదూరంగా చిన్ననగరాల్లో కూడా ఏర్పాటు చేసి అక్కడకూడా మంచి స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, పార్కులు..ఏర్పాటుచేస్తే సిటీల్లో భారం తగ్గుతుంది.
............................... 
 కొందరు సిటీల్లో పొల్యూషన్ ఇష్టపడక, సిటీకు దూరంగా ప్రకృతి వ్యవసాయంతో కూరగాయలు, పండ్లమొక్కలు, పువ్వుల మొక్కలు.. పెంచుకుంటూ,  ఆధునిక వసతులతో కూడా చక్కగా నివసిస్తున్నారు.

Wednesday, March 16, 2016

ఆర్ధిక అసమానతలు తగ్గితేనే సమస్యలు తగ్గుతాయి..

 
 
 
ఈ రోజుల్లో ఎన్నో రంగాలలో ఉపాధి లభించటం చాలా సమస్యగా ఉంది.   ఉపాధి లభించకపోవటం వల్ల ఆదాయం లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కో రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరము ఇంజనీరింగ్ కాలేజీల నుండి ఎన్నో వేలమంది వరకూ పట్టాలు పుచ్చుకుని బయటకు వస్తున్నారు.  దేశం అంతటా కలిపితే ఎన్నో లక్షల మంది ఉంటారు. 


 పరిశ్రమల  ద్వారా  కొందరికి  మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయి.  ఆ ఉద్యోగస్తులు కొన్ని సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు. 

ఇలాంటప్పుడు , ప్రతి ఏటా కాలేజీల నుండి బయటకు వచ్చే లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాలంటే ఎలాగో తెలియదు.

 ప్రతి సంవత్సరం ఎన్నని కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయగలరు ?

నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు తగ్గాలంటే ఆర్ధిక అసమానతలు తగ్గించటమే పరిష్కారం. 

 కొందరి వద్ద విపరీతంగా సొమ్ము ఉండటం ....కొందరి వద్ద సొమ్ము లేకపోవటం వల్ల ఆర్ధిక అసమానతలు ఏర్పడతాయి. 

ప్రపంచంలోని వనరులపై అందరికీ హక్కుంది. అయితే, బలవంతులు, తెలివిగలవాళ్ళు సంపదను తమ చేతుల్లో ఉంచుకుని బలహీనులకు అన్యాయం చేస్తున్నంత వరకూ  సమాజంలో ఆర్ధిక అసమానతలు , నిరుద్యోగం, పేదరికం ఉంటూనే ఉంటాయి. 


 ప్రభుత్వాల వద్ద సంపద ఉండటం వల్ల ఎన్నో ఉద్యోగాలను సృష్టించుకోవచ్చు. సంపద ఉండాలంటే సమాజంలో ఆర్ధిక అసమానతలు తగ్గించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.


 నల్లడబ్బును అరికట్టటం, అన్ని రంగాలలో ధరలను అదుపులో ఉంచటం  ..వంటి విషయాలలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. 

అందరికీ కనీస అవసరాలు తీరటం ఎంతో అవసరం. ముఖ్యంగా ఆహారం లభించకపోతే ప్రజలలో నేరప్రవృత్తి పెరిగే అవకాశం ఉంది. 

నిరుద్యోగం, పేదరికం వంటి పరిస్థితులు చక్కదిద్దటానికి ప్రభుత్వాలకు సమయం పడుతుంది. అంత వరకూ ప్రజలకు  ఆకలిబాధలు లేకుండా ప్రభుత్వాలు తక్కువ ధరకు ఆహారాన్ని అందించాలి.  

 కొన్ని రాష్ట్రాలలో  ప్రభుత్వం వాళ్ళు  తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

 ప్రభుత్వాలు ప్రజలకు చేరువ కావాలన్నా  తక్కువ ధరకే భోజనసదుపాయం కల్పించటం అనేది ఒక చక్కటి మార్గం.



Monday, March 14, 2016

తిరుమల తిరుచానూరు, శ్రీ కాళహస్తి ....




మేము తిరుమల తిరుచానూరు, శ్రీ కాళహస్తి వెళ్లి వచ్చాము. దర్శనాలు బాగా జరిగాయి. అంతా దైవం దయ. 

 తిరుమలలో  పూజ కొరకు టికెట్స్ తీసుకున్నాము. ఈ టికెట్స్ కొన్ని సంవత్సరాల క్రిందట తీసుకున్నాము. 

పూజలో పాల్గొనే అవకాశం కలిగింది. అంతా దైవం దయ. 

తిరుమల నడక దారిలో వెళ్ళాము.

 తిరుమలలో కాలినడక భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించటం బాగుంది. 

అయితే ఒక దగ్గర  ఏమంటున్నారంటే..... కాలినడక భక్తులు 24 గంటల లోపే ప్రత్యేకదర్శనం చేసుకునే అవకాశం  ఉంది  అంటున్నారు.

 ఇంకొక దగ్గర ఏమంటున్నారంటే .....24 గంటలు అనే నియమం ఏమీ లేదు. తరువాత కూడా  ప్రత్యేకదర్శనం  చేసుకునే అవకాశం  ఉంది  అంటున్నారు.

 కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులలో కొందరికి కాళ్ళనొప్పుల వల్ల 24 గంటల లోపే దర్శనం చేసుకోవాలంటే కుదరకపోవచ్చు. అందువల్ల 24 గంటలకన్నా ఎక్కువ కాలం పర్మిషన్ ఇవ్వటమే బాగుంటుంది.


 తిరుమలలో అన్నప్రసాదం చాలా బాగా చేస్తున్నారు. రోజూ ఎందరో భక్తులు వస్తున్నా కూడా అవన్నీ అలా నిర్వహించటం ఎంతో గొప్ప విషయం.


 కొన్ని రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం వాళ్ళు  తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

 ప్రభుత్వాలు ప్రజలకు చేరువ కావాలంటే తక్కువ ధరకే భోజనసదుపాయం కల్పించటం అనేది ఒక చక్కటి మార్గం.


 అందరికీ ఉద్యోగాలు కల్పించటం అనేది అంత సులభమైన విషయంకాదు. అందరికీ ఆహారం అందించటం కొంత తేలికైన విషయమే.

 అయితే ఆహారాన్ని వృధా చేయకూడదు. 

 తిరుమలలో ఉన్నట్లు అన్ని ఊళ్ళలోనూ బాగా మొక్కలు పెంచాలి.

శ్రీ కాళహస్తి దేవాలయం కూడా చాలా పెద్దది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూలైన్లు ఏర్పాటు చేసారు. 

దైవదర్శనాలు బాగా జరిగాయి. అంతా దైవం దయ.
**************