koodali

Thursday, September 5, 2024

కర్నూల్లో వచ్చిన అప్పటి వరద...

 

కర్నూల్లో పెద్ద వరద వచ్చినప్పుడు మేము ఉద్యోగరీత్యా కర్నూల్ లో ఉండేవాళ్లం. సడన్ గా వరదనీరు పెరిగి కర్నూల్ మునిగిపోతుందంటూ వార్తలు వచ్చాయి. 

 డ్యాం సామర్ధ్యం కన్నా ఎక్కువ నీరు వస్తోంది కాబట్టి, ఇంకో కొన్ని గంటలు గడిస్తే తప్ప కర్నూలు ఏమవుతుందో ఏమీ చెప్పలేము..తాటిచెట్టు అంత ఎత్తు నీళ్ళు ఊళ్ళోకి వస్తోందంటూ..వార్తలు వచ్చాయి. 

 ఈ వార్తలు విన్న ప్రజలు కొందరు,  వేరే ఊర్లలోని బంధువుల వద్దకు వెళ్లారు. కొందరు వేరే ఊళ్ళలోని హోటల్ రూంస్ తీసుకుని ఉన్నారు. బాగా ట్రాఫిక్ జాం కూడా  అయ్యి,   వెళ్లలేక చాలామంది తిరిగి వచ్చేసారన్నారు.

 వర్షాలు తగ్గితే తప్ప ఏమీ చెయ్యలేము...అనే పరిస్థితి. భయాందోళనతో దైవాన్ని స్మరించుకున్నాము. దైవం దయ వల్ల డ్యాంకు ఏమీ కాలేదు.

వరదద్వారా వచ్చిన బురద తీయటం చాలా కష్టమయ్యింది.  
మా ఇల్లు ఎత్తుగా ఉంది  కాబట్టి, మాకు వరదనీరు రాలేదు.

 మా ఇంటిచుట్టుపక్కవాళ్ళం కొందరం కలిసి వరదబాధితుల వద్దకు వెళ్ళి కొన్ని పులిహోర పొట్లాలు ఇచ్చాము.  నేను
కొద్దిమందికి.. అన్నం, కొబ్బరిపచ్చడి, టమేటో పప్పు, వంకాయ కూర.. పేపర్ ప్లేట్లలో పెట్టి  ..ఇవ్వటం జరిగింది. 


 అప్పుడు చాలామంది రోడ్లపైన నడుచుకుంటూ వెళ్ళారు. వరదబాధితులకు చాలామంది ఇతరప్రాంతాల వారు సహాయం చేసారు. దైవం దయవల్ల
డ్యాముకు ఏమీకాలేదు..కర్నూల్ కు భారీ ముప్పు జరగలేదు.

************ 

మనదేశంలో అనేకరాష్ట్రాలలో పెద్దడ్యాములు ఉన్నాయి...వాన పెరిగితే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. 

గతకొద్దిరోజులుగా విజయవాడ ప్రకాశం బ్యారెజ్ గురించి, వానలు పెరిగితే బ్యారేజ్ నీటిమట్టం పెరుగుతుంది కాబట్టి,  ఆ ప్రవాహాన్ని బ్యారేజ్ తట్టుకుంటుందా? లేదా?  బ్యారేజ్  కు ఏదో ప్రమాదం జరిగిపోతుందంటూ ..వార్తలు వచ్చాయి. 

 ఇలాంటప్పుడు ఎవరికైనా ఎంతో భయాందోళనలు కలుగుతాయి. ప్రజలు పానిక్ అవుతారు.   ఇలాంటివార్తలు విన్నప్పుడు.. డ్యాంల,  బ్యారేజీల భద్రత ఎంత? అనే సందేహాలు ,భయాందోళనలు కలుగుతున్నాయి. ఎవరైనా కుట్రలు చేసినా చాలా ప్రమాదం.

   ఏమైనా జరిగితే  ఆ వినాశనాన్ని ఊహించగలమా? ఇవన్నీ గమనిస్తే, భారీ డ్యాములు నిర్మించటం కన్నా, చిన్నడ్యాములు నిర్మిస్తే మంచిదనిపిస్తుంది. 

 ఏ కారణం చేతైనా భారీ డ్యాములు నిర్మిస్తే, ఆ డ్యాములకు ఎక్కువ నీరు వచ్చినా ప్రమాదం జరగకుండా ..ముందు జాగ్రత్తలు తీసుకుని నిర్మించాలి. ఒక పెద్ద డ్యాము కన్నా, రెండు లేక మూడు చిన్న డ్యాంలలో( రిజర్వాయర్లలో ) నీటిని నిల్వ చేసుకుంటే మంచిదనిపిస్తుంది.

 *************

 ప్రతిఊరిలో చెరువులను పద్ధతిగా ఉంచుకోవాలి. కాలువలను చక్కగా ఉంచుకోవాలి. చెక్ డ్యాములు నిర్మించుకోవాలి. ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి.

 

Monday, September 2, 2024

ఇలాంటి పరిస్థితులు మారాలి...

 

సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చిపడటం వల్ల కూడా ..కొన్ని సమస్యలు కలిగి ప్రజలలో ఆందోళన కలుగుతుంది.


 దేశంలో సమస్యలు ఒకదానితరువాత ఒకటి  ఉంటూనే ఉన్నాయి.  సమస్యలు ఎందుకొస్తున్నాయి? వీటిని ఎలా పరిష్కరించుకోవాలని అందరూ ఆలోచించి పరిష్కరించుకోవాలి.


దేశంలో
 ఎప్పుడూ సమస్యలేనా?  ..ఇంకెప్పుడు భారతదేశం బాగుపడుతుంది?


అవినీతి, స్త్రీల పట్ల అత్యాచారాలు, నిరుద్యోగసమస్య....ఇలాంటి పరిస్థితి మారాలి.

  ఇవన్నీ పోవాలి.  పట్టుదలగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. 

 
భారతదేశం ఎంతో గొప్పదేశం అయ్యుండి కూడా, ఇక్కడి ప్రజలు ఎందుకు దేశాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు?

 
 స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలయినా కూడా భారతదేశం పేదదేశంగా ఎందుకు ఉంది? ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా నిరాశ కలుగుతుంది .


 మనం మనదేశాన్ని అభివృద్ధి చేసుకోలేని చేతకాని దద్దమ్మలం,  చవటలం కాదు కదా..దేశపౌరులందరూ   దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలి.
 

సమాజాన్ని సరైన దారిలోకి తీసుకురావాలంటే, కొన్నిసార్లు కఠినంగా ఉండటం కూడా అవసరం.

 

యువత ఉపాధి కొరకు విదేశాలకు వెళ్లే పరిస్థితి కాకుండా,  స్వదేశంలోనే చక్కగా జీవించేలా వ్యవస్థలను మార్చుకోవాలి.

 ఎప్పుడూ సినిమాలు, క్రికెట్, సోషల్మీడియా, అస్తమాను సెల్ఫోన్లు చూడటం..అని కాకుండా, పట్టుదలగా దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపించే దిశగా యువత మరియు ప్రజలందరూ  మారాలి.

 జనాలు కొందరు ఒక మైక్ పుచ్చుకుని, పనిచేసే వారి వద్దకు వెళ్ళి అనేక ప్రశ్నలు అడుగుతూ విసిగిస్తుంటారు. ఇంకా కొందరు రెచ్చగొట్టే ప్రశ్నలు వేస్తూ గొడవలు పెడుతుంటారు.

..........
రాజకీయాలు స్వచ్చంగా ఉండేలా మార్పులు జరగాలి. అవినీతి పోవాలి. పేద, ధనిక అసమానతలు తగ్గాలి.. భారతదేశం గత వైభవాన్ని పొందాలి. భారతీయులు ప్రపంచానికి మార్గదర్శకులు కావాలి.

 అంతా  దైవం దయ.

..............

మంచి అంతా దైవం దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు. 


 

ఆధునిక సింగపూర్ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన లీ క్వాన్ యూ గురించి మరియు ..

 

Wednesday, April 15, 2015

ఆధునిక సింగపూర్ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన లీ క్వాన్ యూ గురించి మరియు ..

 

ఆధునిక  సింగపూర్ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన లీ క్వాన్ యూ.. గురించి  ఈనాడులో  కొన్ని వివరాలు చదివిన తరువాత ..
 సింగపూర్ను ఆయన ఎన్నో కోణాల నుంచి  అభివృద్ధి చేయటం జరిగిందని తెలుస్తోంది.  
........
కొన్ని విషయాల గురించి చెప్పుకుందాము.

సింగపూర్ లో సహజ వనరులు లేకపోయినా  అంతర్జాతీయ వ్యాపారంలో  దూసుకువెళ్తోందట.


( మనదేశం కూడా ఆర్ధికంగా అంతర్జాతీయంగా వెలుగులు విరజిమ్మితే  బాగుండు .)


సింగపూర్ ప్రజలకు ఉన్నతమైన అలవాట్లు ఉండాలని ఆయన భావించారట. ప్రజల వ్యసనాలను వదిలించటానికి  ఎన్నో ప్రయత్నాలు  చేసారట .


( మనదేశంలో  ప్రభుత్వాలు మద్యం మీద వచ్చే ఆదాయం కోసం ఆధారపడకుండా  ఉంటే బాగుంటుంది.  .)


వెనుకాముందూ చూడకుండా వీధుల్లో తుపుక్కున ఊసే వారితో జరిమానా కట్టించారట.


( మన దేశంలో కూడా ఇలాంటివి అమలులోకొస్తే  బాగుంటుంది.) 


ఇద్దరు పిల్లల్ని మించి కనొద్దని హుకుం జారీ చేసాడట. అయినా వినకుండా గంపెడు పిల్లల్ని కనేవారి మీద పన్నులు వేశారట.


( ఇక్కడ  పన్నులు వేయకపోయినా, ఓటుహక్కు రద్దుచేయటం..వంటివి చేయొచ్చేమో? ఎవరికైనా ఒక్కరు కాకుండా, ఇద్దరు పిల్లలు ఉంటే మంచిది.)


కాలుష్యనివారణకూ అధిక ప్రాధాన్యతను ఇచ్చారట... కారు కొనాలంటే ఆ ధరకు ఒకటిన్నర రెట్లు మొత్తాన్ని పన్నుగా చెల్లించాలనే షరతు విధించారట. ఇంకా కొన్ని షరతులూ ఉన్నాయట.


ఈ తలనొప్పులన్నీ ఎందుకనుకుంటే, ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకోవచ్చట. అందుకే సింగపూర్ లో ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే కారు ఉంటుందట. 


( మన దేశంలో  కూడా ఇలా జరిగితే  బాగుంటుంది.)

..........
ఆయన అధికారంలోకి రాకముందు, ప్రజలు ..  మురుగునీటినీ, పారిశ్రామిక వ్యర్ధాల్నీ నదుల్లోకి మళ్లించేవారట. 

మన జీవితాల్ని మనమే సర్వనాశనం చేసుకుంటామా? ఇదేం పద్ధతి ? అని ఆగ్రహంగా ప్రశ్నించారట  లీ క్వాన్ యూ.  


ప్రజలు ఆలోచనలో పడి జలవనరులను సంరక్షించుకోవటానికి  స్వచ్చందంగా ముందుకొచ్చారట..


 (
మనదేశంలో  కూడా ఇలాంటి అద్భుతాలు జరిగితే బాగుండు .  మనదేశప్రజలు కూడా జలవనరులను సంరక్షించుకోవటానికి  స్వచ్ఛందంగా ముందుకొస్తే బాగుంటుంది.)
...............

మాతృభాషకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారట.


( మాతృభాష అంటే మృత భాషగా భావించే  మన దేశంలోని జనం తమ అభిప్రాయాలను మార్చుకుని మాతృభాషను గౌరవిస్తే బాగుంటుంది..)


సింగపూర్ లో అవినీతి చాలా తక్కువట. 


(
ఇలాంటివి మనదేశంలో అసలు ఊహించగలమా ? మన దేశంలో కూడా  అవినీతిపరుల పని పట్టే  పటిష్టమైన వ్యవస్థ  వస్తే బాగుంటుంది.)
.............

 సింగపూర్లో  ఖనిజవనరులు అసలేమీ లేవట. నీటివసతి కూడా అంతంత మాత్రమేనట.  లీ క్వాన్ యూ అధికారాన్ని చేపట్టే నాటికి సింగపూర్    సంక్షుభిత దేశమట.


అయితే, నాయకుని ఆలోచనలకు ప్రజలూ స్పందించి తమ సహకారాన్ని అందించారట. 


 అయినా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సింగపూర్ను అభివృద్ధి చేసిన మహామనీషి  లీ క్వాన్ యూ  అంటారు. ఇలాంటి  నాయకులను ప్రజలు కలకాలం గుర్తుంచుకోవటంలో ఆశ్చర్యం ఎంతమాత్రమూ లేదు.


 అయితే, నాయకునికి సహకరించిన అధికారులూ, ప్రజలూ కూడా ఎంతో అభినందనీయులే. 


నాయకులు, అధికారులూ, ప్రజలూ కలిసి పనిచేస్తే చక్కటి స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చని  అనుభవపూర్వకంగా తెలుస్తోంది.


అనే విషయాన్ని అందరూ..

 

   విజయవాడ ప్రకాశం బ్యారేజ్  కొంత ప్రమాదంలో ఉందంటున్నారు.  దైవం దయవల్ల వాన పడటం తగ్గింది.  బ్యారేజ్ కు  ఏమీకాదు.

***************
 ప్రపంచంలో చాలాచోట్ల పెద్ద ఎత్తున వరదలు, ఎండలు, అతివృష్టి, అనావృష్టి..వంటివి వస్తున్నాయి.  పర్యావరణాన్ని పాడుచేయటం వల్ల కూడా ఇలా జరుగుతాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనుషులు ఏం చేయలేరు.

 

నుషులు అంతులేని కోరికలతో టెక్నాలజీ పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తే, కార్బండయాక్సైడ్ పెరగటం, ఓజోన్ పొర పలచబడటం, భూమి వేడెక్కటం, హుధుద్ తుపాన్ లాగ తుపాన్లు రావటం ..వంటివి ఎన్నో జరుగుతాయి.



గ్లోబల్ వార్మింగ్.. వంటి వాటివల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతాయంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో సముద్రమట్టం పెరిగి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఊర్లు.. 

ఉదా..సముద్రపు ఒడ్డున ఉన్న వైజాగ్, ముంబై, చెన్నై..వంటి ఊర్లు  ప్రమాదంలో పడే  అవకాశాలున్నాయంటున్నారు.



 కొందరు పర్యావరణహిత శాస్త్రవేత్తలు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా, చాలామంది  పట్టించుకోవటం లేదు. ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేయటం వల్ల అవి కాలువల్లో, చెరువుల్లో నీటికి అడ్డం పడిపోతున్నాయి. 

 

డ్రైనేజ్ సిస్టం సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. వానలు పడితే ముంబయ్, చెన్నై, హైదరాబాద్ ..వంటి నగరాల్లో  కూడా  వరదలు వస్తున్నాయి.

 

 *****************
 కొండచరియల క్రింద , చెరువుల్లో,కాలువల్లో.... ఇళ్లు కడితే ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది.


 అక్రమంగా కట్టిన ఇళ్లను కూల్చేస్తే మరల ప్రభుత్వాలను తిట్టిపోస్తారు. అక్రమంగా కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన ఉద్యోగస్తుల ఆస్తులను కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలి. అవినీతిపనులు చేసే వారికి కఠినశిక్షలుండాలి.


 ప్రభుత్వం వారు, అధికారులు, ప్రజలు అందరు .. ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తిస్తేనే వ్యవస్థలు అన్నీ బాగుంటాయి. అంతేకానీ, ఎవరికి వారు తప్పులు చేస్తూ ఉంటే వ్యవస్థల పరిస్థితి తప్పులతడకలాగే ఉంటుంది.



 అవినీతితో వేలకోట్ల అక్రమ సంపాదన సంపాదించేవారు కొందరు, ఆఫీసుల్లో లంచాలు తీసుకుని, ఏ పనికైనా పర్మిషన్ ఇచ్చే వారు కొందరు, ఎన్నికల్లో వెయ్యి రూపాయలు.. ఒక మద్యం సీస..ఒక బిరియానిపాకెట్ తీసుకుని ఓట్లు వేసేవారు కొందరు. ప్రజలు చాలామంది ఇలా ఉన్నప్పుడు, వ్యవస్థ దానికి తగ్గట్లే ఉంటుంది.


 సమాజంలోని అందరూ ఎవరి పని వారు సక్రమంగా చేస్తేనే సమాజం సజావుగా నడుస్తుంది.

***********
 దైవానికి కూడా భయపడకుండా చాలామంది పాపాలు చేస్తున్నారు. ఎవ్వరైనా దైవం నుంచి తప్పించుకోలేరు..అనే  విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే మంచిది.

 ************

 ఈ మధ్యకాలంలో చాలా ఊళ్ళలో వరదలు వస్తున్నాయి. ప్రభుత్వం ఒక్కటే అంతా చేయలేరు. ప్రజలు కూడా సమాజం పట్ల తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి.


 మా చిన్నతనంలో మా తాతగారి ఊర్లో వేసవికాలంలో చెరువు ఎండినప్పుడు, ప్రజలే కలసి పూడిక తీసేవారు. ఎండ తగ్గిన తరువాత సాయంకాలం పనిచేసేవారు. కొన్నిసార్లు వెన్నెలవెలుగులో కూడా పనిచేసేవారు.  అదంతా చాలా సందడిగా ఉండేది.

చెరువులను, కాలువలను ఆక్రమించి .. ఇప్పటికే ఎంతోకాలం నుంచి బోలెడు కట్టడాలు నిర్మించారు.

అవి  చెరువులు, కాలువలు ప్రవహించే ప్రాంతాలని కొందరికి తెలిసి కూడా కట్టడాలను నిర్మిస్తే,  కొందరు  తెలియక  కొన్నామంటారు.  తెలిసిచేసినా, తెలియకచేసినా దాని పర్యవసానాలు ఉంటాయి.

అయితే, ఇప్పుడు ఆ కట్టడాలను కూల్చాలంటే చాలామంది ఒప్పుకోకపోవచ్చు. ఇక,  ప్రభుత్వాలు ఏం చేయగలరు? మరీ అడ్దంకిగా ఉన్న వాటిని కూల్చక తప్పదు కానీ, అన్నింటిని పడగొట్టాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో?  చెప్పలేము.


 భవిష్యత్తులో అయినా కొత్తగా అక్రమకట్టడాలు కట్టకుండా ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాలి. 

వరదలు వచ్చే ప్రాంతాలలో ఇళ్లను భూమికి బాగా ఎత్తుగా కడితే.. కొద్దిగా వరద వచ్చినప్పుడు నీరు ఇంట్లోకి రాకుండా ఉంటుంది.


బుడమేరు వరద రావటం వంటి సంఘటనలలో.. బుడమేరు వద్ద ఎత్తుగా గోడ కట్టడం వల్ల, వరద ఊరిమీదకు వచ్చే ప్రమాదం తగ్గవచ్చని నిపుణులు అంటున్నారట.

బుడమేరు నీరు సహజంగా కొల్లేరు సరస్సులో కలుస్తుందట. బుడమేరు కొల్లేరు  వరకు  సరిగ్గా వెళ్ళేలా  దారిలో అడ్డంకులను తొలగించాలి. కొందరు జనాలు కొల్లేరును కూడా కబ్జా చేస్తున్నారట.

 

గండ్లు పడి పెద్ద ఎత్తున వరదలు ఊర్ల మీద పడినప్పుడు.. ప్రాణనష్టం, వందలు లేక వేలు కోట్ల  ఆస్తినష్టం జరుగుతుంది..సహాయకార్యక్రమాలకు కూడా బోలెడు శ్రమ మరియు బోలెడు డబ్బు ఖర్చవుతుంది ..అలాంటప్పుడు, ఎక్కువ డబ్బు ఖర్చయితే.. అప్పు తెచ్చి అయినా ..  గోడవంటిది కట్టడం లేక వరద నీరు నిల్వ కొరకు చిన్న రిజర్వాయర్ కట్టడం.. వంటి  శాశ్వతపరిష్కారాలు చేయటం మంచిది.


వరదలు వచ్చే అవకాశమున్న ఊర్లలో.. అక్కడక్కడా ఎత్తైన భవనాలను నిర్మిస్తే వరదబాధితులకు పునరావాసకేంద్రాలుగా ఉపయోగించవచ్చు.

 
ప్రభుత్వాలు పడవలను, బల్లకట్టులను.. ఎక్కువసంఖ్యలో  కొనుగోలు చేసి ఉంచి, పడవలు నడిపే వారిని సిద్ధం చేసి ఉంచుకుంటే..ఎప్పుడైనా వరదలు వస్తే ప్రజలను త్వరగా రక్షించడానికి, ఇళ్లపైన ఉన్నవారికి ఆహారపొట్లాలను అందించడానికి పడవలు ఉపయోగపడతాయి. పడవల ద్వారా, మారుమూల ఉన్నవారికి కూడా త్వరగా సహాయాన్ని అందించవచ్చు.

**********
పడవలను ఉపయోగించటం మనకు కొత్తకాని, కేరళలో పడవలను ఎక్కువగా ఉపయోగిస్తారు.. అక్కడ రవాణాకు కూడా పడవలను ఉపయోగిస్తారు. మనకు కూడా పాతకాలంలో బకింగ్ హాం కాలువ ద్వారా ర
వాణావ్యవస్థ ఉండేదట.

*************

 ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు పడవలు ఉపయోగపడతాయి. నీరు తగ్గినతరువాత పడవలు ఉపయోగపడవు. విజయవాడలో నీరు ఎక్కువ ఉన్నప్పుడు పడవలను ఉపయోగించారు. నీరు తగ్గిన ప్రాంతాలలో వరదబాధితులను రక్షించడానికి ప్రభుత్వం వారు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు.  ఇది మంచి ఆలోచన.  ఇలాంటప్పుడు ట్రాక్టర్లు బాగా ఉపయోగపడతాయి.

***************

 విజయవాడ వరదల్లో ఎంతోశ్రమతో కష్టపడి పనిచేస్తున్న వారు, సాయాన్ని అందిస్తున్నవారు ఎంతో గొప్పవారు. అందరికి ధన్యవాదములు.  ఎక్కడైనా సరే, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసిన అందరూ గొప్పవారే. అందరికి ధన్యవాదములు.

గోదావరి జిల్లాలు, విశాఖలో, ఉత్తరాంధ్రలో ..విపరీత వర్షాలు  త్వరగా  తగ్గుముఖం పడితే బాగుండు. ఎంతోశ్రమతో కష్టపడి పనిచేస్తున్న వారు, సాయాన్ని అందిస్తున్నవారు ఎంతో గొప్పవారు. అందరికి ధన్యవాదములు.  ఎక్కడైనా సరే, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసిన అందరూ గొప్పవారే. అందరికి ధన్యవాదములు.